Kitab-us-Soum (Telugu)

pig (డోలి! కేతు)

ఆత్మ ప్రక్షాళనం

రొజా

(మిష్కాతుల్‌ మసాబీహ్‌)

రచన మౌలానా సయ్యిద్‌ అబుల్‌ ఆలా మౌదూది (రహ్మ)

సంకలనం హఫీజుర్రహ్మాన్‌ అహ్‌సన్‌

తెలుగు అనువాదం సయ్యద్‌ హుసైన్‌

విషయ సూచిక

సంకలనకర్త మనవి

మిష్మాతుల్‌ మసాబీహ్‌

తొలి పలుకులు

ఉపవాసాల పుస్తకం

రమజాన్‌ - పుణ్యాల వసంత రుతువు

ఉపవాసులకు స్వర్గంలో ఒక ద్వారం ప్రత్యేకించబడింది

పాపాలన్నింటి మన్నింపు సాధనం

రోజా ప్రతిఫలానికి ఎలాంటి హద్దూ లేదు

రోజా (్రేష్టత, గొప్పదనం అసాధారణమైనది

ఉపవాసి కొరకు రెండు ఆనంద ఘడియలు

రోజా చెడులను ఎదుర్శొనే డాలు వంటిది

నరకం నుంచి విముక్తినొందే మాసం

షైతాన్‌ ఎందుకు బంధించబడతాడు?

రమజాన్‌ పిలుపు

నరకాగ్ని నుంచి విడుదలయ్యేవారు

వెయ్యి నెలలకన్నా శ్రేష్టమైన రాత్రి

రేయిలోని మేలుకు దూరంగా వున్నవాడు నిష్ఫలుడే అయ్యాడు

రోజా, ఖుర్‌ఆన్‌ దైవదాసుని కొరకు సిఫారసు చేస్తాయి

లైలతుల్‌ ఖద్ర్‌ (ఘనమైన రేయి)ని పోగొట్టుకుంటే సర్వాన్నీ

పోగొట్టుకున్నట్లే

కారుణ్యం, క్షమాభిక్ష మోక్షాల మాసం

రమజాన్‌ కాలంలో తేడా ఎందుకు?

రమజాన్‌లో సహనానికి జరిగినంత అభ్యాసం మరే సందర్భంలోనూ జరగదు

రమజాన్‌ మాసంలో ప్రవక్త (స) గారి ప్రేమకు, దాతృత్వానికి రెండు ఉదాహరణలు

స్వర్గం ఒక రమజాన్‌ తరువాత మరో రమజాన్‌ వచ్చే వరకు ఎడతెగకుండా ముస్తాబు చేయబడుతుంది

1] 14 17 21 21 24 25 27 28 28 30 31 32 32 33 33 35 36

37

39

42

43

47

49

4 ఆత్మ ప్రక్షాళనం రోజా

రమజాన్‌ చివరి రాత్రి ముస్లిం సమాజానికి క్షమాభిక్ష లభిస్తుంది చండ్ర దర్శన అధ్యాయం రమజాన్‌ ప్రారంభం, ముగింపు నెలవంక దర్శనంతో ముడిపడి ఉంది షాబాన్‌ 29 నాడు నెలవంక కన్పించకపోతే

షాబాన్‌ నెల 30 రోజులుగా పూర్తిచేయండి ఇస్లామీయ ధార్మిక ఆరాధనలకై చాంద్రమానాన్ని

పాటించడంలో వున్న యుక్తి రమజాన్‌, జిల్‌హజ్ఞహ్‌ (పుణ్యం, ఘనతల రీత్యా) ఏనాడూ కొరత లేనివి రమజాన్‌ నెలకు ఒకటి లేదా రెండు రోజుల ముందు ఉపవాసం ఉండకూడదు

షాబాన్‌ నెల సగం గడిచాక రోజాలు ఉండరాదు రమజాన్‌ కొరకు షాబాన్‌ నెలపొడుపును చూసేందుకు ఆదేశం దైవప్రవక్త (స) షాబాన్‌ మరియు రమజాన్‌ ఉపవాసాలను

ఎడతెగకుండా పాటించేవారు అనుమానంతో రోజాను పాటించటం ధర్మసమ్మతం కాదు నెలవంక దర్శనానికి మోమిన్‌ (విశ్వాసి) సాక్ష్యమే ఎన్నదగినది రమజాన్‌ నెలవంక విషయమై ఒక్క ముస్లిం సాక్ష్యం సరిపోతుంది దైవప్రవక్త (స) షాబాన్‌ నెల తేదీలను తెలుసుకునేందుకు

ఏర్పాట్లు చేసేవారు ఒక నెల గడువు రెండవ నెల చంద్రుడు కన్పించే వరకు ఉంటుంది అధ్యాయం సహరీ చేయటంలో శుభం ఇస్లామీయ ఆరాధనల ఉద్దేశం - శిక్షణ, ఆత్మశుద్ధి ఇస్లాంలో ఆరాధనల ఉద్దేశం పూర్తిగా భిన్నం సహరీ భుజించటంలో గల శుభం? గంథవహులు - ముస్లింల ఉపవాసాలలో భేదం ఇఫ్రార్‌ తొందరగా చేయటంలో మేలు ఉంది ఇస్లాం చెడును ఆరంభంలోనే నిరోధిస్తుంది రోజా విరమణకు సరియైన సమయం ఎడతెగకుండా రోజా ఉండటం ధర్మసమ్మతం కాదు

50 ర్‌2 52

54

56 60

60 63 63

64 65 66 69

70 T1 74 74 75 75 76 77 Tr 78 79 80

ఆత్మ ప్రక్షాళనం రోజా 5

రోజా పాటించటానికి సంకల్పం తప్పనిసరి 81 సహరీ సమయంలో ఒకింత సడలింపు ఉంది 82 ఇఫ్లార్‌లో తొందరపడేవారు అల్లాహ్‌కు ప్రీతిపాత్రులు 84 ఇఫ్టార్‌ కొరకు శ్రేష్టమైన వస్తువులు 84 ఇఫ్లార్‌ చేయించేవారికి లభించే పుణ్యం 85 ఇఫ్లార్‌ వేళ చేయాల్సిన మంచి దుఆలు 86 ఇఫ్లార్‌లో తాత్సారం చేయటం యూదులు, క్రైస్తవుల విధానం 88 ఇఫ్లార్‌ చేయటంలో, నమాజ్‌ ఆచరించటంలో

తొందరపడటం సున్నత్‌ 90 సహరీ ఆహారం శుభకరమైనది 92 ఉత్తమమైన సహరీ ఖర్జూరం 93 రోజా పరిరక్షణ కోసం ... 94 రోజా ఉద్దేశ్యం తఖ్వా (దైవభీతి) తప్ప పస్తులుండటం కాదు 95 అబద్ధంపై ఆచరించటమంటే అర్ధం ఏమిటి? 95 రోజా స్థితిలో భార్యతో కలిసిమెలసి వుండే హద్దులు 96 లైంగిక అశుద్ధావస్థలోనూ రోజా ప్రారంభించవచ్చు 97

ఇహ్రామ్‌ ధరించిన స్థితిలో, రోజా స్థితిలో పచ్చా (దేహం నుండి చెడురక్తం తీయటానికి) వేయటానికి అనుమతి 98

మరచిపోయి తినటం, త్రాగటం వలన రోజా భంగం కాదు 99 బుద్ధిపూర్వకంగా రోజాను భంగం చేసినదాని కప్ఫారా (పరిహారం) 100 రోజా స్థితిలో భార్యతో కలసిమెలసి ఉండటం గురించి 104 దానంతట అదే వాంతి అయినప్పుడు రోజా భంగం కాదు 106 వాంతి అయినట్లయితే నఫిల్‌ రోజాను విరమించుకోవాలి 106 రోజా స్థితిలో మిస్వాక్‌ చేయటం అభిలషణీయమే 107 రోజా స్థితిలో సుర్మా పెట్టవచ్చా? 107 రోజాలోని తీవ్రతను తగ్గించటానికి స్నానం చేయటం,

తలపై నీళ్ళు చల్లుకోవటం సమ్మతమే 108

రోజాలో వున్నప్పుడు పచ్చాలు (శరీరంలో చెడురక్తాన్ని బయటికి తీసే పద్ధతి) వేయించటం 109

6 ఆత్మ ప్రక్షాళనం రోజా జీవితాంతం ఉండే రోజాలు, రమజాన్‌లోని ఒక్క రోజాకు

కూడా సాటిరావు 110 అసలు ఉద్దేశం రోజా బాహ్యరూపం కాదు, కావలసింది దాని వాస్తవ ఊపిరి 111 మూడు చర్యల వల్ల రోజా భంగం కాదు 113 రోజాలో పచ్చాలు వేయించుకోవటానికి షరీఅత్‌ రీత్యా తగు కారణం 114 రోజాలో పచ్చాలు వేయించే విషయంలో హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) గారి ఆచరణ 115 పుక్కిలించిన పిదప ఉమ్మిని మింగటం, ఏదైనా చెట్టు బంక లేదా గుగ్గిలం చెట్టు బంక వగైరా నమలటం గురించి సమస్య 115 పయాణీకుని రోజా 118 ప్రయాణంలో ఉన్నప్పుడు రోజా పాటించినా, లేక పాటించకపోయినా రెండూ అనుమతించబడినవే 118 ప్రయాణంలో రోజా పాటించేవారు, పాటించనివారు ఒకరింకొకరిపై అభ్యంతరం తెలుపరాదు 120 భరించశక్యం కాకపోతే ప్రయాణంలో రోజా పాటించవద్దు 121

ప్రయాణం కష్టమని తోచినప్పుడు రోజా పాటించకపోవటమే శ్రేయస్మరం 122 గత్యంతరం లేని పరిస్థితుల్లో రోజా ముందుగానే

విడవటానికి అనుమతి వుంది 124 ప్రయాణీకుడు, పాలు త్రాపించే స్రీ, గర్భవతికి రోజా

విడిచిపెట్టే అనుమతి ఉంది 126 ప్రయాణంలో కష్టాలు ఎదురవకపోతే రోజా పాటించాలి గ్ర

మక్కా విజయం నాటి ప్రయాణంలో ప్రవక్త (స) ఇఫ్తార్‌ చేసిన సంఘటన 129 ప్రయాణంలో (క్రిష్టతర పరిస్థితి ఎదురయ్యే అనుమానముంటే)

రోజా వుండటం భావ్యం కాదు 130 ప్రయాణంలో రోజా విడిచిపెట్టే అనుమతి అల్లాహ్‌చే ప్రసాదించబడిన

ఒక వెసులుబాటు 131

ఖజా అధ్యాయం 133

రమజాన్‌ ఖజా రోజాలను షాబాన్‌ నెల మొదటి పదిహేను రోజుల చివర్లో కూడా పాటించవచ్చు 138

ఆత్మ (ప్రక్షాళనం రోజా నఫిల్‌, ఖజా రోజాలు పాటించే ముందు భార్య, భర్త అనుమతి తీసుకోవాలి బహిష్టు అయిన స్ర్తీ రోజాను ఖజా చేసుకోవటం తప్పనిసరి అవుతుంది, కాని నమాజులను కాదు మరణించిన మనిషికి చెందిన ఖజా రోజాలు అతని సంరక్షకుని బాధ్యతగా మారతాయా? మరణించిన వ్యక్తి ఖజా రోజాలకు బదులుగా నిరుపేదలకు భోజనం పెట్టే విషయం ఎవరైనా ఒక వ్యక్తి ఇతరులకు బదులు రోజా పాటించటం గానీ, ఇంకా నమాజ్‌ ఆచరించటం గానీ చేయలేడు స్వచ్చంద రోజాల అధ్యాయం ప్రవక్త (స) అన్ని నెలలకన్నా ఎక్కువగా నఫిల్‌ రోజులను షాబాన్‌ నెలలో పాటించేవారు రమజాన్‌లో తప్ప దైవప్రవక్త (స) ఇతర నెలల్లో పూర్తి నెల రోజులు రోజా పాటించేవారు కారు షాబాన్‌ నెల చివరి రెండు రోజుల ఉపవాసం గురించి ముహర్రం నెలలోని రోజాలు ఇంకా తహజ్ఞుద్‌ నమాజ్‌ ప్రాశస్త్యం ఆషూరా (ముహర్రం 10వ తేదీ) రోజాలోని శ్రేష్టత ఆషూరాతో పాటు 9 లేదా 11వ తేదీ ఉపవాసాన్ని కూడా కలుపుకోవాలి అరఫా (జిల్‌హజ్ఞహ్‌ 9వ తేదీ) రోజా గురించి ప్రవక్త (స) జిల్‌ హజ్జహ్‌ నెలలోని మొదటి పది రోజుల ఉపవాసాన్ని ఎన్నడూ పాటించలేదు నఫిల్‌ రోజాలు పాటించే మస్నూన్‌ పద్ధతి సోమవారం నాటి రోజా ప్రాశస్యం ప్రతి నెలా మూడు రోజులు నఫిల్‌ రోజాలు పాటించడం ప్రవక్త (స) సంప్రదాయం రమజాన్‌ రోజాలతో పాటు షవ్వాల్‌ నెల ఆరు రోజుల రోజా పాటించిన వ్యక్తి ఎల్లప్పుడు రోజా పాటించిన వానితో సమానం ఈదుల్‌ ఫిత్ర్‌, ఈదుల్‌ అజ్‌హా నాడు ఎలాంటి రోజా లేదు అయ్యామె తష్షీఖ్‌లో రోజా పాటించటం సముచితం కాదు

158

159 160

8 ఆత్మ ప్రక్షాళనం రోజా

జుమా రోజును ఉపవాసం కొరకు ప్రత్యేకించుకోవటం సమ్మతం కాదు శుక్రవారం రాత్రిని జాగరణకు, పగటిని

రోజా పాటించడానికి ప్రత్యేకించుకోవటం సముచితం కాదు దైవమార్గంలో ఒక రోజు రోజా పాటించటం వల్ల అసాధారణ

పుణ్యం ప్రాప్తిస్తుంది నఫిల్‌ ఆరాధనల్లో మధ్యేమార్గం సోమ, గురువారాల నఫిల్‌ రోజాల శ్రేష్టత సోమవారం, గురువారం రోజుల ఢ్రేష్టత ప్రతి నెల 18, 14, 15వ తేదీల్లో రోజా ఉండే సూచన ప్రవక్త (స) ప్రతి నెలా ప్రారంభంలో మూడు రోజుల

ఉపవాసం పాటించేవారు నఫిల్‌ రోజాల విషయంలో ప్రవక్త (స) మరో పద్ధతి నఫిల్‌ రోజాల విషయమై హజత్‌ ఉమ్మె సలమా (ర.అ)కు ప్రవక్త (స) హితవు వ్యక్తి సదా రోజా పాటించినట్లు? అరఫాత్‌ మైదానంలో అరఫా నాటి రోజా పాటించటం సముచితం కాదు శనివారం రోజు రోజా పాటించటం సముచితం కాదు దైవమార్గంలో ఒక రోజు రోజాకు కూడా అసాధారణ పుణ్యం చలికాలంలోని రోజా తేరగా లభించిన “ప్రాప్తి ఆషూరా (ముహర్రం 10వ తేదీ) నాటి రోజా హజక్‌ మూసా (అ) గారి సంప్రదాయం

దైవప్రవక్త (స) తరచూ శని, ఆదివారాలు రోజా పాటించడంలోని విజ్ఞత రమజాన్‌ రోజాలను ఫర్డ్‌ గావించబడక ముందు మహాప్రవక్త (స)

ఆషూరా నాటి రోజాను పాటించమని తాకీదు చేసేవారు నాలుగు పనులను ప్రవక్త (స) ఎన్నడూ విడనాడలేదు ప్రవక్త (స) “అయ్యామె బైజ్‌” రోజాలను ప్రత్యేకంగా పాటించేవారు రోజా శరీరం తాలూకు జకాత్‌ సోమవారం, గురువారం నాటి నఫిల్‌ రోజాల గ్రేష్టత దైవప్రీతి కొరకు ఒక రోజు రోజా పాటించిన దాని (శ్రేష్టత

161

162

ఆత్మ ప్రక్షాళనం రోజూ అధ్యాయం నఫిల్‌ రోజాలో వేళకంటే ముందు ఇఫ్టార్‌ చేసే విషయంలో ప్రవక్త (స) గారి రెండు ఆచరణలు నఫిల్‌ రోజాను ఖజా చేసుకోవటం భోజనానికి ఎవరైనా ఆహ్వానిస్తే అంగీకరించటం మంచి పద్ధతి నఫిల్‌ రోజా పాటిస్తున్నప్పుడు నిర్జీత సమయానికి ముందే ఇస్తార్‌ చేయవచ్చు నఫిల్‌ రోజాను ఖజా చేయటం నఫిల్‌ రోజా పాటించేవారి క్రేష్టత నఫిల్‌ రోజాకు లభించే పుణ్యం లైలతుల్‌ ఖద్ర్‌ (ఘనమైన రేయి) అధ్యాయం లైలతుల్‌ ఖద్ర్‌ రమజాన్‌ చివరి దశకంలోని బేసి రాత్రులలో ఉంది లైలతుల్‌ ఖద్ర్‌ విషయంలో గౌరవనీయులైన సహాబా (రజి) కన్న కల లైలతుల్‌ ఖద్ర్‌ను రమజాన్‌ చివరి దశకంలోని బేసి రాత్రుల్లో వెదకాలని హితవు లైలతుల్‌ ఖద్ర్‌ను వెదకటానికి ప్రవక్త (స) పూర్తి రమజాన్‌ మాసం ఏతికాఫ్‌లో గడిపిన సంఘటన రమజాన్‌ 27వ రాత్రినే లైలతుల్‌ ఖద్ర్‌ కావచ్చు అన్న విషయమై ఉల్లేఖనం చివరి దశకంలో దైవప్రవక్త (స) ఆరాధనలు పాటించటంలో చూపే శ్రద్ధాసక్తులు రమజాన్‌ చివరి దశకంలో ప్రవక్త (స) ఆరాధనలు లైలతుల్‌ ఖద్ర్‌ దుఆ లైలతుల్‌ ఖద్ర్‌ీను రమజాన్‌ చివరి దశకంలోని బేసి రాత్రుల్లో వెదకాలని హితవు లైలతుల్‌ ఖధ్ర్‌ ప్రతి రమజాన్‌లో ఉంటుంది హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ ఉనైస్‌ గారికి ప్రతి నెలా 23వ తేదీ రాత్రి మస్టిద్‌-యె-నబవీలో గడిపేందుకు హితవు

ప్రవక్త (స)గారికి మొదటి లైలతుల్‌ ఖద్ర్‌ విషయం ముందు తెలుపబడింది

తనకు విధేయులైన దాసులపై అల్లాహ్‌ గర్విస్తాడు

10 ఆత్మ ప్రక్షాళనం రోజా

ఏతెకాఫ్‌ అధ్యాయం ఏతెకాఫ్‌లో దైవప్రవక్త (స) గారి సంప్రదాయం రమజాన్‌లో ప్రవక్త (స) ఎడతెగని దానధర్మాలు,

జిబ్రీల్‌ (అ)తో పాటు ఖుర్‌ఆన్‌ పారాయణం జిబ్రీల్‌ (అ) ప్రతి సంవత్సరం రమజాన్‌లో ప్రవక్త (స)కు

ఖుర్‌ఆన్‌ విన్పించేవారు ఎంతో అవసరమైతే తప్ప ఏతెకాఫ్‌ పాటిస్తున్న సమయంలో

ప్రవక్త (స) ఇంటిలోకి వెళ్లేవారు కాదు అజ్ఞానంలో ఏదైనా మంచి పనికి మొక్కుకుంటే దాన్ని పూర్తిచేయాలి ప్రవక్త (స) ఫజ్ర్‌ నమాజ్‌ చదివి తను ఏతెకాఫ్‌ కూర్చొనే

స్థలంలో ప్రవేశించేవారు ప్రవక్త (స) రమజాన్‌ చివరి దశకంలో సదా ఏతెకాఫ్‌ పాటించేవారు ఏతెకాఫ్‌ స్థితిలో ఉన్నప్పుడు రోగిని పరామర్శించే మస్నూన్‌ పద్ధతి తెకాఫ్‌ స్థితిలో వారించబడిన పనులు, ఇంకా ఏతెకాఫ్‌కు రెండు షరతులు

ప్రవక్త (స) గారి ఏతెకాఫ్‌ పాటించే స్థల విషయం మోతకిఫ్‌ ఖాతాలో వ్రాయబడే పుణ్యాలు

బా

CR

217 217

218

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్‌ పేరుతో

సంకలనకర్త మనవి

యల IEG

నహ్‌మదుహూ నుసల్లిఅలా రసూలిహిల్‌ కరీమి అలా ఆలిహీ అస్‌హాబిహీ అజ్మయీన్‌

క్రీ.శ. 1967 చివర్లో మౌలానా సయ్యిద్‌ అబుల్‌ ఆలా మౌదూదీ (రహ్మ) గారి సప్తాహిక హదీసు పాఠాల్ని ఒకచోట సంకలనం చేసి లాహోర్‌ నుంచి వెలువడే “ఆయిన్‌” వారపత్రికలో ప్రచురించడం ప్రారంభించినప్పుడు అవి ఎంతోమందికి నచ్చాయి. మౌలానా గారి ధార్మిక మూలధనమయిన వివేకం, విజ్ఞతలను అభిమానించే అనేకమంది పాఠకులు దీన్ని తమ చిరకాల వాంఛ నెరవేరే సాధనంగా భావించారు. ఇంకా దీన్ని పుస్తక రూపంలో ప్రచురించాలని పదే పదే కోరడం జరిగింది. ఆపై పుస్తకం పూర్తయిన తరువాత నేను ఇలా వ్రాయడం జరిగింది:

“ఆయిన్‌” పత్రికలో గౌరవనీయులైన మౌలానా గారి హదీసు పాఠాల పరంపర మొదలయ్యాక పాఠకులు ఇంకా మిత్రులు అధ్యాయం పూర్తయిన వెంటనే, దీన్ని పుస్తకరూపంలో ప్రచురించే ఏర్పాటు చేయాలని, తద్వారా ఇలాంటి మహత్తర కూర్చు ప్రవక్త (స)ని అమితంగా ప్రేమించే వారి వరకు చేరుకుంటుందని వారు అభిప్రాయపడ్డారు. స్వయంగా నేను కూడా ఇలాంటి కూర్చును మౌలానా గారి సన్నిధిలో సమర్పించాలని భావించేవాణ్డి. ఎందుకంటే మౌలానాగారి పరిశీలన తరువాత, వారి అనుమతితో పుస్తకరూపం ఇవ్వాలని కూడా తలచేవాణ్డి. కాని ఇలాంటి తృష్టగల వారు ఇంకా ఒక సంవత్సర కాలం పాటు వేచి ఉండాల్సి వస్తుందని భావిస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదట ప్రస్తుతమున్న హదీసు పాఠాల మూలప్రతులు ఇంకా వాటి అనుబంధ అంశాలను నంపూర్ణంగా పరిశీలించి వాటిని ప్రచురణకు యోగ్యమైనవిగా చేయాలి. మౌలానా గారి ఉద్దేశ్యం కూడా ఇదేను.

రెండవ విషయం, మౌలానా గారు “తఫ్‌హీముల్‌ ఖుర్‌ఆన్‌”

12 ఆత్మ ప్రక్షాళనం రోజా కార్యభారంలో నిమగ్నులై ఉండటం చేత వారు మరో పరిశోధనపైన గాని, రచనా వ్యాసంగంపైన గాని దృష్టి సారించలేకపోతున్నారు. తఫ్‌హీముల్‌ ఖుర్‌ఆన్‌ పూర్తవటమే బృహత్తర కార్యం అనే విషయం మనకు అవగతమవ్వాలి. పని పూర్తికావటం మౌలానా గారికీ మనకు కూడా ఎంతో ప్రియమయినది. కాబట్టి మౌలానాగారు హదీసు కృతికై సమయాన్ని కేటాయించే వరకూ నిరీక్షించటమే ఉత్తమం. ఈలోగా పత్రికలో అచ్చయిన వాటిని చోట కూర్చి భద్రపరచటమే నా వంతు కర్తవ్యమని, ఆపై దైవచిత్తమైతే, మౌలానా గారికి సమయం చిక్కినప్పుడు దీన్ని పరిశీలించి ప్రచురించాలి అని భావించాను. (ఆయిన్‌” 1968 జులై 7)

ఆపై పరిస్థితులు ఎలా పరిణమించాయంటే పని పూర్తి కావటం అనిశ్చితంగా మారింది. దీని ఒక కారణం ఏమిటంటే 'తఫ్‌హీముల్‌ ఖుర్‌ఆన్‌ పని కొరకు మౌలానా గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం, వీటికి తోడు మౌలానా గారి అనారోగ్యం కూడా మరో కారణమయ్యింది. వైద్యం కొరకు చాలాకాలం వరకు ఆయన గారి రచనా వ్యాపకం, రాజకీయ వ్యాపకం ఆగిపోయాయి. పరిస్థితుల ప్రభావం వల్ల పని నిత్యం ఆగుతూనే పోయింది. ఆపై గడచిన సంవత్సరం 1971 జులైలో కూర్చు చేసిన (గ్రంథాన్ని పరిశీలించవలసినదిగా మౌలానా గారికి మనవి చేసుకున్నాను. కాని ఆయన గారు తన అశక్తతను వ్యక్తం చేశారు. అయితే ఆయన గారు నాకు అనుమతినిస్తూ బాగా కష్టపడి పని చేయమని, ఇంకా రెండు విషయాల పట్ల శ్రద్ధ వహిస్తూ పుస్తకాన్ని ప్రచురించాలని హితవు గరిపారు.

మొట్టమొదట పుస్తకంలో ప్రచురితమయ్యే హదీసు పాఠాల్ని సాధారణంగా ధార్మిక పాఠశాలల్లో విద్యార్థులకు బోధించే హదీసుల్లా భావించకూడదు. ఇవి వారానికోసారి బోధించడానికి సాధారణ ప్రజల ప్రయోజనార్థం కూర్చు చేయబడ్డాయి. ఇంకా శ్రోతల మానసిక స్థితులను, సందర్భాలను దృష్టిలో ఉంచుకొని వీటిని వివరించడం జరిగింది.

రెండవ విషయం మౌలానాగారు పుస్తకాన్ని వ్రాయలేదు, కాని టేపురికార్డు చేసిన మౌలానా గారి పాఠాలకు లిఖితరూపం ఇవ్వటం జరిగింది.

పుస్తకాన్ని పరిశీలించి, ప్రచురణకు యోగ్యంగా చేయడానికి తగినవారు ఎవరంటే స్వయంగా మౌలానాగారే. లేదా సున్నితమయిన కార్యభారాన్ని మోయడానికి జ్ఞానపరంగా ఖుర్‌ఆన్‌ హదీసులతో పాటు అతి సూక్ష్మమైన ఫిఖా అంశాలు తెలిసివున్న వారు దీనికి అర్హులు. అలాంటివారే ఇలాంటి అమూల్యమైన

ఆత్మ ప్రక్షాళనం రోజా 13 హదీసుల సారాంశాన్ని మరింతగా విడమరచి చెప్పగలరు. కాని పరిస్థితుల ప్రభావం వల్ల కఠినమయిన విధిని నిర్వర్తించే బాధ్యతను ఎలాంటి ధార్మిక జ్ఞానం లేదా సాహితీ సంపదలేని నాలాంటి అనర్హుడే స్వీకరించవలసి వచ్చింది.

ఇలా వైపు జ్ఞానలేమి వల్ల పని ముందుకు సాగనీయకుండా ఆపుతూ వచ్చింది; మరోవైపు ఎలాగైనా గొప్ప పని చేస్తే పరలోక సాఫల్యం లభిస్తుందనే తపన ప్రోద్బలం చేసేది. విధమైన దైవ చింతనా భావంతో పనిని సాధ్యమైనంత మేరకు చేస్తూ వుండేవాణ్ణి. కాబట్టి కేవలం దైవ కృపవల్లనే ఇది పాఠకుల ముందు పుస్తక రూపంలో వచ్చింది. నా ఇహపరాలు సఫలం కావాలని పరమోన్నత ప్రభువును సందర్భంగా వేడుకుంటున్నాను. ఆమీన్‌.

మౌలానా గారి ఇతర ధార్మిక జ్ఞాన సంపద వలెనే ప్రియప్రవక్త (స) గారి హదీసు పుష్ప సంచయనాన్ని కూడా దైవదాసుల సన్మార్గానికి తోడ్పడేలా చేయాలని గొప్పవాడైన అల్లాహ్‌ను వేడుకుంటున్నాను. ఇంకా పుస్తకం మౌలానా గారి మంచి రచనల్లో ఒకటిగా వెలుగొందుతుందని ఆశిస్తున్నాను.

ఇందులో ఏమైనా లోపాలుంటే తెలియజేసి మేలు చేస్తే వాటిని మలి ముద్రణలో సరిచేసి ప్రచురిస్తామని సందర్భంగా విజ్ఞులైన పాఠకులతో మనవి చేస్తున్నాను.

మీ ముందున్న గ్రంథం ప్రఖ్యాత హదీసు గ్రంథం 'మిష్మాతుల్‌ మసాబీహ్‌'లోని “కితాబుస్సామ్‌” వ్యాఖ్యానాన్ని ఆధారంగా చేసుకుని సంకలనం చేయటం జరిగిందన్న విషయాన్ని పాఠకులకు తెలుపటం సముచితమని భావిస్తున్నాము. అయితే సంకలనకర్త హదీసుకు తగిన విధంగా శీర్షికలను పెట్టారని గ్రహించగోర్తాను.

చివర్లో ప్రియమిత్రులు 'ఆయిన్‌' సంపాదకులైన జనాబ్‌ ముజప్ఫర్‌ బేగ్‌ గారి అమూల్యమైన తోడ్చాటుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హదీసులను ఆయన తన ప్రఖ్యాత పత్రిక 'ఆయిన్‌'లో ప్రచురించే అవకాశాన్నిచ్చారు. నిజానికి హదీసుల సంకలనానికి, ప్రచురణకు ఆయన తోడ్చాటే గనక లేకుంటే నేను కార్యానికి పూనుకునే సంకల్పమే చేసేవాణ్ణి కాను. అల్లాహ్‌ ఆయనకు ఇహపరాల మేళ్లను ప్రసాదించుగాక!

DR

14 ఆత్మ ప్రక్షాళనం రోజా

మిష్మాతుల్‌ మసాబీహ్‌

ఇప్పుడు మీ ముందున్న పుస్తకం ప్రఖ్యాత హదీసు సంచయనం 'మిష్మాతుల్‌ మసాబీహ్‌” గ్రంథంలోని ఒక భాగం 'కితాబుస్సౌమ్‌'కు వివరణ. సందర్భంగా మిష్మాత్‌ గ్రంథాన్ని సంక్షిప్తంగా పరిచయం చేయటం భావ్యమను కుంటున్నాము.

హిజ్రీ 8వ శతాబ్దానికి చెందిన గొప్ప ఫిఖహ్‌వేత్త హదీసు పండితులైన వలియుద్దీన్‌ ముహమ్మద్‌ బిన్‌ అబ్బుల్లాహ్‌ తటబ్రేజీ (రహ్మ) (విచారకరమైన విషయం ఏమిటంటే వీరి జనన మరణాల తేదీలు తెలియలేదు. అయితే ఈయనగారు మిష్మాత్‌ రచయిత అని, హిజ్రీ 737లో దీన్ని పూర్తిగావించారని తెలిసింది) గారి సరిక్రొత్త ప్రక్రియతో కూడిన రచన ఇది. దీని మూలాధారం ప్రఖ్యాత హదీసువేత్త, వ్యాఖ్యానకర్త, ఫిఖహ్‌వేత్త ఇమామ్‌ బగ్‌వి (రహ్మ) (ముహియుస్సున్నహ్‌” - అబూ ముహమ్మద్‌ అల్‌ హుసైన్‌ బిన్‌ మసూద్‌ అల్‌ ఫవ్వాద్‌ అల్‌ బగవియ్యి (మరణం 516 హిజ్రీ) గారి హదీసు సంకలనం “మసాబీహుస్సున్నహ్‌.” దీన్ని మరింతగా సంస్కరించి, మరిన్ని హదీసుల్ని చేర్చి “మిష్మాతుల్‌ మసాబీహ్‌ిగా సంకలనం చేయటం జరిగింది.

అల్లామా తట్రేజీ (రహ్మ) గారి “మిష్మాతుల్‌ మసాబీహ్‌” నూతన ప్రక్రియతో కూడుకున్న రచన. గ్రంథాన్ని ప్రఖ్యాత గురువులు అల్లామా హుసైన్‌ బిన్‌ అబ్బుల్లా తయ్యిబీ (రహ్మ) (మరణం హిజ్రీ 748) గారి సలహా, ఆజ్ఞ మేర సంకలనం చేశారు. గ్రంథం సంకలనమయిన పిదప వారి గురువుగారు దీనికి “అల్‌ కాషిఫు అన్‌ హఖాయిఖిస్సునన్‌” పేరుతో వ్యాఖ్యానం వ్రాశారు.

మిష్మాతుల్‌ మసాబీహ్‌ ప్రత్యేకతను, అవసరాన్ని తెలుసుకోవటానికి ఇమామ్‌ బగవీ (రహ్మ) గారి “మసాబీహుస్సున్నహ్‌” ప్రత్యేకతలపై దృష్టి సారించటం అవసరం. (1) 'మసాబీహుస్సున్నహ్‌'లో హదీసులను ఫిఖహ్‌ (ధర్మశాస్త్రం) అధ్యాయాల

ప్రకారం సంకలనం చేయటం జరిగింది. ప్రతి అధ్యాయాన్ని రెండు

ఆత్మ ప్రక్షాళనం రోజా 15 భాగాలుగా విభజించారు. ఒక భాగంలో ఇమామ్‌ బుఖారీ (రహ్మ), ఇమామ్‌ ముస్లిం (రహ్మ హదీసులను, రెండవ భాగంలో అబూ దావూద్‌ (రహ్మ, తిర్మిజీ (రహ్మ), నసాయి (రహ్మ), ఇబ్బుమాజా (రహ్మ), బైహఖీ (రహ్మ) ఇంకా దారె ఖుత్‌నీ (రహ్మ) తదితరులు ఉల్లేఖించిన హదీసులను పేర్కొన్నారు.

(2) మసాబీహ్‌ రచయిత ఉల్లేఖనకర్తల పేర్లు, సంబంధిత (గ్రంథాల పేర్లు, హదీసు ఆధారాలను పేర్కొనలేదు. దీనివలన హదీసు విద్యార్థులకు వాటి మూలాలను, వాటి ప్రామాణికతను, వాటి స్థానాదులను, తరహాను పేర్కొనటం కష్టంగా పరిణమించేది.

“'మసాబీహిస్సున్నహ్‌”, 'మిష్మాతుల్‌ మసాబీహ్‌'ల మధ్య వ్యత్యాసం (1) మిష్మాత్‌ గ్రంథకర్త 'మసాబీహిస్సున్నహ్‌'లోని రెండు ప్రకరణల

తరువాత మూడవ ప్రకరణాన్ని కూడా చేర్చారు. హదీసుల ఎంపిక చేయటంలో

సిహాహ్‌ సిత్సాహ్‌ (బుఖారీ, ముస్లిం, నసాయి, అబూదావూద్‌, తిర్మిజీ, ఇబ్బుమాజా) కాక, 'షోబుల్‌ ఈమాన్‌, 'బైహఖీ, 'ముస్నద్‌ ఇమాం అహ్మద్‌”,

'ముస్నద్‌ రజైన్‌' (రహ్మ)లను కూడా దృష్టిలో ఉంచుకోవటం జరిగింది.

విధంగా విషయానికి తగ్గట్టు చాలా ప్రముఖమైన హదీసులు గ్రంథంలో

చేర్చబడ్డాయి. మసాబీహ్‌ గ్రంథంలో హదీసుల సంఖ్య 4434, మిష్మాత్‌ గ్రంథంలో వీటి సంఖ్య 5945కి చేరుకుంది.

మిష్మాతుల్‌ మసాబీహ్‌ యావత్‌ ప్రామాణిక హదీసు గ్రంథాల సంక్షిప్త గ్రంథమైనప్పటికీ సత్యతా పూర్వకమైన సమగ్ర సంకలన (గ్రంథం. ఇలాంటి ప్రత్యేకతలుండబట్టే హదీసు విద్యార్థులు, ఉలమాలు (విద్వాంసులు), సామాన్య ముస్లిముల్లో ఇది బాగా ఆదరణకు నోచుకుంది. (గంథం వివిధ ఫిఖహ్‌ అభిమతాలు కలిగిన ధార్మిక కేంద్రాల్లో కూడా ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ధార్మిక పాఠశాలల్లో దీన్ని పాఠ్యాంశంగా చేర్చడం జరిగింది. ఇది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే అరవీ, ఉర్దూ, ఇంకా వేరే అనేక భాషల్లో దీని

వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. హదీసు (గ్రంథాల్లో “సహీహైన్‌' తరువాత

గ్రంథానికే ప్రాచుర్యం లభించింది. అరబీ వ్యాఖ్యానాల్లో అల్లామా అత్‌ తయ్యబీ(రహ్మ) వ్యాఖ్యానం (దీని

ప్రస్తావన ఇంతకు మునుపే వచ్చింది) “మిర్ధాతుల్‌ మఫాతీహ్‌” (ముల్లా అలీ

16 ఆత్మ ప్రక్షాళనం రోజా ఖారీ - రహ్మ), “లమ్‌ఆత్‌” (షేఖ్‌ అబ్బుల్‌ హబ్‌ ముహద్దిస్‌ దెహల్వీ - రహ్మ, “అత్తాలీఖుస్సబీహ్‌” (మౌలానా ముహమ్మద్‌ ఇద్రీస్‌ కాంథహల్వీ), ఇంకా 'మిన్‌హాజుల్‌ మిష్మాత్‌' (అబ్బుల్‌ అజీజ్‌ అల్‌ బహరీ - రహ్మ) ముఖ్యమైనవి. ఫార్సీలో షేఖ్‌ అబ్బుల్‌ హజ్జ్‌ ముహద్దిస్‌ దెహల్వీ (రహ్మ) వ్యాఖ్యానం “అషిఅతుల్‌ లమ్‌ఆత్‌' ప్రసిద్ధిగాంచింది. దాని ఉర్జూ వ్యాఖ్యానం నేడు అరుదైన గ్రంథం. ఇంకా మౌలానా ఖుతుబుద్దీన్‌ (రహ్మ) గారి 'మజాహిరె హఖ్మ్‌ కూడా ప్రస్తావించదగినదే. ఇంకా 1809లో ఒక ఇంగ్లీషు అనువాదం కూడా ప్రచురించబడింది.

“మిష్మాతుల్‌ మసాబీహ్‌'కు చెందిన వివిధ అంశాలు పాకిస్తాన్‌లోని అనేక విద్యాసంస్థల్లో పాఠ్యాంశాల్లో భాగంగా వున్నాయి.

- సంకలనకర్త

ఆత్మ ప్రక్షాళనం రోజా 17

తొలి పలుకులు

శుభప్రదమైన రమజాన్‌ తఖ్వా (నిష్టాగరిష్టతకి), దాస్యానికి ఇంకా కృతజ్ఞతా భావానికి దేవుని పాఠ్య ప్రణాళిక. 9 2 a కక Heo Kone IT CRNA OYE 1 OE Te eT (14 tsi 0 త్రయము మడ ం*

అనువాదం : విశ్వసించిన ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించ బడింది - విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడ విధించబడిందో. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. (అల్‌ బఖర : 183)

(1) రమజాన్‌ ఉపవాసాలు ప్రవక్త (స) హిజ్రత్‌ చేసిన 18 నెలల తరువాత విధి గావించబడ్డాయి. ఖిబ్లా మార్పు ఆజ్ఞ దీనికంటే రెండు లేక రెండున్నర నెలల ముందు వచ్చింది. రమజాన్‌ ఉపవాసాల విధివిధానాలు, ఖుర్‌ఆన్‌ హదీసులు, ముస్లిమ్‌ సముదాయం మూడింటి ద్వారా రూఢీ చేయబడ్డాయి. పైన పేర్కొన్న ఆయత్‌లో రమజాన్‌ రోజాల ఆదేశాలు ఇవ్వబడుతూ “కుతిబ అలైకుము స్సియాము” అని పేర్కొనటం జరిగింది. “కుతిబ” అనే పదం “విధి” గావించ డానికి సూచించబడుతుంది. ఖుర్‌ఆన్‌ ఆధారంగా రుజువయ్యే విషయం ఏమిటంటే రమజాన్‌ ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయి. ఆపై ప్రవక్త (స) సెలవిచ్చినట్లు,

క్ర రమ్యైడ ప్రవ! త్తో శయం పదర దుర భుజు పుటలో OTE)

18

బాసి

ఇస్లాం (2)

(3)

ఆత్మ ప్రక్షాళనం రోజా అనువాదం : ఇస్తాం ఐదు మూల స్తంభాలపై ఆధారపడి ఉంది : అల్లాహ్‌ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ముహమ్మద్‌ (స) ఆయన ప్రవక్త అని సాక్ష్యమివ్వటం. నమాజ్‌ను స్థాపించడం. జకాత్‌ చెల్లించటం. దేవుని గృహం కాబాకు వెళ్ళి హజ్జ్‌ విధిని నెరవేర్చటం. రమజాన్‌ ఉపవాసాలుండటం. హదీసు ద్వారా తెలిసిందేమంటే రోజా కేవలం విధియే కాదు, అది మూలస్తంభాల్లో ఒకటి. ఇస్లాం ఇతర ఆదేశాల వలె రోజాలు కూడా క్రమంగా విధితమయ్యాయి. ప్రారంభంలో ప్రవక్త (స) ప్రతి నెలా కేవలం మూడు రోజులు రోజా పాటించమని సెలవిచ్చారు. అయితే ఇవి విధిగావించబడలేదు. ఆపై హిజ్రీ 2వ సంవత్సరం రోజాల ఆదేశం ఖుర్‌ఆన్‌ ద్వారా వెలువడింది. అయితే రోజాలు పాటించే శక్తి ఉన్నప్పటికీ రోజాలు వుండనివారు ప్రతి రోజాకు బదులు ఒక నిరుపేదకు భోజనం పెట్టాలనే అనుమతి ప్రారంభంలో ఇవ్వబడింది. ఆపై రెండవ ఆదేశం వెలువడ్డాక అంతకు ముందు ఆదేశాలు రద్దు చేయబడ్డాయి. అయితే రోగగ్రస్తులు, ప్రయాణీకులు, గర్భవతులు, బిడ్డలకు పాలుపట్టే స్రీలు, శక్తిహీనులైన వృద్ధులు ఆదేశం నుండి మినహాయించబడ్డారు. (ఖుర్‌ఆన్‌ అవగాహనం, మొదటి సంపుటం, పేజి: 141, 2.అల్‌ బఖర :ఆయత్‌-183, 184) బఖరా సూరాలోనే మరో సందర్భంలో రోజా ఉద్దేశ్యాన్ని ఇలా తెలుపడం

జరిగింది : PT ELI SA BYE 0 wf 0 రభమతయయపయుంయడ్యజు![

అనువాదం: మీరు అల్లాహ్‌ జెన్నత్యాన్ని కొనియాడటానికీ, ఆయనకు మీరు

కృతజ్ఞతలు తెలుపుకోవటానికీ పద్ధతి తెలుపబడుతోంది. (అల్‌ బఖర : 185)

తెలిసిందేమిటంటే రమజాన్‌ రోజాలను కేవలం దాస్యం కొరకో లేదా

నిష్టాగరిష్ట జీవితం కొరకో నిర్ణయించటం జరగలేదు. పైగా దీనిని గొప్ప మార్గోపదేశ

ఆత్మ ప్రక్షాళనం రోజా 19

అనుగ్రహ భాగ్యానికి గాను కృతజ్ఞతలు తెలిపే అవకాశంగా కూడా పేర్కొనటం జరిగింది. అది మనకు ఖుర్‌ఆన్‌ రూపంలో ప్రసాదించటం జరిగింది. వాస్తవానికి ఒక విజ్ఞుడైన మనిషి తనకు చేయబడిన సహాయానికిగాను, తనకు దీన్ని ప్రదానం చేసిన విధాతకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి మరింతగా కృషి చేస్తాడు. ఖుర్‌ఆన్‌ మనకు ప్రసాదించటంలోని ఉద్దేశ్యం ఏమిటంటే డైవాభీష్టాన్ని చూరగొనే మార్గం ఇదేనని గ్రహించి, దానిపై నడుస్తూ పరుల్ని కూడా మార్గంపై నడిచేలా చేయటం మన కర్తవ్యం. ఉద్దేశ్యం కొరకు మనల్ని తయారుచేసేదే రోజా. ఖుర్‌ఆన్‌ అవతరించిన నెలలో మన ఉపవాసం, దైవారాధన కొరకే కాదు, ఇంకా కేవలం మన నైతిక శిక్షణ కొరకే కాదు, వీటన్నింటితో పాటు అనుగ్రహ భాగ్యమైన ఖుర్‌ఆన్‌ అవతరణకు ప్రతిగా కృతజ్ఞతలు తెలుపడమే అసలు లక్ష్యం కావాలి.

20

ఆత్మ ప్రక్షాళనం రోజా

అపస్మారక స్థితిలో ఉన్న రోగికి ఇక చివరి పరీక్షగా అతని ముక్కుకు ముందు అద్దం ఉంచుతారు. అద్దంపై ఏదైనా దుమ్ము, ధూళి పేరుకున్నట్లయితే ఇంకా ప్రాణం మిగిలే వుందని గ్రహిస్తారు. అలా కానట్లయితే ఇక అతని జీవితంపై పెట్టుకున్న చివరి ఆశలు కూడా ఆవిరి అయినట్లే. అదేవిధంగా ముస్లిమ్‌ల ఏదైనా బస్తీని పరీక్షించాలంటే రమజాన్‌ నెలలో దాని స్థితిని గమనించండి. ఒకవేళ నెలలో బస్తీవాసుల్లో కొద్దిపాటి నిష్టాగరిష్టత, దైవభీతి, మంచిని పెంపొందించే చైతన్యమయినా కనిపిస్తే బస్తీ ఇంకా బ్రతికే వుందని గ్రహించాలి. ఒకవేళ నెలలో కూడా మంచిని పెంపొందించే వాతావరణం కన్పించక, పాపకార్యాలు యధాతథంగా కొనసాగుతూ, ఇస్లామీయ భావన చచ్చిపోయినట్లయితే, “ఇన్నాలిల్లాహి ఇన్నా ఇలైహి రాజివూన్‌” అనండి. ఆపై అక్కడి ముస్లింలు శ్వాసపీల్చుకునే అవకాశమే మిగలలేదని భావించాలి.

- సయ్యిద్‌ అబుల్‌ ఆలా మౌదూదీ

ఆత్మ ప్రక్షాళనం రోజా

sp ఉపవాసాల పుస్తకం

రమజాన్‌ - సత్మార్యాల వసంత రుతువు

ory tu AA TCE TL HY NS అంబు! పంట 06 రర =|

ia SK 2 2A nce, seo అవవ రా

నం యాల ఆధ రము విదయ సు 9 నా wea త] LU ( మషమనడ ఘు!

=

2m

1. హజ్రత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు : రమజాన్‌ మాసం వచ్చిందంటే ఆకాశద్వారాలు తెరువబడతాయి (మరో ఉల్లేఖనం ప్రకారం స్వర్గద్వారాలు తెరవబడతా యని వుంది). ఇంకా నరకద్వారాలు మూయబడతాయి; షైతానులు బంధించబడతారు.” మరో ఉల్లేఖనంలో కారుణ్య ద్వారాలు తెరవబడతా

యని పేర్కొనబడింది. * (ముత్తఫకున్‌ అలైహ్‌**)

రమజాన్‌ నెల ప్రారంభంలో ప్రజలకు హితవు గరపటానికి మహాప్రవక్త

(స) ప్రసంగించేవారు. ఇలాంటి వాటిలో ఒక ప్రసంగం : ఇక్కడ ప్రవక్త (స) గారి ప్రసంగంలోని నిజ సారాన్ని గ్రహించటానికి మనం మనసులో గుర్తుంచుకోవలసిన

4 దీని వలన తెలిసేదేమంటే ఒక్సోసారి ప్రవక్త (స) 'అబ్‌వాబున్సమాయి” అన్న వచనాలు ప్రయోగించేవారు, మరొక్తుడు 'అబ్‌వాబుల్‌ జన్నవ్‌” మరోసారి 'అబ్‌వాబురవ్మావొ” అని పలికేవారు. అయితే అన్నిటి ఉద్దేశ్యం ఒక్కటే.

AA ముత్తఫకున్‌ అలైవా అంటే ఇమామ్‌ బుఖారీ మరియు ఇమామ్‌ ముస్లిం ఇద్దరూ

పొందువరబిన వాదీను అని భావం

22 ఆత్మ ప్రక్షాళనం రోజా విషయం ఏమిటంటే ఇక్కడ (శ్రోతలు ఎలాంటి ముస్లింలంటే వీరికంటే సత్యవంతులు, దృఢ విశ్వాసం కలవారు మానవ చరిత్రలో కానరారు. ప్రవక్త (స) సాధారణంగా తమ జుమా ప్రసంగాలలోనే హితవులు గరిపేవారు. సందర్భంలో మస్టిద్‌ నబవీ (స)లో హాజరయిన ముస్లింలు తమ విశ్వాసంలో బలహీనులని, విధేయత చూపించేవారు కారని అనుమానించటానికి వీలేలేదు. కాబట్టి వారు హితవుల పట్ల పూర్తిగా నిజ విశ్వాసం గలవారు, సద్వర్తనులు, నిష్టగలవారు. డైవానికి భయపడుతూ జీవితాన్ని గడిపేవారు. ఆయన ఆదేశాలనుసారం విధేయులై జీవించేవారు. ఇలాంటి వారితో సెలవియ్యబడిందేమిటంటే, రమజాన్‌ నెల ప్రారంభమైందంటే ఆకాశం (స్వర్గం లేదా కారుణ్యం) యొక్క ద్వారాలు తెరవబడతాయి. దీని అసలు ఉద్దేశ్యమేమిటంటే శ్రోతలు రమజాన్‌ నెల వచ్చిన పిదప సాధ్యమైనంతగా సత్కార్యాలు సంపాదించుకోవాలి, స్వర్గపు ద్వారాలన్నీ మీ కొరకు తెరవబడ్డాయి. సదఖా దానధర్మాల ద్వారం గుండా ప్రవేశించగోరితే సదఖా, దానధర్మాలు చేసి స్వర్గంలో ప్రవేశించండి. ఒకవేళ రోజా ద్వారం గుండా ప్రవేశించగోరితే రోజా ద్వారం గుండా ప్రవేశించండి, లేదా ఖుర్‌ఆన్‌ పారాయణ ద్వారం గుండా ప్రవేశించగోరితే విధంగా ప్రవేశించండి, చెడుల నుంచి దూరంగా వుంటూ విధంగా ప్రవేశించగోరితే అలానే చేయండి, మొత్తంమీద స్వర్గంలో ప్రవేశించడానికి మీ కోసం ద్వారాలు తెరవబడే వున్నాయి. ఇకపై మీరు స్వర్ణ ప్రవేశార్హులుగా రూపొందడం మీ వంతు కర్తవ్యం. 4+ ఇంకా నరక ద్వారాలు మూసివేయబడతాయని సెలవియ్యడం జరిగింది : దీని ఉద్దేశ్యం ఏమిటంటే రమజాన్‌లో సాధారణంగా ఒక మనిషి వేరే రోజుల్లో చేసే చెడు పనులకు దూరంగా మసలుకుంటాడు. కాబట్టి మంచి ముస్లిం రమజాన్‌ వాతావరణ పుణ్యమా అని చెడుల నుంచి దూరంగా ఉండే ఆస్మారముంటుంది. విధంగా నరకద్వారాలు అతని కొరకు మూసివేయబడతాయి. + మూడో విషయం ఏమంటే షైతానులు బంధింపబడతారని చెప్పడం జరిగింది: మాటల ఉద్దేశం ఏమిటంటే పవిత్ర రమజాన్‌ మాసంలో సత్కార్యాలు పెంపొందించబడి, షైతాన్‌ చేష్టలకు అడ్డుకట్ట వేయటం జరుగుతుంది. ఎందుకంటే యావన్మంది ముస్లింలు ఒకేసారి ఉపవాసాలను పాటించటం మూలంగా అల్లాహ్‌ వైపునకు మరలే వాతావరణం ఏర్పడుతుంది, ఇది ఇతర దినాల్లో కన్పించదు. కాబట్టి రమజాన్‌ నెల ఎలాంటిదంటే మనిషిలో దేవుని వైపు మొగ్గు చూపే లక్షణం ఎడతెగకుండా ఉంటుంది. ఎందుకంటే మనిషి పన్నెండు, పద్నాలుగు గంటలు రోజా ఉన్నప్పుడు

ఆత్మ ప్రక్షాళనం రోజా 23 నిత్యం అతని మనసులో తాను దైవాభీష్టాన్ని చూరగొనేందుకు రోజాలో వున్నాననే విషయం అనుక్షణం మనసులో మెదలుతూ వుంటుంది. తనకు ఆకలేసినప్పుడు, దప్పికవేసిప్పుడు వెంటనే అతనికి రోజాలో వున్నానన్న విషయం గుర్తుకు వస్తుంది. అందువలన అతను వెంటనే వీటికి దూరంగా వుంటాడు. విధంగా మొత్తం రమజాన్‌ మాసం అతని మనసు దేవుని వైపే మొగ్గుతూ వుంటుంది. అతను ఇఫ్టార్‌ చేసినప్పుడు, ఇప్పటి వరకు నా ప్రభువు నన్ను బంధించివుంచాడు, ఇక నన్ను ఆయన అనుమతించాడు కాబట్టి రోజా విరమిస్తున్నాను అని తలపోస్తాడు. పిదప భోజనం చేశాక తరావీహ్‌ నమాజ్‌కు వెళ్తాడు, మళ్ళీ అతను దేవుని వైపు మరలి వెళ్ళాడు. విధంగా 24 గంటలూ అతను దేవుని వైపు మరలివుంటాడు. ఇలా ఒక్క మనిషి మాత్రమే చేయడు, పూర్తి సముదాయం విధంగానే ఆచరిస్తుంది. దీనివలన అర్ధమయ్యేదేమిటంటే రమజాన్‌ వరాల వసంతం. వర్షాకాలంలో ప్రతిదీ పచ్చగా మారినట్లు, మాసంలో సత్కార్యాలు పెంపొందించబడటానికి అనేక అవకాశాలు ఏర్పడతాయి. మనిషి ఆధ్యాత్మికంగా ఎంతగా అభివృద్ధిచెందాలంటే అంతగా వృద్ధిచెందుతాడు. ఎందుకంటే మాసంలో ఒక మనిషి చేసే సత్మార్యం మరో మనిషికి ఊతంగా ఉంటుంది. విధంగా అతను సహాయకుడుగా మారతాడు. ఇతర దినాల్లో రోజా వుంటే - రోజా ఉండటం ఎంత కష్టమోనన్న విషయం మనిషికి తెలిసివస్తుంది. ఎందుకంటే అతనికి సహాయకుడుగా మనిషీ కనిపించడు. కానీ రమజాన్‌లో పరిస్థితి వేరుగా వుంటుంది. అప్పుడు పూర్తి సమాజమే రోజాలో వుంటుంది. విధంగా ఒక్క మనిషికి లక్షల మంది ద్వారా పటిష్టత చేకూరుతుంది. కారణంగానే రమజాన్‌లో మనిషి ఆధ్యాత్మిక వికాసానికి, శీల నిర్మాణానికి, శీల సంస్కరణకు అనేక అవకాశాలు దొరుకుతాయి. ఇప్పటికే మీరు గమనించేవుంటారు - రమజాన్‌లో ఎవరైనా తిట్లకు దిగితే వెంటనే ఇతరులు కలుగజేసుకొని “ఏమయ్యా, రమజాన్‌లో ఇదేం ప్రవర్తన” అని అతన్ని మందలిస్తారు. దీనర్ధం సమాజం మొత్తానికి ఇప్పటి వరకు తెలుసు, రమజాన్‌ మాసంలో ఎలా గౌరవప్రదంగా, జాగ్రత్తగా మెలగాలో అన్న విషయం. దీనినిబట్టి మనం ఊహించవచ్చు-హృదయాల్లో ఎలాంటి భావనలుంటాయోనన్నది.

ఇదేవిధంగా రమజాన్‌లో స్వర్గద్వారాలు తెరచుకొని ఉంటాయని, నరకద్వారాలు మూయబడతాయని, షైతానులు బంధించబడతారని పేర్కొనటం జరిగింది. అయితే విషయం సద్గుణ సంపన్నత కలిగిన ముస్లిం సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే పేర్కొనబడింది. అంతేగాని, రోజుల్లో కూడా ఎవరైనా ఒకరు బహుదైవారాధన, ఇంకా ఇతర చెడు పనుల్లో మునిగివుంటే అతని కొరకు

24 ఆత్మ (ప్రక్షాళనం రోజా మొత్తం నరకద్వారాలు తెరచుకొని ఉంటాయి, ఇంకా స్వర్గ ద్వారాలు మూయబడ తాయి.

ఉపవాసులకు స్వర్గంలోని ఒక ద్వారం ప్రత్యేకించబడింది

a apg -1 తీ తధరడక్తం 51 కరత (ఉరుసు టేకు రక్తపు!

2. హజ్రత్‌ సహ్‌ల్‌ బిన్‌ సఅద్‌ (రజి) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (స) సెలవిచ్చారు : స్వర్గానికి ఎనిమిది ద్వారాలున్నాయి. వీటిలో ఒక ద్వారాన్ని “రయ్యాన్‌” అని అంటారు. ద్వారం గుండా కేవలం ఉపవాసాలుం డేవారు మాత్రమే ప్రవేశించగలరు. (ముత్తఫకున్‌ అలైహ్‌)

“రయ్యాన్‌” పదాన్ని “రియ్యి” నుంచి గ్రహించడమయింది. దీని అర్ధం దప్పిక తీర్చడం, నీరు సరఫరా చేయడం. రయ్యాన్‌ అంటే దప్పిక తీర్చేద్వారమని అర్థం.

స్వర్గద్వారాలంటే అర్ధం బాహ్యంలో కన్పించే గొప్ప సత్యార్యాలని అర్ధం, వీటివలన మనిషి స్వర్గ ప్రవేశానికి అర్హుడవుతాడు. ఉదాహరణకు ఒక మనిషి దాత, దానశీలుడు, ద్రైవమార్లంలో ఖర్చు చేసేవాడై ఉంటాడు. అతను వేరితర సత్యార్యాలు కూడా చేస్తున్నాడు, రోజాలు కూడా ఉంటున్నాడు, నమాజ్‌ కూడా ఆచరిస్తున్నాడు. కాని ప్రధానంగా బహిర్గతంగా కన్పించే సత్మార్యం, దేనివల్లనైతే అతనికి గుర్తింపు లభించిందో అది దైవమార్గంలో తాను చేసిన ఖర్చు (ఇన్ఫాక్‌ ఫీ సబీలిల్లాహ్‌) వల్లనే. అందుకని అతను “ఇన్ఫాక్‌ ఫీ సబీలిల్లాహ్‌” ద్వారం ద్వారా స్వర్గంలో ప్రవేశిస్తాడు. మరోవ్యక్తి ఆచరణలో దైవమార్గంలో పోరాటం చేసే లక్షణం అతనిలో ప్రధానంగా వుంటుంది. కాబట్టి అతను “ముజాహిదీన్‌ ఫీ సబీలిల్లాహ్‌” మార్గం ద్వారా స్వర్గంలో ప్రవేశిస్తాడు. విధంగా వివిధ వ్యక్తులు తాము అత్యధికంగా ఆచరించి గుర్తించబడే ఆచరణ ద్వారానే స్వర్గంలో ప్రవేశం పొందుతారు. మరోమాటలో చెప్పాలంటే ప్రపంచంలో సత్మాధ్యాలు లెక్కకు మించి వున్నాయి. సత్మార్యాలను విభజిస్తే ఎనిమిది ద్వారాలుగా విభజించబడతాయి. ఎనిమిది ద్వారాలగుండా ఎవరు దేనిద్వారా ప్రవేశానికి అర్హుడో దానిద్వారా స్వర్గంలో ప్రవేశిస్తాడు.

ఆత్మ ప్రక్షాళనం రోజా 25

ఇక్కడ ప్రస్తావించిన “రయ్యాన్‌” ద్వారం గుండా కేవలం ఉపవాసి మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తాడు. దీని అర్ధం ఏమిటంటే, రోజా అయితే యావన్మంది ముస్లింలు పాటిస్తారు, కాని కొందరు ఎక్కువగా రోజాలు పాటిస్తారు, కాబట్టి వారికి ప్రతిఫలం తప్పకుండా లభించాలి. వీరు శ్రద్ధగా రోజాలు పాటించి అల్లాహ్‌ను ప్రీతిపాత్రునిగా చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ద్వారం అలాంటి వారి కొరకు ప్రత్యేకించటం జరిగింది.

పాపాలన్నింటి మన్నింపు సాధనం

Sib Fob Ag -౯ di atts AUT ET ENT రద పపకి తకు రటేపకే (రదు. ఉతర రయి 8. హజ్రత్‌ అబూహురైరా (రజి) ద్వారా ఉల్లేఖనం-ప్రవక్త (స) సెలవిచ్చారు: సంపూర్ణ విశ్వాసంతో, పుణ్యఫలాపేక్షతో ఎవరైతే రమజాన్‌ రోజాలను పాటిస్తాడో అతని పూర్వపాపాలన్నీ మన్నించివేయబడతాయి. ఇంకా ఎవరైతే పూర్తి విశ్వాసంతో, పుణ్యఫలాపేక్షతో రమజాన్‌ రాత్రుల్లో దైవా రాధనలో గడుపుతాడో అతని వలన జరిగిన పూర్వ పాపాలన్నీ మన్నించి వేయటం జరుగుతుంది. ఇంకా ఎవరైతే లైలతుల్‌ ఖద్ర్‌ (ఘనమయిన రేయి) యందు పూర్ణ విశ్వాసంతో, పుణ్యఫలాపేక్షతో జాగరణ చేస్తాడో, అతని వలన జరిగిన పూర్వపు పాపాలన్నీ క్షమించివేయబడతాయి. (ముత్తఫకున్‌ అలైవ్‌)

“ఎహ్‌తెసాబ్‌ అంటే ఒక వ్యక్తి తాను చేసే పుణ్యకార్యాలన్నింటినీ కేవలం అల్లాహ్‌ కొరకే చేస్తూ, కేవలం ఆయన ప్రీతి పొందటానికే ఆచరించటం.

హదీసులో పాపపరిహారాల గురించి విన్సించబడిన శుభవార్త ఉద్దేశం అల్లాహ్‌ ఆదేశాలకు అనుక్షణం వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, పరలోకంలో జవాబుదారీ తనం గురించి నిర్భయులుగా వున్నవారికి అలా చేయమని లైసెన్స్‌ ఇచ్చినట్లు ఎంతమాత్రం కాదు - చూడబ్బాయీ, రమజాన్‌లో రోజాలు పాటించు, తరావీహ్‌

26 ఆత్మ ప్రక్షాళనం రోజా చదువుకో, లైలతుల్‌ ఖద్ర్‌లో ఆరాధన చేసుకో, అప్పుడు నీ లెక్క సాఫీ అవుతుంది. ఇక మిగతా పదకొండు నెలల్లో నీ ఇష్టమొచ్చినట్లు చేసుకుంటూ వుండు. లంచాలు తిను, ప్రజల హక్కులు కొల్లగొట్టు, ఎలాంటి దౌర్దన్యాన్నయినా, జులుంనయినా చేయి, ఆపై రమజాన్‌లో ఆరాధనకై నిల్చో, రోజాలు పాటించు, నమాజులు చదువుకో, ఆపై పూర్వపు పాపాలన్నీ క్షమించబడతాయి అని దీని భావం కానేకాదు.

హదీసును పఠిస్తున్నప్పుడు మన దృష్టిలో ఎవరి గురించి ఇలా అనబడు తుందో అవగతమవ్వాలి. విషయాన్ని ముందే వివరించటమయ్యింది. హదీసులో ప్రస్తావితులెవరంటే నిత్యం నిష్టాగరిష్ట జీవితాన్ని గడిపే ప్రయత్నం చేసే సజ్జనులు, దైవభీతిపరులు, శిష్టశీల సంపన్నులు మాత్రమే. ఇలాంటి వారు మరుపు వలన ఏదైనా పాపకార్యం, పొరపాటు జరిగినట్లయితే వారు ఇతరుల్లా తప్పుచేసి కూడా దానిపై మొండిగా వాదించే వ్యక్తుల్లాంటివారు కారు. వ్యక్తులు భిన్నమైనవారు. ఇలాంటి సన్మార్గగాముల వలన ఏదైనా తప్పు, పాపం జరిగిందంటే అది మానవమాత్రులవడం చేతనే. ఇలాంటి సందర్భాల్లో వారు పశ్చాత్తాపంతో కుమిలిపోతారు. ఒకవేళ అనుకోకుండా మానవ సహజ దౌర్బల్యం చేత పొరపాటు జరిగినా దానిపై పశ్చాత్తాపభావంతో కుమిలిపోతూ సన్మార్గాన్ని అలవరచుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే వారి పశ్చాత్తాపంగా మారుతుంది. ఒక వ్యక్తి వలన ఏదైనా పాపకార్యం జరిగి దాన్ని అతను మరచిపోయాడు. ఆపై నమాజ్‌ చేసినట్లయితే అతని లెక్క నుంచి పాపకార్యాన్ని తీసివేయటం జరుగుతుంది. అసలు పశ్చాత్తాపం అంటే ఒక వ్యక్తి వలన ఏదైనా పొరపాటు జరిగి తరువాత అది అతనికి గుర్తుకు వచ్చి దానిపై అతను ప్రభువు వైపునకు మరలినట్లయితే అదే అతని పశ్చాత్తాపం. అదెలాగంటే ఒక నౌకరు ఒక తప్పు వలన తన యజమాని నుంచి దూరమయిపోతాడు. దానిపై అతను క్షమాపణ వేడుకుంటాడు. ఒకసారి నౌకరు చేత జరిగిన పొరపాటు వలన యజమాని అతన్ని దూరం చేసుకోడు. క్షమాపణ వేడుకున్న నౌకరును క్షమించి మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకుంటాడు. వెనుకటి మాదిరిగా నౌకరు కూడా నమ్మకంతో సేవాభావంతో మెలగుతాడు.

తన దాసులైన మానవులతో కూడా అల్లాహ్‌ ఇలాగే చేస్తాడు. మూలతః దాసుడు అల్లాహ్‌ పట్ల విధేయత చూపేవాడైనట్లయితే, తెలిసీ తలబిరుసుతనంతో తప్పుచేసే ఉద్దేశ్యం లేనట్లయితే, పొరపాటుగా దాసుడు ఏదైనా తప్పుచేసి ఆపై అల్లాహ్‌ సమక్షంలో నమాజ్‌ కొరకు నిల్చుంటే అల్లాహ్‌ అతన్ని నిరాశపరచడు. ఎందుకంటే దాసుని ఆచరణ ద్వారా తెలిసిందేమంటే తప్పులతో ఎదురుదెబ్బ తిన్నప్పటికీ

ఆత్మ ప్రక్షాళనం రోజా 27 మళ్ళీ అల్లాహ్‌ వైపు పశ్చాత్తాపంతో మరలాడు కాని, తిరుగుబాటు చేయలేదు. దీని ఆధారంగానే చెప్పబడిందేమిటంటే ఒక వ్యక్తి, సంపూర్ణ విశ్వాసంతో, పుణ్యఫలా పేక్షతో రోజా వున్నట్లయితే పూర్వపు పాపాలన్నీ పరిహరించబడతాయి. రమజాన్‌లో రాత్రిళ్ళు దైవారాధనలో నిల్చున్నా కూడా అది పాపపరిహారంగా మారుతుంది. అదేవిధంగా లైలతుల్‌ ఖద్ర్‌ నాడు ఆరాధన చేసినా ఆచరణ కూడా తన పాపాల మన్నింపునకు ఆస్మారంగా మారే అవకాశం ఉంది.

రోజా sets ఎలాంటి హద్దూ లేదు

బబు గ్రీంయు గ్ర పేక రర Jey erm NEN IES EN తీ Ir బులి రువిం హో Yrs సయ య్యాజత వ్య POTN SE తేజు మ్‌ 5కు) cue థః హమ TODS Bre Bem A 2 Gem! res 5 GES, D225 CTO : స్త రు ROOT యట్లు (అనీ 4. _హటజత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు : ఆదం సుతుని ప్రతి సత్మార్యం అతని కొరకు ఎన్నో రెట్లు పెంచబడుతుంది. కడకు ఒక సత్మార్యం పదిరెట్లు పెంచి ఇవ్వటం జరుగుతుంది, పదింతలనే 700 రెట్లకు పెంచి ఇవ్వటం జరుగుతుంది. అయితే అల్లాహ్‌ సెలవిస్తున్నాడు : రోజా విషయం దీనికి భిన్నమైనది. ఎందుకంటే అది నా కొరకు ఉంచబడింది. అది నేనే. కాబట్టి దాని ప్రతిఫలం కూడా నేనే ఇస్తాను. ఉపవాసి తన శారీరక సుఖాలను, అన్నపానీయాలను నా కోసం త్యజిస్తాడు. ఉపవాసికి రెండు సమయాలు ఆనందదాయకమైనవి. ఒకటి ఇష్హార్‌ వేళ, రెండవది తన ప్రభువును

28 ఆత్మ ప్రక్షాళనం రోజా కలుసుకునే వేళ. ఉపవాసి నోటి నుంచి వచ్చే వాసన అల్లాహ్‌కు కస్తూరి సువాసనకన్నా మిన్నగా ప్రీతికరం. రోజా డాలు లాంటిది. మీలో ఎవరైనా రోజా వున్నప్పుడు తమ నోటి ద్వారా చెడు మాట్లాడరాదు, హింసా దౌర్జన్యాలు జరపరాదు. ఒకవేళ ఎవరైనా తన పట్ల తిట్లు, దూషణకు దిగితే “సోదరా! నేను రోజాలో వున్నానిని మృదువుగా చెప్పేయాలి.

(ముత్తఫకున్‌ అలైవ్‌)

ఇతర పుణ్యకార్యాలైతే పది నుంచి 700 రెట్లకు పెంచి ఇవ్వబడతాయని చెప్పటం జరిగింది, కాని రోజా గురించి, అవి నా కోసం పాటించబడ్డాయి, వాటి ప్రతిఫలాన్ని నేనే ప్రసాదిస్తానని అల్లాహ్‌ సెలవిస్తున్నాడు. దీని భావం ఇతర సత్కార్యాలు అల్లాహ్‌ కోసం కావని ఎంతమాత్రం కాదు. వాటి ప్రతిఫలం ఎటూ ఇవ్వబడుతుంది. ఇక్కడ ప్రస్తావించినట్లు దీని భావం ఏమిటంటే అవి అల్లాహ్‌ కోసం ప్రత్యేకం. కాబట్టి ఆయన కోరినంతగా ప్రతిఫలం ప్రసాదిస్తాడన్నమాట. ఇతర సత్కార్యాల పుణ్యాలు

700 రెట్ల వరకు పెంచి ఇవ్వటం జరుగుతుందని, దీనికి బదులుగా రోజా విషయమై

అల్లాహ్‌ తన ఇష్టానుసారం దాని ప్రతిఫలాన్ని ఇస్తానని సెలవిస్తున్నాడని భావం.

అంటే రోజా ప్రతిఫలంలో ఎలాంటి హద్దూ నిర్ధారితమై లేదు. అల్లాహ్‌ తాను తలచినంత మేరకు ప్రసాదిస్తాడన్నమాట.

రోజా శ్రేష్టత, గొప్పదనం అసాధారణమైనది

అసలు విషయం ఏమిటంటే, ఇతర సత్యాన్యాల్ని మనిషి బహిర్గతంగా ఆచరిస్తాడు. ఉదాహరణకు నమాజ్‌ ఒక బాహ్యాచరణ. నమాజ్‌ ఆచరించే వ్యక్తి నిల్చుంటాడు, కూర్చుంటాడు, రుకూ, సజ్ఞాలు చేస్తాడు. విధంగా ఇది కనిపించే ఆచరణ. హజ్‌, జకాత్‌ ఆచరణలు కూడా అంతే. కానీ రోజా వీటికి పూర్తిగా భిన్నమైనది. ఇది బాహ్యపరంగా కనిపించని ఆచరణ. ఇది తన ప్రభువైన అల్లాహ్‌కు తనకు మాత్రమే తెలుసు. రెండవ కోణంలో ఇది అల్లాహ్‌ ఆదేశాలను గోప్యంగా శిరసావహించాల్సిన ఆచరణ. ఉదాహరణకు తినటం, త్రాగటం మానుకోవాలి, అదేవిధంగా ఇతర వారించబడిన పనులకు దూరంగా ఉండాలి. గోప్యమైన ఆచరణ స్వయంగా మనిషికీ లేక దైవానికే తెలుసన్నమాట. మూడో వ్యక్తికి ఇది విధంగానూ తెలిసే అవకాశం లేదు - గోప్యాచరణ ఉపవాసి చేశాడా లేదా అన్న

ఆత్మ ప్రక్షాళనం రోజా 29 విషయం. ఉదాహరణకు ఒక మనిషి రహస్యంగా తిని, త్రాగితే విషయం ఎవరికీ తెలియదు. అంటే రోజాను భంగపరచి కూడా తాను రోజాలో వున్నానని బుకాయిస్తే ఎవరికీ తెలిసిరాదు. అప్పుడు మూడో వ్యక్తి కూడా అతను రోజాలో వున్నాడో లేదో అన్న విషయాన్ని రూఢీగా చెప్పలేడు - ఒకవేళ తాను రోజాలో వున్నానని చెప్పినా, లేనని చెప్పినా తనకు మాత్రమే తెలుసు. అందువల్లనే రోజా విషయం దాసునికి, దైవానికి మాత్రమే తెలుసు. కారణంగానే ఇది బాహ్యపరంగా కన్పించే ఆచరణ కాదు. ఒక వ్యక్తి ప్రపంచానికి చూపించటానికి తాను రోజాలో వున్నానని చెప్పవచ్చు. వాస్తవానికి అందులో బాహ్యాచరణ ఏమాత్రం లేదు. అతను అల్లాహ్‌ను మోసం చేయలేడు. అందుకనే అల్లాహ్‌ రోజా నా కోసం ప్రత్యేకించబడింది. 45s

“వ అనా అజ్‌జీబిహీ” కాబట్టి నేనే దాని ప్రతిఫలం ఇస్తానని సెలవిచ్చాడు.

దీని భావం, అల్లాహ్‌ రోజా ప్రతిఫలాన్ని లెక్కలేనంతగా ఇస్తాడు. మనిషి ఎంతగా దీక్షతో, నిష్టాగరిష్టతో, తఖ్వాతో రోజా వుంటూ, దానిద్వారా ఆధ్యాత్మికంగా, ధార్మికంగా ప్రయోజనాన్ని పొందుతూ వుంటాడో అంతగా వాటి ప్రతిఫలం పొందుతాడు. మిగతా రోజుల్లో కూడా అదే ఆచరణ స్థిరంగావుంటే అల్లాహ్‌ అందులో అంతగానే వృద్ధీవికాసాలను ప్రసాదిస్తాడు.

అల్లాహ్‌ దృష్టిలో రోజా గురించి వున్న అసామాన్య గౌరవాదరణలకు మరో కారణం ఏమిటంటే, ఉపవాసి అల్లాహ్‌ కోసమే తన లైంగిక వాంఛను, అన్నపానీయాలను త్యజిస్తాడు. అందువల్లనే అల్లాహ్‌ అతన్ని పరలోకంలో లెక్కకు మించిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

ఉపవాసి కొరకు రెండు ఆనంద ఘడియలు

4+ _ ఉపవాసి రెండు సందర్భాల్లో సంతోషపడతాడు. ఒకటి, ఉపవాస విరమణ వేళ, రెండవది తన ప్రభువైన అల్లాహ్‌ను కలుసుకునే సమయంలో.

దీని అర్థం, ఉపవాస దీక్ష విరమణ సందర్భంలో ఉపవాసికి లభించే సంతోషం ఇష్తార్‌తోనే అంతమవదు. పైగా అతను తన ప్రభువును కలుసుకున్నప్పుడు అంతకన్నా ఎక్కువ సంతోషమే ప్రాప్తమవుతుంది. తాను ఇహలోకంలో చేసివచ్చిన సదాచరణకు ఆయన సన్నిధిలో ఎంత గొప్ప ప్రతిఫలం లభించిందో కూడా అతనికి తెలిసివస్తుంది.

30 ఆత్మ (ప్రక్షాళనం రోజా

4+ ఉపవాసి నోటి వాసన కస్తూరికన్నా మిన్నగా పరిమళాన్ని వెదజల్లుతుందని సెలవియ్యడం జరిగింది. ఎవరయినాసరే తన నోటిని, పల్లను ఎంతగా పరిశు భ్రపరచినా రోజుకు 12 లేక 14 గంటల పాటు తినటం, త్రాగటం మానివేసిన కారణాన నోటి ద్వారా ఒక రకమయిన దుర్వాసన వస్తుంది. అందువలన పవాసి నోటిద్వారా వెలువడే అలాంటి దుర్వాసన పట్ల అసహ్యించుకోరాదు. ఎందుకంటే ఇలాంటి వాసననే అల్లాహ్‌ కస్తూరికన్నా మిన్నయైన పరిమళంగా పరిగణించాడు.

రోజా చెడులను ఎదుర్శొనే డాలు వంటిది

4+ రోజా డాలు లాంటిదని సెలవియ్యడం జరిగింది. కనుక మీలో ఎవరయినా

ఉపవాసం వున్నప్పుడు దుర్భాషలాడకూడదు, దౌర్జన్యం చేయరాదు.

రోజా డాలు వంటిదని ఎందుకు చెప్పబడిందంటే, అది మనిషిని చెడుల నుండి రక్షిస్తుంది. శత్రువు వేటునుండి కాపాడుకోవటానికి డాలును అడ్డంగా పెట్టి రక్షణ పొందినట్లు, రోజాలో వున్నప్పుడు మనం ఏదైనా చెడు కార్యాచరణకు పూనుకోవాల్సిన దుస్థితి ఏర్పడితే, వెంటనే ఉపవాసి తాను రోజాలో వున్నానని గ్రహించి దాన్నుంచి దూరమైపోతాడు. కాబట్టి సందర్భంలో తన రోజా తనకు డాలులాగా ఉపకరించినట్లుగా పరిగణించాలి. డాలును విధంగా పటిష్టంగా, సహాయకారిగా చేయాలంటే మనిషి రోజాలో వున్నప్పుడు స్వయంగా ఎవరితోనూ దూషణలకు, తగాదాకు దిగరాదు. ఇది డాలు చేసే మొదటి సహాయం. ఇక రెండవ కోణం ఏమిటంటే, ఎవరైనా తనతో తగాదాకు వస్తే, మిత్రమా! నేను మాత్రం అలా చేయను అని సున్నితంగా చెప్పాలి. ఇకపై డాలు మనిషిని ప్రతి చెడు కార్యాన్నుంచి ఆపే పటిష్టమైన ఆయుధంగా తయారవుతుంది.

ఒకవేళ ఎవరయినా రోజాలు వుండి కూడా ఎవరితోనయినా పోట్లాటకు దిగితే తనకు చెడుల నుండి రక్షణగా వుండే డాలులో బీటను లేక పగులును వేసినట్లే. ఒకవేళ ఎవరయినా తనతో కోట్లాటకు వస్తే, ఉపవాసి కూడా దానికి దీటుగా చొక్కా చేతుల్ని పైకి మడచి కోట్లాటకు సంసిద్దడైతే దాని అర్థం తన డాలును తానే విరచిపారేశాడన్నమాట! ఇక అతను తమలపాకుతో ఇట్టంటే, ఇతను తలుపు చెక్కతో ఇట్లన్నట్లుగా మారుతుంది పరిస్థితి. అయితే మనిషి రోజాను డాలులా ఉపయోగించినట్లయితే అది అతనిని నిజంగానే చెడుల నుండి రక్షిస్తుంది.

ఆత్మ ప్రక్షాళనం రోజా 31

నరకం నుంచి విముక్తి నొందే మాసం

semen A 0 అటక తడల వదేల్ర రక 5) యే వే Pe Wr. భ్‌ తపం బున Wes hiss ie

- Pe 229

WEI OHI CGY

EH bE Hi

ima గ్ర కరుకు. ఖైదు రో యు కడు! 5. హజ్రత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు : రమజాన్‌ నెల మొదటి రాత్రి ప్రవేశించగానే దుష్మా్యాలను ప్రేరేపింపజేయదానికి సంసిద్ధులైన పైతానులు, జిన్నులు బంధించబడ తారు. నరక ద్వారాలు మూసివేయబడతాయి, వీటిలో ద్వారమూ తెరవబడదు. ఇంకా స్వర్గద్వారాలు తెరవబడతాయి, అందులోని ద్వారమూ మూసివేయబడదు. ఆపై ప్రకటన కర్త ఇలా ప్రకటిస్తాడు - మేలును కాంక్షించేవాడా! ముందుకు సాగిపో. చెడులను ఆశించేవాడా! ఆగిపో. మీలో ఎంతోమంది అల్లాహ్‌ తరఫు నుండి నరక జ్వాలల నుండి రక్షణ పొందుతారు. ఇలా ప్రతి రాత్రి జరుగుతుంది. (తిర్మిజీ, ఇబ్నెమాజా) ఇస్లామీయ క్యాలెండర్‌ చాంద్రమానంపై ఆధారపడివుంది. చాంద్రమాసాలు చంద్రోదయంతో ప్రారంభమవుతాయి. అందుకని ఇస్లాంలో ప్రతి నెలా రాత్రితో (ప్రారంభమవుతుంది. అందువల్ల రమజాన్‌ నెల చంద్రుణ్ణి చూసిన పిదప ప్రారంభమవుతుంది. కారణంగానే ఇక్కడ రమజాన్‌ మాసంలోని మొదటి రాత్రి నుద్దేశించి సెలవియ్యటం జరిగింది - ఇందులో షైతానులను, ఇంకా చెడులను, హింసను వ్యాపింపజేసే జిన్నులను బంధించటం జరుగుతుందని. రమజాన్‌ ప్రత్యేకతలతో పాటు విషయం కూడా మన దృష్టిలో వుండాలి. అదేమిటంటే, రమజాన్‌ వెలుగు, శుభాలు మొత్తం ప్రపంచంలో వుండదు. వాతావరణం కేవలం ముస్లిములు, సజ్జనులు నివసించే ప్రాంతాల్లోనే నెలకొంటుంది.

32 ఆత్మ (ప్రక్షాళనం రోజా షైతాన్‌ ఎందుకు బంధించబడతాడు?

రమజాన్‌ నెల ప్రారంభమవగానే విశ్వాసి అయిన సజ్జనుడు మామూలు రోజుల్లో లేని ప్రతిబంధకాల్ని తన మనోవాంఛలపై విధించుకుంటాడు. ఉదాహరణకు మామూలు రోజుల్లో అతనికి ధర్మసమ్మతమైన నీరు రమజాన్‌లో అతనికి 12 నుంచి 14 గంటల వరకు హరామ్‌ (నిషిద్దం) అయిపోతుంది. మామూలు రోజుల్లో అతనికి అనుమతించబడిన హలాల్‌ (ధర్మసమ్మతం) అయిన ఆహారం రమజాన్‌లో అనేక గంటల పాటు అతనికి నిషిద్ధమైపోతుంది. తెలిసేదేమంటే, ఒక విశ్వాసికి మామూలు రోజుల్లో లేని ప్రతిబంధకాలు రమజాన్‌ నెలలో అతని మనోవాంఛలు, శారీరక వాంఛలు, స్వేచ్చలపై ఏర్పడతాయి. అప్పుడు విశ్వాసి కట్టుబాట్లకు తలొగ్గి వాటిలో బంధితుడవుతాడు. ఒకవేళ విశ్వాసి మనోకాంక్షలకు దాసుడై, షరీఅత్‌ను పాటించకున్నట్లయితే తనలో వున్న షైతాన్‌ బంధించబడలేదని, చట్టం సాక్షిగా వాడు స్వేచ్చగా తిరుగుతూ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడని భావించాలి. కాబట్టి ఇక మీరే గ్రహించండి, ఒక వ్యక్తి షరీఅత్‌ విధించిన కట్టుబాట్లను క్షణం నుంచి పాటిస్తాడో క్షణం నుంచే అతను తన షైతాన్‌ను గొలుసులతో బంధితునిగా చేశాడని అర్థం. ఎప్పుడైతే అతను తనపై షరీఅత్‌ నిబంధనల్ని విధించుకున్నాడో అప్పుడు రెండోవైపు తన కోసం స్వర్గద్వారాలు తెరచుకున్నాయన్నమాట. షైతాన్‌లు బంధించబడతాయంటే, నరకద్వారాలు మూయబడతాయంటే, స్వర్గద్వారాలు తెరచుకుంటాయంటే అర్థం ఇదే. ఇలాంటి ఆచరణలు విశ్వాసులు, సజ్జనులు నివసించేచోట వికసించి వెలుగొందుతాయి. అంతేగాని ప్రపంచంలో వున్న షైతాన్‌లందరూ బంధించబడతారని దీని భావం కాదు. మాటకొస్తే నేడు ముస్లింల బస్తీల్లో కూడా షైతాన్‌లు యధేచ్చగా తిరుగుతున్నాయి. ముస్లిములయి వుండి కూడా షరీఅత్‌ కట్టుబాట్లకు విరుద్ధంగా నడుచున్నట్లయితే, వారి షైతాన్‌ స్వేచ్చగా తిరుగాడటమే కాదు, వారిపై తన అధికారం చెలాయిస్తున్నాడన్నమాట. తన మనోకాంక్షల పైన కట్టుబాట్లను విధించుకుని, అల్లాహ్‌ ఆదేశానుసారం నడుచుకున్న వ్యక్తి యొక్క షైతాన్‌ మాత్రమే బంధించబడినట్లు లెఖ్క

రమజాన్‌ పిలుపు 4+ _ ప్రకటనకర్త మేలును కాంక్షించేవాడా! ముందుకు సాగు, చెడు చేసే తలంపు

గలవాడా! ఇక ఆగిపో” అని ప్రకటించటం జరుగుతుందని సెలవియ్యడం జరిగింది.

ఆత్మ ప్రక్షాళనం రోజా 33

ఒక ప్రకటనకర్త నిల్పొని ఇలా పిలుపునిస్తాడని దీని అర్ధంకాదు. దీని ఉద్దేశం అల్లాహ్‌ ఆదేశాలను పాటించేవారు రమజాన్‌ ప్రారంభం కాగన ఇక పుణ్యాలు సంపాదించుకునే, చెడులను త్యజించే కాలం వచ్చేసిందని తలుస్తారన్న మాట. రమజాన్‌ నెల పొడుపు అయ్యిందని ప్రకటించగానే, ఉపవాసి “ఓ మంచిని కాంక్షించేవాడా! ముందుకు సాగు, పుణ్యాలను జుర్రుకునే సమయం ఇదే, పుణ్యాలతో నీ జోలెను నింపుకునే కాలం మొదలయ్యింద”న్న విషయాలను తన మనసులో నాటుకుంటాడు. ఇంకా “దుష్మార్యాల తలంపుగలవాడా! ఆగిపో, నీవు ఆగిపోవలసిన తరుణమిదే. ఎందుకంటే సమయంలో నీవు చేసే సాధారణ దుష్మార్యం కూడా పెద్ద ద్ద దుష్మార్యంగా పరిగణించటం జరుగుతుంది, దానికి విరుద్ధంగా నీవు చేసే మామూలు సత్మార్యం కూడా అనేక రెట్లు వృద్ధీ వికాసాలు పొందుతుంది. కాబట్టి నీవు ఇక దుష్మార్యాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం” అని సంకల్పించుకుంటాడు.

నరకాగ్ని నుంచి విడుదలయ్యేవారు

4+ _ ఇంకా ఏమని సెలవియ్యబడిందంటే, రమజాన్‌లో అనేకమంది అల్లాహ్‌ దాసులు నరకాగ్ని నుంచి విడుదలవుతారు.

“అతీఖ్‌ అంటే స్వతంత్రుడైన వ్యక్తి అని అర్థం. ఇలా సెలవిచ్చిన దానికి అర్ధమేమంటే, అనేకమంది దాసులు కాలంలో తమ సత్మార్యాల ఫలితంగా నరకాగ్ని నుంచి విడుదల గావించబడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తాము కూడా ఇలాంటి దాసుల్లో ఒకరుగా పరిగణించబడటానికి మేరకు ప్రయత్నిస్తున్నామని ఆలోచించాలి.

ఇలా ప్రతి రాత్రి జరుగుతుంది

దీని భావమేమిటంటే, పవిత్ర రమజాన్‌ శుభాలు, ప్రత్యేకతలు దాని మొదటి రాత్రి నుంచే ప్రస్ఫుటమై, నెలలోని ప్రతి రాత్రి ఇలాగే ఎడతెగకుండా ప్రకాశిస్తూనే వుంటాయి.

వెయ్యి నెలలకన్నా శ్రేష్టమైన రాత్రి మదుర 4 WNT POIROT

34 ఆత్మ ప్రక్షాళనం రోజా భార పోత 6. హజుత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు : మీపై శుభప్రదమైన రమజాన్‌ నెల వచ్చింది. ఇందులో మీపైన రోజాలు విధి గావించబడ్డాయి. ఇందులో స్వర్గద్వారాలు తెరచుకోబడతాయి, నరకద్వారాలు మూయబడతాయి. ఇంకా తలబిరుసు షైతానులు బంధించబడతారు. ఇందులో అల్లాహ్‌ తరఫున ఒక రాత్రి వుంది, అది వెయ్యి నెలలకన్నా (శ్రేష్టమైనది. రాత్రి శుభాలకు దూరమయినవాడు అభాగ్యుడు. (అహ్మద్‌, నసాయి) హదీసు కూడా ప్రవక్త (స) ప్రసంగాలలోనిదే. శుభాలు నిండిన రమజాన్‌ మాసం ప్రారంభమవగానే ప్రవక్త (స) తన సహచరులకు మాసంలోని శుభా లను, ప్రత్యేకతలను వివరించేవారు. ఇందులో మొట్టమొదట రమజాన్‌ ఎన్నో శుభాలతో నిండిన మాసమని తెలుపటం జరిగింది. నెలలోని రోజాలు ముస్లిం సమాజానికి విధి గావించబడ్డాయి. బర్మత్‌ పదం అసలు అర్థం “వృద్ధి, “వికాసం”. రమజాన్‌ మాసాన్ని శుభాల మాసమని ఎందుకనబడిందంటే ఇందులో మేళ్ళు వృద్ధి, వికాసాలు పొందుతాయి. సత్కార్యాలు అధికమవుతాయి. దీనికి ప్రతిగా దుష్కార్యాలు పెరిగిపోయేబదులు క్షీణించిపోతాయి. వాటి వృద్ధి నిలిచిపోతుంది. సెలవిచ్చిన రెండవ మాట ఏమిటంటే, నెలలో ఒక రాత్రి వున్నది - అది వెయ్యి నెలలకన్నా శ్రేష్టమైనది. దీని ఉద్దేశం 'లైలతుల్‌ ఖద. అంటే రాత్రిలో ఖుర్‌ఆన్‌ అవతరించింది. ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌లో సెలవియ్యటం జరిగింది :

పదర మడు చత భదత యోక్క ఇన్నా అన్‌జల్‌నాహు ఫీ లైలతిల్‌ ఖద్‌ర్‌. వమా అద్రాక మా లైలతుల్‌ ఖద్‌ర్‌. లైలతుల్‌ ఖద్‌రి ఖైరుమ్‌ మిన్‌ అల్‌ఫి షహ్‌ర్‌. భావం : మేము దీని (ఖుర్‌ఆన్‌)ని ఘనమైన రాత్రియందు అవతరింపజేశాము.

a

ఆత్మ ప్రక్షాళనం రోజా 35 ఘనమైన రాత్రి ఏమిటో మీకు తెలుసా? ఘనమైన రాత్రి వెయ్యి నెలలకంటే కూడా ఎంతో శ్రేష్టమైనది.

వాస్తవం ఏమిటంటే, ఖుర్‌ఆన్‌ అవతరణ మానవాళి కొరకు గొప్ప మేలుతో కూడుకొని ఉంది. మానవుని కొరకు ఇంతకన్నా గొప్ప వరం, మేలు మరొకటి వుండజాలదు. అందుకనే ఖుర్‌ఆన్‌ అవతరించిన రాత్రి వెయ్యి నెలలకంటే ఎక్కువ శ్రేష్టమైనదని సెలవియ్యటం జరిగింది. మరో అర్థంలో చెప్పాలంటే ఒక్క రాత్రిలో ప్రసాదించిన శ్రేష్టత, మేలు మొత్తం మానవ చరిత్రలోనే వెయ్యి నెలల్లో ఇలాంటి గ్రేష్టత ప్రసాదించబడలేదు. వెయ్యి నెలలు అంటే ఖచ్చితంగా వెయ్యి అని లెక్క లేదు. ఇది దీనికన్నా ఎన్నో రెట్లు అధికమైందని ఉద్దేశం. కాబట్టి శ్రేష్టత దృష్ట్వా ఇది వెయ్యి నెలలకన్నా మిన్న అల్లాహ్‌ ఆరాధనలో భక్తి శ్రద్ధలను నిలిపిన వ్యక్తి ఎంతో గొప్ప మేలును పొందినట్లేనని లెఖ్క ఎందుకంటే రేయి దాసుడు అల్లాహ్‌కు ఎంతో చేరువయిపోతాడు. దీనికి రుజువు ఏమిటంటే, రేయి ప్రత్యేకత ఏమిటో దాసునికి తెలుసు. రేయిన అల్లాహ్‌ మనుజ జాతిపైన ఎంతగా మేలు చేశాడంటే తన వాణిని అవతరింపజేశాడు. అందువలన రేయి అల్లాహ్‌ను ఆరాధించిన వ్యక్తి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడన్నమాట. ఇలా చేసి ఖుర్‌ఆన్‌ పట్ల తన హృదయంలో వున్న గౌరవాదరణలను తనకు తాను నిరూపించుకున్నాడన్నమాట.

రేయిలోని మేలుకు దూరంగా వున్నవాడు నిష్టలుడే అయ్యాడు

దీని అర్ధం ఏమిటంటే ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి రేయి ఆరాధనలో గడపలేదంటే రేయిలో అల్లాహ్‌ అవతరింపజేసిన ఖుర్‌ఆన్‌ యొక్క గొప్ప మేలు, శ్రేస్టత పట్ల అతనికి స్పృహే లేదన్నమాట. అలాంటి స్పృహే అతనిలో వున్నట్లయితే రేయి అతను ఆరాధనలో నిలబడి “ఓ అల్లాహ్‌! ఘనత, శుభాలు నిండిన ఖుర్‌ఆన్‌ అవతరింపజేసి నాకు ఎంతో సహాయం చేశావని” కృతజ్ఞతలు తెలుపుకుం టాడు. ఇంకా “నీవు నాకు తినటానికి ఆహారాన్ని తొడగటానికి వస్ర్తాలను ప్రసాదించావు. కాని నీ అసలైన కరుణానుగ్రహాల సహాయం ఏమంటే నీవు నాకు సన్మార్గాన్ని ప్రసాదించావు, నిజధర్మం వెలుగును ప్రసాదించావు. చీకట్లలో తచ్చాడ కుండా నన్ను కాపాడావు, ఇంకా వాస్తవ జ్ఞానజ్యోతిని ఇచ్చావు, కాబట్టే దాని ద్వారా నేను రుజుమార్గాన నడిచి నీ ప్రీతిని పొందే భాగ్యానికి నోచుకునే యోగ్యుడనయ్యాను' అని విన్నవించుకుంటాడు. విధంగా ఎవరిలోనైతే అనుగ్రహభాగ్యం పట్ల స్పృహ కలుగుతుందో అతను రేయి అల్లాహ్‌ ఆరాధనలో గడుపుతాడు.

36 ఆత్మ ప్రక్షాళనం రోజా అందులోని శుభాలను ఆస్వాదిస్తాడు. శాయశక్తులా వాటిని జుర్రుకుంటాడు. ఒకవేళ ఎవరయినా రేయి కృతజ్ఞతాపూర్వకంగా అల్లాహ్‌ సన్నిధిలో ఆరాధనకు నిల్పోకపోతే రేయి శుభాలకు అతను దూరమయినట్లే. వాస్తవానికి అతను గొప్ప మేలుకు దూరమైన దౌర్భాగ్యుడని దీని భావం.

రోజా, ఖుర్‌ఆన్‌ దైవదాసుని కొరకు సిఫారసు చేస్తాయి

బగ్ర D7 eg భు! wee Frere AIF స్త్వ స్త ధ్ర Wa త్రయం Te లకక 2237 PU DE hs HE Ress GI)

7. _హజత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ (రజి) గారి ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు : రోజా మరియు ఖుర్‌ఆన్‌ దాసుని కొరకు సిఫారసు చేస్తాయి. రోజా అంటుంది : 'ఓ ప్రభూ! నేను ఇతన్ని రోజంతా అన్నపానీయాల నుండి, లైంగిక వాంఛల నుండి దూరంగా వుంచాను. కాబట్టి నీవు ఇతని విషయంలో నా సిఫారసును స్వీకరించు.” ఇంకా ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది - “ప్రభూ! నేను ఇతన్ని రాత్రుల్లో విశ్రాంతికి దూరం చేశాను, కాబట్టి ఇతని పట్ల నా సిఫారసు ఆమోదించు.” అంతే, రెంటి సిఫారసూ ఆమోదించబడుతుంది. (జైహభీ)

దీని అర్థం, రోజా, ఖుర్‌ఆన్‌లు ప్రాణమున్న జీవులు కాదు - అవి నిలబడి విధంగా మాట్లాడటానికి. దీని ఉద్దేశం ఏమిటంటే, ఉపవాసాలుండే ఒక వ్యక్తి, అలాగే ఖుర్‌ఆన్‌ పఠించే వ్యక్తి నిజానికి వారంతట వారే సిఫారసుకు అర్హులవుతారు. అల్లాహ్‌ సమక్షంలో రోజాను ప్రత్యక్షపరచినప్పుడు దానితో పాటు దాని సిఫారసు కూడా ప్రత్యక్షమవుతుంది. అప్పుడది అల్లాహ్‌తో అంటుంది - దాసుడు నీ కోసం అన్నపానీయాలను మానుకున్నాడు. ఇతను రహస్యంగా దాగి తింటం, త్రాగటం ఇంకా ఇతర కోరికలను కూడా తీర్చుకునేవాడే, కాని ఇతను అలా

ఆత్మ (ప్రక్షాళనం రోజా 37 చేయలేదు. రోజంతా దాసుడు అన్నపానీయాలపైన, ఇతర కోరికలపైన నీ కట్టుబాట్లను భరించాడు. కాబట్టి ఇతని తప్పులను మన్నించు.

అదేవిధంగా ఒక వ్యక్తి రాత్రుల్లో ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తాడు. ఖుర్‌ఆన్‌ అల్లాహ్‌ సమక్షంలో హాజరవటం కూడా దానంతటదే సిఫారసుకు తార్కాణం అన్నమాట. సిఫారసు ఇలా వుంటుంది - వ్యక్తి రోజంతా ఉపవాసం వుండి అలసిపోయి కూడా నీ ప్రీతి కొరకు నమాజ్‌లో నిల్పొని ఖుర్‌ఆన్‌ పారాయణం చేశాడు, కాబట్టి ఇతని తప్పుల్ని క్షమించు.

ప్రళయదినం నాడు దైవప్రవక్త (స) విశ్వాసులకు, సజ్జనుల కొరకు సిఫారసు చేసినట్లే, స్వయంగా మనిషి యొక్క మంచి ఆచరణలు కూడా అతని కొరకు సిఫారసు చేస్తాయి. మనిషి ఆచరణలు అల్లాహ్‌ సమక్షంలో హాజరై, మనిషి ఫలానా మంచి పనులు చేసివచ్చాడు, కాబట్టి ఇతన్ని మన్నించు, ఇతని తప్పిదాల పట్ల చూపోపు వహించు అని అంటాయి.

మహాప్రవక్త (స) వారి ఉల్లేఖనాన్నిబట్టి అల్లాహ్‌ తన దాసుని విషయంలో రోజా మరియు ఖుర్‌ఆన్‌ల సిఫారసులను స్వీకరిస్తాడు.

లైలతుల్‌ ఖద్ర్‌ (ఘనమైన రేయి)ని పోగొట్టుకుంటే సర్వాన్నీ పోగొట్టు కున్నట్లే

TED Te eA యమ WN Ey, AGA thi Jog! aR Bri BRR das Gis. at Wie ఓం ఉందు TT. కంగా వలల్‌ GFE III; GUD 8. హజ్రత్‌ అనస్‌ బిన్‌ మాలిక్‌ (రజి) గారి ఉల్లేఖనం:రమజాన్‌ నెల ప్రారంభం కాగానే దైవప్రవక్త (స) సెలవిచ్చారు:ఈ నెల మీపై ఆసన్నమయ్యింది, ఇందులో ఒక రేయి ఉన్నది, అది వెయ్యి నెలలకంటే (శ్రేష్టమయినది. దీన్ని పోగొట్టుకున్నవాడు అన్ని మేళ్ళనూ పోగొట్టుకున్నట్లే. దీని మేళ్లను కేవలం స్వతహా దురదృష్టవంతుడే పోగొట్టుకుంటాడు. (ఇబ్నెమాజా)

38 ఆత్మ ప్రక్షాళనం రోజా

సందర్భంగా లైలతుల్‌ ఖద్ర్‌ రోజు రాత్రిలో వుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రవక్త (స) తెలిపిన దాని ప్రకారం అది రమజాన్‌ మాసంలోని చివరి దశకంలో ఉంది. అంటే అది 21వ రాత్రి కావచ్చుగానీ, 22వ రాత్రి కాయ, అలాగే 23వ రాత్రి కావచ్చుగానీ 24వ రాత్రి కాదు. మొత్తంమీద అది చివరి దశకంలోని బేసి రాత్రి. విషయాన్ని తెలిపిన తరువాత అది ఖచ్చితంగా రాత్రి అనే విషయాన్ని తెలుపకుండా వదలివేయటం జరిగింది. సాధారణంగా ప్రజలు లైలతుల్‌ ఖధ్ర్‌ 27వ రాత్రి కావచ్చు అనే నమ్మకం కలిగివున్నారు. కాని అది 27వ రాత్రి మాత్రమే అని గట్టిగా చెప్పలేము. అయితే అది చివరి దశకంలోని ఏదో ఒక బేసి రాత్రి అని సూత్రం గట్టి నమ్మకంతో చెప్పవచ్చు.

అయితే లైలతుల్‌ ఖద్ర్‌ ఇదమిత్థంగా ఇదేనని చెప్పకపోవటంలో కూడా విజ్ఞత దాగివుంది. ఎందుకంటే మనిషి ప్రతి బేసి రాత్రి దైవ సన్నిధిలో నిలబడి దానిని పొందే ప్రయత్నం చేస్తాడనే యుక్తి ఇందులో దాగివుంది. ఒకవేళ రాత్రుల్లో మనిషి దేన్ని అభిలషిస్తున్నాడో అది అతనికి లభ్యమైతే, దాని తరువాత కూడా కొన్ని రాత్రులు దైవారాధనలో గడిపినట్లయితే అది అతని పుణ్యాల్లో మరింత పెంపుదలకు కారణభూతమవుతుంది.

సందర్భంగా గ్రహించాల్సిన మరో విషయం ఏమిటంటే, ప్రపంచంలో రమజాన్‌ తేదీలు ఎప్పుడూ ఒకేవిధంగా ఉండవు, అవి మార్పులకు గురవుతూ ఉంటాయి. అందువలన ఎవరైనా మనిషికి రాత్రి లభించింది అని గట్టిగా చెప్పడం కష్టమైన విషయం. సత్యాభిలాషి అయిన మనిషి దాని కొరకు ప్రతి రాత్రి వెదకాల్సిన అవసరముంది. రమజాన్‌లోని చివరి దశకం ఏతెకాఫ్‌ కొరకు నిర్ణయించబడింది. ఇందులో కూడా పరమార్ధం దాగివుంది. ఒక ప్రక్క అతనికి ఏతెకాఫ్‌ పుణ్యమూ దొరుకుతుంది. మరోవంక ఏతెకాఫ్‌లో వున్న మనిషి తన బేసి రాత్రులన్నీ ఆరాధనలో గడుపుతాడు. కాబట్టి ఏదో రాత్రి అతనికి లైలతుల్‌ ఖద్ర్‌ తప్పకుండా దొరికే ఆస్కారమూ వుంటుంది.

కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు దీని భావాన్ని మరోరకంగా కూడా (గ్రహించారు. అదేమిటంటే, రాత్రి బయటికి వచ్చి చూస్తే వాతావరణంలో ప్రశాంతత, నిర్మలత నెలకొనివుంటుంది. దాని భావం రాత్రి లైలతుల్‌ ఖ్‌ లభించినట్లేనని తలపోశారు. కాకపోతే రోజు వాతావరణంలో కాంతి కురుస్తుందన్న విషయం రూఢీ కావలసి వుంది. అయితే ఇలాంటి భావన వాస్తవ విరుద్ధమైనది. కాంతి అయితే రాత్రి కురుస్తుంది. అయితే అది ఒక్కరాత్రే కాదు, రమజాన్‌లో ప్రతిరోజు రాత్రీ కాంతి కురుస్తూనే వుంటుంది. కాకపోతే దాన్ని చూసే కళ్ళు కావాలి.

ఆత్మ ప్రక్షాళనం రోజా 39

వాస్తవానికి కాంతి మీ ఆరాధనల్లో కురుస్తుంది. దేవుని యందు మీకున్న నిష్టాగరిష్టతల్లో, భక్తి తత్పరతలో, పుణ్యఫలాపేక్షతో మీరు చేసే సత్మార్యాల్లో, ఆరాధనల్లో, మీరు చూపే ఢ్రద్ధాసక్తుల్లో, ఇలా మీరు చేసే ప్రతి ఒక్క కార్యంలో కాంతి కురుస్తూనే వుంటుంది.

కారుణ్యం, క్షమాభిక్ష మోక్షాల మాసం ఉల్రిజ [రెడ గ్రరు పర 4 I pe eh Js Aisa మే టంయలత్తోం.0త JW. Fe WIE AE A Pree! sn Ss Fis POAT) తవ! షట సీ 451 5 gee HE RLS Joes కరక్మకక కడ SLUT AY CAT Herren) 5 pp బక gh deg. GE కళగా కు గ్రతట! OER భభ [Dey కిఉరోః ene] sa rs ks నయ! ge మెలాగా క్ష్‌ 14 కణ మప

2 se

తా Fis AFG esi jas డు రట & హు డపటు J ఉట్ల

40

ఆత్మ ప్రక్షాళనం రోజా హజ్రత్‌ సల్మాన్‌ ఫార్సీ (రజి) ఉల్లేఖనం : దైవప్రవక్త (స) షాబాన్‌ నెలలోని చివరి తేదీన ప్రసంగిస్తూ ఇలా అన్నారు : ప్రజలారా! మీపై గొప్ప నెల అవతరించబోతోంది. అది అనంత శుభాల మాసం. నెలలో రేయి దాగి వుంది, అది వేయి నెలలకన్నా ఘనమైనది. అల్లాహ్‌ దాని (ఈ మాసం) రోజాలను మీకు విధిగావించాడు. నెలలోని రాత్రిళ్ళ ఆరాధనను అదనపు ఆరాధనలుగా పరిగణించాడు. మాసంలో ఎవరైనా సత్మార్యం చేసి అల్లాహ్‌ సామీష్యతను పొందే ప్రయత్నం చేసినట్రైతే అతను ఇతర దినాల్లో విధిగావించబడిన కార్యాన్ని నెరవేర్చి దాని ప్రతిఫలాన్ని పొందినవానితో సమానమవుతాడు (అంటే ఫర్డ్‌ కార్యనిర్వహణకు సమానమయిన పుణ్యం ప్రాప్తమవుతుంది). నెలలో ఒక విధిని నిర్వహిస్తే అతనికి 70 రెట్లకు సమానమైన పుణ్యం లభిస్తుంది. రమజాన్‌ సహనం వహించవలసిన నెల. సహనానికి ప్రతిఫలం స్వర్గప్రాప్తి. ఇది ఒండొకరి పట్ల సానుభూతితో మెలగవలసిన నెల. మాసంలో విశ్వాసి జీవనోపాధిలో శుభం (సమృద్ధి) ప్రసాదించ బడుతుంది. నెలలో ఎవరైనా ఒక ఉపవాసికి ఇఫ్టార్‌ చేయిస్తే, అంటే అన్న పానీయాలను సమకూరిస్తే అది అతని పాపాల మన్నింపుగా మారుతుంది, ఇంకా అతని మెడను నరకాగ్ని యాతన నుంచి కాపాడబడ టానికి కారణభూతమవుతుంది, ఇంకా ఒక ఉపవాసికి లభించే పుణ్యంతో సమానమయిన పుణ్యం అతనికి లభిస్తుంది, ఉపవాసి పుణ్యంలో ఎలాంటి కొరతా చేయబడదు. హజత్‌ సల్మాన్‌ (రజి) ఇంకా అన్నారు : మేము (అంటే సహచరులు) “ఓ దైవప్రవక్తా (స)! మాలో ఎవరికీ ఒక ఉపవాసికి రోజా విరమణ చేయించే శక్తి లేకపోతేనో?” అని విన్నవించు కోగాా ప్రవక్త (స) సెలవిచ్చారు : “ఓ ఉపవాసికి ఎవరైనా పాలతో ఉపవాస విరమణ చేయించినా, లేదా ఒక ఖర్జూరం తినిపించినా లేదా ఒక గ్రుక్కెడు నీరు త్రాపించినా వ్యక్తికి కూడా అల్లాహ్‌ దాని పుణ్యాన్ని ప్రసాదిస్తాడు, ఇంకా ఎవరైనా ఒక ఉపవాసికి కడుపు నిండా అన్నం తినిపిస్తే అతనికి నా సెలయేరు నుంచి నీరు త్రాపిస్తాడు, (ఈ సెలయేరు నీరు త్రాగిన పిదప అతనికి ఇక దప్పికయే వుండదు), చివరికి అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు.” నెల ఎలాంటిదంటే, దీని ప్రారంభంలో

ఆత్మ ప్రక్షాళనం రోజా 41 కారుణ్యం వుంది, మధ్యస్థంలో క్షమాభిక్ష వుంది, చివర్లో నరకం నుంచి విముక్తీ వుంది. నెలలో ఎవరైనా (యజమాని) తన సేవకునితో తేలికైన పని చేయిస్తే అల్లాహ్‌ యజమానిని క్షమించి నరకాగ్ని నుంచి విముక్తి నొసగుతాడు.” (టైవఖీ) హదీసు ద్వారా తెలిసేదేమంటే (ఇంతకు ముందు కూడా ఇదే విషయాన్ని

చెప్పటం జరిగింది) మహాప్రవక్త (స) రమజాన్‌ శుభాల గురించి ఇంకా ఉపవాసాల

హితవులను గురించి సాధారణంగా షాబాన్‌ నెలలోని జుమా ప్రసంగాలలో లేదా ఇతర ధార్మిక సమావేశాలలో విశదపరచేవారు. రమజాన్‌ నెలలోని ప్రసంగాలలో

కూడా రమజాన్‌ ఉపవాసాల హితవులను ప్రబోధించేవారు. అయితే ఆయన (స)

రమజాన్‌ ప్రారంభం కాకముందే షాబాన్‌ నెలలోనే రమజాన్‌ శుభాల గురించి

పాటించాల్సిన నియమాలను విడమరచి చెప్పేవారు.

దైవప్రవక్త (స) ప్రసంగంలో ఇలా సెలవిచ్చారు : 4 ప్రజలారా! మీపై శుభకరమైన, మాన్యత కలిగిన నెల రాబోతోంది.

రమజాన్‌ నెలలో శుభాభివృద్దులు, మాన్యత లభిస్తాయంటే ఉద్దేశం దాని రోజుల్లో, గంటల్లో, నిముషాల్లో, క్షణాల్లో ప్రతి మనిషికీ ఇట్టే దాని శుభాభివృద్ధులు వాటంతటవే లభిస్తాయని దాని అర్ధం కాదు. దాని అసలు ఉద్దేశం ఏమిటంటే నెలలో అల్లాహ్‌ లెక్కలేనన్ని పుణ్యాలను, శుభాలను సంపాయించుకునే అవకాశాన్ని మీకు కల్పిస్తాడు. నెలలో ఒక మనిషి ఎంత ఎక్కువ ఆరాధనలు చేసి, పుణ్యాలను సంపాదించుకుంటాడో అంతగానే అతని ఆధ్యాత్మిక జీవితంలో పరిణతి చేకూరు తుంది. ఇందులో శుభాలు, మాన్యతలు వున్నాయన్న దాని ఉద్దేశం వాటిని ఎక్కువగా పొందే అవకాశాన్ని మీకు కల్పించబడిందన్నమాట.

4% నెలలో రేయి వుంది - అది వెయ్యి నెలలకన్నా శ్రేష్టమైనది.

దీని ఉద్దేశం “లైలతుల్‌ ఖద్ర్‌” (ఘనమైన రేయి) అన్నమాట - రాత్రిలోనే అల్లాహ్‌ దివ్య ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాడు. ఇది వేయి నెలలకంటే ఘనమైనది అన్నదాని భావం ఏమిటంటే, మానవజాతికి రేయిన చేకూరినంత మేలు మరెప్పుడూ లభించదని అర్థం.

42 ఆత్మ ప్రక్షాళనం రోజా 4% అల్లాహ్‌ రమజాన్‌ రోజాలను విధిగావించాడు. ఇంకా దాని రాత్రులలో ఆరాధనలు చేయటాన్ని అదనపు (నఫిల్‌) ఆరాధనలుగా ఖరారు చేశాడు.

“తతవ్వూ అంటే మనిషి తన మనఃపూర్వకంగా, స్వచ్చందంగా (VolUntarily) నెరవేర్చే పని అన్నమాట - అది అతనికి విధి గావించబడకపోయినాసరే.

రమజాన్‌ పగటి ఉపవాసాలను విధిగాను, రాత్రి జాగరణను నఫిల్‌గాను నిర్ణయించడం జరిగింది. ఫర్డ్‌, నఫిల్‌ ఆరాధనలు రెంటినీ ఒకేచోట చేర్చటం జరిగింది. విధి (ఫర్డ్‌) గావించబడిన వాటి ప్రయోజనాలు వేరుగా వున్నాయి. ఇంకా మనిషి తన ఇష్టానుసారం, ఎలాంటి బలవంతం, వత్తిడి లేకుండా నిర్వర్తించే కార్యాల పుణ్యాలు వేరుగా వున్నాయి. దైవారాధన చేయటం ద్వారా చేకూరే లాభాలు వేరుగా వున్నాయి. ఒక మనిషి తన విధిని నిర్వర్తిస్తే అతను రకమైన బహుమానానికి అర్హుడవుతాడు. తనకు విధిగా చేయబడని దాన్ని తన ఇష్టపూర్వకంగా చేస్తే దానికి ప్రతిగా అతను ఎన్నో బహుమతుల స్వీకృృతికి అర్హుడవుతాడు. రెండవ విషయం ఏమిటంటే అతనికి అదనపు ప్రతిఫలం లభిస్తుంది. దీనివల్ల తెలిసిందేమంటే నెలలో రెండు రకాల అవకాశాలు కల్పించబడ్డాయి. ఒకటి, విధి నిర్వహణ, దానికి నిర్ణయించబడిన ప్రతిఫలానికి అర్హత లభించింది. రెండవది, మీ ఇష్టాయిష్టాలకు వదలివేయబడినది. దైవసామీప్యాన్ని, ప్రీతిని పొందాలంటే రాత్రివేళ దైవారాధనలో జాగరణ చేసి మరిన్ని బహుమతులు పొందవచ్చు. ఇది మాన్యత కలిగిన నెలలోని శుభాల గురించిన విశదీకరణ.

దీని పిదప సెలవియ్యబడింది : ఎవరైనా ఒక వ్యక్తి నెలలో ఒక పుణ్యాన్ని నిర్వర్తించి అల్లాహ్‌ సామీష్యతకు చేరుకునే ప్రయత్నం చేస్తే, వేరే రోజుల్లో విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చిన పుణ్యానికి సమానమైన ప్రతిఫలం అతనికి ఇవ్వటం జరుగుతుంది. ఇంకా నెలలో ఎవరయినా ఒక విధిని నిర్వర్తిస్తే ఇతర రోజుల్లో నిర్వర్తించిన 70 విధులు దానికి సమానం.

ఇక్కడ “ఫరీజహ్‌' కు బదులు 'ఖస్లతున్‌ మినల్‌ ఖైర్‌ అన్న పదాలు ఉపయోగించబడ్డాయి. వీటిద్వారా దానంతట అది “అదనపు పుణ్యం” అని అర్ధం వస్తుంది. అంటే, నెలలో ఎవరైనా వ్యక్తి అదనంగా ఏదైనా పుణ్యాన్ని నిర్వర్తిస్తే, ఇతర దినాల్లో విధిని నిర్వర్తించిన దానికి సమానమైన పుణ్యం లభిస్తుంది.

రమజాన్‌ కాలంలో తేడా ఎందుకు?

ఇతర దినాలకు, రమజాన్‌ రోజులకు తేడా ఎందుకంటే మామూలు రోజుల్లో మనిషి చాలామటుకు విధి నిర్వహణనైనా, ఆరాధనలనైనా వ్యక్తిగతంగా నిర్వర్తిస్తాడు.

ఆత్మ ప్రక్షాళనం రోజా 43 అయితే రమజాన్‌ నెలను సామూహికంగా మొత్తం సమాజం కొరకే పుణ్యకార్యాల వసంతంగా నిర్ణయించడం జరిగింది. మొత్తం సముదాయం ఒకేసారి ఉపవాసాలను పాటిస్తుంది, విరమిస్తుంది. అలాగే అందరూ ఒకే సమయంలో వెళ్ళి తరావీహ్‌ నమాజ్‌, ఇంకా ఇతర ఆరాధనలు నిర్వర్తిస్తారు. విధంగా పూర్తి సముదాయంలో పుణ్యకార్యాల నిర్వర్తనకు ఒక సాధారణ వాతావరణం ఏర్పడుతుంది. అందువలన కాలంలో పుణ్యాలు బాగా పుష్పించి, ఫలదీకరిస్తాయి - విధంగానైతే వర్ష రుతువులో సస్యం బాగా పెరిగి పుష్పించి ఫలవంతమవుతుందో. కాబట్టి రమజాన్‌ మాసంలో ఒక వ్యక్తి చేసిన పుణ్యకార్యంతో పాటు ఇతరుల పుణ్యాలు కదా చేరి అవి వికాసమొందుతాయి. రమజాన్‌ సాధారణంగా వరాల మాసం. కాబట్టి కాలంలో అల్లాహ్‌ అనుగ్రహాలు, శుభాలు, కారుణ్యాలు సర్వ నత తా వృద్ధీవికాసం పొందుతాయి. ఒక వ్యక్తి నఫిల్‌ నమాజ్‌లు చేసినా, ఎవరికైనా ఏదైనా సహాయం చేసినా, దానధర్మాలు చేసినా, ఇతర రోజుల్లో నిర్వర్తించిన విధ్యుక్త ధర్మాలకు లభించినంత పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా రమజాన్‌లో ఒక విధిని నిర్వర్తిస్తే అది జకాత్‌నయినా, నమాజ్‌ లేక రోజా అయినా అది ఇతర రోజుల్లో చేసిన 70 రెట్ల జకాత్‌ చెల్లింపునకు, 70 రెట్ల నమాజ్‌లకు, 70 రెట్ల రోజాలకు సమానంగా పుణ్యం లభిస్తుంది.

'సబ్‌ర్‌ పదానికి అరబీ నిఘంటువు ప్రకారం కట్టి పడేయటం, నిలువరించటం అని అర్థం. సందర్భంగా 'సబ్‌ర్‌' అన్న దానికి అర్ధం అల్లాహ్‌ ఆదేశాలకు వ్యతిరేకంగా నడచుకోకుండా, అల్లాహ్‌ విధేయతా పరిధిని దాటిపోకుండా మనిషి తనకు తాను కట్టి పదేసుకోవటం, మనస్సును నిగ్రహించుకోవటం, నిలువరించటం అన్నమాట.

సహనానికి ప్రతిఫలం స్వర్గం. ఒక వ్యక్తి స్వర్గాన్ని పొందాడంటే దానికి కారణం, అతను తన మనసును ఎంతగా అదుపు చేశాడంటే, అది తన మనోవాంఛలను ఇట్టే వదలిపెట్టలేదన్నమాట, ఇంకా దానిని దైవ ప్రీతిని చూరగొనేలా తయారు చేశాడన్నమాట.

రమజాన్‌లో సహనానికి జరిగినంత అభ్యాసం మరే సందర్భంలోనూ జరగదు

రమజాన్‌లో 24 గంటలూ మనిషి సహనం అలవడేలా అభ్యాసం చేస్తాడు. సహరీ వేళ అతను లేచే పరిస్థితిలో వుండడు, అయినా లేస్తాడు, అది తినే సమయం కాదు, అయినా తన మనస్సునుద్దేశించి “నీ ప్రభువు తరఫున నిర్దేశించబడిన తినేవేళ

M4 ఆత్మ ప్రక్షాళనం రోజా ఇది. కాబట్టి నీవు తినాలి, లేకుంటే రోజంతా నీవు పస్తులుండాల్సి వస్తుంది” అనంటాడు. విధంగా అల్లాహ్‌ ఆదేశాలను శిరసావహిస్తూ తన మనస్సును అదుపు చేసే పగ్గాలు తన చేతిలో వుంటాయన్నమాట. అలా లేకుంటే మనోపగ్గాలు తననే అదుపు చేస్తాయి. ఆపై అల్లాహ్‌ ఆజ్ఞ మేరకు తినటం, త్రాగటం మానేస్తాడు. తరువాత తన చేతులు తినటానికిగానీ, త్రాగటానికి గానీ ముందుకు రావు. రోజంతా ఎలాంటి పరిస్థితికి లోనైనాసరే మనసు అదుపు తప్పకుండా చూసుకుంటాడు. ఇక అల్లాహ్‌ ఆజ్ఞ అయినవెంటనే ఇఫ్లార్‌ చేస్తాడు. దాసుడు ఇస్టార్‌ వేళ తొందరపడితే అది అల్లాహ్‌కు ఎంతో ప్రీతికరమని తెలిపే హదీసు మున్ముందు రాబోతోంది. దీని అర్ధం ఏమిటంటే ఒక ఉపవాసి కేవలం దైవాజ్ఞమేరకే ఇంత వరకు ఆగిపోయాడన్న మాట. లేకుంటే, అతనికి ఎంతగా ఆకలివేస్తుందంటే అతను తినటంలో, త్రాగడంలో ఒక్క క్షణకాలం కూడా ఆలస్యం చేసేవాడు కాదు.

పద్ధతి ప్రకారమే మీకు నిగ్రహం, సహనం అబ్బేలా మీ మనసును అదుపుచేసే అభ్యాసం చేయించబడుతుంది. సహనం కారణంగానే మీకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. సహన సంపద ద్వారానే మీరు మీ మనసుపై అదుపును సాధిస్తారు, అల్లాహ్‌ ఆదేశాల విముఖతకు దూరంగా వుంటూ ప్రతి సమయంలోనూ ఆయనకు విధేయులై జీవించటాన్నే మీరు లక్ష్యంగా పెట్టుకున్నారు. $ ఈనెల పరస్పరం సానుభూతి చూపే నెల అని సెలవియ్యటం జరిగింది

“'మువాసాత్‌' అంటే ఒకరికి మరొకరు సుఖదుఃఖాల్లో సహాయకారులుగా మారటం. రమజాన్‌లో “షహ్‌రుల్‌ మవాసాత్‌” కు ఉద్దేశం ఇదే. నెలలో ఒకరు మరొకరి పట్ల సానుభూతిపరులుగా, సహాయకులుగా మారటానికి తర్ఫీదు నివ్వటం జరుగుతుంది. ఒక వ్యక్తికి స్వయంగా ఆకలేసినప్పుడుగాని, ఇతరుల ఆకలి బాధ ఎలా వుంటుందో తెలిసిరాదు.

4 నెలలో విశ్వాసి ఉపాధిలో వృద్ధీ వికాసాలివ్వబడతాయి

రమజాన్‌ మాసంలో లెక్కకట్టి లేదా తూచి తన ఆదాయం లేదా తన జీతం మేరకు పెరిగిందోనన్న విషయాన్ని వ్యక్తీ చెప్పలేడు, కాని అనుభవంలోకి వచ్చిన విషయం ఏమిటంటే, రమజాన్‌లో లక్షలు, కోట్ల మంది ముస్లింలు మాసంలో తిని, త్రాగినట్లుగా ఇతర రోజుల్లో వారికి ఇలాంటి ఆహారం దొరకదు. దీనిద్వారా తెలిసేదేమిటంటే తప్పనిసరిగా అల్లాహ్‌ నెలలో విశ్వాసుల ఆహార పానీయాల్లో వృద్ధిని, శుభాన్ని కలుగజేస్తాడు.

ఆత్మ ప్రక్షాళనం రోజా 45

ఇంకా సెలవియ్యబడిందేమంటే, ఎవరైనా ఒక ఉపవాసికి ఇఫ్రార్‌ చేయించి నట్లయితే, అది అతని క్షమాభిక్షకు, నరకం నుంచి విముక్తికి కారణమవుతుంది. ఒక ఉపవాసికి లభించిన పుణ్యానికి సమానమైన పుణ్యం వ్యక్తికి కూడా లభిస్తుంది - మరోవైపున ఉపవాసి పుణ్యంలో ఎలాంటి కొరతా చేయబడదు. ఉపవాసి పుణ్యాల్లో కోత విధించి ఇఫ్తార్‌ చేయించిన వ్యక్తికి పుణ్యాలు ప్రసాదించటానికి అల్లాహ్‌ కరుణానుగ్రహాల్లో ఎలాంటి కొరత, లోటూ లేదు. ఉపవాసికి ఎంత పుణ్యమైతే లభిస్తుందో, ఇఫ్తార్‌ చేయించిన వ్యక్తికి కూడా అంతే పుణ్యాన్ని అల్లాహ్‌ తన వద్ద నుంచి ప్రసాదిస్తాడు.

బాగా గుర్తుంచుకోండి - తాము చేయించిన ఇఫ్తార్‌ గొప్పదనాన్ని చాటి చెప్పుకోవటానికి, ప్రజలకు చూపటానికి లేదా వ్యక్తి ఎంత ఐశ్వర్యవంతుడండి, తన సంపదను దైవమార్గంలో ఇట్టే ఖర్చుపెడుతున్నాడుగదా! అని ప్రజలు చెప్పుకోవాలన్న ఉద్దేశ్యంతో చేయించిన ఇష్తార్‌కు పుణ్యాలు దక్కవు. ఇక్కడ ప్రస్తావించిన ఇఫ్టార్‌ పుణ్యం కేవలం దైవ ప్రసన్నతను పొందే ఉద్దేశ్యంతో చేయించిన దానికే లభిస్తుంది. ఇంకా బాగా తిని, త్రాగే స్టోమత కలిగిన వారికి ఇఫ్తార్‌ చేయించేకన్నా సరియైన ఇఫ్లార్‌ కూడా చేసే స్థోమత లేని పేద ప్రజలకు ఇష్హార్‌ చేయించడం ఎక్కువ పుణ్యప్రదం.

పై పంక్తుల్లో దైవప్రవక్త (స) సెలవిచ్చిన విషయాల పిదప హజ్రత్‌ సల్మాన్‌ ఫార్సీ (రజి) ఇంకా ఇలా తెలుపుతున్నారు : ప్రవక్త (స)తో - “ఓ ప్రవక్తా! మాలో ప్రతి ఒక్కరికీ ఇతరులకు ఇఫ్తార్‌ చేయించేంత స్థోమత లేదని సహచరులు విన్నవించుకోగా, దానిపై ప్రవక్త (స) “ఒక ఉపవాసికి పాలు త్రాగించినా, ఒక ఖర్జూరాన్ని ఇచ్చినా లేదా కనీసం ఒక గ్రుక్మెడు మంచినీళ్లు త్రాగించినాసరే వారికీ పుణ్యం లభిస్తుంద”ని సెలవిచ్చారు. అంటే ఇఫ్తార్‌ భారీగా చేయిస్తేనే పుణ్యం లభించదు. కేవలం రోజాను విరమింపజేయిస్తేనే చాలు - చూడటానికి అది అతి సాధారణ ఇష్తార్‌ అయినాసరే. ఫీ ఎవరైనా ఒక ఉపవాసికి కడుపు నిండా అన్నం తినిపిస్తే వ్యక్తికి

అల్లాహ్‌ నా సెలయేరు నుంచి నీరు త్రాపిస్తాడు. ఆపై స్వర్గ ప్రవేశం

చేసేంతవరకు అతనికి దాహం వేయదు అని సెలవియ్యబడింది.

హదీసుల్లో తెలిపినట్లు హష్ష్‌ మైదానంలో ఒక సెలయేరు వుంటుంది, దాన్నే “కౌసర్‌” అని అంటారు. సెలయేరు ప్రవక్త (స) పర్యవేక్షణలో వుంటుంది. ప్రవక్త (స) ఎవరికైతే నీరు త్రాపించదలుస్తారో వారే నీరు త్రాగగలరు.

46 ఆత్మ ప్రక్షాళనం రోజా అంతేగాని మరో వ్యక్తికి అవకాశం లభించదు. సెలయేరు తప్ప నీరు త్రాగటానికి మైదానంలో మరో సెలయేరు ఏదీ వుండదు. అర్హులైన వారికే నీరు త్రాగేందుకు దైవప్రవక్త (స) అనుమతినిస్తారు, అలా అనుమతించబడిన వారే మున్ముందు స్వర్గంలో ప్రవేశిస్తారు. కాబట్టి ఎవరైతే ఉపవాసికి కడుపునిండా భోజనం పెడతాడో అతను హట్‌ మైదానంలో కౌసర్‌ సెలయేరు నీరు త్రాగగలడు, తరువాత స్వర్గంలో కూడా ప్రవేశించగలడు.

హదీసుల ద్వారా తెలిసే విషయం ఏమిటంటే - హష్ష్‌ మైదానంలో ఒక్క దేవుని నీడ తప్ప మరే నీడా లభించదు. నీడ కేవలం సజ్జనులైన వారికే లభిస్తుంది. దుష్టులకు నీడ లభించదు. ఇక మీరే ఆలోచించండి - అల్లాహ్‌ నీడ తప్ప మరే నీడా వుండని హష్ష్‌ మైదానంలో ఉపవాసికి కడుపు నిండా అన్నంపెట్టిన వ్యక్తికి మాత్రమే సెలయేరు నుంచి నీరు త్రాపించబడుతుంది. ఫీ ఈనెల ప్రారంభంలో కారుణ్యం, మధ్యస్థంలో క్షమాపణ ఇంకా చివర్లో

నరకం నుంచి విముక్తి లభిస్తుంది

అంటే, మీరు ఇటు నెల ఆరంభం నుంచి ఉపవాసం మొదలెట్టగానే మరో వైపు నుంచి మీపై అల్లాహ్‌ కారుణ్యం కురవటం మొదలవుతుంది. ఆపై రమజాన్‌ మధ్యస్థానికి చేరుకోగానే అల్లాహ్‌ మీ తప్పులను మన్నించి మిమ్మల్ని క్షమిస్తాడు. విధంగా ఇక రమజాన్‌ చివరి దశ చేరుకొని చివరి రోజా పూర్తి చేసుకోగానే మీకు నరక యాతన నుంచి విముక్తి లభిస్తుంది.

చివరి రోజా పూర్తయిన వెంటనే, మీకు నరకం నుంచి విముక్తి లభించగానే ఇక మీరు మీ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఏదిబడితే అది చేయవచ్చు, మిమ్మల్ని అడగటం జరగదన్నది దీని అర్ధం కాదు. బాధాకరమయిన విషయమేమంటే, కొంతమంది రమజాన్‌ నెల పూర్తయిన వెంటనే నెలలో తమపై విధించుకున్న కట్టుబాట్లనన్నింటినీ త్రెంచివేస్తారు. అంతే, పండుగ నాడే అంటే షవ్వాల్‌ మొదటి తేదీనాడే సినిమా చూడటానికి వెళ్తారు, ఇంకాస్త ముందుకెళ్ళి నాట్యగానాలను ఆస్వాదిస్తారు. ఆపై కొద్దోగొప్పో జూదం కూడా ఆడారు. ఇలా ఎవరైనా వ్యక్తి ఆచరిస్తే అతను ఇటు భయానక నరకం నుంచి విముక్తి పొందాడో లేదో మరో వైపు వెంటనే దానిలోకి దూకే తయారీ కూడా చేసుకున్నాడన్నమాట. స్పష్టంగా తెలిసేదేమంటే హృదయంలో కొద్దిపాటి సత్సంకల్పం, దైవభీతి వున్నవాడైనా ఇలా ప్రవర్తించడు.

ఆత్మ ప్రక్షాళనం రోజా షా 4% రమజాన్‌ నెలలో తన నౌకర్ల ద్వారా తేలికపాటి పనులు చేయించుకుంటే అలాంటి వారికి అల్లాహ్‌ నరకం నుంచి విముక్తి కలిగిస్తాడు.

రమజాన్‌ నెలలో తాను రోజాలో వున్నట్లే తన వద్ద పనిచేసే నౌకరు కూడా ఉపవాసంలో ఉన్నాడని తెలుసుకోవాలి. రమజాన్‌ నెలలో తన సేవకుడు ఉపవాసంలో లేడని భావిస్తూ, మామూలు రోజుల్లోలాగా అతనిచేత పనిచేయించకూడదు. ఇది సజ్జనులైన వారికి ఎంతమాత్రం శోభించదు. రోజాలోవున్న కారణంగా మీలో నిస్సత్తువ ఏర్పడినట్లే నౌకరుకు కూడా నిస్సత్తువ ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైతే రమజాన్‌ నెలలో తమ సేవకుల ద్వారా తేలికపాటి పనులు చేయిస్తారో వారికి అల్లాహ్‌ నరకం నుంచి విముక్తి ప్రసాదిస్తాడు.

నేటి కాలంలో కొంతమంది వ్యక్తులు తమ అధీనంలోవున్న వారిచేత రమజాన్‌ నెలలో మామూలు రోజులకన్నా ఎక్కువగా పనులు చేయిస్తారు. పైగా తమ ప్రవర్తన ద్వారా “మంచిది, నీవు కూడా రోజా పాటించే దుస్సాహసానికి ఒడిగట్టావన్నమాట! ఇక చూసుకో, నీకు దీని శిక్షగా మామూలు రోజులకన్నా నీవు రెట్టింపు పని చేయాలి. అంటే మా చెప్పుచేతల్లో, మా నీడలో వున్న నీవు రోజా వుండే ధైర్యం చేస్తావా?” అన్నట్లు వ్యవహరిస్తారు. కాని ప్రవక్త (స) గారి సర్వవిదితమైన హితవు ఇలా ఉంది: (ఇక్కడ 'మమ్లూక్‌' అన్న పదం వాడబడింది, 'ఖాదిమ్‌” అని లేదు). “రమజాన్‌ మాసంలో అలాంటి వారిచేత తేలికైన పనిచేయించండి. వారి పట్ల దయాభావంతో ప్రవర్తించండి, వారికి సౌకర్యాలు కల్పించండి. దీనికి ప్రతిగా మీకు అల్లాహ్‌ వద్ద లభించే ప్రతిఫలం ఏమంటే ఆయన మిమ్మల్ని నరకం నుంచి విముక్తినొసగుతాడు.”

రమజాన్‌ మాసంలో ప్రవక్త (స) గారి ప్రేమకు, దాతృత్వా నికి రెండు ఉదాహరణలు

Saas పవన పడు Ges (పయత ELE HT 10. హజత్‌ అబ్బుల్లా బిన్‌ అబ్బాస్‌ (రజి) ఉల్లేఖనం : రమజాన్‌ నెల రాగానే దైవప్రవక్త (స) నిర్బంధంలో ఉన్న ప్రతి ఒక్కరినీ లున్న చేసేవారు. ప్రతి అర్థించేవానికి ఎంతో కొంత ప్రదానం చేసేవారు. (బైహఖీ)

48 ఆత్మ ప్రక్షాళనం రోజా

దైవప్రవక్త (స) గారి వాత్సల్యం, దయార్ర హృదయం, మృదుత్వం, వితరణ, క్షమాగుణం, దాతృత్వం మామూలు రోజుల్లో ఉండనే ఉంది. గుణాలన్నీ ఆయన కారుణ్య స్వభావంలోని అంశాలే. అయితే పవిత్ర రమజాన్‌ రాగానే ఇవన్నీ ఇంకా ఎక్కువయ్యేవి. రోజుల్లో ఆయన (స) తన మామూలుకన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా అల్లాహ్‌ వైపునకు మరలేవారు, దైవశప్రేమను ఇంకా ఎక్కువగా ఆశించేవారు. అందువలన ఆయన పుణ్యాలు కూడా సాధారణ రోజులకన్నా ఎక్కువయ్యేవి. స్వయంగా ఆయన (స) సెలవిచ్చారు - మామూలు రోజుల్లో విధ్యుక్త ధర్మం నెరవేరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి సమానమైన పుణ్యం రమజాన్‌లో నఫిల్‌ నెరవేరిస్తేనే లభిస్తుంది. కాబట్టి ఆయన (స) రమజాన్‌లో ఎక్కువగా పుణ్యాల కొరకు చాలా తీవ్రంగా పరిశ్రమించేవారు. ఇక్కడ ప్రవక్త (స) ఆచరణలోని రెండింటిని ఉదాహ రణగా పేర్కొంటున్నాం. అందులో ఒకటి ఖైదీలను విడుదల చేయటం, రెండవది అర్ధించిన వారికి లేదనకుండా ఇవ్వటం.

“రమజాన్‌ మాసంలో దైవప్రవక్త (స) ఖైదీలను విడుదల చేసేవారు.” దీనిపై హదీసువేత్తల మధ్య వాదోపవాదాలు మొదలయ్యాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏదైనా నేరానికిగాను చెరసాల పాలైతే రమజాన్‌ నెల కారణంగా అలాంటి వ్యక్తిని శిక్షించకుండా విడుదల చేయించటం ఎంతవరకు న్యాయం? కారణంగా ఎన్నో రకాల వివరణలు, వ్యాఖ్యానాలు చేయబడ్డాయి. కొంతమంది హదీసువేత్తల అభిప్రాయంలో వీరు యుద్ధంలో పట్టుబడ్డ ఖైదీలు. మరికొంతమంది ఉద్దేశం ప్రకారం తాము చెల్లించాల్సిన రుణం కారణంగా పట్టుబడ్డవారు. విధంగా దీనిపై పరి పరి విధాలుగా వ్యాఖ్యానించారు. ఆలోచిస్తే దీనికి మరో అర్ధం కూడా వస్తుంది. ఉదాహరణకు నేటి కాలంలో ఒక ఖైదీని పెరోల్‌ (P2018) పైన వదలివేస్తారు. అంటే ఖైదీని పూచీకత్తుపైన వదలివేయటం అన్నమాట. ఖైదీ తన గడువుకాలం పూర్తయిన మీదట తిరిగి వస్తాడన్న నమ్మకంతోనే అతన్ని వదలివేస్తారు. ఆనాటి సమాజం ఎలా వుండేదంటే, ఒక ఖైదీని విడుదల చేస్తే అతను పరారై తిరిగి వెళ్ళకపోతే మరలా తనను ఎవరు పట్టుకుంటారు? అన్న ఆలోచన కూడా అతనికి కలిగేది కాదు. ప్రజలు ఎలాంటి వారంటే వారి ద్వారా ఏదైనా తప్పు జరిగితే, స్వయంగా వారే వచ్చి దాన్ని ఒప్పుకునేవారు. ఇంకా తమను శిక్షించి పరిశుద్ధపరచాలని 'ప్రాధేయపడేవారు. పైన పేర్కొన్న ప్రవక్త (స) ఆచరణకు మరో ఉద్దేశం ఇది కూడా

ఆత్మ ప్రక్షాళనం రోజా 49 కావచ్చు - వారు చేసిన నేరం క్షమార్దమైనది కానట్లయితే వారు కనీసం రమజాన్‌ నెలలో తమ తమ ఇళ్ళల్లో గడుపుతారన్న ఉద్దేశంతో విడుదల చేసి ఉంటారు - వల్లాహు ఆలము బిస్సవాబ్‌ - నిజం దైవానికే తెలుసు.

స్వర్గం ఒక రమజాన్‌ తరువాత మరో రమజాన్‌ వచ్చే వరకు ఎడతెగ కుండా ముస్తాబు చేయబడుతుంది

Sry os Eg లోల అం పు! ఫ్రం 20 OHSU yp 9 d9 El CID మతం WE HEI Ie RO J

42%

hy WE Sore ae అటో యడప NAD. a1 555

11. హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: స్వర్గం రమజాన్‌ కొరకు ఏడాది మొదలుకుని రాబోయే సంవత్సరం వరకు (అంటే ఒక రమజాన్‌ ముగియగానే మళ్ళీ వచ్చే రమజాన్‌ వరకు) అందంగా తీర్చిదిద్దబడుతుంది. రమజాన్‌ మొదటి రోజు రాగానే అర్న్‌ క్రింద నుంచి ఒక రకమైన గాలి వీచటం మొదలై స్వర్గంలోని ఆకులగుండా ప్రసరించి సుందరాంగులైన స్వర్గ కన్యలపై వీస్తుంది. గాలి సోకగానే స్వర్గకన్యలు “ఓ దేవా! నీవు నీ (సజ్ఞనులైన) దాసుల్లో నుంచి మా కన్నులకు చల్లదనాన్ని చేకూర్చే భర్తలను మాకు ప్రసాదించు. మా ద్వారా వారి కన్నులు కూడా చల్లబడేలా చేయి” అని అంటారు. (బైహభీ) హదీసు ననుసరించి ప్రవక్త (స) విశ్వాసులకు హితవు గరిపిన విషయ

మేమంటే “మీరు రమజాన్‌ మాసాన్ని అల్లాహ్‌ పట్ల సంపూర్ణ విధేయతతో, గాఢమైన

అనుబంధంతో ఉపవాసాలను పాటిస్తూ, పుణ్యాలను సంపాదిస్తూ గడిపినట్లయితే

స్వర్గ సౌఖ్యాలు మీ కోసం ఎదురుచూస్తుంటాయి.”

50 ఆత్మ ప్రక్షాళనం రోజా రమజాన్‌ చివరి రాత్రి ముస్లిం సమాజానికి క్షమాభిక్ష లభిస్తుంది

నామాని OEY ట్ల: |r నో పు ప్ర06 ఓవ! SY Sgt సుమార

ఈపహపుటే ఆపు కప! de

12. హజ్రత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు : రమజాన్‌ చివరి రాత్రిన నా అనుచర సమాజానికి క్షమాభిక్ష ప్రసాదించబడుతుంది. దానికి సహచరులు దైవప్రవక్తా (స)! అది లైలతుల్‌ ఖద్ర్‌ నాడా” అని విన్నవించుకోగా, ప్రవక్త (స) “లేదు, కూలివాడు తన పనిని ముగించగానే అతని కూలి చెల్లించటం జరుగుతుంది” అని సెలవిచ్చారు. (అహ్మద్‌)

“రమజాన్‌ చివరి రాత్రి నా అనుచర సమాజానికి క్షమాభిక్ష అన్న ప్రవక్త (స) గారి పలుకు విని సహచర గణానికి బహుశా అదే లైలతుల్‌ ఖద్ర్‌ అయివుంటుందిని రాత్రే ఇలా జరుగుతుందన్న ఆలోచన వచ్చి వుంటుంది. కాని దానికి ఆయన (స) “లైలతుల్‌ ఖద్ర్‌ అవటం చేత అలా జరగదు, ఇలా ఎందుకు జరుగుతుందంటే కూలివాడు తన పనిని ముగించిన పిదప అతని కూలీ చెల్లించబడటం జరుగుతుందని, నా అనుచర సమాజానికి లభించే కూలీ క్షమాభిక్ష రూపంలో ఉంటుందని” సెలవిచ్చారు.

అనుచర సమాజానికి క్షమాభిక్ష లభిస్తుందన్న దానికి అర్థం - రోజాలు పాటించకుండా, ఇతర ఆదేశాలను నెరవేర్చని వారికి కూడా క్షమాభిక్ష లభిస్తుందని ఎంతమాత్రం కాదు. క్షమాభిక్ష అనుచర సమాజంలో రోజాలు పాటించిన వారికి, దేవుని ఆదేశాలకు విధేయత చూపిన వారికి మాత్రమే లభిస్తుంది. ఆనాటి దైవప్రవక్త (స) అనుచర సమాజంలో వుండి కూడా రోజాలు పాటించనివారు ఎవరైనా ఉండేవారంటే నమ్మశక్యం కాదు. అప్పుడు పూర్తి సమాజం రోజాలు పాటించేది. రమజాన్‌ నెల మొత్తం దైవ విధేయతలో గడిపేది. దుష్కార్యాలన్నింటికీ దూరంగా ఉండేది. ఇంకా మామూలు రోజుల్లోకన్నా మిన్నగా పుణ్యాలు సంపాదించేది.

ఆత్మ (ప్రక్షాళనం రోజా 51 అందువల్లనే ఇక్కడ అలాంటి సమాజం గురించే చెప్పబడింది. అంతేగాని, దాని ఉద్దేశం రమజాన్‌ వచ్చినా తమ మార్గవిహీనతలో ఏమాత్రం తేడా చూపనివారు, ఇంకా ఎక్కువ తలబిరుసుతనంతో ప్రవర్తించేవారి గురించి కాదు. కొంతమంది రోజా ఉండటం అటుంచి, దానికి విరుద్ధంగా బహిరంగంగా, నిర్మొహమాటంగా తినటం, త్రాగటం చేస్తారు. ఇక రమజాన్‌ చివరి రాత్రిన ఇలాంటి వారికి క్షమాభిక్ష లభించే ప్రశ్నే ఏముందని? పైగా రాత్రిన వారికి వ్యతిరేకంగా నిర్ణయం గైకొనబడుతుంది.

52 ఆత్మ ప్రక్షాళనం రోజా

Derr

చంద్ర దర్శన అధ్యాయం

అధ్యాయంలో నెలవంక దర్శనాన్ని ఏవిధంగా నిర్ణయిస్తారన్న విషయాన్ని తెలిపే హదీసులు పేర్మొనబడ్డాయి. అంటే షాబాన్‌ నెలవంకకు రమజాన్‌తో, రమజాన్‌ నెలవంకకు రోజాలతో, ఇంకా షవ్వాల్‌ నెలవంకకు పండుగతో గల సంబంధం ఎలాంటిదోనన్న విషయమన్నమాట.

రమజాన్‌ HAE ముగింపు నెలవంక దర్శనంతో ముడిపడి ఉంది జు ర్రేవమై! లేకి ey లేరలిడ లా!" ప్ర నా. ASP ట్‌ి గ. పష భూ PEA as EN YG లా. Dee (జక పో

సూ త్త

13. హజ్రత్‌ అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ (రజి) గారి ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ఉద్బోధించారు : రమజాన్‌ మాసం నెలవంకను చూడనంత వరకు రోజా పాటించకండి, ఇంకా షవ్వాల్‌ నెలవంకను చూడనంత వరకు ఇఫ్టార్‌ చేయకండి (అంటే రోజా విరమించకండి). మబ్బులు కమ్మిన కారణంగా నెలరాజు కనిపించకపోతే దానిపై అంచనా వేయండి - మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది - దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: నెల 29 రోజులదై వుంటే, రోజా ప్రారంభించకండి - అంటే రమజాన్‌ నెలవంకను చూడనంత వరకు. ఆకాశం నిర్మలంగా లేని కారణాన మీకు చంద్రదర్శనం కాకపోతే షాబాన్‌ నెల 30 రోజులు పూర్తి చేసుకోండి.

(ముత్తఫకున్‌ అలైహ్‌)

ఆత్మ ప్రక్షాళనం రోజా 53

హదీసులో మొదటి మాటగా సెలవియ్యబడిందేమంటే రమజాన్‌ నెలవంకను చూడనంత వరకు రోజాలు ప్రారంభించకూడదు. “లా తసూమూ” అన్నదానికి అర్ధం “రోజాలు పాటించవద్దు” అని కాదు, దాని ఉద్దేశం రోజాలు ప్రారంభించకండి అని మాత్రమే. అంటే రమజాన్‌ చంద్రుణ్ణి చూడకుండా రమజాన్‌ ప్రారంభమయ్యిందని నిర్ణయించకండి. ఇంకా దాని అర్ధం మీలోని ప్రతి ఒక్కరూ చంద్రుణ్ణి చూడాలన్నది కూడా కాదు. అసలు పదాలు “హత్తా తరవ్‌” అంటే మీరు చంద్రుణ్ణి దర్శించుకోండి లేక చూడండి అని అర్ధం. మరో మాటలో చెప్పాలంటే ఏదైనా ఒక బస్తీలోని లేదా ప్రాంతంలోని ప్రజలు మామూలుగా నెలవంకను చూసినా సరిపోతుంది. అంతేగాని ప్రతి మనిషీ వ్యక్తిగతంగా నెలవంకను చూడాలన్నది దాని ఉద్దేశం కాదు. మామూలుగా కొందరు చూసినా ప్రతి మనిషీ చూసినట్లే లెజ్జ.

నెలవంక దర్శనంపై ఇంతగా తాకీదు ఎందుకు చేయబడిందంటే, నెల పొడుపు రమజాన్‌ ప్రారంభానికి సంకేతం. మరే లెక్కా లేదు. క్యాలెండర్‌ లేక పంచాంగం లెక్క ప్రకారం నేడు షాబాన్‌ నెల పూర్తవుతుంది, నేడు రమజాన్‌ చంద్రోదయం కావాల్సిందేనని, అందుకని రమజాన్‌ ప్రారంభమయినట్టేనని ఇక ప్రకటన కూడా చేయమనటం సరికాదు. కాబట్టి రమజాన్‌ ప్రారంభానికి నెలవంక దర్శనం తప్పనిసరి. షవ్వాల్‌ నెల చంద్రుణ్ణి చూడనంత వరకు ఇఫ్తార్‌ చేయకండి అని సెలవియ్యటం జరిగింది. దీని ఉద్దేశం ఇఫ్తార్‌ చేసి రోజాను విరమించటం కాదు, రమజాన్‌ పూర్తయింది, షవ్వాల్‌ నెల చంద్రుడు కనిపించాడు, ఇక రోజాలు పూర్తయ్యాయి, రేపు ఈదుల్‌ ఫిత్ర్‌ పండుగ. అంటే రమజాన్‌ మాసం నెలపొడుపుతోనే ప్రారంభమై మళ్లీ నెలపొడుపుతోనే పరిసమాప్తమవుతుంది. నిర్ణయం నెలవంకతోనే వుందిగాని, మరే లెక్కతో కాదు.

ఆపైన ఆకాశం నిర్మలంగా లేని కారణంగా చంద్రుడు కనిపించకపోతే అంచనా ప్రకారం నిర్ణయం తీసుకోండి అని కూడా సెలవియ్యటం జరిగింది. “అంచనా వేసుకోండి” అన్న పదానికి అర్ధం ఇతర ఉల్లేఖనాల ద్వారా స్పష్టం చేయబడింది. దాన్నే ఇలా వివరించటం జరిగింది : “నెల 29 రోజులదవుతుంది. నెలవంకను చూడనంత వరకు రోజా ప్రారంభించకండి. ఒకవేళ నెలవంక కన్పించకపోతే 30 రోజులు పూర్తిచేయండి.” అంటే షాబాన్‌ 29 నాడు చంద్రుడు కనిపించకపోతే షాబాన్‌ నెల 30 రోజులుగా నిర్ణయించుకోండి. కాబట్టి రమజాన్‌ నెల ప్రకటనను ఏదో లెక్క ప్రకారం చేయరాదు. కొంతమంది “అంచనా వేసుకోండి”

54 ఆత్మ ప్రక్షాళనం రోజా అన్న పదాలకు, షాబాన్‌ నెల 30 రోజులు పూర్తయిన తరువాతనే రమజాన్‌ (ప్రారంభమవుతుందని అర్ధం తొడుగుతారు.

షాబాన్‌ 29 నాడు నెలవంక కన్పించకపోతే షాబాన్‌ నెల 80 రోజులుగా పూర్తిచేయండి

ధాలు) ౪350696 BE BSG Dip cs get!

ల? ప్రయ టక తర్‌ (సహక ప్ర 5

14. హజ్రత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనానుసారం దైవప్రవక్త (స) ఇలా హితవు గరిపారు : చంద్రుణ్ణి చూసి రోజాలుండటం ప్రారంభించండి, ఇంకా చంద్రుణ్ణి చూసే రోజాలను విరమించండి. ఒకవేళ ఆకాశం నిర్మలంగా లేని కారణాన చంద్రుణ్ణి మీరు చూడలేకపోతే షాబాన్‌ నెల 30 రోజులు పూర్తిచేయండి. (ముత్తఫకున్‌ అలైహ్‌)

ఇక్కడ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేమిటంటే, ఇస్లాంలో ఆరాధనలకు సూర్యమానం ప్రకారం కాక, చాంద్రమానం ప్రకారం నెలలను లెక్కించటం జరుగుతుంది. దీని అర్ధం అరబ్బులు సూర్యమానం ప్రకారం వారికి నెలల లెక్క తెలియదని కాదు. వారి సౌకర్యార్థం నెలలను చాంద్రమానం ప్రకారం లెక్కించేవారు. సూర్యమానం ప్రకారం కూడా అరబ్బులు నెలలను నిర్ణయించేవారని ఖుర్‌ఆన్‌ ద్వారా మనకు విదితమవుతుంది. అరబ్బు బహుదైవారాధకుల్లో 'నసీ” పద్ధతి చెలామణిలో ఉండేది. ఇది ఖుర్‌ఆన్‌లో నిర్ద్వంద్వంగా ఖండించబడింది : “ఇన్నమా అన్నసియు జియాదతున్‌ ఫిల్‌ కుక్ర్‌” - 'నసీ' అవిశ్వాసంలో ఒక అదనమైన అవిశ్వాసపు చేష్ట. (తౌబా:37). అరబ్బు దేశంలో “సీకి సంబంధించిన రెండు పద్ధతులు చెలామణిలో వుండేవి. యుద్దాలు, మారణకాండలు, హత్యా ప్రతీకారం తీర్చుకోవటానికి, ఏదైనా నిషిద్ధ మాసాన్ని హలాల్‌ చేసుకునేవారు. దానికి బదులు ఏదైనా హలాల్‌ మాసాన్ని నిషిద్ధం చేసుకుని, నిషిద్ధ మాసం రోజులను పూరించేవారు. రెండో పద్ధతి ప్రకారం చాంద్రమాన సంవత్సరాన్ని పూరించటానికి సూర్యమాన సంవత్సరం ప్రకారం ఒక నెలను అదనంగా చేర్చేవారు - తద్వారా హజ్‌ ఎల్లప్పుడూ

ఆత్మ (ప్రక్షాళనం రోజా 55 ఒకే కాలంలో రావాలని. ఇంకా చాంద్రమానం ప్రకారం వివిధ కాలాల్లో హజ్‌ నెల వస్తే వాటిలోని ఇబ్బందుల్ని ఇట్టే తప్పించుకోవచ్చని వారు తలపోసేవారు. విధంగా 36 యేళ్ళపాటు హజ్జ్‌ తన అసలైన తేదీలలో గాక, ఇతర తేదీల్లో నిర్వహించబడేది. ఆపై 87వ యేట మాత్రం హజ్జ్‌ తన అసలైన తేదీ జిల్‌ హజ్జహ్‌ 9 - 10 తేదీల్లో నిర్వహించబడేది. హజ్జతుల్‌ విదా సందర్భంగా దైవప్రవక్త (స) తన ప్రసంగంలో విషయాన్నే సెలవిచ్చారు : “ఈ సంవత్సరం హజ్జ్‌ కాలం పరిభ్రమణం చెందుతూ తన అసలైన తేదీల్లో వచ్చింది. సృష్టికర్త నిర్ణయించిన అసలైన తేదీలు ఇవే.”4

దీనినిబట్టి అరబ్బులకు సూర్యమాన నెలల లెక్క తెలియకుండా లేదని రూఢీ అవుతుంది. అసలు విషయమేమంటే అల్లాహ్‌ తాను ఆదేశించిన విధుల నిర్వహణను సూర్యమానం ప్రకారం కాక, చాంద్రమానం ప్రకారం నిర్ణయించటానికి కారణం అందులో సంస్మరణ జరగాలనే. వాటిలో ఒకటేమంటే తన దాసులు అన్ని కాలాల్లోనూ తన ఆదేశ పాలనకు, విధేయతకు అలవాటు పడాలి. ఉదాహరణకు రమజాన్‌ ఒక్కోసారి వేసవిలో, మరోసారి వర్ష రుతువులో, ఇంకోసారి చలికాలంలో వస్తుంది. విశ్వసించినవారు అన్ని కాలాల్లోను రోజాలు పాటించి తమ విధేయతను చాటుకుంటారు, ఇంకా అత్యుత్తమ నడవడికకు శిక్షణ కూడా పొందుతారు. అదేవిధంగా హజ్జ్‌ కూడా చాంద్రమానం ప్రకారం వివిధ కాలాల్లో వస్తుంది. మంచీ, చెడు అన్ని పరిస్థితుల్లోనూ దైవదాసులు అల్లాహ్‌ ప్రీతిని పొందటానికి ప్రయాణించి దేవుని పరీక్షలో పూర్తిగా నెగ్గుకు వస్తారు. ఇంకా దైవదాస్యంలో పరిపూర్ణతను పొందుతారు. ఉత

ఇంకా ఇక్కడ మరోమాట కూడా గమనార్హమైనదే. ప్రపంచ మానవాళి అందరి కొరకు ప్రభవించిన ప్రపంచ ధర్మంలో రోజాలు, హజ్జ్‌ చాంద్రమానం ప్రకారం ఎందుకు నిర్ణయించబడ్డాయి? అని సందేహపడవచ్చు. నెల నిర్ణయించబడినా అది ప్రపంచ మానవాళి అందరికీ ఒకేలా వుండదు. ఒక్కోచోట అది వేసవి కాలం కావచ్చు, మరోచోట చలికాలం, ఇంకోచోట వర్షకాలం కావచ్చు, మరోచోట పొడి వాతావరణం, ఇంకోచోట పంటలు కోతకొచ్చే కాలంగాను, మరోచోట విత్తనాలు విత్తేకాలంగానూ ఉండవచ్చు. 444 అందుకని సూర్యమానం ప్రకారం కాక, చాంద్రమానం ప్రకారం నిర్ణయించడం తప్పనిసరి చేయటం జరిగింది. దీనివలన

A ఖుర్‌ఆన్‌ అవగాహనం, నం. తౌబా సూరా పాదసూచి 87, పేజి 164, 165, 166. 44 ఖుర్‌ఆన్‌ అవగాహనం, నం. తౌబా సూరా పాదనూచి 87, పేజి 164, 165, 166. 44 ఉఖుర్‌ఆన్‌ అవగావొనం, సం. తి, తౌబా సూరా, పాదసూచి 87, పేజి 164, 165, 166.

56 ఆత్మ (ప్రక్షాళనం రోజా ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో నివసించే ప్రజలు ప్రతి కాలంలో ఆరాధనల్ని నెరవేర్చి ఉత్తమ నడవడితో పాటు ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందగలగాలన్నదే దీని ఉద్దేశం.

చాంద్రమానం ప్రకారం ఆరాధనలు నిర్ణయించటానికి కారణమేమిటన్న మరో సందేహం కూడా నివృత్తి చేయబడింది. అదేమిటంటే, ఇలా నిర్ణయించని పక్షంలో ప్రతి ముస్లిం గ్రహ, నక్షత్రాల జ్ఞానం తప్పనిసరిగా కలిగివుండాల్సి వచ్చేది. లేదా పంచాంగం అతని ధార్మిక అంశాల్లో ఒకటిగా నిర్ణయించబడేది. ఇది లేకుండా ధార్మిక విధుల నిర్వహణ కష్టంగా పరిణమించేది. అందువలన ప్రతి నెల పంచాంగం పేజీ తిరిగేసేబదులు, దేవుడు తేదీల లెఖ్మను నిర్ణయించాడు. మనిషి ఎడారి ప్రాంతాల్లో జీవనాన్ని కొనసాగిస్తున్నా లేక కొండకోనల్లో కాలం గడుపుతున్నా అతను కూడా ఇప్పుడు రమజాన్‌ మాసం చంద్రుడు ఉదయించాడని తేలిగ్గా తెలుసుకోగలగాలి. ఇక రోజాలు పాటించాలని, లేక షవ్వాల్‌ మాసం నెలవంక కనిపించింది, ఇక ఈదుల్‌ ఫిత్ర్‌ చేసుకోవాలని తెలుసుకోగలగాలి.

చంద్రోదయ వేళ ఆకాశం తేటగా లేకున్నా లేక మబ్బులు క్రమ్ముకుని వున్నా రమజాన్‌ నెలను 30 రోజులకు పూర్తి చేసుకోవాలని నిర్ణయించబడింది. విధంగా 29వ తేదీనాడు చంద్రుడు కన్పించనప్పుడు సందిగ్ధతను ఇలా దూరం చేసుకోవాలి.

ఇస్లామీయ ధార్మిక ఆరాధనలకై చాంద్రమానాన్ని పాటించడంలో వున్న యుక్తి

OTOL _-!లి

ఢి wrt hoy tan pen Togas aaah ఘుంఘుమ! లతకు పడ ధ్ర ఉడక ద్ర ట్రగయంధ ట్‌

క్యా కండి,

(ae sas పసరు క్తో N35)

15. హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ (రజి) గారి ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా “ప్రవచించారు : మనది విద్యావిహీన సమాజం. వ్రాయనూలేము, తిథి నక్షత్రాల లెక్కనూ ఎరుగము. నెల ఇలా ఇలా ఉందని చెప్పి ఆయన (స) తన రెండు చేతులతో సైగ చేస్తూ రెండు

ఆత్మ ప్రక్షాళనం రోజా 57 చేతుల వ్రేళ్ళను చాపి ఉంచారు. ఆపైన మూడవసారి తన అంగుష్టాన్ని మూసివేశారు. (దాని ఉద్దేశం ఏమిటంటే నెలకు 29 రోజులుంటాయి). మళ్ళీ ఆయన (స) ఇలా సెలవిచ్చారు : నెలలు ఇలా ఇలా వుంటాయి అని, అంటే 80 రోజులుంటాయని చెప్పారు. విధంగా ఒకసారి ప్రవక్త (స) నెలకు 29 రోజులుంటాయని, మరోసారి 80 రోజులుంటా యని సెలవిచ్చారు. (ముత్తఫకున్‌ అలైహ్‌)

అరబ్బులు సాధారణంగా వేళ్ల పైన లెక్కపెట్టి ఎంచేవారు. పది అంకెలు లెక్కపెట్టాలంటే రెండు చేతుల ట్రేళ్లను లేపి సైగలతో లెక్కిస్తారు. నేటికీ మన నాట పల్లెల్లో నిరక్షరాస్యులైన ప్రజల అలవాటు ఇలాగే వుంటుంది. దీని అర్ధం అరబీ భాషలో లెక్క వేయటానికి పదాలు లేవని కాదు. అరబ్బుల్లో అలవాటు పురాతన కాలం నుంచే వున్న కారణంగా, దైవప్రవక్త (స) చేతివేళ్లతో సైగ చేస్తూ నెలకు ఒక్కోసారి 29 రోజులుంటాయని, మరోసారి 30 రోజులుంటాయని సెలవిచ్చారు. మహాప్రవక్త (స)తో తాము చదవను వ్రాయను రానివారమని, నక్షత్రాలు, రాశుల లెక్క తెలియని వారమని, తమ నిరక్షరాస్యత గురించి చెప్పటం జరిగింది. మనలో చదవను వ్రాయను వచ్చినవారు లేరనే చెప్పుకోవాలి. కారణంగా మన లెక్క పత్రం ద్వారా నెల ప్రారంభమైందో, మరే నెల సమాప్తమయ్యిందో చెప్పటం ఎలా సాధ్యం? విధంగా ప్రవక్త (స) చాంద్రమానం ప్రకారం నెల ప్రారంభం, పరిసమాప్తం ఆధారంగా నెలవంకను సంకేతంగా నిర్ణయించటం జరిగింది.

నేడు కొంతమందికి సైన్స్‌ పిచ్చి పట్టుకుంది. వాళ్ళంటారు - బాబూ ఇది సైన్స్‌ యుగం. దీనిద్వారా చంద్రోదయమయ్యిందో లేదో అన్న విషయాన్ని చాలా తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఆకాశంపై చంద్రుడున్నా, వాతావరణం సరిగ్గా లేనందువల్ల అది కన్పించనప్పుడు దాన్ని పరికరముల సహాయంతో చూడవచ్చు. స్వయంగా ఖగోళశాస్త్రం, జ్యోతిశ్శాస్త్రం ద్వారా కూడా చంద్రోదయం అయ్యిందో లేదో అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. కాని ఒక విశ్వజనీన ధర్మం ఎప్పుడయినా కృత్రిమ పద్ధతులపై ఆధారపడదన్న విషయాన్ని వీళ్ళు గ్రహించరు. సహజసిద్ధమైన పద్ధతుల పైనే అది ఆధారపడుతుంది. నేడు సాంకేతికాభివృద్ధి పట్ల శ్రద్ధాసక్తులు వున్నవారు సయితం సహజ పద్ధతుల ప్రభావంతో ధర్మంపై నడచుకోగలగాలి. ఇంకా నేటి అభివృద్ధి ఫలాలకు దూరంగా వున్నవారు, వీటి జ్ఞానం పట్ల స్పృహలేని సామాన్య ప్రజానీకం కూడా నికార్సయిన ముస్లిములుగా నడుచుకుంటూ సహజధర్మమైన, స్వతఃస్పిద్ధమైన విధానాలపైన తమ జీవితం గడపగలగాలి.

58 ఆత్మ ప్రక్షాళనం రోజా

నెలవంక దర్శనం విషయంలో సాంకేతిక పద్ధతులు అవలంబించాలని అభిలషించేవారు మరో ఆధారాన్ని కూడా మన ముందుంచుతారు. అదేమంటే సాంకేతిక పద్ధతుల ద్వారా ముస్లింలందరూ తమ పండుగను కనీసం వారి మొత్తం దేశంలోనయినా ఒకే రోజున జరుపుకోవచ్చు. ఎందుకంటే పండుగయే ముస్లింల ఐక్యతకు ఒక సంకేతం. పైగా నెలవంక దర్శనంపైన వచ్చే వివాదాలు ముస్లింల ఐక్యతకు భంగం వాటిల్లచేస్తున్నాయి - వీరిలో మరికొంతమంది, ప్రపంచ ముస్లిం లందరి పండుగ ఒకే రోజు జరుపుకోవాలని కూడా అంటారు. కాని వాస్తవానికి, ఇలాంటి భావన లోపభూయిష్టమైనది. ధర్మావగాహన లేమి వల్లనే ఇలాంటి మాటలు అనబడతాయి. ఎక్కువగా ఇలాంటి మాటలను రమజాన్‌లో ఉపవాసాలను పాటించని వారే అంటారు. అయితే వీరికి పండుగ విషయంలో మాత్రం ఎక్కడలేని ఇస్లాం, ముస్లింల ఐక్యత గురించిన విచారం పుట్టుకొస్తుంది.

ప్రపంచ ముస్లింలందరూ పండుగను ఒకేరోజు జరుపుకోవాలనే వారి మాట వట్టి నిరర్ధకమైన వాచాలత. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో చంద్రోదయం ఒకేరోజు కావటం అసంభవమైన విషయం. ఇక పోతే దేశం లేదా దేశంలోని పెద్ద ప్రాంతంలో ముస్లింలందరూ ఒకే రోజు పండుగ జరుపుకోవాలన్న సమస్య; దీన్ని కూడా షరీఅత్‌పరంగా తప్పనిసరి చేయలేదు. వీలైతే ఒక దేశంలో షరీఅత్‌ శాసనాంగాన్ననుసరించి నెలవంక దర్శనం అయ్యిందన్న సమాచారాన్ని చేరవేసే సౌకర్యం వుంటే అలా జరుపుకోవటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కాని షరీఅత్‌ ఇలాగే కావాలని ఎన్నడూ అభిలషించదు, ఇంకా ఇది షరీఅత్‌ రీత్యా దుష్మార్యం కూడా కాదు. వివిధ ప్రాంతాల్లో వివిధ రోజుల్లో పండుగ జరగాలన్నది కూడా షరీఅత్‌ అభిమతం కాదు. దైవధర్మం సర్వమానవాళి కొరకు, సర్వకాలాలకు అనుసరణీయం. నేడు ప్రజలు రేడియోలు, టీ.వీ.ల ఆధారంగా అందరి పండుగా ఒకేరోజు జరగాలని అభిలషిస్తున్నారు. కాని నేటికి 60 లేక 70 యేళ్ళకు పూర్వం భారత ఉపఖండం విడిపోక ముందు, దాని ఒక్క ప్రాంతంలోనూ రమజాన్‌ పండుగ తాలూకు 29 తేదీనాడు చంద్రోదయం అయ్యిందన్న సమాచారాన్ని ముస్లింలందరికీ చేరవేయబడలేదు. ఒకవేళ పండుగ ఒకే రోజు జరగాలని షరీఅత్‌ తప్పనిసరి చేసినట్రైతే పూర్వ శతాబ్దాల్లో గతించిన ముస్లిం తరాలు విధంగా అమలు చేసి వుంటారు? మరి నేడు కూడా దీన్ని తప్పనిసరి చేసి పండుగ ఒకేరోజు జరపటం ఆచరణలో సాధ్యం కాని విషయం. ముస్లింలు కేవలం పెద్ద నగరాల్లో, పట్టణాల్లో నివసించరు. సుదూర గ్రామీణ ప్రాంతాల్లో కూడా వుంటారు. ఇంకా

ఆతు ప్రక్షాళనం రోజా 59 ఎక్కువ శాతం ముస్లింలు అటవీ ప్రాంతాల్లో, కొండకోనల్లో కూడా నివసిస్తూవుంటారు. పండుగను ఒకే రోజు జరపాలని షరీఅత్‌ ఆదేశంగా నిర్ణయించటానికి దేశంలోని ముస్లింలందరికీ ఒకే రేడియో స్టేషన్‌ వుండటమే సరిపోదు. ప్రతి వారికీ, ఇంకా ప్రతి ఇంటా లేదా ముస్లింల ప్రతి చిన్నా పెద్దా బస్తీలో ఒక రేడియో సెట్‌గాని, ట్రాన్సిస్టర్‌ గాని అవసరమైవుంటుంది. లేకపోతే వారు తమ షరీఅత్‌ విధుల్ని నెరవేర్చలేరు. ఇక పరికరాలు కూడా ధర్మంలో తప్పనిసరి అంశం కానున్నాయా? దేవుని షరీఅత్‌ ద్వారా జారీఅయిన నిబంధనల్ని తన విధి నిర్వహణలో ప్రతి ముస్లిం సర్వకాలాల్లోనూ సులువుగా ఆచరించగలడు. దేవుడు నమాజ్‌ వేళల్ని పాటించడానికి, తన ధర్మంలో అవి కూడా అంతర్భాగంగా మారడానికి ప్రతి ముస్లింకు గడియారాన్ని తప్పనిసరి చేయలేదు. దీనికి బదులు దేవుడు ప్రపంచం మొత్తంలో నమాజ్‌ వేళల్ని పాటించడానికి సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ఇంకా సూర్యుడు వాలిపోయే సమయాల్ని సూచనలుగా చేశాడు. వీటిని ప్రతి మనిషి, ప్రతిచోటా చూడగలడు. అలాగే రోజాలు ప్రారంభించడానికి, పరిసమాప్తం చేయడానికి యావత్‌ ప్రపంచం సులువుగా చూడగలగటానికి రమజాన్‌, షవ్వాల్‌ల నెలవంకలను సూచనలుగా నిర్ణయించాడు. ప్రతి ముస్లిం ప్రతి చోటా చంద్రుణ్ణి చూసి ఇప్పుడు రమజాన్‌ మొదలయ్యిందని, సమాప్తమయ్యిందని ఇట్టే తెలుసుకోగలడు. ఒకవేళ అతను పంచాంగం లెక్కను పాటించినట్లయితే, ఇక ప్రతి ముస్లింకు ఖగోళశాస్తాన్ని జ్యోతిశ్చాస్తాన్ని విధిగా తెలుసుకోవాల్సిన అగత్యం ఏర్పడేది, లేదా పంచాంగం కూడా అతని ధర్మంలో అంశంగా మారేది, ఇంకా అది లేకుండా తన విధ్యుక్త ధర్మాలను పాటించలేకపోయేవాడు. పైగా అతను ఒకచోట అయిన చంద్రోదయం ఆధారంగా ప్రపంచం మొత్తంలో లేక పుడమిపైని ప్రతి ప్రాంతంలో, ఖండాలలో రోజాలు పాటించాలని లేక పరిసమాప్తం చేయాలని నిర్ణయించేవాడు. అలాగైతే నేటి ఆధునిక ప్రసార మాధ్యమాలు లేని పూర్వకాలంలో ముస్లింలు తమ ధర్మంపైన నడుచుకోవటం దుర్లభమయ్యేది. ఇక ఆధునిక మాధ్యమాల ఉనికి అమలులోకి వచ్చిన పిదప ముస్లింలపై పెద్ద ఆపదే వచ్చిపడేది. ఎందుకంటే అతనికి కూడు, గూడు, గుడ్డ లభ్యం కానప్పటికీ తన వద్దనయితే తప్పనిసరిగా ట్రాన్సిస్టర్‌ లేక టీ.వీ. ఉంచాల్సిన అగత్యం ఏర్పడేది. *

4 “ఈదుల్‌ఫిత్ర్‌ ఉవన్యాసం”, పేజీ 18, ఇఐవానె అదద్‌' ప్రచురణ, ఉర్జూ బాజార్‌ లాహోర్‌

60 ఆత్మ ప్రక్షాళనం రోజా రమజాన్‌, జుల్‌హిజ్జహ్‌ (పుణ్యం, ఘనతల రీత్యా) ఏనాడూ కొరత లేనివి 2h Sede 0 06 96 9% gf Co - BEEN TEU యమ _ ఓహీ[335 16. హజత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) సెలవిచ్చారు, “పర్వదినాల రెండు నెలలు ఎన్నడూ కొరతలేనివి, అవి రమజాన్‌ నెల ఇంకా జుల్‌హిజ్జహ్‌ నెల”. (ముత్తఫకున్‌ అలైహ్‌)

రమజాన్‌ను పండుగ నెల అని ఎందుకనబడిందంటే దాని తరువాత వెంటనే పండుగ వస్తుంది. అందువలన ఈదుల్‌ ఫిత్ర్‌ సంబంధం రమజాన్‌తో ముడిపడి వుంది.

కొంతమంది ప్రవక్త (స) గారి హదీసును ఆధారంగా చేసుకొని రెండు నెలలు ఎప్పుడూ-ఏక కాలంలో-29 రోజులవిగా వుండవు అని అర్ధం తీస్తారు. అయితే ఇదొక జ్ఞానహీన వ్యాఖ్యానం. రమజాన్‌, జుల్‌హిజ్జహ్‌ నెలలు ఒక సంవత్స రంలో 29 రోజులవిగా వుండే ఆస్మారం వుంది, వుంటాయి కూడా. హదీసు అసలు భావం ఏమిటంటే, నెలలు 29 రోజులవైనా లేక 30 రోజులవైనా, వాటి పుణ్యం, పవిత్రతల రీత్యా వాటిలో ఏమాత్రం కొరత ఏర్పడదు. రమజాన్‌ నెల 30 రోజులకు బదులు 29 రోజులదైతే దాని రోజాల పుణ్యఫలాల్లో ఏదైనా కొరత ఏర్పడుతుందన్నది దీని అర్ధం కాదు (అంటే 29 రోజుల పుణ్యం 30 రోజుల పుణ్యం కన్నా తక్కువ అన్న భావంలో). ఇదేవిధంగా జుల్‌హిజ్జహ్‌ నెల 29 రోజులదైనా లేక 30 రోజులదైనా దాని మొదటి పది రోజుల ఘనత, పుణ్యఫలాల్లో ఏమాత్రం తరుగుదల ఏర్పడదు.

రమజాన్‌ నెలకు ఒకటి లేదా రెండు రోజుల ముందు ఉపవాసం వుండకూడదు Jems C2 PRO S| దండలు 6 I EEE

ఆత్మ (ప్రక్షాళనం రోజా 61 17. హజ్రత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు : మీలో వ్యక్తీ రమజాన్‌ నెలకు ఒకటి లేదా రెండు రోజుల ముందు ఉపవాసాలు పాటించరాదు-సాధారణంగా ఒక వ్యక్తి ఆయా రోజుల్లో రోజాలు పాటించటం అలవాటుగా వుంటే తప్ప. అలాంటి వ్యక్తి మాత్రం రోజాలు పాటించవచ్చు. (ముత్తఫకున్‌ అలైహ్‌)

మున్ముందు షాబాన్‌ నెల సగం రోజులు గడిచాక ఎలాంటి రోజాలు పాటించరాదు అని ప్రవక్త (స) సెలవిచ్చిన హదీసు రాబోతోంది. ఇందులో రెండు హేతువులు లేక మర్మాలున్నాయి.

ఒకటి, రమజాన్‌కు ముందున్న రోజుల్లో ఉపవాసాల్ని పాటిస్తే మనిషిలో బలహీనత ఏర్పడుతుంది. ఫలితంగా అతనికి రమజాన్‌ రోజాలు పూర్తి చేయటం కష్టంగా పరిణమిస్తుంది. ఎవరికైనా రమజాన్‌ రోజాలే గాక నఫిల్‌ లేక ఖజా రోజాలు వుండే అనుభవముంటే వారికి తెలిసిపోతుంది - రమజాన్‌ నెలలోని 10 రోజాల కన్నా ఇతర దినాల్లోని ఒక్క రోజా కూడా మనిషిని నిస్సత్తువగా చేస్తుందని. దానిక్మారణం ఏమంటే రమజాన్‌లో పూర్తి సమాజం రోజాలు పాటిస్తుంది. అందుచేత ఒకరి రోజా మరొకరికి సహాయకారిగా మారుతుంది. కాలంలో రోజాలు పాటించే సాధారణ పరిస్థితి, వాతావరణం నెలకొని వుంటుంది. దీని ఫలితంగా మనిషి పూర్తి నెల చాలా తేలిగ్గా రోజాలు పాటిస్తాడు. రమజాన్‌ మాసంలో కాక ఇతర రోజుల్లో ఉపవాసముండే వ్యక్తి ఏకాకి అయిపోతాడు. తన చుట్టూ వున్న పూర్తి సమాజంలో వాతావరణం అతనికి అననుకూలంగా మారుతుంది. అందువలన అతనికి రోజాలు పాటించటం కష్టమనిపిస్తుంది. కాబట్టి అతను మామూలుకు భిన్నంగా తనకు తాను బలహీనునిగా భావిస్తాడు. అందువల్ల రమజాన్‌ కంటే ముందు రోజుల్లో వ్యక్తీ రోజాలు పాటించరాదని తాకీదు చేయబడింది.

రెండవ కారణంలోని పరమార్థం ఏమిటంటే ఇస్లామీయ షరీఅత్‌ విధిగా నిర్వహించాల్సిన వాటిలో హెచ్చుతగ్గులు చేయటాన్ని భరించదు. ఎందుకంటే రమజాన్‌ రోజాలు విధిగావించబడ్డాయి. అందుకని రమజాన్‌కు ముందు రోజుల్లో రోజా పాటిస్తే విధిగావించబడిన ఆరాధనల్లో అధికం చేసినట్లు భావించబడుతుంది. ఒక వ్యక్తికి రమజాన్‌ మాసపు 30 రోజాల పుణ్యం ఎటూ లభిస్తుంది, మరైతే ఒకటి అర రోజులు వీటిలో ఎందుకు అధికం చేయరాదని తలపోయవచ్చు. అలా భావించి అతను రమజాన్‌కు ముందు ఒకటి లేక రెండు రోజుల ముందు నుంచే రోజాలు పాటించడం మొదలెడతాడు. దీని అర్ధం ఏమిటంటే, విధిగా చేసిన ఆరాధనల్లో

62 ఆత్మ (ప్రక్షాళనం రోజా తనంతట తాను అధికం చేసుకోవాలని భావించాడు. దీన్నే బిద్‌అత్‌ (షరీఅత్‌లో లేనివాటిని కొత్తగా చేర్చుకోవటం)గా పరిగణించటం జరుగుతుంది. ఇది మార్గవిహీనతగా పేర్కొనబడింది, దాని ఫలితం నరకాగ్ని అని చెప్పబడింది. ఇలా (గంథవహులు, ఇంకా ముస్లింలు కూడా నానా విషయాలను, పద్ధతుల్ని పుణ్యాలుగా తలపోస్తూ వాటిని విధ్యుక్త ధర్మాల్లో కలపటం జరిగింది. అంతేగాక తమ మనసుల్లో వాటిని ఘనకార్యాలుగా పేర్కొంటూ, ప్రచారం చేశారు. పైగా వాటి నిర్వహణ విధ్యుక్త ధర్మాలకంటే కూడా మించిందని నిర్ణయించేశారు. చివరికి అవి దైవధర్మ శాస్త్రంలోని విధుల్లో అంశంగా మారిపోయాయి, అంశం కూడా అసలైన దానికన్నా మించిపోయి అదే ముఖ్యాంశంగా మారిపోయింది. అందుకనే ఇస్లామీయ షరీఅత్‌ నైజం ఏమిటంటే, అందులో నిర్ణయించిన అంశాలను తక్కువ చేయటం లేక ఎక్కువ చేయటం జరగదు. ఒకవేళ జుహ్ర్‌ నమాజ్‌లో 4 రకతులు ఫర్డ్‌గా నిర్ణయించబడినప్పుడు ఇక అందులో తక్కువ చేసి 8 రకతులుగా మార్చడమో లేక ఎక్కువ చేసి 5 రకతులుగా నిర్ణయించటమో చేసే హక్కు ఎవరికీ లేదు. అల్లాహ్‌ ఆదేశాల ' పట్ల విధేయత చూపటమే దాసుని విధ్యుక్త ధర్మం. ఒకవేళ ఎవరైనా తన తరఫున విధి విధానాల్లో ఎక్కువ చేసినట్లయితే వాస్తవానికి అది ఆరాధనగా భావించబడదు, అది ఒక చట్ట నిర్మాణం అవుతుంది. అమలులో వున్న చట్టం లభిలషించేదేమంటే, ఎక్కువ తక్కువలు చేయకుండా దాని ప్రకారం అమలు చేయాలన్నదే. అందులో ఎక్కువ తక్కువలు చేయటం పూర్తిగా అవిధేయతగా, పైగా కొన్ని సందర్భాల్లో దాన్ని కుఫ్‌గా పరిగణించటం జరిగింది. నమాజ్‌లో ఇమామ్‌ ఫర్డ్‌ నమాజ్‌ ముగించిన వెంటనే దిశ మళ్ళి కూర్చోవటం అభిలషణీయం. ఇమామ్‌ నమాజ్‌ ముగించినప్పటికీ అలానే ఖిబ్లా అభిముఖంగా కూర్చోవటం కూడా నమాజ్‌లో అంతర్భాగం కాకూడదు. సామూహిక నమాజ్‌ ముగిసిన పిదప సున్నత్‌ నమాజ్‌లను విడి విడిగా చేసుకోవాలి. ఒకవేళ వీటిని సామూహికంగా నిర్వహిస్తే అవి కూడా ఫర్డ్‌ నమాజ్‌లో అంతర్భాగంగా మారే అవకాశం ఏర్పడుతుంది. కాని అలా చేయరాదు. అదేవిధంగా ఉపవాసాల కొరకు రమజాన్‌ నెలను నిర్ణయించినప్పుడు, ఎవరైనా వీటితో పాటు మరికొన్ని రోజులను కలుపుకొని రోజాలు పాటిస్తే అవి కూడా విధి విధానాల్లో అధికాంశాలుగా మారే అవకాశముంది.

ఇక్కడ సెలవియ్యబడిందేమంటే - 71... 6 HRD ET ISS “ఇల్లా యకూన రజులున్‌ కాన యసూము సౌమన్‌ .... ఒకవేళ ఎవరయినా సాధారణంగా రోజు రోజా పాటించడం తన అలవాటుగా చేసుకుంటే అది అతనికి అనుమతించబడినట్లే. దాని అర్ధం ఏమంటే ఒకవేళ వ్యక్తి నెలలోని చివరి తేదీల్లో నఫిల్‌ రోజాలు వుండే నియమం పెట్టుకుంటే లేక వారంలో ఏదో

ఆత్మ ప్రక్షాళనం రోజా 63 ఒక రోజు నఫిల్‌ రోజా వుండేలా నియమం పెట్టుకుంటే - రోజు అనుకోకుండా రమజాన్‌కన్నా ముందు రోజుగా వచ్చివుంటే రోజు రోజా ఉండటంలో ఎలాంటి ఆక్షేపణ లేదు. ఎందుకంటే రోజాలను అతను తన మామూలు ఆచరణా నియమంగా పెట్టుకున్నాడు గనక.

రెండవ భాగం

షాబాన్‌ నెల సగం గడిచాక రోజాలు ఉండరాదు Ses Be = nL మకీ అన “వ Wl ఆటు) ప్రపం 96 ఫర I BESSY Sat యమన యట (NUE వర కసీ యువత టీ

18. హజ్రత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స)

ఉద్బోధించారు: షాబాన్‌ నెల సగం గడిచిపోయిందంటే, ఆపైన రోజా పాటించకండి. (అబూదావూద్‌, తిర్మిజీ, ఇబ్నెమాజా, దారిమీ)

ఆదేశానికి విశదీకరణ ఇంతకు పూర్వమే వచ్చింది. ఇంకా దీనికి ఒక మినహాయింపు రూపం కూడా పేర్కొనటం జరిగింది. మరో వినాయింపు ఖజా (తప్పిపోయిన) రోజాల విషయంలో వుంది. దీని వివరణ, వ్యాఖ్యానం సందర్భాను సారం చేయటం జరుగుతుంది.

రమజాన్‌ కొరకు షాబాన్‌ నెలపొడుపును చూసేందుకు ఆదేశం లేడు ర్రిజ0త ఏ6 భత త్ర దై | అరా ప్ర వడమ మభ! (సేయు Saas 19. హజ్రత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స)

విధంగా హితవు గరిపారు : రమజాన్‌ కొరకు షాబాన్‌ నెలవంకను చూసే ఏర్పాటు చేసుకోండి. (తిర్మిజీ)

హితవును ఎందుకు ఇవ్వటం జరిగిందంటే ఒకవేళ షాబాన్‌ నెలవంకను

64 ఆత్మ (ప్రక్షాళనం రోజా చూసే ఏర్పాటు చెయ్యకున్నట్లయితే రోజు షాబాన్‌ నెల తాలూకు తేదీ అన్నది తెలియకపోవచ్చు. అలా చేయకపోతే రమజాన్‌ ప్రారంభపు తేదీ నిర్ణయించుకోవటానికి కష్టంగా మారవచ్చు. ఎందుకంటే ఒకవేళ రమజాన్‌ ప్రారంభ తేదీ రోజు ఆకాశం నిర్మలంగా లేకపోయినందున చంద్రుడు కన్పించనట్లయితే రోజు షాబాన్‌ 29వ తేదీయా లేక 30వ తేదీయా అని నిర్ణయించటం కష్టంగా పరిణమించవచ్చు. ఒకవేళ షాబాన్‌ నెల చంద్రుణ్ణి చూసే ఏర్పాటు చేసుకునివుంటే, 29వ రోజు రమజాన్‌ నెల చంద్రుడు కన్పించనిపక్షంలో షాబాన్‌ నెల 30 రోజులు పూర్తిచేసుకోవాలి. ఒకవేళ రోజు షాబాన్‌ 30వ తేదీ అని తెలిస్తే రోజు చంద్రుడు కన్పించకపోయినా మరుసటి రోజు నుంచి ఇక రమజాన్‌ ప్రారంభమయి నట్లే లెఖ్క అందుకే రమజాన్‌ ప్రారంభ తేదీ నిర్ణయానికి షాబాన్‌ నెల చంద్రుణ్ణి చూసే ఏర్పాటు కూడా చేసుకోవాలి.

దైవప్రవక్త (స) షాబాన్‌ మరియు రమజాన్‌ ఉపవాసాలను ఎడతెగ కుండా పాటించేవారు

bess తండ తేర మ్య ౫4 ERT డపేడిని్తు : Stas 5 ఢ్వ్మ్లసై155 5 ప్త కు

20. హజ్రత్‌ ఉమ్మె సలమా (రజి.అన్‌హా) ఉల్లేఖించారు : “నేను దైవప్రవక్త (స)ను ఎన్నడూ వరుసగా రెండు నెలలు రోజాలు పాటిస్తున్న స్థి సితిలో చూడలేదు - అయితే షాబాన్‌ రమజాన్‌లలో తప్ప అలా జేసే వారు. (అబూదావూద్‌, తిర్మిజీ, కస ఇబ్నెమాజా)

ఇంతకుముందే షాబాన్‌ నెల సగం గడిచాక రోజాలు పాటించటం నిషిద్ధం అన్న ప్రవక్త (స) హితవును పేర్కొనటం జరిగింది. అయితే హదీసు ద్వారా మనకు తెలిసే ప్రవక్త (స) ఆచరణ ఏమిటంటే, ఆయన తరచుగా (ఎల్లప్పుడూ కాదు) షాబాన్‌ ఇంకా రమజాన్‌ నెలల రోజాలను ఎడతెగకుండా పాటించేవారు. ఇది దైవప్రవక్త గారి ప్రత్యేకమైన ఆచరణ అని మనకు తెలుస్తోంది. ఇతరులెవరికీ ఇలా ఆచరించే అనుమతి లేదు. ప్రవక్త (స) గారి కొన్ని ఆచరణలు ఆయన (స)

ఆత్మ (ప్రక్షాళనం రోజా 65 కొరకు ప్రత్యేకం. ఇతరులెవరూ వాటిని పాటించటం అభిలషణీయం కాదు. లేదా వాటి ఆచరణ ఇతరులకు తప్పనిసరి కూడా కాదు. ఉదాహరణకు తహజ్ఞుద్‌ నమాజ్‌ ప్రవక్త (స) కొరకు తప్పనిసరి గావించబడింది. కాని ఇతరులకు ఇది తప్పనిసరి కాదు. ఇతరులెవరైనా నమాజ్‌ ఆచరిస్తే అది వారి కొరకు పుణ్యకారకం, లేకుంటే ఎలాంటి దోషం లేదు. ఇలాగే మరికొన్ని ఆచరణలున్నాయి - అవి కేవలం (ప్రవక్త (స) గారి కొరకే ప్రత్యేకం. ఉదాహరణకు సాధారణ ముస్లింలు ఒకేసారి నలుగురు భార్యలకన్నా అధికంగా కలిగి ఉండకూడదు. కాని ప్రవక్త (స) గారికి దీనిపైన

ఎలాంటి ఆంక్ష ఉండేది కాదు. స్వయంగా దివ్య ఖుర్‌ఆన్‌లో దీని విషయంలో ప్రవక్త (స) గారికి వినాయింపు ఇవ్వటం జరిగింది. అలాగే కొన్ని విషయాల్లో ప్రవక్త (స)కు వినాయింపు లేదు కాని సాధారణ ముస్లింలకు వుంది. ఉదాహరణకు గ్రంథవహులైన స్రీలతో సాధారణ ముస్లింలు వివాహం చేసుకోవచ్చు, కాని ప్రవక్త (స) గారికి అనుమతి లేదు. దీనివలన తెలిసేదేమంటే ప్రవక్త (స) గారికి కొన్ని ప్రత్యేకతలు ఇవ్వబడ్డాయి. ఆయన (స)తో మరెవరూ సాటిరాలేరు. ఇలాంటి ప్రత్యేకతల్లోనిదే ఇది - అంటే ఆయన (స) షాబాన్‌ నెల రోజాలను పాటించటం. కాని షాబాన్‌ నెల సగం రోజులు గడిచాక రోజాలు పాటించడానికి సాధారణ ముస్లింలకు అనుమతి లేదు.

అనుమానంతో రోజాను పాటించటం ధర్మసమ్మతం కాదు

ehh smn

జు! Had రస్యజపడ ఉతమ

ASST

(ల షీజరలక ప్రరు5 ఈం] 5 వము

21. హజత్‌ అమ్మార్‌ బిన్‌ యాసిర్‌ (రజి) ఉల్లేఖనం : ఎవరైనా ఒక వ్యక్తి ఒక రోజు రోజా పాటించాడు, కాని అందులో అతనికి అనుమానం ఏర్పడితే అతను అబుల్‌ కాసిమ్‌ (స) పట్ల అవిధేయత కనబరచిన వాడవుతాడు. (అబూదావూద్‌, తిర్మిజీ, ఇబ్బెమాజా, దారిమీ) ఇవి హజ్రత్‌ అమ్మార్‌ బిన్‌ యాసిర్‌ (రజి) గారి పలుకులు. తన మాటల్లో దన్న ప్రవక్త (స) గారి హితవుగా - అనుమానంగా వుంటే రోజు రోజా పాటించవద్దని పేర్కొనటం జరిగింది. “అనుమానపు రోజా” అంటే అర్ధం “ఈ రోజు రమజాన్‌ మొదలయ్యిందా లేదా” అని అనుమానపడటం అని అర్ధం.

66 ఆత్మ ప్రక్షాళనం రోజా దాహరణకు, రోజు షాబాన్‌ నెల 29వ తేదీ. ఆకాశం నిర్మలంగా లేనందువల్ల చంద్రుడు కన్పించలేదు. అప్పుడు రోజు గురించి అనుమానం ఏర్పడింది - రోజు చంద్రోదయం అయ్యిందా లేదా అని. ఇక ఎవరైనా ఒక వ్యక్తి చంద్రోదయమైందని భావించి మరునాడు రోజాను పాటిస్తే అది తప్పు. ఎందుకంటే దీన్నే అనుమానపు రోజా” అని పేర్కొనటం జరిగింది. అలాంటి స్థితిలో రోజా ఉండటాన్ని వారించటం జరిగింది. దీని అర్థం ఏమిటంటే, ఆరాధన అనుమానం ఆధారంగా చేయరాదు, పూర్తి నమ్మకంతో చేయాలి. ఉదాహరణకు ఒక ప్రాంతం లేదా పట్టణవాసులైన కొంతమంది ప్రజలకు 'ఇక్కడ జుమా నమాజ్‌ చేయవచ్చా లేదా?” అన్న అనుమానం కలుగుతుంది. అప్పుడు వారు జుమా నమాజూ చదువుతారు, ఇంకా జుహ్‌లోని నాలుగు ఫర్ట్‌ రకతులూ చదువుతారు. దాని అర్థం వారి జుమా కూడా అనుమానమైందే, ఇంకా జొహర్‌లోని నాలుగు రకతుల ఫర్ట్‌ నమాజ్‌లూ అనుమానంలో పడిపోయాయి. ఇది సరియెన పద్ధతి కాదు. వారికి జుమా అవుతుందన్న నమ్మకముంటే కేవలం జుమా నమాజ్‌ చేస్తే సరిపోతుంది, జుహ్ర్‌లోని 4 రకతుల ఫర్డ్‌ చదవరాదు. ఒకవేళ జుమా కాదు అని గట్టి నమ్మకముంటే 4 రకతుల ఫర్డ్‌ మాత్రమే చదవాలి, జుమా చదవరాదు. అనుమానంతో ఆరాధన చేయటం తప్పు, ఇలాంటిదే రమజాన్‌కు సంబంధించి రోజు రమజాన్‌ మొదలయ్యిందన్న గట్టి నమ్మకం కుదిరితేనే రమజాన్‌ రోజా పాటించాలి. అనుమానంతో రమజాన్‌ రోజా వుండటం సరిఅయింది కాదు. సందర్భంగా ఇంతకు ముందే హితవు గరపటం జరిగింది - ఒకవేళ షాబాన్‌ 29వ లేదీ నాడు నెలవంక కన్పించకపోతే షాబాన్‌ నెల 30 రోజులు పూర్తి చేసుకోవాలని.

నెలవంక దర్శనానికి మోమిన్‌ (విశ్వాసి) సాక్ష్యమే ఎన్నదగినది

sd BT EH err I Ef SLOG hsql Je ప్రుత రద రట అడు రేక ఆకే సమర రో లితంమోోల్రిరుటు! ఆఫ ల్రమురరఈ లిఆ పులి? చలో g శి 4262s

rer 0 ner sae 32 ఆతుర యు! తానే BIRD)

z

ఆత్మ ప్రక్షాళనం రోజూ 67 22. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (రజి) కథనం : ఒకసారి ఒక పల్లెటూరి వ్యక్తి దైవప్రవక్త (స) సన్నిధిలో హాజరై “నేను చంద్రుణ్ణి చూశాను” అని పలికాడు. అంటే రమజాన్‌ నెలపొడుపు అన్నమాట. ఆయన (స) అతనితో : “అల్లాహ్‌ తప్ప మరెవడూ దేవుడు కాడని నీవు సాక్ష్యం ఇస్తావా?” అని అడిగారు. దానికి వ్యక్తి “అవును? అని అన్నాడు. దాని మీదట దైవప్రవక్త (స) హజ్రత్‌ బిలాల్‌ (రజి)ను ఉద్దేశించి “బిలాల్‌ (రజి), రేపటి నుంచి రోజాలు పాటించండి” అని ప్రజల్లో ప్రకటించండి” అని అన్నారు. (అబూదావూద్‌, తిర్మిజీ, నసాయి, ఇబ్నెమాజా)

ఇది చాలా ముఖ్యమైన హదీసు. దీనిద్వారా అనేక సమస్యలకు సమాధానం దొరుకుతుంది.

మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఆకాశం నిర్మిలంగా లేనప్పుడు చంద్రోదయ సమస్య తలెత్తుతుంది. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు చంద్రోదయాన్ని చూడటం తేలికవుతుంది. దానిని, వేలు, లక్షల మంది చంద్రుణ్ని చూడగలుగుతారు. అప్పుడు సాక్ష్యం ఇచ్చే అవసరం వుండదు. ఆకాశం నిర్మలంగా ఉండి కూడా వేలమంది ఎంత ప్రయత్నించినా చంద్రుణ్ణి వీక్షించలేని సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి చంద్రోదయం అయ్యిందని సాక్ష్యం పలికినా - వారెంతటి తఖ్వా, నిష్టాగరిష్టులైనప్పటికీ - వారి సాక్ష్యం అంగీకరించబడదు. ఎందుకంటే ఆకాశం నిర్మలంగా వున్నవేళ నలుగురైదుగురు వ్యక్తులు వచ్చి చంద్రోదయం అయ్యిందని సాక్ష్యం పలికినా వారి సాక్ష్యం అంగీకరించబడదు. ఆకాశంలోని ప్రతిదీ వీక్షించగలిగే స్థితిలో వున్న వేళ లక్షల మంది చూడలేని చంద్రుణ్ణి ఇద్దరు ముగ్గురు లేక ఐదు పది మంది చంద్రుణ్ణి చూశామని చెబితే ఎలా నమ్మశక్యమవుతుంది? అయితే ఆకాశం నిర్మలంగా లేనప్పుడు, మబ్బులు క్రమ్ముకుని ఉన్న వాతావరణంలో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు, తాము చంద్రుణ్ణి చూశామని చెబితే దీనిని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడో కొంత సమయం పాటు మబ్బులు విడిపోయి చంద్రుడు కన్పించి ఉండవచ్చు. అలాంటప్పుడు అలా చెప్పిన వ్యక్తులు సత్యవంతులా కాదా, ఇంకా వారు నమాజ్‌ రోజాలు పాటించేవారా కాదా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. &

A ఖుత్ఫ-యె-తదుల్‌ ఫిత్ర్‌ - పేజీలు ర, 6.

68 ఆత్మ ప్రక్షాళనం రోజా

రెండవ విషయం ఏమంటే చంద్రోదయం విషయంలో మొదటి దశలో పేర్కొన్న విషయమై సాక్ష్యం అవసరం అవుతుంది. రెండవ అంశం విషయమై కొంతమంది వ్యక్తులు చంద్రుణ్ణి చూశామని ఇచ్చిన సాక్ష్యం విషయంలో వెలువడిన సమాచారం సరిపోతుంది. ఒక పరపతిగల, నమ్మకమైన సంఘం లేక ఒక ముఫ్తీ లేక ఖాజీ సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకొని, సంతృప్తిచెంది సమాచారాన్ని ప్రకటిస్తే ఇక ఆపై ప్రతి వ్యక్తీ చంద్రుణ్ణి చూసి సాక్ష్యాన్నివ్వాల్సిన అవసరం లేదు. సమాజ పెద్ద లేక ముఫ్తీ లేక ఖాజీ గారి ప్రకటన ఆధారంగా సైరన్‌ లేక నగారాలు మోగితే లేక పట్టణంలో చంద్రుడు కన్పించాడన్న విషయమై చర్చలు జరిగినా సాధారణ వ్యక్తులకు ఇది సరిపోతుంది. 4

మూడవ విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం రమజాన్‌ నెల ప్రారంభ సమయానికి మాత్రమే, పండుగ నెలవంక్షకై కాదు. దైవప్రవక్త (స) రమజాన్‌ నెల చంద్రోదయం విషయమై మాత్రమే ఒక వ్యక్తి సాక్ష్యాన్ని అంగీకరించారు. అయితే పండుగ నెలవంక విషయమై కనీసం ఇద్దరు వ్యక్తుల సాక్ష్యం అవసరమని ఫిఖహ్‌వేత్తలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. విషయంలో ఒక వ్యక్తి సాక్ష్యం అంగీకరించబడదు. దీనిక్కారణం ప్రజల్లో పండుగ నెలవంక విషయంలో ఉన్నంత ఆతృత, రమజాన్‌ చంద్రుని విషయంలో ఉండదు. కాబట్టి పండుగ నెలవంక విషయంలో చాలా జాగ్రత్త అవసరం.

నాలుగవ విషయం ఏమంటే, సాక్ష్యం ఇచ్చే వ్యక్తి విశ్వాసియె ఉండాలి. నెలవంక దర్శనం గురించి సాక్ష్యం ఇచ్చిన పల్లెటూరి వ్యక్తి విశ్వాసియా కాదా అన్న విషయంలో కూడా దైవప్రవక్త (స) ఆరా తీశారు. ధార్మిక విషయాల్లో విశ్వసించని వ్యక్తుల సాక్ష్యం చెల్లదని చెప్పటం కూడా దీని మరో ఉద్దేశ్యం. ఏదైనా ధార్మిక విషయంలో తాను ఇచ్చిన సాక్ష్యం ఎంతటి నష్టాన్ని చేకూరుస్తుందో అన్న విషయం ఒక విశ్వసించని వ్యక్తికి ఎలా తెలుస్తుంది? దీనికి ప్రతిగా ఒక విశ్వాసి అయిన మనిషి దృష్టిలో నేడో రేపో రమజాన్‌ మొదలవుతుందా? లేదా అన్న విషయం ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉంటుంది లేక రేపు పండుగ ఉన్నదా? లేదా? అన్న విషయం. ఒకవేళ రేపు పండుగైతే రోజా ఉండటం నిషిద్ధం, లేకపోతే రోజా విరమించటం కూడా నిషిద్ధం. సమస్య యావన్మంది ముస్లిములదైనప్పుడు ఒక ముస్లిం అయిన వ్యక్తి బాధ్యతా రహితునిగా ప్రవర్తించి ఇలాంటి ధార్మిక విషయంలో తప్పిదం ఎలా చేయగలడు?

A ఖుతృ-యె-లుదుల్‌ ఫిత్ర్‌ - పేజి 6, 7

ఆళ్ళ (ప్రక్షాళనం రోజా 69

ఇక ఐదవ విషయం. దైవప్రవక్త (స) సమక్షంలో పల్లెవాసి తాను విశ్వసించిన వాణ్ణని చెప్పినప్పుడు ఆయన (స) విషయంలో అసలు వ్యక్తి పాపియా, దుర్మార్గుడా అని దర్యాప్తు చేయలేదు. వ్యక్తి ముస్లిమన్న విషయంపై సంతృప్తిచెంది అతని సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. దీనిద్వారా తెలిసేదేమంటే ఒక వ్యక్తి పాపి అని రుజువు కానంత వరకు అతని సాక్ష్యాన్ని రద్దుచేయటం జరగదు. ఒక ముస్లిం విషయంలో ప్రారంభంలో అతని ఫాసిఖ్‌ (పాపి) అని తెలియలేదు, దీనిమీద దర్యాప్తు కూడా జరపబడలేదు. అయితే అతను పాపి అని తెలిస్తే ఇక అతని సాక్ష్యం అంగీకరించబడదు.

రమజాన్‌ నెలవంక విషయమై ఒక్క ముస్లిం సాక్ష్యం సరిపోతుంది

సభల SIH gl sy r సదయు! శ్రమ eG ARENT ABE (క్ర వికమక కు 23. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) ఉల్లేఖనం : జనమంతా ఒక్కటై రమజాన్‌ నెలవంకను చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు నేను దైవప్రవక్త (స) సన్నిధిలో హాజరై 'నేను చంద్రుణ్ణి చూశాను” అని విన్నవించాను. దానిపై ప్రవక్త (స) రోజాలు ఉండాలన్న నిర్ణయం తీసుకుని, ఇక రమజాన్‌ రోజాలు ప్రారంభించమని ఆదేశమిచ్చారు. (అబూదావూద్‌, దారిమీ) హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) విషయంలో ఆయన ముస్లిమని, ప్రవక్త (స) సహచరులని తెలుసు. అందువల్ల ఆయనతో 'నీవు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను విశ్వసించావా? అని అడగటం జరగలేదు. కేవలం సాక్ష్యం పైననే రమజాన్‌ రోజాల నిర్ణయం గైకొనబడింది. హదీసు ద్వారా తెలిసేదేమంటే ఆకాశం నిర్మలంగా లేనప్పుడు రమజాన్‌ నెలవంక విషయంలో ఒక వ్యక్తి ఇచ్చే సాక్ష్యం సరిపోతుంది. స్వయంగా “తరాఅన్నాసుల్‌ హిలాలొ అనే పదాల ద్వారా తెలిసేదేమంటే, చాలామంది ప్రజలు చంద్రుణ్ణి చూసే ప్రయత్నం చేశారు. కాని ఆకాశం నిర్మలంగా లేనందువల్ల చంద్రుడు కనిపించలేదు. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) గారికి అది కనిపించింది. ఆపై ఆయన ప్రవక్త (స) సన్నిధికి వచ్చి, 'నేను చంద్రుణ్ణి చూశాను”

70 ఆత్మ ప్రక్షాళనం రోజా అని సాక్ష్యం పలికారు. పిదప ఆయన (స) రమజాన్‌ ఉపవాసాల విషయమై తన నిర్ణయం ప్రకటించారు.

విషయంలో సర్వసాధారణమైన, సంపూర్ణ ఆమోదం ఏమంటే, రమజాన్‌ నెలవంక విషయమై ఒక వ్యక్తి సాక్ష్యం అంగీకరించబడుతుందన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొంతమంది ధర్మవేత్తల అభిప్రాయంలో రమజాన్‌ చంద్రోదయ విషయమై ఒకే వ్యక్తి సాక్ష్యం కూడా అంగీకరించబడుతుంది - అయితే అది ఆకాశం నిర్మలంగా లేనప్పుడు మాత్రమే. ఒకవేళ ఆకాశం నిర్మలంగా వుంటే అట్టి పరిస్థితిలో ఒక వ్యక్తి సాక్ష్యం సమ్మతం కాదు. పరిస్థితిలో చంద్రోదయ విషయమై అనేకమంది సాక్ష్యం అవసరమవుతుంది. ఇమామ్‌ మాలిక్‌ ఇంకా కొందరు ధర్మవేత్తల పంథా ప్రకారం కనీసం నమ్మకస్తులైన ఇద్దరు వ్యక్తుల సాక్ష్యం అత్యంతావశ్యకం. అయితే ప్రస్తుత హదీసు వీరి పంథాకు వ్యతిరేకంగా ఉంది. కొన్ని ఇతర హదీసుల ద్వారా వారి పంథాకు పటిష్టత చేకూరుతుంది. అయితే వారి ద్వారా కూడా ఒక వ్యక్తి ఇచ్చే సాక్ష్యం విషయమై ఎలాంటి ఆదేశమూ పరిగణనలోకి తీసుకోబడదు.

దైవప్రవక్త (స) షాబాన్‌ నెల తేదీలను తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేసేవారు జమిలి అకక సమద yo SEM IARI ఆధర్‌ రాక పవత రడ 24. హజ్రత్‌ ఆయిషా (రజి. అన్‌హా) కథనం : దైవప్రవక్త (స) ఇతర నెలలకన్నా షాబాన్‌ నెలను చాలా ఎక్కువగా కనిపెట్టుకుని ఉండేవారు. (అంటే వాటి తేదీలను తెలుసుకుంటూ వుండేవారు). ఆపై రమజాన్‌ నెలవంకను చూసి రోజాలు ఉండేవారు. ఒకవేళ ఆకాశం నిర్మలంగాలేని కారణంగా చంద్రుడు కన్సించకపోతే షాబాన్‌ నెల 80 రోజులు పూర్తిచేసి రోజాలు మొదలు పెట్టేవారు. (అబూదావూద్‌)

ఆత్మ ప్రక్షాళనం రోజా 71

ఇంతకు ముందు వచ్చిన హదీసులో షాబాన్‌ నెల చంద్రుణ్ణి చూసే ఏర్పాటు చేయండి అన్న ప్రవక్త (స) గారి హదీసు వచ్చింది. ఇక్కడ హజత్‌ ఆయిషా (రజి. అన్‌హా) గారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (స) ఇతర నెలల చంద్రోదయం పైన అంతగా (శ్రద్ధ చూపేవారు కారు, కాని షాబాన్‌ నెల చంద్రోదయంపై ఎంతో శ్రద్ధ చూపేవారు. వాటి తేదీలను సరిగ్గా లెక్కించాలని సెలవిచ్చేవారు. ఒకవేళ ఆకాశం నిర్మలంగా లేనందువల్ల షాబాన్‌ నెల చంద్రుడు రజబ్‌ 29వ తేదీనాడు కన్పించకపోతే నెల పొడవునా దాన్ని గురించి పరిశోధించాలి - రోజు చంద్రోదయం అవుతుందా లేదా అన్న విషయం గురించి. విధంగా ప్రవక్త (స) కాలంలో షాబాన్‌ తేదీలను చాలా జాగ్రత్తగా గమనించేవారు - రోజు షాబాన్‌ 29వ తేదీయా లేక 30వ తేదీయా అనే విషయాన్ని.

ఒక నెల గడువు రెండవ నెల చంద్రుడు కన్పించే వరకు ఉంటుంది

Iga] Sys AIG BGs Ga PHOS! Sat SIGE SIS IW OA as IG రంత మట బద టమ? 96 కర ఖై seth es oy లీరూండల పత ప్రస రాడా ౮! యత్ర లి: మటు! పంతు! 925 శర త్రిక టవ మన (మచం 25. హజత్‌ అబుల్‌ బఖ్రరీ (రహ్మ) ఇలా అన్నారు: మేము ఉమ కొరకు

|

ఆత్మ (ప్రక్షాళనం రోజా మా పట్టణం నుండి బయలుదేరాము. (మార్గంలో) మేము 'బతనె నఖ్‌లా* అనేచోట ఆగి, నెలవంకను చూసే ప్రయత్నం చేశాము. సందర్భంగా కొంతమంది “ఇది మూడవ రాత్రి చంద్రుడు” అని అన్నారు, మరికొందరి దృష్టిలో అది రెండవ రాత్రి చంద్రునిలా పేర్కొనటం జరిగింది. ఆపై మేము (మక్కాకు చేరుకొని) హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (రజి)ను కలిశాము. వారితో 'మేము చంద్రుణ్ణి చూశాం. కాని మాలో కొంతమంది అది మూడవ రాత్రి చంద్రుడని అంటే, మరికొందరు అది రెండవ రాత్రి చంద్రుడని అన్నారు” అని అన్నాము. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 'మీరు రాత్రి చంద్రుణ్ణి చూశారు” అని అడిగారు. మేము ఫలానా రాత్రిన నెలవంకను చూశామని అన్నాము. దానిపై హజత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (రజి) “దైవప్రవక్త (స) నెల రోజుల గడువు, మరుసటి నెల చంద్రోదయం వరకు ఉంటుందని నిర్ణయించారు. కాబట్టి మీరు చూసిన చంద్రుడు రాత్రిన కన్పించినదే” అని అన్నారు. హజ్రత్‌ అబుల్‌ బఖ్బరీ (రహ్మ) గారి మరో ఉల్లేఖనం ఇలా ఉంది : “మేము రమజాన్‌ చంద్రుణ్ణి చూశాము. అప్పుడు మేము 'జాతె ఇర్థ్‌44 అనే చోట వున్నాం. ఆపై మాలోని ఒక వ్యక్తిని హజత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (రజి) వద్దకు పంపి (ప్రస్తావిత అంశంలోని భేదాభిప్రాయంపై) అడిగాము. దానిపై హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) దైవప్రవక్త (స) గారు సెలవిచ్చిన దాన్ని ఇలా ఉల్లేఖించారు : అల్లాహ్‌ నెలల గడువును మరుసటి నెల చంద్రోదయం వరకు నిర్ణయించాడు. ఒకవేళ ఆకాశం మబ్బులతో నిండివుండి చంద్రుడు కన్పించకపోతే, ఇక (రెండు నెలల్లోనూ) 30 రోజులు పూరించండి.

హజ్రత్‌ అబుల్‌ బఖ్లరీ (రహ్మ) ఒక తాబయి (ప్రవక్త -స- సహచరుల

కాలానికి చెందినవారు). ఆయన (రహ్మ) వినిపించిన సంఘటన ప్రవక్త (స)

తరువాతి కాలానిది.

ఒకవేళ ఆకాశం మబ్బుగా ఉండి చంద్రోదయం గురించి ఒక నిర్ధారణకు

రాలేకపోతే, మరునాడో లేక తరువాతి రోజో నెలవంక దర్శనంపై, నేడు కన్పిస్తున్న

A

మక్కా మరియు తాయిఫ్‌ల మధ్యనున్న ఒక (ప్రాంతం.

AA - బతనె నఖ్‌లా'కు దగ్గరగా వున్న ఒక ప్రదేశం.

ఆత్మ ప్రక్షాళనం రోజా 73 చంద్రుడు రెండవ రాత్రిదని, లేక మూడవ రాత్రిదని జనుల్లో తర్జనభర్జనలు మొదలవుతాయి. దీనివలన మనసుల్లో రకరకాల అనుమానాలు జనిస్తాయి. అందువలన హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (రజి) దీన్ని ఆపటానికే విషయాన్ని వివరించాల్సి వచ్చింది : దైవప్రవక్త (స) నెల గడువును చంద్రోదయం వరకు నిర్ణయించారు. మరో ఉల్లేఖనంలో, “అల్లాహ్‌ నెల గడువు కాలాన్ని చంద్రోదయం వరకు నిర్ణయించాడు” అని వుంది. అంటే ఒక నెల రెండవ నెల చంద్రుణ్ణి చూసిన తరువాత పూర్తవుతుంది. ఒకవేళ 29వ తేదీ చంద్రుడు కన్పించకపోతే, నెల 30 రోజులతో పూర్తి చేయాలి. కేవలం చంద్రుడి పరిమాణం అంటే సన్నగా లేక లావుగా వుందన్న అంశం ఆధారంగా తేదీని నిర్ణయించకూడదు. ఇలా చేయటం ఎన్నో అనుమానాలకు తావునిస్తుంది. కేవలం చంద్రోదయంపై మీరు నిర్ణయం తీసుకోవాలి, అంతేగాని ఊహలు, అంచనాలపై నిర్ణయం తీసుకోరాదు. అనవసరంగా కోరి కష్టాల్లో కూరుకుపోరాదు.

74 ఆత్మ ప్రక్షాళనం రోజా

అధ్యాయం

సహరీ చేయటంలో శుభం

కుయతత లీల రం. లా ప; త్ర తత, భయమ మయ 26. హజ్రత్‌ అనస్‌(రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు, సహరీ చేయండి, సహరీ తినటంలో శుభం ఉంది. (ముత్తఫకున్‌ అలైహ్‌)

ఇస్లాంలో నిర్ధారితమైవున్న ఆరాధనలకు, ప్రపంచ ఇతర మతాలలోని ఆరాధనలకు మధ్య ఒక సూత్రప్రాయమైన భేదముంది. భేదం వల్లనే వాటి ప్రయోజనాల్లో కూడా తేడా ఉంది.

మౌలిక తేడా ఏమంటే ఇతర మతధర్మాల్లో దాగివున్న భావన ప్రకారం మనిషి తన శరీరాన్ని బాధల్లో పడవేయడం ద్వారా ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించగలడనీ, తద్వారానే అతను దైవానికి మరీ దగ్గరవుతాడని తలపోయటం జరిగింది. ఉదాహరణకు వారి దృష్టిలో ఆకలితో అలమటించి చావటం దేవునికి ప్రీతికరం, ఇదే మనిషిని దైవానికి చేరువ చేస్తుంది. ఇలాంటి భావనతోనే వారు అనేక ఇతర పనులు చేస్తారు. ఉదాహరణకు ఎవరో ఒకరు ఒక బావిలో తనకు తాను తలక్రిందుగా వ్రేలాడుతుంటాడు. మరొకడు దేశ దిమ్మరిగా తిరుగుతూ తన జీవనాన్ని కొనసాగిస్తాడు. రకరకాల జంతువులు అతన్ని కాటువేస్తుంటాయి. ఇంకా ఇలాంటివే ఇతర అనేక బాధల్లో మునిగిపోవటం వల్లనే దైవప్రీతిని పొందే ఉద్దేశంతో తమకు తాము కష్టాలపాల్దేసుకుంటారు. కాబట్టి వారి దృష్టిలో మనిషి తనకు తాను రకరకాల కష్టాలకు గురిచేసుకుని దేవుని ప్రేమలో, దాసునికెంత

ఆత్మ ప్రక్షాళనం రోజా 75 ప్రీతి వుందో, తన స్వయాన్ని కూడా దహించుకోవటానికి తాను సిద్ధంగా వున్నాడని, దీనిద్వారా దేవునికి నమ్మకం కలుగజేయాలని ప్రయత్నిస్తుంటాడు - కాని ఇస్లామీయ ఆరాధనా దృక్పథం ప్రకారం ఇలాంటి భావనలు పూర్తిగా అజ్ఞానంతో కూడుకున్నవి.

ఇస్లామీయ ఆరాధనల ఉద్దేశం - శిక్షణ, ఆత్మశుద్ధి

ఇస్లామీయ ఆరాధనలు వాస్తవానికి మనిషి శిక్షణకు నిర్ణయించబడ్డాయి. శిక్షణే మనిషిని దైవానికి చేరువచేస్తుంది. ఉదాహరణకు రోజా. రోజా అసలు ఉద్దేశం అల్లాహ్‌ కొరకు మనిషిని ఆకలితో అలమటించేలా చేయటం కాదు. ఇంకా బాధవలన (అల్లాహ్‌ క్షమించుగాక!) అల్లాహ్‌కు ఎలాంటి సంతోషం కలుగదు. మీరు రోజా వుండి అల్లాహ్‌ ఆదేశాల్లో ఒక దాన్ని పాలించి, ఆయన పట్ల విధేయతను ప్రకటించారన్నమాట. ఒక ప్రత్యేక సమయం వరకు మీరు తినవచ్చు, త్రాగవచ్చు. ఆపైన మీరు ఆయన ఆదేశించనంత వరకు ప్రత్యేక సమయం వరకు తినలేరు, త్రాగలేరు. విధంగా మీరు ఒక సమయం వరకు తిన్నారు, త్రాగారు, ఆపై ఆగిపోయారు. దీనర్ధం మీరు అల్లాహ్‌ ఆదేశాలకు కట్టుబడి వున్నారు, మీరు అవిధేయులు కారు. సమయం వరకు తినవద్దని మీకు ఆయన ఆదేశించాడో అంతవరకు మీరు తినరు, అంటే మీకు ఆకలి ఎంతగా బాధించి మిమ్మల్ని నిస్సత్తులుగా జేసినా. విధంగా ఒక ప్రత్యేక సమయం వరకు మీరు తినటం, త్రాగటం మానేశారంటే దానర్థం మీరు ఆయనకు విధేయులయ్యారు. మీ విధేయతే అల్లాహ్‌కు నచ్చింది. విధేయత పేరే ఆరాధన. అంతేగాని, మీకు కష్టం కలిగించటం అల్లాహ్‌ ఉద్దేశం కాదు. అల్లాహ్‌ మీకు తినటానికి, త్రాగటానికి అనుమతినిచ్చినప్పుడు మీరు ఒక్కసారిగా స్వతంటత్రులై ఇక మాకు తినటం, త్రాగటం అవసరం లేదు, మాకు అల్లాహ్‌ సాన్నిధ్యం కావాలి, అంటే అల్లాహ్‌కు పోటీగా నిలబడి ఇక మాలో ఎంత సామర్థ్యం వుందో (అల్లాహ్‌ క్షమించుగాక!) అని అనే ఆలోచన మీ ఊహకు కూడా అందదు-ఇక చూస్తాం మాపై మాకు ఎంత పట్టుందో అన్న చందంగా. ఇలాంటి వారిని అల్లాహ్‌ క్రైస్తవ సన్యాసులను శిక్షించిన విధంగా శిక్షిస్తాడు. ఇస్లాంలో ఆరాధనల ఉద్దేశం పూర్తిగా భిన్నం

ఇక్కడ మీకు ఇవ్వబడిన అనుమతి ద్వారా మీరు దాని ప్రయోజనం పొందాలి. దేవుడు ఇచ్చిన అనుమతుల ద్వారా మీరు లాభపడితేనే ఆయన సంతోషిస్తాడు. ఆయన నిర్ణయించిన హద్దుల్ని మీరు అతిక్రమించినప్పుడే మీ పట్ల ఆయన అప్రసన్నుడవుతాడు. ఆయన వారించిన చోట మీరు ఆయన ఆదేశాలను అతిక్రమిస్తే

76 ఆత్మ ప్రక్షాళనం రోజా అదే అతనికి కోపకారణమవుతుంది. అంతేకాని, ఆయన అనుమతించినప్పుడు మీరు సుష్టుగా మంచి భోజనం చేసినప్పుడు కాదు. మంచి భోజనం కూడా అల్లాహ్‌ ప్రసాదితమే కదా! అది కూడా మీ కోసమే సృజించబడింది. మీరు ఆయన వరప్రసాదాల పట్ల సంతుష్టులైతే, మీ పట్ల పరలోకంలో అది ఆయన అయిష్టతకు కారణం ఎలా అవుతుంది? కాబట్టి ఆయన ఆదేశించినప్పుడు ఆకలితో గడపాలి, ఆయన అనుమతించినప్పుడు తినాలి. ఇలాంటి ఉద్దేశంతోనే మన ఉపవాసాలకు, ఇతర ధర్మాల్లోని ఉపవాసాలకు మధ్య తేడా ఏర్పడుతుంది. భేదం ఆదిలోనూ, అంతంలోనూ రెండు చోట్లా స్పష్టంగా కన్పిస్తుంది.

గ్రంథవహుల రోజులలో సహరీ చేయాలని లేదు. వారి ఉపవాసం సూర్యాస్తమయం తరువాత మొదలవుతుంది. వారు రాత్రి పూటనే తినటం, త్రాగటం పూర్తిచేసుకుంటారు. వారి ఉపవాసం రెండవ రోజు సూర్యాస్తమయం వరకు కొనసాగేది. కాని వారిలో అత్యధిక ధర్మనిష్టగల వారు రెండవ రోజు ఉపవాస విరమణ చేసిన వెంటనే మరుసటి రోజాను మొదలెట్టేవారు. వారిలో మరో దైవభక్తుడు ఒక్క బటానీ గింజతో ఉపవాసాన్ని విరమించి రెండవరోజు ఉపవాసాన్ని ప్రారంభించేవాడు. ఇంకా వారిలో మరికొంతమంది సంపూర్ణ సిద్ధహస్తులు రెండవ రోజు ఉపవాసాన్ని కూడా విరమించక మరుసటి రోజు ఉపవాసాన్ని మొదలెట్టేవారు. విధంగా నిరంతరం మూడేసి, నాలుగేసి రోజాలుండేవారు. అంటే ఎవరు ఎంత గొప్ప వైరాగ్యులో వారు తమ తమ ధర్మనిష్టతో తమ సంపూర్ణ సిద్ధహస్తతతను వ్యక్తం చేయటానికి చాలా నిడివైన రోజాను పాటించేవారు.

సహరీ భుజించటంలో గల శుభం?

హదీసులో ప్రవక్త (స) “సహరీ భుజించటంలో శుభముంది” అని సెలవిచ్చారు. సహరీ భుజించటం వలన అల్లాహ్‌ ఆదేశపాలనలో మీకు సౌలభ్యముం టుంది. ఆయన ఆదేశం ఏమంటే, ఫజ్ర్‌ (ఉదయం) నుండి రోజా మొదలై సూర్యాస్తమయంతో పూర్తవుతుంది. ఇక రోజా మొదలవక ముందు అల్లాహ్‌ ఇచ్చిన అనుమతితో ప్రయోజనం పొంది తినటం, త్రాగటం చేయాలి. ఇలా తిని, త్రాగిందే మీకు రోజంతా పనికివస్తుంది. మీరు ఒకవేళ అలా చేయకుంటే మీలో తప్పక దుర్చలత ఏర్పడుతుంది. నెలంతా రోజాలుండాలని అల్లాహ్‌ ఆదేశముంది గనుక, వ్యక్తయినా తన శక్తి, స్థయిర్యాల ప్రకారం గడువు పూర్తవక ముందే శక్తిహీనుడై అల్లాహ్‌ ఆదేశాన్ని పాలించే స్థితిలో వుండకపోవచ్చు. కారణంగానే దైవ ప్రవక్త

ఆత్మ (ప్రక్షాళనం రోజా 77 (స) సహరీ భుజించాలని తాకీదు చేశారు. మీకు అనుమతించిన వేళ తిని త్రాగటం వలన, మీకు అనుమతించని సమయంలో దైవాజ్ఞాపాలనలో మీకు శక్తి లభిస్తుంది.

గ్రంథవహులు - ముస్లింల ఉపవాసాలలో భేదం

లప 49GAU ఆలియా! srs 0s 6 gull హక యతో సు! Me దుక Cy 27. హజ్రత్‌ అమ్‌ బిన్‌ ఆస్‌, దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారని పేర్కొన్నారు: “మనకు మరియు [గ్రంథవహుల రోజాలకు మధ్య తేడా వుంది. అదే సహరీ భుజించటం.” (ముస్లిం) గ్రంథవహుల రోజాలో సహరీ లేదు. కాగా, మన రోజా సహరీతో మొదలవుతుంది. ఇదే విషయం వారికి, మనకు మధ్య తేడాగా వుంటుంది. వారి ఉద్దేశం ప్రకారం రోజా అంటే స్వయంగా బాధకు లోనుచేసుకోవటం. కాని మన ఉద్దేశంలో రోజా దైవాజ్ఞాపాలనకు అలవాటు పడే ప్రక్రియ. మనం విధేయతను పాటిస్తూ దైవసామీప్యాన్ని అభిలషిస్తాము. కాని వారు దైవ సామీష్యం కొరకు దేవుడు ఆదేశించని పద్ధతుల ద్వారా తమను కష్టాలకు లోనుజేసుకుంటారు.

ఇఫ్తార్‌ తొందరగా చేయటంలో మేలు ఉంది

sib Jeghidse LUGE ers నం గూ ERE SENS, Hs

వక

(క్త Gi

28. హజ్రత్‌ సహ్‌ల్‌ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) సెలవిచ్చారు: ప్రజలు ఇఫ్టార్‌ చేయటంలో తొందరపడే వరకు క్షేమంగా ఉంటారు.

(ముత్తఫకున్‌ అలైహ్‌)

యూదులు ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్న వేళ ఇఫ్టార్‌ చేస్తారు. ఇందులో

కూడా ఎవరు ఇంకా ఆలస్యంగా ఉపవాసాన్ని విరమిస్తాడో అతను మరింత

నిష్టాగరిష్టుడుగా, సంపూర్ణ సిద్ధి గల వానిగా ఎంచబడేవాడు. ప్రవర్తన వారి

దృష్టిలో “ఈ వ్యక్తి తినటానికి తొందరపడేవాడు కాడని, తన మనసుపై పూర్తి అధీనత

78 ఆత ప్రక్షాళనం రోజా గలవాడని, ఇంకా రోజా విరమణ సమయం దాటిపోయినా రోజా విరమించలేదిని గొప్పగా భావించబడేవాడు. ఇస్లాంలో ఇలాంటి బాహ్యపరమైన నిష్టకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఇస్లాం ఉద్దేశంలో అల్లాహ్‌ నిర్దేశించిన సమయం వరకు - ఎవరో తనను కట్టిపడేశారా అన్నట్లు - రోజా విరమణకు ఆగవలసిందే. అల్లాహ్‌ ఆదేశం, అనుమతి అయిన వెంటనే రోజా విరమణకై ఏర్పాటైన పదార్థాల వైపు పరుగెత్తండి. ఆపై వాటి ప్రయోజనాన్ని పొందటానికి తొందరపడండి. ఇలాంటి ఆచరణ అల్లాహ్‌కు మిక్కిలి ప్రీతికరమైనది. ఎందుకంటే దాసుడు ఆయన ఆజ్ఞానుసారం ఇప్పటి వరకు వేచి వున్నాడు. ఒకవేళ అల్లాహ్‌ ఆదేశం ప్రకారం ఆగాల్సిన అవసరం లేకుంటే వేచి వుండేవాడే కాదు. అల్లాహ్‌ అతన్ని కట్టిపడేశాడు కాబట్టే తన మనోవాంఛల్ని, ఆకలిదప్పుల్ని భరించాడు. ఇంకా ప్రతిదానిపై అదుపు సాధించగలిగాడు. ఆపై కట్టుబాటు సడలించిన వెంటనే పూర్తి స్వేచ్చ, స్వాతంత్రాలతో తినటం, త్రాగటం మొదలెట్టాడు, ఇతర అవసరాలూ తీర్చుకున్నాడు. ఇలా చేయటం వల్లనే అల్లాహ్‌ ఇష్టపడతాడు. అందుకనే దైవప్రవక్త (స) సెలవిచ్చారు : “ప్రజలు ఇఫ్లార్‌ చేయటంలో తొందర పడేంతవరకు క్షేమంగా వుంటారు”. ఒకవేళ ఇఫ్లార్‌ చేయటంలో ఆలస్యం చేసినట్లయితే, గ్రంథవహులు చిక్కుకున్న రోగంలోనే వారూ కూరుకుపోతారు.

ఇస్లాం చెడును ఆరంభంలోనే నిరోధిస్తుంది

ఖుర్‌ఆన్‌, హదీసులను పరిశోధనా దృష్టితో అధ్యయనం చేసినవారికి విషయంలో ఇస్లాం దృక్పథం ఏమిటో అర్థమవుతుంది. ఒకవేళ ఏదైనా ప్రమాదకర మయిన వస్తువు బహుదూరాన పొంచివుందని తెలిసినప్పుడు ఒక విశ్వాసి అది సమీపానికి వచ్చినప్పుడు దాన్ని అడ్డుకోవచ్చులే అన్న ధీమాను వ్యక్తం చేయరాదు. దీనికి ప్రతిగా ఇస్లాం ప్రమాదం ఎక్కడ్నుంచైతే ఆరంభమయిందో అక్కడే దాన్ని నిలువరిస్తుంది. అది ఒక్క అడుగు కూడా ముందుకేయటానికి ఇష్టపడదు ఇస్లాం. ఇక సన్యాసత్వాన్నయితే ఇస్లాం గట్టిగా వ్యతిరేకిస్తుంది. రోజా విషయంలో రోగం ఎలా దాపురిస్తుందంటే, రోజా విరమణ సమయం అయిపోయింది, అయితే మీరు మరికాస్త ఆలస్యం చేసి దానిద్వారా మీ శరీరాన్ని మరింత శుష్మింపజేసి దాన్ని కష్టపెడితే దేవుడు అంతగానే మీ పట్ల సంతోషపడతాడని తలపోస్తారు. అందువల్లనే విషయంలో హెచ్చరించటం జరిగింది - ఇలా చేస్తే మీరు మేలుకు

ఆత్మ ప్రక్షాళనం రోజా 79 దూరమవుతారు. అల్లాహ్‌ ప్రీతిని పొందే బదులు అది ఆయన ఆగ్రహానికి కారణమవుతుంది. అల్లాహ్‌ ప్రీతి అయితే ఆయన ఆదేశపాలనలో విధేయత చూపటంలో, ఆయన విధించిన నిబంధనల పట్ల సమ్మతి తెలుపుతూ ఆయన అనుమతించిన వాటి ద్వారా లాభం పొందటంలోనే వుంది. ఆయన హలాల్‌ చేసిన వాటిపట్ల మీరు పూర్తిగా సంతృప్తిచెందాలి. ఇంకా ఆయన హరామ్‌ చేసిన వాటి నుంచి దూరంగా వుండాలి. మీ తరఫు నుంచి ఆయన ఆదేశాల పాలనలో ఎలాంటి లోపం రానీయకూడదు. విధేయత అంటే ఇదే, దీనివలన అల్లాహ్‌ మీరంటే ఇష్టపడతాడు. అందుకనే దైవప్రవక్త (స) సెలవిచ్చారు : “ప్రజలు ఇఫ్లార్‌ చేయటంలో తొందరపడే వరకు క్షేమంగా ఉంటారు. ఎందుకంటే అల్లాహ్‌ నిర్ణయించిన ఇఫ్లార్‌ వేళన ఇఫ్తార్‌ చేయటం ఆయనకు ప్రీతికరం, ఇందులోనే మీ మేలు ఉంది.”

రోజా విరమణకు సరియైన సమయం

అబు రేవు 2 70696 తకగ4

MD TT Eos rs,

of 52513 Wa EE 5 Sets 22 క్ల పయ! యమమ 2 DICT EGU

29. హజ్రత్‌ ఉమర్‌ (రజి) గారి ఉల్లేఖనం - దైవప్రవక్త (స) సెలవిచ్చారు : రాత్రి వైపు నుంచి రావటం మొదలై పగలు వైపు నుంచి తిరగటం మొదలై, ఆపై సూర్యుడు అస్తమించినప్పుడు ఉపవాసి రోజా విరమణకు సమయం అవుతుంది.” (ముత్తఫకున్‌ అలైహ్‌) అంటే తూర్పు దిశ నుంచి రాత్రి చీకట్లు క్రమ్ముకోవటం మొదలై, రెండవ వైపు

పశ్చిమ దిశ నుంచి సూర్యాస్తమయమయిందన్న సమాచారం వస్తుంది. మీరు చూస్తూ

వుండగానే పగలు సమాప్తమయినప్పుడు అదే రోజా విరమణ సమయానికి సంకేతం. అప్పుడు వెంటనే మీరు ఉపవాస విరమణ చేయాలి.

ఒకవేళ రోజా విరమణ సమయం అయినప్పుడు, దానిపై మీరు రోజా విరమించాలా? వద్దా? అని ఆలోచిస్తే అది పొరపాటు. ఇది పూర్తిగా షరీఅత్‌ ఊపిరికి వ్యతిరేకం. ఇస్తార్‌ సమయం కాగానే వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రోజా విరమించాలి.

80 ఆత్మ ప్రక్షాళనం రోజా ఎడతెగకుండా రోజా ఉండటం ధర్మసమ్మతం కాదు

జుం 2706 రత వా 3 షల్‌ ఛం తీశా బీ ఏట త్రయ తయ ఊట reo (మత రస్తు 80. హజత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖించారు : దైవప్రవక్త (స) ఎడతెగకుండా రోజా వుండటాన్ని వారించారు. దీనిపై ఒక వ్యక్తి “ఓ దైవప్రవక్తా! మీరు కూడా ఎడతెగని రోజాలుంటారు కదా!” అని విన్నవించుకున్నాడు. తదుపరి ప్రవక్త (స) సెలవిచ్చారు : మీలో ఎవరు నాతో సమానమవుతారు? నేనైతే రాత్రివేళను ఎలా గడుపుతానంటే, రాత్రివేళ నా ప్రభువు నాకు తిన్పిస్తాడు, త్రాపిస్తాడు.” (ముత్తఫకున్‌ అలైహ్‌) హదీసులో ఒక ముఖ్యమయిన అంశాన్ని తెలుపటం జరిగింది. గ్రంథవహుల్లో రోజాలుండే వివిధ పద్ధతుల్లో ఎడతెగని రోజాలుండటం కూడా పద్ధతి. ఇందులో కూడా అనేక రకాలున్నాయి. ఒక పద్ధతి ఏమంటే, ఒక వ్యక్తి విధి(ఫర్డ్‌)గా వుండే రోజాలే కాకుండా నఫిల్‌ రోజాలను కూడా ఎలాంటి విరామం లేకుండా ఎడతెగకుండా, నెలల తరబడి రెండేసి నెలలు రోజాలు పాటిస్తాడు. (గ్రంథవహుల్లో కొంతమంది ఇలా కూడా చేస్తారు, మరికొందరు కావాలని కూడా (సౌమె విసాల్‌) ఎడతెగని రోజాలుండేవారు. అల్లాహ్‌ చేత విధిగావించబడిన రోజాలే గాకుండా, మిగతా రోజుల్లో కూడా వారు ఉపవాసిగానే వుండేవారు. సౌమెవిసాల్‌ రెండో పద్ధతి ఏమంటే ఒక వ్యక్తి ఒక సహరీ తిని రెండవ సహరీ వరకు ఎడతెగని రోజా పాటిస్తాడు, మధ్యలో ఇఫ్లార్‌ చేయడు. కొన్ని సమయాల్లో రెండేసి, మూడేసి రోజులు ఉపవాసం వుంటాడు. గ్రంథవహుల్లో రెండు నవీన పోకడలు అమల్లో ఉండేవి. ఇస్లాం అనుయాయులకు దైవప్రవక్త (స) విసాలె సౌమ్‌ రోజాలను వారించారు. ఎందుకంటే ఇది గ్రంథవహుల పద్ధతి. అయితే ప్రవక్త (స) కూడా సౌమె విసాల్‌ను పాటిస్తారనే విషయం హదీసు ద్వారా తెలిసింది. దాని ఉద్దేశ్యం ఏమై వుంటుంది? దాని అర్ధం ఆయన (స) ఒక సహరీ నుంచి మరో సహరీ వరకు

ఆత్మ ప్రక్షాళనం రోజా 81 రోజా వుండేవారు. లేక ఎక్కువ కాలం వరకు ఎడతెగకుండా రోజాలు పాటించేవారు. నిరూపిత బలమైన ఆధారం ఏమిటంటే ప్రవక్త (స) ఒక సహరీ నుంచి మరో సహరీ వరకు రోజా పాటించేవారు కాదు, పైగా ఎడతెగని నఫిల్‌ రోజాలను పాటించేవారు. అయితే కొన్నిసార్లు చాలా కాలం వరకు ఎలాంటి రోజాలే పాటించేవారు కాదు.

సౌమె విసాలొ పాటించటం దైవప్రవక్త (స) గారి ప్రత్యేకత. దీన్ని ఇతర ముస్లింలు అనుకరించటం సమ్మతం కాదు. స్వయంగా ప్రవక్త (స) “మీలో నా వంటివారు ఎవరు?” అని ప్రశ్నించారు.

రోజా పాటించటానికి సంకల్పం తప్పనిసరి

hfs] Lai వం,

రూ ou FY Se Ur: md WIC mee CP: As

(పడు పవత పం. బల్లల 31. హజత్‌ హఫ్‌సా (రజి.అన్‌హా) గారి ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు : ఫజ్ర్‌ (ఉషోదయానికి పూర్వం) కంటే ముందు రోజా వుండేందుకు సంకల్పం చేసుకోకపోతే అది రోజాగా పరిగణించబడదు. (తిర్మిజీ, అబూదావూద్‌, నసాయి, దారిమీ)

ఉల్లేఖనం ఉద్దేశం ఏమంటే, మీరు ఏదైనా ఆరాధన ఆరంభించారంటే అప్పుడు మీరు ఆరాధనను అల్లాహ్‌ కొరకు చేస్తున్నానని సంకల్పం చేసుకోవాలి. విధంగా ఎందుకు సెలవియ్యబడిందంటే మనిషి తింటూ త్రాగుతున్నప్పుడు ఆకలితో వుంటే లెక్కలోకి రాదు. అయితే ఆకలికి, ఉపవాసాలకు మధ్య తేడా కలిగించేది మీరు రోజా పాటిస్తున్న సమయంలో చేసుకున్న “సంకల్పం” మాత్రమే. అదే రెంటినీ వేరుచేస్తుంది. సమయంలో అల్లాహ్‌ ఆరాధన పేరుతో రోజా సంకల్పం చేసుకొని తినటం, త్రాగటం మానేస్తారు. ఒకవేళ సంకల్పం మీరు చేయకపోతే బాహ్యపరంగా రోజాకు, ఆకలితో ఉండటానికి మధ్య ఏమాత్రం తేడా లేదు.

రోజా (ఫజ్ర్‌) ఉషోదయపు వేళతో ప్రారంభమవుతుంది. అందుకని దైవప్రవక్త (స) సెలవిచ్చారు : “అల్లాహ్‌ కొరకు రోజు ఉపవాసం వుండాలని నిశ్చయించుకున్నా

82 ఆత్మ (ప్రక్షాళనం రోజా నని సంకల్పం చేసుకోండి. అలా చేసుకోకపోతే దాని అర్ధం మీరు పస్తులకు, రోజాలకు మధ్య ఏమాత్రం భేదం కనబరచలేదు.”

అయినప్పటికినీ దీనర్ధం అది కాదు - ఒక మనిషి ఉషోదయానికి ముందు రోజా సంకల్పం చేసుకోవటం మరచిపోయాడు, అంతమాత్రాన అతని రోజాయే భంగమైపోయినట్లు కాదు. దాని అసలు ఉద్దేశ్యమేమంటే మీరు రోజా వుంటున్నవేళ సంకల్పం చేసుకోవటం మరచిపోతే, తరువాత గుర్తుకు వచ్చినప్పుడు వెంటనే సంకల్పం చేసుకోవాలి. మీ సంకల్పం రోజాతో ముడిపడివుందని భావించుకోండి. మీరు సహరీ కొరకు లేచారంటే దాని అర్థం రోజా వుండాలనే సంకల్పం, ఉద్దేశంతోనే కదా. అందుకని రోజా సందర్భంలో మీ నోటి ద్వారా నేను రోజు అల్లాహ్‌ కొరకు రోజా వున్నానన్న సంకల్పపు పదాలు వెలువడకున్నా రోజా వృధా పోదు. అయితే షరీఅత్‌లో అసలు ప్రాముఖ్యం సంకల్పానికి ఇవ్వటం జరిగింది. మన ఆచరణల ప్రతిఫలం కూడా మన సంకల్పంపైనే ఆధారపడి వుంది కదా! అందుకని షరీఅత్‌ దృష్టిలో ఒక ఆచరణ మరో ఆచరణతో ఘనతను ప్రసాదించేది మనిషి యొక్క సంకల్పమే. కారణంగానే సెలవియ్యబడింది : మనిషి ఉషోదయానికి పూర్వమే నేను రోజు ఉపవాస దీక్షకు సంకల్పం చేసుకుంటున్నానని అనాలి. లేకపోతే బాహ్యపరంగా చూస్తే రోజాకు, పస్తులకు తేడా కన్పించదు.

సహరీ సమయంలో ఒకింత సడలింపు ఉంది

చమ తత కంరం పడరు నం లూ. న? (S555) DOI షు

82. హజత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) విధంగా సెలవిచ్చారు : మీలో ఎవరైనా అజాన్‌ వాక్యాల శబ్దం వింటే, వేళ మీ చేతిలో ఆహార పళ్ళెరముంటే మీ అవసరం పూర్తిచేసుకోనంత వరకు దానిని మీ చేతులతో క్రింద పెట్టకండి. (అబూదావూద్‌)

దైవప్రవక్త (స) గారి కాలంలో నేటి నగారాలు లేక సైరన్‌లు మోగించబడేవి కావు అన్న విషయం మనకు విదితమవ్వాలి. అయితే అజాన్‌ పిలుపు విన్నప్పుడు

ఆత్మ ప్రక్షాళనం రోజా 83 ఇక సహరీ సమయం ముగిసిందన్న విషయం ప్రజలకు తెలిసేది. ఒక్కొక్కప్పుడు వేసవి కాలంలో జనం ఆరుబయట పడుకున్నవేళ ఇక రోజా మొదలయ్యే సమయం అయిందా లేదా అన్న విషయాన్ని ప్రతి మనిషీ తెలుసుకోగలిగేవాడు. వర్షకాలంలో, చలికాలంలోనయితే ప్రజలు ఇళ్ళల్లోనే సహరీ చేయాల్సి వచ్చేది. ఇలాంటివేళ సహరీ సమయం అయ్యిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవటానికి ప్రజలంతా బయటికి రావలసిన అవసరం లేదు. అందుకనే సెలవియ్యబడింది : సహరీ వేళ మీ చెవులకు అజాన్‌ శబ్దం వినబడినప్పుడు ఒక మనిషి నీరు త్రాగుతున్నప్పుడు, మరొకడు తింటున్నాడు, వేళ అల్లాహు అక్బర్‌ అన్న శబ్దం విన్నంతనే వాటిని వదలి పెట్టాల్సిన అవసరం లేదు. అలాంటి వారికి స్థితిలో తమ అవసరం మేర త్రాగటానికి, తినటానికి అనుమతి నివ్వబడింది.

ఖుర్‌ఆన్‌, హదీసుల ద్వారా సహరీ వేళ పరిసమాప్తమయ్యే వేళలను వివరంగా తెలుపటం జరిగింది. వీటి ద్వారానూ ఇంకా సాధారణంగా రుజువయ్యేదేమంటే సమయం సెకండ్ల లెక్కతో చేయబడలేదు - ఒక సెకను ఇటు మొదలవటం లేక ఒక సెకను అటు గడవగానే సహరీ వేళ ముగిసిపోయిందని లెక్క కాదు. సహరీ వేళ సమాప్తమయ్యేది వేకువ జామునే. అదే పెద్ద సహజసిద్ధమైన సంకేతం. దీనివలన మనిషి వెంటనే తన ద్రుక్కులను తూర్పు దిక్కుకు పెడతాడు. తూర్పు నుంచి ధవళ రేఖలు వ్యాపిస్తూ కన్పిస్తాయి. ప్రారంభంలో ఒక రేఖ బయలుదేరి వస్తుంది, ఇక తెల్లవారబోతుందని, రాత్రి సమాప్తమయిందని సంకేతమిస్తుంది. దీనివలన తెలిసేదేమంటే తెల్లవారటమనే ప్రక్రియ ఒక సెకను కాలంలో సంభవించేది కాదు. రాత్రి ముగింపునకు, ఉషోదయానికి కొన్ని నిముషాల తేడా తప్పక ఉంటుంది. అందువలన మనిషి అజాన్‌ శబ్దాన్ని విన్నప్పుడు దాని అర్ధం ఒక సెకనుకు ముందు సహరీ చేసే సమయం వున్నదని, ముఅజ్జిన్‌ సాహెబ్‌ నోటి నుండి “అల్లాహ్‌” అనే పలుకులు వెలువడగానే ఇక సమయం ముగిసినట్లు కాదు. వెంట్రుకలో కూడా చర్మం వొలిచే ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదు. సరిఅయిన మాట ఏమంటే, అనుకోని సందర్భంలో ఎప్పుడన్నా మీరు నిద్రిస్తున్నప్పుడు ఎకాఎకిన మెలకువ వచ్చి, అప్పుడు మీరు కొన్ని ముద్దలు మాత్రమే తిన్నారు, వెంటనే సైరన్‌ మోగింది, అంతమాత్రాన వెంటనే మీరు తినటం ఆపాలని, నోటి దగ్గరవున్న పాత్రను క్రింద పెట్టేయాలని దీనర్ధం కాదు. తొందర తొందరగా మీరు తినగలిగినంత తిని, త్రాగగలిగినంత త్రాగాలి.

84 ఆత్మ ప్రక్షాళనం రోజా

హదీసులో విషయాన్నే సెలవియ్యటం జరిగింది. మీరు అజాన్‌ విన్నప్పుడు, లేక సహరీ సమాప్తమయ్యిందని తెలిపే మరో ప్రకటన అవుతున్నప్పుడు మీ చేతిలో ఏదైనా ఆహారపదార్థం వుంటే దాన్ని క్రిందపెట్టకుండా మీ అవసరం పూర్తి చేసుకోవాలి.

అయినా, దీని అర్ధం మనిషి అనుమతి ఆధారంగా ప్రయోజనం పొందే ఉద్దేశ్యంతో తింటూనే కూర్చోవాలన్నది కూడా కాదు. తొందరగా తన అవసరాన్ని పూర్తి చేసుకోవాలన్నదే దీని ఉద్దేశం.

ఇష్తార్‌లో తొందరపడేవారు అల్లాహ్‌కు ప్రీతిపాత్రులు

33. హజత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు : అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు - నా దాసుల్లో ఇఫ్టార్‌లో తొందరపడేవారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు.” (తిర్మిజీ)

ఇఫ్తార్‌ కొరకు (శ్రేష్టమయిన వస్తువులు

BASH IAEA re PS RT DT పయ Yt 96 Sid DO హార aD SCSI Sa DAD Gab 34. హజ్రత్‌ సల్మాన్‌ బిన్‌ ఆమిర్‌ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు : మీలో ఎవరైనా ఇఫ్టార్‌ చేస్తే ఖర్జూరంతో చేయండి. ఎందుకంటే అందులో శుభం, గ్రేష్టత ఉంది. ఒకవేళ ఖర్జూరం దొరక్కపోతే అతను నీటితో ఇఫ్తార్‌ చేయాలి, ఎందుకంటే అది పవిత్రమైనది. (అహ్మద్‌, తిర్మిజీ, అబూదావూద్‌, ఇబ్నెమాజా, దారిమీ)

ఆత్మ ప్రక్షాళనం రోజా 85 Tee Te ree Ses ge hi pot SIG Toya

sds రం దందం ఖే ట్‌

ర? $5 se Lay

poe PIR PA

తిలక ఈం లక త్వర

Ct Shh hy a 2

(395913 SLA నో 35. హజత్‌ అనస్‌ (రజి) ఇలా ఉల్లేఖించారు : దైవప్రవక్త (స) అలవాటు ఏమిటంటే, మగ్‌రిబ్‌ నమాజ్‌ చేయక ముందు కొన్ని తాజా ఖర్జూరాలతో రోజాను విరమించేవారు. ఒకవేళ తాజా ఖర్జూరాలు దొరక్కపోతే ఎండిన

ఖర్జూరాలతో ఇఫ్లార్‌ చేసేవారు. ఒకవేళ అవి కూడా దొరక్కపోతే కొన్ని నీళ్లు సేవించేవారు. (తిర్మిజీ, అబూదావూద్‌)

దైవప్రవక్త (స) అలవాటు ఎలా ఉండేదంటే ఆయన ముందు రోజా విరమణ చేసేవారు, ఆపై నమాజ్‌ చేసేవారు. ఇఫ్లార్‌లో ఆయన సాధారణ నియమం ప్రకారం తాజా ఖర్జూరాలతో ఇఫ్టార్‌ చేసేవారు. తాజా ఖర్జూరాలు అంటే అప్పుడే చెట్టు నుంచి త్రెంచినవి కాదు. అంటే ఎండినవి కాక పండినవి అని అర్ధం - ఇక్కడ మనం అలాంటి ఖర్జూరాలను వాడినట్లు అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలాంటి ఖర్జూరాలు లభ్యం కాకపోతే ఎండు ఖర్జూరాలతో రోజా విరమించేవారు. ఒకవేళ అవి కూడా లభ్యం కాకపోతే ఒకట్రెండు నీటి గ్రుక్కలు త్రాగి ఇఫ్తార్‌ చేసేవారు.

ఇఫ్తార్‌ చేయించేవారికి లభించే పుణ్యం

రు UE మంటు! J ILI AE Ory SNE? Lat Bests యం రంత Ge పప A (కీ FED

36. హజత్‌ జైద్‌ బిన్‌ ఖాలిద్‌ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు : ఎవరైనా ఒక ఉపవాసికి ఇఫ్తార్‌ చేయించినా లేక ఒక యోధునికి జిహాద్‌ కొరకు సామాను సమకూర్చినా అతనికి ఉపవాసికి లభించే పుణ్యం, ఇంకా యోధునికి జిహాద్‌ చేయటం వలన లభించే పుణ్యం లభిస్తుంది. (బైహభీ, మొహియిస్సున్నహ్‌)

86 ఆత్మ (ప్రక్షాళనం రోజా

షరీఅత్‌ నిబంధన ఏమిటంటే, మేలు చేసే వారికి ఎటూ వారి ప్రతిఫలం దొరుకుతుంది, అయితే మేలు చేయటానికి మార్గాలను సుగమం చేసిన వానికి కూడా పుణ్యం లభిస్తుంది. హదీసులో “అద్దల్లు అలల్‌ ఖైరి కఫాయిలిహీ” (మేలు కొరకు మార్గదర్శకం చేసేవాడు కూడా మేలు చేసేవానితో సమానం) అని అనబడింది. మేలు చేసేవాని పుణ్యంలో నుంచి ఎలాంటి తగ్గుదల చేయకుండా, మేలు చేయటానికి మార్గం సుగమం చేసినవానికి, సౌలభ్యాలు సమకూర్చినవానికి కూడా పుణ్యం లభిస్తుంది, ఇంకా మేలు చేయడానికి సిఫారసు చేసినవానికి, సహాయం చేసిన వానికి కూడా వారి వారి పుణ్యం ప్రసాదించబడుతుంది.

ఒక ఉపవాసికి రోజా విరమణ చేయించటమనేది చూడటానికి అది ఒక మామూలు విషయంగా కన్పిస్తుంది. అయితే సెలవిచ్చినవిధంగా, అతనికి లభించే పుణ్యం మాత్రం ఎంతో విలువైనది. దానికి కారణం ఏమిటంటే మేలు కొరకు ప్రోత్సహించటం కూడా అల్లాహ్‌ దృష్టిలో ఎంతో విలువైన కార్యమే. ఎందుకంటే అది మంచి వ్యాపించటానికి సహాయకారి అవుతుంది. మానవ శ్రేయస్సుకు, మోక్షం కొరకు కావలసిన పని నెరవేరుతుంది, ధర్మం (దీన్‌) ఉద్దేశం కూడా అదే.

ఇఫ్టార్‌ వేళ చేయాల్సిన మంచి దుఆలు

PPO ము $56 006s pe gly 3 అహ దపీ ధి, 37. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) ఉల్లేఖనం : దైవప్రవక్త (స) అలవాటు ఏమిటంటే ఆయన (స) రోజా విరమణ చేసినప్పుడు ఇలా సెలవిచ్చేవారు - దాహం తీరింది, నరాలు తడిబారాయి, అల్లాహ్‌ తలిస్తే పుణ్యప్రాప్తి కూడా తథ్యమే. (అబూదావూద్‌)

రోజా విరమణ సమయంలో దైవప్రవక్త (స) గారు చేసిన అనేక దుఆ లున్నాయి. వాటిలో దుఆ కూడా ఒకటి. అంటే ప్రవక్త (స) రోజా విరమణ చేసే సమయంలో పదాలు పలికేవారు.

en రత తస gu ey gen JG! తత

|| రో సుం యడ తు లం

ఆత్మ ప్రక్షాళనం రోజా 87 88. హజ్రత్‌ ముఆజ్‌ బిన్‌ జుూహ్‌రా (రజి) ఉల్లేఖనం : దైవప్రవక్త (స) ఇఫ్టార్‌ చేసినప్పుడు ఇలా సెలవిచ్చేవారు - అల్లాహ్‌! నీ కోసమే నేను రోజా వున్నాను. ఇంకా నీవు ప్రసాదించిన ఆహారంతోనే నేను ఇఫ్టార్‌ చేశాను. (అబూదావూద్‌)

ఒక వ్యక్తి అల్లాహ్‌చే విధించబడిన ఏదైనా విధిని నిర్వర్తిస్తే పని దానంతట అదే ఎంతో విలువను సంతరించుకుంటుంది. ఆపై అతను పుణ్యఫలానికి అర్హుడవుతాడు. అయితే విధి నిర్వహణా కాలంలో అతనికి రెండు ఆచరణలు ఎదురవుతాయి. ఒకటి : విధిని అతను అజాగ్రత్తగా నిర్వర్తించటం, రెండవది: విధి నిర్వహణలో అతను ఎడతెగకుండా తన ప్రభువు పట్ల శ్రద్ధచూపుతూ ఆయన్ని స్మరిస్తూ ఉండటం. రెండు స్థితుల్లో పుణ్యం, గౌరవాల రీత్యా చాలా తేడా వుంది. ఒక వ్యక్తి ఏదైనా విధి నిర్వహణలో అల్లాహ్‌ పట్ల (శ్రద్ధ చూపిస్తే అది అతని పుణ్యాన్ని ఎన్నో రెట్లు పెంచేస్తుంది. ఉదాహరణకు మీరు నమాజ్‌ కొరకు వుజూ చేస్తున్నారు, మీరు వుజూలో పరిశుభ్రం చేయాల్సిన అవయవాలన్నింటినీ సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మీరు నమాజ్‌ చేయటానికి అర్హులయ్యారన్న మాట. ఇంకా వుజూ చేస్తున్న సమయంలోనూ మీరు అల్లాహ్‌ను స్మరిస్తూ చేసినట్లయితే దాని అర్ధం మీరు వుజూ చేస్తున్నప్పుడు కూడా అల్లాహ్‌ పట్ల అశ్రద్ధగా లేరని తెలియజేస్తోంది. అప్పుడు మీరు చేసిన వుజూకు విలువ, గౌరవం వుంటుంది.

ఇదే ఉపమానం రోజాకు కూడా వర్తిస్తుంది. మీరు సహరీ సమయం సమాప్తం నుంచి ఇష్తార్‌ వరకు ఏమీ తినకుండా, త్రాగకుండా వున్నట్లయితే మీ రోజా పూర్తవుతుంది. ఇంకా రోజా సమయంలో మీరు అల్లాహ్‌ను స్మరిస్తూ వున్నట్లయితే దాని అర్ధం మీరు రోజా విలువను, గౌరవాన్ని ఇంకా పుణ్యాన్ని పెంచుకున్నారన్న మాట. మరోవిధంగా చెప్పాలంటే రోజాలో అజాగ్రత్తగా కాలం వెళ్ళదీయటంలోను, ఇంకా సమయంలో అల్లాహ్‌ను స్మరిస్తూ వుండటంలోనూ ప్రతిఫలం రీత్యా, గౌరవం రీత్యా భూమ్యాకాశాలంత తేడా ఉంది. ఆపై రోజా ముగిసిన వెంటనే మీరు ఇఫ్లార్‌ చేయటానికి అర్హులవుతారు, ఖర్జూరంతోగాని, మరో పదార్థంతో గాని ఇష్తార్‌ చేయండి. ఇఫ్లార్‌ చేస్తున్నప్పుడు కూడా మీరు అల్లాహ్‌ను స్మరిస్తూ, అల్లాహ్‌! నేను నీ కోసమే రోజా వుంచాను, నీవు ప్రసాదించిన పదార్థాలతోనే ఇష్టార్‌ చేస్తున్నాను అని అన్నట్లయితే దీని వలన మీరు ఆకలి దప్పికల స్థితి (రోజా)లో కూడా అల్లాహ్‌ పట్ల అజాగ్రత్తగా లేరని, పైగా ఇఫ్తార్‌ చేస్తున్నప్పుడు కూడా అల్లాహ్‌ను విస్మరించలేదని తెలుస్తుంది. ఇలా మీరు రోజా పుణ్యఫలాన్ని అనేక రెట్లు పెంచేసుకున్నారన్నమాట.

88 ఆత్మ ప్రక్షాళనం రోజా

దైవప్రవక్త (స) సంప్రదాయం కూడా ఇదే. దాన్నే ఆయన (స) ప్రజలకు ప్రబోధించారు : అల్లాహ్‌ యొక్క ఒక ఆరాధనను చేస్తూ ఇతర ఆరాధనలను కూడా కలుపుకున్నట్లయితే ఆరాధన పుణ్యఫలాలు, గౌరవం, విలువలు అనేక రెట్లు పెంచబడతాయి.

ఇష్తార్‌లో అర్య చేయటం యూదులు, (క్రైస్తవుల విధానం

swede 606 వ. ర్‌ం జి! రిల eres SH SAE SAI aw! pn జ్‌

39. హజత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు : ప్రజలు ఇఫ్టార్‌ చేయటంలో తొందర పడేంతవరకు ధర్మం ఆధిక్యతలో వుంటుంది. ఎందుకంటే యూదులు, క్రైస్తవులు ఇష్తార్‌ చేయటంలో ఆలస్యం చేస్తారు.

(అబూదావూద్‌, ఇబ్నెమాజా)

దైవప్రవక్త (స) హదీసులో చిన్న మాట ద్వారా గొప్ప పరమార్థాలను వివరించారు.

రోజా విరమణలో తాత్సారం చేయటం, సహరీ భుజించకుండా ఎడతెగని

రోజాలుండటం ఇవన్నీ యూదులు, క్రైస్తవులు పాటించే పద్ధతులు. వారి విధానమే

క్రమేణా సన్యాసత్వానికి దారి తీసింది, ఇంకా వారు క్రియాత్మక జీవితం నుంచి

పరారై ఏకాంత కుహరాల్లో జీవనం కొనసాగించటానికి ప్రోద్బలం చేసింది. కాని

దేవుని ధర్మం ఉద్దేశం దీనికి పూర్తి భిన్నంగా వుంది. అల్లాహ్‌ ఉద్దేశ్యం ప్రకారం

ప్రపంచం కేవలం మానవుల కొరకే సృష్టించబడింది. దీని సుఖాలు, సౌలభ్యాలు,

ఏర్పాట్లు ఇంకా ఇతర వస్తు సామగ్రి యావత్తూ కేవలం మానవుని కొరకే వున్నాయి. అయితే మానవుని కర్తవ్యం ఏమిటంటే ప్రపంచంలోని సమస్త సామగ్రిని అల్లాహ్‌ నిర్దేశించిన హద్దులకు లోబడి ఏమాత్రం హద్దులు మీరకుండా వాటిని ఉపయోగించాలి.

విధంగా ఒక ముస్లిం కర్తవ్యం, విధి ఏమంటే షరీఅత్‌ ఇచ్చిన సౌలభ్యాలను,

ఆత్మ ప్రక్షాళనం రోజా 89 అనుమతులను సద్వినియోగం చేసుకుంటూ వాటి ప్రయోజనాల్ని పొందాలి. అయితే సౌలభ్యాల కొరకు నిర్ణయించబడిన హద్దులకు లోబడి ఉండాలి. సహరీ వేళ ముగిసిన తరువాత సూర్యాస్తమయం వరకు తినటం, త్రాగటానికి మీకు ఎలాంటి అవకాశం అనువతి లేదు. ఆపై సూర్యాస్తమయం అయిన వెంటనే మీరు తినవచ్చు, త్రాగవచ్చు. దీనివలన తేటతెల్లమయ్యే విషయమేమిటంటే ఇఫ్తార్‌ చేయటంలో యూదులు, క్రైస్తవులు చేసే తాత్సారం సన్యాసత్వానికి దారితీసే ఒక మార్గంలా ఏర్పడుతుంది, దీనికి కారణం అల్లాహ్‌ పట్ల వారు ఏర్పరచుకున్న అనుమానమే. వారి ఉద్దేశంలో దేహాన్ని ఎంతగా బాధకు లోనుచేస్తే అంతగా వారి దేవుడు వారి పట్ల సంతోషపడతాడు. కాని ఇక్కడ మీ విధేయత, ఆరాధనలనే మీ నుంచి మీ ప్రభువు ఆశిస్తున్నాడు, దీన్నే ఆయన ఇష్టపడతాడు. అందుకని ఒకవేళ హలాల్‌ వస్తువైన నీళ్ళను మీ కోసం హరామ్‌ చేసినట్లయితే మీ పని కేవలం దాని వాడకం నుంచి దూరంగా ఉండటమే. అయితే దానిని మీకు హలాల్‌ చేసిన వెంటనే దాని ద్వారా ప్రయోజనాన్ని పొందాలి. అందుకనే దైవప్రవక్త (స) సెలవిచ్చారు : యూదులు, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఇస్తార్‌లో తొందరపడేంత వరకు మీ ధర్మం ఆధిక్యతలో వుంటుంది. ఒకవేళ ఇష్తార్‌లో ఆలస్యం చేయటం మొదలెడితే దాని ఉద్దేశం ఇక మీరు ధర్మంలోని అసలైన ప్రాణవాయువును వృధా చేసి, సన్యాసత్వం దిశగా పయనమవుతున్నట్లు భావించబడుతుంది. విధంగా మీ సంప్రదాయాన్ని వదలి యూదులు, క్రైస్తవుల పద్ధతుల్ని ఆచరిస్తూ ఉంటే, ఇక మీ ధర్మం ఎలా ఆధిక్యం పొందుతుంది? ఒక ముస్లిం విధ్యుక్త ధర్మం ఏమిటంటే ఒక బోధనాంశం ఎక్కడైనా లభ్యమై అందులో యూదులు, క్రైస్తవుల ఆచార వ్యవహారాలు, సభ్యతా సంస్కృతులు గోచరిస్తే, వాటిలో ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే వాటికి దూరంగా మెలగాలి. వారి బోధనలు పాటించటం స్వయంగా మన ధర్మానికి నష్టాన్ని చేకూర్చుకోవటమే అవుతుంది, తరువాత మీ ధర్మం దాని అసలైన రూపంలో మిగిలి ఉండదు. దాని ఫలితం ఎలా వుంటుందంటే ప్రారంభంలో మీరు వారి ఒక బోధనను పాటించటం మొదలెడితే ఇక రెండవ దానిపట్ల కూడా మొగ్గు చూపుతారు. క్రమంగా మీ పరిస్థితి ఎలా మారిపోతుందంటే మీలో ఒక నిజ ముస్లిమ్‌కు ఉండాల్సిన లక్షణాలు మిగిలి వుండవు. అందుకనే ఆదేశించడం జరిగింది : ఎక్కణ్నుంచైతే విచ్చిన్నత ప్రారంభమైందో అక్కడే ఆగిపోండి. ఒకవేళ ఇక్కడ ఆగకపోతే మీరు ఇక ముందుకు సాగిపోతూనే ౦టారు. దీని ఆధారంగా ఇక్కడ అంత పెద్ద మాట సెలవియ్యబడింది - యూదులు, (కెస్తవులకు భిన్నంగా మీరు ఇష్తార్‌లో తొందరపడేంత వరకు మీ ధర్మం ఆధిక్యతలో వుంటుందని.

90 ఆత్మ ప్రక్షాళనం రోజా ఇస్తార్‌ చేయటంలో, నమాజ్‌ ఆచరించటంలో తొందరపడటం సున్నత్‌ PUSSIES 5 లహ టరు) క్ట తకు ధరర టియురడ మూ టు! రదు లి మై AD SHE 40. హజత్‌ అబూ అతియా (రహ్మ) కథనం : 'నేను మరియు మస్రూఖ్‌ కలిసి హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) గారి వద్దకు వెళ్ళి విన్నవించు కున్నాం - విశ్వాసుల మాతృమూర్తీ! సహాబాల్లో ఇద్దరు వ్యక్తులున్నారు. వారిలో ఒకరు ఇష్టార్‌లో, నమాజ్‌లో తొందర చేస్తారు. మరొకరు ఇఫ్టార్‌లో, నమాజ్‌లోనూ తాత్సారం చేస్తారు”. “ఇఫ్తార్‌లో, నమాజ్‌లో రెంటిలోనూ ఎవరు తొందరపెడతారు? అని విశ్వాసుల మాతృమూర్తి ఆరా తీయగా, 'అబ్బుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌(రజి)” అని మేము విన్నవించు కున్నాం. ఆపై ఆమె (రజి.అన్‌హా) “దైవప్రవక్త (స) కూడా ఇలాగే ఆచరించేవారు” అని చెప్పారు - రెండవ వ్యక్తి 'హజత్‌ అబూ మూసా అష్‌అరీ (రజి).” (ముస్లిం) ఇక్కడ తాత్సారం చేయటం, తొందరపడటంలోని ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకోవాలి. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ (రజి) తొందరపడేవారంటే అర్థం, వారి ఆచరణ ఎలా ఉండేదంటే ఇష్తార్‌ వేళ అవగానే ఇఫ్టార్‌ చేసి వెంటనే నమాజ్‌ ఆచరించేవారు. కాని హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ (రజి) పద్ధతి ఎలా ఉండేదంటే ఇఫ్టార్‌ వేళ అయిపోయిన తరువాత కూడా ఆయన దీనిపై నింపాదిగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవారు. సూర్యాస్తమయం అయిన పిదప, ఏమాత్రం ఒకింత

ఆత్మ ప్రక్షాళనం రోజా 91 కిరణాలు కన్పించినా, ఆయన ఖచ్చితంగా సూర్యాస్తమయమయిందా? అని అనుమానించేవారు. కాబట్టి విషయమై గట్టి నమ్మకం ఏర్పడటానికి కాస్తంత ఆలస్యం చేసే అవకాశముంది.

మొదటి సహాబి అంటే హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ (రజి) సూర్యాస్తమయం అయిన వెంటనే రోజా విరమించి, వెంటనే నమాజ్‌ ఆచరించేవారు. కాని హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ (రజి) రోజా విరమణలోనూ ఆలస్యం చేసేవారు, ఇంకా నమాజ్‌ చేయటానికి ముందు కూడా ఒకింత తాత్సారం చేసేవారు (ఈ లోపు ఏదో ఒకటి తిని త్రాగేవారు). దీని మరో కోణం ఏమిటంటే రోజా విరమణలో ఇతరుల కోసం వేచి వుండేవారు, ఆపై వారూ నమాజ్‌లో పాల్గొనాలని కొంతసేపు వేచి వుండేవారు.

తొందరపాటు - తాత్సారంలో ఒక విషయం కూడా గమనార్హమైనది. రెండు సందర్భాల్లోనూ సాధారణ ప్రజల కోసం కొంత సౌలభ్యం, సమయంలో కొంత నింపాదీ వుంది. ఉదాహరణకు, ఇఫ్రార్‌ పిదప మస్ట్రిద్‌లో నమాజ్‌ తొందరగా చేసేమాటైతే ఆలస్యంగా వచ్చే వారికి సమయం మించిపోతుంది. అయితే ఇష్లార్‌ సమయంలో హాజరుగా వున్నవారు వారికోసం వేచి వుండాల్సి వస్తుంది. అయినప్పటికీ హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) గారు సెలవిచ్చిన దాని ప్రకారం ప్రవక్త (స) గారి ఆచరణ ఎలా ఉండేదంటే ఆయన (స) ఇఫ్టార్‌లోనూ, నమాజ్‌లోనూ వేగిరపడేవారు. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) గారి ఉవాచకు అర్ధం “ఒకరు ఒప్పు, మరొకరు తప్పు” అని ఎంతమాత్రం కాదు. స్వయంగా ప్రవక్త (స) గారి ఆచరణ ఏమిటి? ఇంకా అందులో అభిలషణీయం ఏది? అన్నది తెలుపటమే హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) గారి ఉద్దేశం. అందువలన తెలుసుకోవలసిన విషయం ఏమంటే, హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ (రజి) ఆచరణతో పాటు, హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ (రజి) గారి ఆచరణకు కూడా షరీఅత్‌లో అవకాశం వుంది. ఎందుకంటే ఆయన (రజి) గారి ఆలస్యం యూదులు చేసే ఆలస్యం లాంటిది కాదు. ఇఫ్టార్‌ చేసే ముందు సూర్యాస్తమయం అయిందా లేదా అని ఆచితూచి నిర్ణయించుకునే అవకాశం వుంది అన్న విషయం గమనించదగినది. ఇక్కడ నిబంధన ఏమంటే ఇలాంటి వ్యక్తి తెలిసీ తాత్సారం చేయరాదు, ఇంకా సన్యాసత్వాన్ని అభిలషించే కోరిక వుండకూడదు.

92 ఆత్మ ప్రక్షాళనం రోజా సహరీ ఆహారం శుభకరమైనది ee Frere We Cd AEs ghia heh! కర ముత మ. లెటే తరు ఆదేకకకషిపు

41. హజ్రత్‌ ఇర్‌బాజ్‌ బిన్‌ సారియా (రజి.అన్‌హు) కథనం : ఒకసారి

రమజాన్‌లో దైవప్రవక్త (స) తనతో సహరీ భుజించటానికి నన్ను పిలుస్తూ

“రా, శుభకరమైన ఆహారం కొరకు” అని అన్నారు.

(అబూదావూద్‌, నసాయి)

దైవప్రవక్త (స) గారి ప్రబోధనానుసారం సహరీ కేవలం సహరీ మాత్రమే కాదు, అది శుభకరమైన భోజనం.

సహరీ చేసి మరీ రోజా వుంటే అదేమి రోజా అని యూదులు తలపోసేవారు. కాని ఇస్లామీయ షరీఅత్‌లో ఇలాంటి భావనకు ఏమాత్రం అవకాశం లేదు. ‘రోజా కేవలం పగలు మాత్రమే, రాత్రి సమయంలో రోజా లేదు’ అని అల్లాహ్‌ నిర్ణయించాడు. దీనివలన తేటతెల్లంగా తెలిసేదేమంటే రాత్రివేళ తినటానికి, త్రాగటానికి పూర్తి స్వేచ్చ ఉంది, కాబట్టి స్వేచ్చను కాదని అనటం భావ్యం కాదు. రాత్రి సమయంలో మేల్మొని సహరీ భుజించటం ఒక శుభకర విషయం. దీనితోనే మనం రోజాను ప్రారంభిస్తాం. దీనిలో గల జెచిత్యం ఏమిటంటే, రోజా ప్రారంభించటానికి ముందు ఏదైనా తినాలి. ఎందుకంటే పగలు పనిచేయటానికి, ఇతర పనుల నిర్వర్తనకై మనకు శక్తి కావాలి కదా! అలా కాకపోతే మనం ఆకలిదప్పులతో శక్తిహీనులుగా పడివుంటాం. దీన్ని ధర్మం అభిలషించదు. ధర్మం అభిలషించేది మనం అల్లాహ్‌ ఆదేశాలను పాటించటంతో పాటు పని చేయటానికి మనలో శక్తి కూడా ఉండాలన్నది. ఒక ముస్లిం అయిన కారణంగా మన పైవున్న విధులు, బాధ్యతలు మనం సక్రమంగా, సమంజసంగా నెరవేర్చగలగాలి, ఆరాధనకు భావం కార్యకారకమైన ప్రపంచంతో తెగతెంపులు చేసుకొని ఏకాకిగా కుహరాల్లో కూర్చోవాలన్నది కాదు. అసలు ఆరాధనకు వాస్తవమైన శిక్షణా తరగతి ఏమిటంటే మీరు ఆచరణాపూరితమైన జీవన క్రమంలో అల్లాహ్‌ ఆదేశాలను పాటిస్తూ జీవితం గడుపుతూ పరలోకంలో అల్లాహ్‌ ప్రీతిని పొంది సఫలీకృతులు కావాలి.

ఆత్మ ప్రక్షాళనం రోజా 93 ఉత్తమమైన సహరీ ఖర్జూరం

తోనే oA a 1

మంటు! లీ లేడ రడ కా ర్‌

3

Se; GID

42. హజత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స)

సెలవిచ్చారు : విశ్వాసికి ఉత్తమ సహరీ ఖర్జూరం. (అబూదావూద్‌)

ఖర్జూరంలో మనిషికి కావలసిన సంపూర్ణ ఆహారం సమృద్ధిగా వుంది. మనిషి ఎలాంటి ఆహారం దొరక్కపోయినా, ఖర్జూరం లభిస్తే అదే అతనికి సరిపోతుంది. నేటి పరిశోధనల ప్రకారం మనిషి తన శక్తిని కాపాడుకోవటానికి ఆహారంలో ఎన్ని కాలరీలు కావాలో అవన్నీ ఖర్జూరంలో పుష్కలంగా వున్నాయి. దీని కారణంగా రోజుల్లో కూడా సైనికులకు ఎక్కడైనా ఎడారి ప్రాంతాల్లో దీర్ణకాలం పాటు వుండాల్సివస్తే, అక్కడ ఆహార సరఫరా చేసే అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఖర్జూరాల స్టాకు చాలినంతగా సైనికులకు సరఫరా చేయబడుతుంది. విధంగా నెలల తరబడి ఆహారం లభ్యం కాకపోయినా కేవలం ఖర్జూరం పైనే ఆధారపడి వుండవచ్చు.

ఖర్జూరపు లాభాల దృష్టా, ఇంకా ఇది సంపూర్ణ ఆహారమైన కారణంగా దైవప్రవక్త (స) దీనిని ఉత్తమ ఆహారంగా నిర్ణయించారు. సహరీలో దీన్ని ఉపయోగిం చటం వలన చేకూరే ప్రయోజనం ఏమిటంటే, పగలల్లా మనిషి తన శక్తిని కోల్పోకుండా వుండేందుకు, తన విధులు నిర్వర్తించుకోవటానికి ఇది ఎంతగానో సహాయకారిగా ఉంటుంది.

94 ఆత్మ ప్రక్షాళనం రోజా కళ > మకుటం PAS

రోజా పరిరక్షణ కోసం...

అధ్యాయంలో రోజాను వస్తువులతో కాపాడాలన్న విషయం తెలుపడం జరిగింది. రోజాను పవిత్రంగా వుంచటానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరమో సూచించడం జరిగింది. ఇంకా నిశితంగా రోజా సమయంలో వేటిని ఆచరించటం అభిలషణీయం, ఇంకా దేని ఫలితంగా రోజాకు ఎలాంటి భంగం వాటిల్లకుండా వుంటుందో వివరించడం జరిగింది.

హదీసు వ్యాఖ్యానం, వివరణల ద్వారా ముందు ఒక విషయం తేటతెల్లంగా తెలిసేదేమంటే వీటిని అధ్యయనం చేస్తున్నప్పుడు ఎలాంటి సంశయం, అనుమానం జనించరాదు.

వేటిని ఆచరిస్తే రోజాకు భంగం కలుగుతుంది, వేటితో కాదు, పని చేసే అనుమతి ఉంది, మరే పని చేయటానికి అనుమతి లేదు. బోధనలో చాలా సున్నితమైన సమస్యలూ ఎదురౌతాయి. ముఖ్యంగా మనిషి ఏకాంత జీవితానికి చెందిన సమస్యలు ఎదురవుతాయి. ఇది మనిషి జీవితానికి సంబంధించిన ఎలాంటి అంశమంటే దీన్నుంచి ఎవరూ బయటపడలేరన్న విషయం సర్వవిదితం. అందుకే రోజా స్థితిలో మనిషి తన జీవితంలో మేరకు వెళ్ళగలడన్నదానిపై సమస్య ఉత్పన్నమవుతుంది. సమస్యకు వివరణాత్మక సమాధానం ఇవ్వనట్లయితే మనిషి నిత్యం వ్యాకులతకు, చికాకు చింతలకు లోనవుతాడు. విషయమై అవగాహన, మార్గదర్శనం ఎలాంటి వ్యక్తుల ద్వారా లభిస్తుందంటే వారు దైవప్రవక్త (స) గారి దాంపత్య జీవితం గురించి తెలిసినవారై వుండాలి. పృచ్చకుల మార్గదర్శకం, హితవు కొరకు ఇది వినా మరోమార్గం లేదు. ప్రవక్త (స) గృహస్థ జీవితం, దాంపత్య జీవితం గురించి అతి సమీపం నుంచి తెలిసినవారు విశ్వాసుల మాతృమూర్తులు, ఆయన (స) ప్రియ సతీమణులే. విషయాలను తెలుసుకునే మార్గం ఇది వినా మరొకటి లేదు. విషయాలను ప్రవక్త (స) పవిత్ర సతీమణుల ద్వారా ముస్లింలకు మార్గదర్శకత్వాలుగా, హితవులుగా చేరవేయబడాలి. అల్లాహ్‌ మానవులందరికీ ప్రవక్త (స)ను మార్గదర్శిగా, హితైషిగా

ఆత్మ ప్రక్షాళనం రోజా 95 పంపాడు. అలాంటి మహోన్నత ప్రవక్త (స) సతీమణులు ముస్లిం సమాజం మాతృమూర్తులుగా ఖరారు చేయబడ్డారు. కారణంగా వారి పట్ల గౌరవాదరణలతో మెలగవలసిన అవసరం ఉంది. అందుకే పూర్తి ముస్లిం సముదాయానికి హెచ్చరించటం జరిగింది - ఒకవేళ మాతృమూర్తుల తాలూకు మీ మనసులో ఏమాత్రం చెడుతలంపు కలిగినా అది మీ విశ్వాసాన్నే హరించివేస్తుందని.

రోజా ఉద్దేశ్యం తఖ్వా (దైవభీతి) తప్ప పస్తులుండటం కాదు

LISI oe లా Mr Ne MAE Ge eve కల బయటి రము

My hams TT WYN LF (తాటకిపు పుర చప

43. హజ్రత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు : ఒకవేళ వ్యక్తి అయినా అబద్ధం చెప్పటాన్ని దానిపై ఆచరించటాన్ని మానుకోకపోతే అతను ఆకలిదప్పులతో పడి వుండటం పట్ల అల్లాహ్‌కు ఏమాత్రం ఆసక్తి లేదు. (బుఖారీ) దీని అర్థం ఏమంటే, రోజాలో వున్నప్పుడు అబద్ధం చెప్పటం, దానిపై

ఆచరించటం మానుకోకపోతే కేవలం అతను పస్తులున్నాడని భావం. అతని

రోజాకు ఎలాంటి అర్థం లేదు. ఎందుకంటే రోజా ద్వారా మనిషిలో తఖ్వా (దైవభీతి),

నిష్టాగరిష్టత, దేవుని యందు భీతి జనింపజేయటమే అసలు ఉద్దేశం. విధమైన ఆచరణ వలన ఇలాంటి సద్గుణాలను అతను తనలో జనింపజేసుకోనే లేదని దీని అర్ధం.

అబద్ధంపై ఆచరించటమంటే అర్ధం ఏమిటి? అబద్ధం చెప్పటంలోని ఆంతర్యం అయితే అర్థమయ్యింది. అయితే దానిపై

అమలు చేయటంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలి.

అబద్ధం చెప్పటం ఒక హద్దుకు లోబడి ఉంది. కాని దానిపై ఆచరించటం దాదాపు అన్ని పాపాలకు మూలమవుతుంది.

96 ఆత్మ (ప్రక్షాళనం రోజా

ఉదాహరణకు ఒక మనిషి ఇతరుని సొమ్మును అన్యాయంగా తీసుకున్నాడను కోండి, దాని ఉద్దేశం అతను ఒక అబద్ధంపై అమలు చేశాడన్నమాట. సొమ్మయితే అతనిది కాదు, అయినా దాన్ని అతను తన సొమ్ముగా నిర్ణయించుకొని దానిని ఖబ్బా చేసినట్లయితే, అలాంటివాని దొంగతనం వాస్తవానికి ఒక అబద్ధం. పూర్తిగా అతను ఒక అబద్ధంపై అమలు చేశాడన్నమాట.

విధంగా ఒక వ్యక్తి ఎవరినైనా హత్యచేసినట్లయితే, అతను అబద్ధంపై అమలు చేసినట్లే. అతను తనకు తాను ఫలానా వ్యక్తి తన పట్ల తప్పుగా ప్రవర్తించాడుగాబట్టి అతన్ని హత్యచేయటం సబబే అని నిర్ణయించుకుని హత్య చేస్తాడు. వాస్తవానికి ఇలా చేయటం పట్ల అతనికి ఎలాంటి హక్కూ లేదు. కాని అతను అబద్ధంపై ఆచరించాడు. మీరు ఆలోచించినట్లయితే మనిషి చేసే పాపాలు, అవి చెడు మార్గంపైన నడుస్తూ దేవుని పట్ల చేసే అవిధేయత కానివ్వండి, లేక తోటి దైవదాసులపై చేసే దౌర్జన్యం కానివ్వండి, రెంటిలోనూ నిజానికి అవి అబద్ధంపై ఆధారపడి చేసినవే. దీని ఆధారంగానే ప్రవక్త (స) సెలవిచ్చారు : మనిషి అయినా రోజాలో వున్నప్పుడు అబద్ధం చెప్పడాన్ని, దానిపై ఆచరించటాన్ని మాననట్లయితే, అతను ఆకలిదప్పులతో పడివుండటం పట్ల అల్లాహ్‌కు ఏమాత్రం ఆసక్తి లేదు. ఎందుకంటే అతను రోజా యొక్క అసలైన ఉద్దేశాన్నే ఖూనీ చేశాడు.

అయితే ఇక్కడ మాటను అర్థం చేసుకోవాలి. అబద్ధం రోజాను భంగపరచే వాటిలో పరిగణించబడదు. ఒకానొక దానితో రోజా భంగమవుతుంది. మరొక దానితో రోజాలోని పరిశుద్ధతకు, నాణ్యతకు భంగం వాటిల్లుతుంది. ఉదాహరణకు కొన్ని నైతిక దురాచారాలున్నాయి, వాటి ద్వారా రోజా గౌరవ మర్యాదలకు, పవిత్రతలకు భంగం వాటిల్లుతుంది. కాని వాటివలన రోజా భంగం కాదు. ఇక్కడ సెలవిచ్చిందేమంటే ఇలాంటి రోజా అల్లాహ్‌కు ఏమాత్రం అవసరం లేదని. అంతేకాని అతని రోజా భంగమైందని చెప్పబడలేదు. సారాంశం ఏమిటంటే, అతను రోజా ఊపిరిని ఖూనీ చేశాడు, ఎందుకంటే అతను రోజాలో వున్నప్పుడు అబద్ధం చెప్పడం, దానిపై ఆచరించటం మానలేదు.

రోజా స్థితిలో భార్యతో కలసిమెలసి వుండే హద్దులు

జీ Lewd 4 వమ pr YEATES రరర తామ

కు le 6a యమ యు! os

ని

ఆత్మ (ప్రక్షాళనం రోజా 97 44. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) ఉల్లేఖించారు : దైవప్రవక్త (స) రోజా స్థితిలో తన సతీమణులతో కలుసుకునేవారు. ఇంకా ప్రవక్త (స) మీ అందరికంటే ఎక్కువగా తన మనోవాంఛలపై అదుపు కలిగి వుండేవారు. (ముత్తఫకున్‌ అలైహ్‌) దీని ఉద్దేశం ఏమిటంటే రోజా స్థితిలో వున్నప్పుడు లైంగిక సంబంధం తప్ప భార్యలతో కలవడం సమ్మతమే. ఇది అసలు నిబంధన. అయితే ఆపై హజ్రత్‌ ఆయిషా (రజి. అన్‌హా) దీనిపై వివరణ ఇస్తూ, మనిషికి ఒక్క లైంగిక సంబంధం తప్ప తన భార్యతో మిగతా అన్ని రకాల కలయికలకు అనుమతి ఉన్నప్పటికీ ఇందులో కూడా ప్రమాదం పొంచివుంది. ఒకవేళ మనిషి తన మనోవాంఛలను అదుపు చేసుకోలేక తన వలన జరగరాని పని జరిగినట్లయితే అతని రోజా భంగమవుతుంది. అందువలన హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) ఏమన్నారంటే - ప్రవక్త (స) మీ అందరికన్నా ఎక్కువగా తన మనోవాంఛలపై అదుపు కలిగి వుండేవారు. అంటే మీలో ఎవరికైనా తనను తాను అదుపులో వుంచుకోగలిగే శక్తి వుంటే దీనిద్వారా అతను ప్రయోజనం పొందవచ్చు. అయితే ఎవరికైతే తన స్వయంపైనే అదుపు లేదో, అతను కలయికకు దూరంగా మెలగటమే ఉత్తమం. మున్ముందు ఒక హదీసులో విషయమై స్వయంగా దైవప్రవక్త (స) గారి మరో వివరణ దొరుకుతుంది.

లైంగిక అశుద్ధావస్థలోనూ రోజా ప్రారంభించవచ్చు బ్య్రవ్తపగ్రువంరళదేర వితల రో AIS ఊిత్తయ్తక్‌ 45. హజత్‌ ఆయిషా (ర.అ) ఉల్లేఖనం : కొన్ని సందర్భాల్లో దైవప్రవక్త (స) లైంగిక అశుద్ధావస్థలో వున్నప్పుడు ఫజ్ర్‌ సమయం వచ్చేది. అశు ద్ధావస్థ కూడా ఏదో స్వప్న స్థలనం వలన కాదు. ఆపై ఆయన (స) గుసుల్‌ చేసేవారు. అప్పుడు ఆయన రోజాలో వుండేవారు. (ముత్తఫకున్‌ అలైహ్‌)

98 ఆత్మ (ప్రక్షాళనం రోజా రమజాన్‌లో కొన్ని సమయాల్లో ఒక ప్రశ్న ఉదయిస్తుంది - ఒకవేళ మనిషి రాత్రివేళ రతిలో పాల్గొంటే సహరీ ముగియకపూర్వం (లేదా) రోజా మొదలవక ముందు గుసుల్‌ (స్నానం) చేయాలా లేదా సహరీ ముగిసినప్పటికీ, రోజా ప్రారంభం అయిన తరువాత కూడా గుసుల్‌ చేసుకోవచ్చా? ప్రశ్నకు జవాబు హదీసులో దొరుకుతుంది. హజ్రత్‌ ఆయిషా (ర.అ) ఉల్లేఖనం ప్రకారం - కొన్ని సందర్భాల్లో దైవప్రవక్త (స) పైన కూడా ఫజ్ర్‌ వేళ వచ్చేసేది. రోజా సమయం కూడా మొదలయిన తరువాత ఆయన (స) గుసుల్‌ చేసేవారు. దానికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అది స్వప్న స్థలనంలో జరిగిన అశుద్ధత వల్ల చేసిన గుసుల్‌ (స్నానం) కాదు.

దీనిద్వారా తెలిసేదేమంటే విధమైన స్థితిలో రోజా ప్రారంభించవచ్చు. దీనివలన రోజాకు ఎలాంటి భంగం వాటిల్లదు, కొరతా ఏర్పడదు.

ఇక మీరే ఆలోచించండి, ఒకవేళ హజత్‌ ఆయిషా (ర.అ) గనక విషయాన్ని తెలుపనట్లయితే ముస్లిం సముదాయోనికి ఇది ఎలా తెలిసేది? తెలియక పోతే వ్యక్తులు తమ ప్రైవేటు జీవితాల్లో ఎన్నో ఇబ్బందుల్ని, చిక్కుల్ని ఎదుర్మోవాల్సి వచ్చేది. మరోమాటలో చెప్పాలంటే ఇదంతా అల్లాహ్‌ కృప, కరుణానుగ్రహాలు. ఇంకా ఇది ప్రవక్త (స), ఆయన ఇంటివారల త్యాగమయ జీవితాల ఫలితం. వారు తమ జీవితంలోని ఇలాంటి సున్నిత అంశాలను కూడా ఎలాంటి దాపరికం లేకుండా ప్రజలకు తెలిపారు. పైగా వాటి తాలూకు అవసరమైన సమాచారాన్ని అందజేశారు - ప్రజలను తమ జీవితాల్లోని సందర్భాల్లో మార్గదర్శకత్వం దొరకాలని. వాస్తవానికి ఇదంతా దైవప్రవక్త (స), ఆయన పవిత్ర సతీమణుల గొప్ప త్యాగనిరతి ఫలితమే. నేడు కొంతమంది బుద్ధిలేనివారు హదీసులో ఇలాంటి విషయాలు ఎలా వచ్చాయని ఆక్షేపిస్తున్నారు. అలాంటి వారికి తెలిసిరావలసిన విషయం ఏమిటంటే - మాతృమూర్తులు (ర.అ) గనక ముస్లిం సముదాయానికి విషయాలు తెలుపనట్లయితే, వీటి తాలూకు ముస్లిం సమాజానికి మార్గదర్శకత్వం ఎక్కడి నుండి లభించేది? ఎలా లభించేది? ఇహ్రామ్‌ ధరించిన స్థితిలో, రోజా స్థితిలో పచ్చా (దేహం నుండి చెడురక్తం తీయటానికి) వేయటానికి అనుమతి

adem FEA 0G gee 0 GAS SIRE

ఆత్మ (ప్రక్షాళనం రోజా 99 46. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (రజి) ఉల్లేఖనం : దైవప్రవక్త (స) ఇహ్రామ్‌ ధరించిన స్థితిలో, ఇంకా రోజా ఉన్న స్థితిలో పచ్చాలు వేయించే వారు. (ముత్తఫకున్‌ అలైహ్‌)

పూర్వకాలంలో ఇంకా నేడు కూడా వైద్య సంబంధమైన కొన్ని సందర్భాల్లో, పద్ధతుల్లో శరీరంలోని ఏదో ఒకచోట కత్తితో లేక సూదులతో సున్నితంగా పొడిచి గాయపరుస్తారు. ఫలితంగా గాయాల నుంచి రక్తం స్రవిస్తుంది, ఇంకా రక్తాన్ని కొమ్ముల (కప్పుల) ద్వారా పీల్చటం జరుగుతుంది. దీన్నే హిజామా (కప్పింగ్‌ మెథడ్‌) అంటారు. సందర్భంగా ఇహ్రామ్‌ స్థితిలో లేక రోజా స్థితిలో ఇలా చేయటం అభిలషణీయమా? కాదా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. హదీసు ద్వారా మొట్టమొదట ఇహ్రామ్‌ స్థితిలో పచ్నాలు వేయవచ్చనే విషయం తెలుస్తోంది. అయితే పచ్చా వేయించినప్పుడు వెంట్రుకలు కత్తిరించరాదు. వెంట్రుకలు కత్తిరించటం జరిగితే ఇహ్రామ్‌కు భంగం వాటిల్లుతుంది. రెండో విషయం, రోజులో వున్న స్థితిలో కూడా పచ్చాలు వేయవచ్చని తెలుస్తోంది. అయితే ఇందులో ఇహ్రామ్‌ స్థితిలో తీసుకునే జాగ్రత్తలు పాటించే అవసరం లేదు.

ఇక్కడ గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే, పచ్చా వేయించుకునే విషయంలో హదీసువేత్తల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. విభేదాల ఆధారంగా ఇమామ్‌ అబూ హనీఫా (రహ్మ), ఇమామ్‌ మాలిక్‌ (రహ్మ) ఇంకా ఇమామ్‌ షాఫియీ (రహ్మ) దృష్టిలో పచ్చాలు వేయించుకోవటం వలన రోజాకు ఎలాంటి భంగం వాటిల్లదు. అయితే ఇమామ్‌ అహ్మద్‌ (రహ్మ) దృష్టిలో పచ్చాలు వేయించుకునే వ్యక్తి, పచ్చాలు వేసే వ్యక్తి ఇద్దరి రోజాకు భంగం వాటిల్లుతుంది. వారి తర్మం మున్ముందు రాబోయే హదీసు ఆధారంగా చేయబడింది. అయితే ప్రస్తుత హదీసులో హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (రజి) గారి మాటల ద్వారా స్పష్టంగా తెలిసిందేమంటే, స్వయంగా ప్రవక్త (స) రోజా స్థితిలో పచ్చాలు వేయించుకున్నారు. దీనివలన తెలిసిందేమంటే పచ్చాలు వేయించుకోవటం వల్ల రోజాకు భంగం వాటిల్లేమాటైతే ఆయన (స) ఇలా చేసేవారు కాదు.

మరచిపోయి తినటం, త్రాగటం వలన రోజా భంగం కాదు FBI ag SAS UA STC

ఒడ డ్‌ ఉల (ew II!

100 ఆత్మ (ప్రక్షాళనం రోజా 47. హజ్రత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు : రోజా వున్న స్థితిలో ఎవరైనా వ్యక్తి మరచిపోయి తినటం, త్రాగటం చేస్తే, అతను తన రోజాను పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే వ్యక్తికి అల్లాహ్‌యే తినిపించి, త్రాపించాడు. (ముత్తఫకున్‌ అలైహ్‌) ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా, మరచిపోయి కడుపు నిండా తిన్నా గ్లాసు నిండా నీరు త్రాగినా, లేదా మరేదయినా త్రాగినా అప్పుడు కూడా అతని రోజాకు భంగం వాటిల్లదు, అయితే అలాంటి స్థితిలో అతనికి తన రోజా గుర్తుకు వచ్చినట్లయితే వెంటనే చర్య నుంచి ఆగిపోవాలి. లేకపోతే స్థితిలో ఒక్క మెతుకయినా లేక ఒక బొట్టు నీరైనా అతని గొంతులో దిగితే అతని రోజాకు భంగం వాటిల్లుతుంది. తెలిసిందేమంటే, మరచిపోయి, ఎవరైనా ఒక వ్యక్తి రోజాకు భంగం వాటిల్లే చర్యకైనా పాల్పడినా, అతని రోజాకు ఎలాంటి భంగం వాటిల్లదు. ఇలాంటి తప్పిదం జరిగినా అతను తన రోజాను పూర్తి చేసుకోవాలి తప్ప రోజాకు భంగం చేయకూడదు. దీనిద్వారా విదితమయ్యే మరో నిబంధన ఏమంటే, మరుపు వల్ల జరిగిన తప్పిదం క్షమార్దం, షరీఅత్‌ సూత్రాన్ని అంగీకరిస్తుంది కూడా.

బుద్ధిపూర్వకంగా రోజాను భంగం చేసినదాని ne (పరిహారం)

TT AVI స్ట. సిగ అకక వై ము రేవ ర్ర్‌! Js sledGets, పనా ఉనే ' "అపవేపే dy టక ర్రిపయడటు 1 ery AAG సహమ్రెత్‌ ఫశ 9G టకు] ప్రేత ఫ్ర లెక పయః

ఆత్మ ప్రక్షాళనం రోజా 1 CR వద్ధ సుమో lea తడ్త్యడు!

dU తరత ఉపమ! యాత్రను రిపీ౦జ తర రడ తళ Ae _gdiL GE

men

Pur)

48. హజత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం : ఒకసారి మేము దైవప్రవక్త (స) సన్నిధిలో కూర్చొని వున్నాం. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి, 'దైవప్రవక్తా (స)! నేను నాశనమైపొయ్యాను” అన్నాడు. ప్రవక్త (స) 'నీకేమయింది” అని అడిగారు. “నేను రోజాలో వున్నప్పుడు నా భార్యతో సంభోగించాను” అన్నాడావ్యక్తి. ఆపై ప్రవక్త (స) 'నీవు స్వేచ్చ నొసంగడానికి నీ దగ్గర ఎవరైనా బానిస ఉన్నాడా?” అని ఆరా తీశారు. వ్యక్తి 'లేదు” అన్నాడు. “నీవు వరుసగా రెండు నెలల ఉపవాసం ఉండే శక్తి కలిగి వున్నావా?” అని ప్రవక్త (స) అడిగారు. అతను 'నేను అలా వుండలేను” అని అన్నాడు. ఆపై ప్రవక్త (స) “పోనీ, అరవైమంది పేదలకు అన్నం పెట్టగలవా?” అని అడిగారు. “ఇదీ చేయలేను” అని వ్యక్తి అన్నాడు. ఆయన (స) “అయితే కూర్చో” అని చెప్పి కొంత సమయం గడిపారు. అలా కూర్చొని వుండగా దైవప్రవక్త (స) సన్నిధిలో ఖర్జూరాలతో నిండిన ఒక పెద్ద బుట్ట తేబడింది. ఆయన (స) 'సందేహపడిన వ్యక్తి ఎక్కడ?” అని ఆరాతీశారు. 'నేను ఇక్కడే వున్నా దైవప్రవక్తా!” అని అన్నాడావ్యక్తి. 'దీన్ని తీసుకెళ్ళి దానం చెయ్యి” అని ప్రవక్త (స) అన్నారు. (అంటే కప్ఫారా (పరిహారం)గా 60 మంది నిరుపేదలకు తినిపించు అన్నారు). దానికి వ్యక్తి, 'దైవప్రవక్తా! నాకంటే నిరుపేద అయిన వ్యక్తులకు తినిపించమంటారా? దేవుని మీద ఒట్టు, మదీనా నగరంలోని రెండు కొండల మధ్య నాకంటే నిరుపేద ఎవ్వడూ లేడు? అని విన్నవించు కున్నాడు. దీనిపై ప్రవక్త (స) పెద్దగా నవ్వేశారు. అలా నవ్వుతున్నప్పుడు

102 ఆత్మ ప్రక్షాళనం రోజా ఆయన (స) గారి ముందు పల్లు కన్పించాయి. తరువాత ఆయన (స) “సరే, ఇక వెళ్ళు, వీటిని తీసికెళ్లి నీ ఆలు బిడ్డలకే తినిపించు” అని సెలవిచ్చారు. (ముత్తఫకున్‌ అలైహ్‌) హదీసు ద్వారా అనేక అంశాలు సుబోధకమవుతున్నాయి : ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి తన మనసును అదుపులో వుంచుకోలేక బుద్ధిపూర్వకంగా రోజాను భంగపరచినట్లయితే దానికి పరిహారం ఏమిటన్నది ఒక విషయం - మొదటి పరిహారం (కప్ఫారా) బానిసను విముక్తం చేయటం; ఒకవేళ మనిషి కష్పారా చెల్లించే స్థోమత కలిగివుంటే అతను దీన్ని నిర్వర్తించాలి. ఒకవేళ దీనిని చెల్లించే స్థోమత కలిగిలేనట్లయితే అప్పుడు రెండవ కప్ఫారా - రెండు నెలల పాటు మధ్యలో ఎలాంటి నాగా లేకుండా - ఉపవాసాలు పాటించడం. దీని స్థోమత కూడా అతనికి లేనట్లయితే ఇక అతను 60 మంది నిరుపేదలకు అన్నం పెట్టాలి. 60 మంది నిరుపేదలకు అన్నం పెట్టటమంటే రెండు పూటలా కడుపునిండా తినిపించాలి. అది కూడా తాను ఆహారం తింటాడో అలాంటి ఆహారమే తినిపించాలి.

ఇంతవరకయితే సమస్యకు సాధారణ సమాధానం ఇవ్వబడింది. దీని తరువాత ఒక ప్రత్యేక విధానం కూడా మన ముందుకు వచ్చింది - ఒకవేళ పైన తెలిపిన పద్ధతుల్లో దేనినీ ఆచరించే స్టోమత లేకపోతే అతనికి ఇవ్వబడిన ఆదేశం ఏమిటన్నది? హదీసులో పృచ్చకుడు 'నేనైతే మూటిలో ఒక్క దానినైనా నెరవేర్చే స్టోమత కలిగి లేనని విన్నవించుకోగా, ప్రవక్త (స) తన దగ్గరకు జకాత్‌గా వచ్చిన ఖర్జూరాలను అతనికి దానంగా ఇచ్చారు. బైతుల్‌ మాల్‌ (ప్రభుత్వ ధనాగారం) నుంచి ఇలాంటి వ్యక్తులకు సహాయం చేయవచ్చన్న విషయం దీని ద్వారా విదితమయ్యింది. ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఇలాంటి పాపానికి ఒడిగట్టి, ఇలాంటి పరిహారం చెల్లించే స్థోమత కలిగి లేనప్పుడు అలాంటి వ్యక్తికి రెండే మార్గాలున్నాయి. మూడు విధానాల్లో ఏదో ఒకదాని స్టోమత కలిగేంత వరకు అతను వేచి చూడాలి (ఈ వేచి చూడటంలో అతని వయస్సు మీరిపోయినాసరే). లేక ప్రభుత్వ ధనాగారాన్నుండైనా అతనికి సహాయం చేయటమో లేదా ధనవంతులైనా అతనికి తోడ్పాటు అందించటమో చేయాలి. జకాత్‌ సొమ్ము ఇలాంటి పద్దుల్లో కూడా ఖర్చు చెయ్యవచ్చని దీనిద్వారా తెలుస్తోంది - అప్పులు చెల్లించడానికి స్టోమత లేని వ్యక్తి రుణాన్ని వసూలైన జకాత్‌ సొమ్ము నుంచి చెల్లించినట్లు. ఒకవేళ బైతుల్‌ మాల్‌లో అంత సొమ్ము లేకపోతే, జకాత్‌ సొమ్ము ద్వారా ఇలాంటి సమస్యల్లో చిక్కుకున్న ముస్లిం సోదరుణ్ణి విముక్తం చెయ్యాలి.

ఆత ప్రక్షాళనం రోజా 103

ఫిఖావేత్తల మధ్య విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కప్ఫారా (పైన తెలిపిన వివరాల ప్రకారం) భార్యతో సమాగమం చేసి రోజా భంగం చేసినందుకేనా? లేక ఒక వ్యక్తి రోజాలో వుండి బుద్ధిపూర్వకంగా తినటం, త్రాగటం చేసినప్పుడు కూడా ఇది వర్తిస్తుందా? ఫిఖావేత్తల ఒక వర్గం అభిప్రాయం ప్రకారం కప్ఫారా భార్యతో సంభోగించి రోజాను భంగపరచిన స్థితిలోనే వర్తిస్తుంది. రెండవ వర్గం అభిప్రాయంలో ఒక మనిషి బుద్ధిపూర్వకంగా పద్దతి ప్రకారంగానైనా రోజాను భంగపరిస్తే కప్ఫారా తప్పనిసరి అవుతుంది. ఇమామ్‌ అబూ హనీఫా, ఇమామ్‌ మాలిక్‌ అభిప్రాయంలో రోజాను భంగం చేసిన అన్ని సందర్భాల్లోనూ పరిహారం (కప్ఫారా) చెల్లించబడాలి.

ఇక మున్ముందు హదీసులో ఎంతో ముఖ్యమయిన విషయం ముందుకు వస్తుంది. మదీనాలో తనకన్నా ఎక్కువ నిరుపేద మరొకరు లేరని పృచ్చకుడు విన్నవించుకోగా, దైవప్రవక్త (స) “సరే మంచిది, వెళ్ళు, ఖర్జూరాలను తీసుకెళ్ళి నీ ఆలుబిడ్డలకు దానంగా ఇచ్చెయ్యి” అని సెలవిచ్చారు. సందర్భంగా కొంతమంది ఫిఖావేత్తల అభిప్రాయమేమంటే, వ్యవహారం కేవలం వ్యక్తి వరకే పరిమితం. అంతేగాని ఇతరులకు ఇది వర్తించదు అని. కాని నా ఉద్దేశ్యంలో (నిజం అల్లాహ్‌కే తెలుసు) అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త(స) వ్యవహారంలో సౌలభ్యాన్ని వెసులుబాటును చేకూర్చారో అందులో కారిన్యాన్ని, సంకుచితత్వాన్ని కల్పించే హక్కు మరొకరికి లేదు. తినటానికే తిండి లేని వ్యక్తి చేతికి మీరు ధనాన్నిచ్చి, 'దీన్ని నిరుపేదల్లో పంచు” అని అంటే వ్యక్తి సొమ్మును తీసుకోవటానికి హక్కుడారుడు ఎందుకు కాడు అన్న సందేహం వస్తుంది. తన వద్ద తినటానికి కనీసం ఏదైనా వున్న వ్యక్తి మాత్రమే సదఖా (దానధర్మాలు) ఇవ్వగలడు. కాని రాత్రి నా బిడ్డలు ఏమి తింటారు అన్న బెంగతో ఉన్న వ్యక్తి ద్వారా మీరు 60 మంది నిరుపేదలకు అన్నం పెట్టించాలని భావిస్తున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయం. నా జ్ఞాన పరిధి మేరకు షరీఅత్‌ ఉద్దేశం ఇదై వుండదు. వాస్తవమేమంటే దైవప్రవక్త (స) గారి ఆచరణ ద్వారా షరీఅత్‌కు సంబంధించిన ఒక షరీఅత్‌ విషయం అవగతమవుతోంది. మాటకొస్తే దైవప్రవక్త (స) గారి ప్రతి ఆచరణ ఏదో ఆవేశపూరితంగా చేసింది కాదు. ఆయన (స) ప్రతి ఆచరణా షరీఅత్‌ పరిధిలోనే వుంటుంది. అసలు దీనిలోని అసలైన భావనా ఊపిరి ఏమిటి? కాబట్టి ఎవరైనా వ్యక్తి చేత తప్పక కప్పారా చెల్లించాల్సిన తప్పిదం జరిగితే, అప్పుడు స్వయంగా అతనే దానస్వీకారయోగ్యుడైన పక్షంలో బైతుల్‌ మాల్‌ నుంచి అతనికి సహాయం చేయటం అభిలషణీయం. దీని

104 ఆత్మ ప్రక్షాళనం రోజా పద్ధతి ఏమిటంటే ఒకసారి సొమ్ముకు అతన్ని యజమానిగా చేసి ఆపై అతనితో “దీనిని దానం చేసే హక్కు నీకుంది' అని అనాలి. అయితే “ఒకవేళ దాన స్వీకృతికి నీవు కూడా అర్హుడివైతే దీన్ని నీవూ ఉపయోగించుకోవచ్చు” అని కూడా అతనితో చెప్పాలి. దైవప్రవక్త (స) గారి ఆచరణ ద్వారా ఇలా చేయటం సమ్మతమేనన్న మార్గదర్శకత్వం లభిస్తుంది.

శర బపు రోజా స్థితిలో భార్యతో కలసిమెలసి ఉండటం గురించి

జ్య్రవర్రే రో ama యుడు భాం టో jade

IEE e154 heres అఆ 13}3 Tr ఆరభి

50. హజ్రత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం : ఒక వ్యక్తి దైవప్రవక్త (స) సన్నిధిలో హాజరై “ఉపవాసి అయిన ఒక వ్యక్తి తన భార్యతో కలిసే అనుమతి ఉందా?” అని ప్రశ్నించాడు. దైవప్రవక్త (స) అతనికి అనుమతినిచ్చారు. ఆపై మరో వ్యక్తి ఆయన (స) సన్నిధిలో హాజరై అతను కూడా ఇలాంటి ప్రశ్ననే అడిగాడు. దానికి ఆయన (స) వ్యక్తికి అనుమతినివ్వలేదు - మొదట ఆయన (స) అనుమతినిచ్చిన

వ్యక్తి వయసుమీరినవాడు. అనుమతి ఇవ్వబడని రెండో వ్యక్తి యువకుడు. (అబూదావూద్‌)

హదీసు మూలంలో భార్యతో కలవటం అని సూచించటానికి 'ముబాషరత్‌'

అన్న పదం వాడబడింది. హదీసుల్లో పదం అనేకచోట్ల వచ్చింది. అరబీ భాష తెలియనివారు, ఉర్జూ ద్వారా అరబీని అర్థం చేసుకునేవారు పదాన్ని ఆసరాగా

eS re "a we Thre oa ac SE 4A గౌరవనీయులైన మౌలానా గారు తన వాదీను పాఠంలో వాదీనును వ్యాఖ్యానించలేదు.

ఆత్మ ప్రక్షాళనం రోజా 105 తీసుకొని హదీసుకు వ్యతిరేకంగా తుఫానును లేవనెత్తుతారు - చూడండి, హదీసుల్లో ఎలాంటి తప్పుడు అంశాలను జమచేయటం జరిగిందో అని. ఇలాంటి వ్యక్తులు ఎలాంటి పరిశోధనా చేయకుండా విధమైన తుఫానును సృష్టిస్తూ వుంటారు. ఇదంతా తమ అజ్ఞానం కారణంగా ప్రవక్త (స) హదీసుకు వ్యతిరేకంగా దీనిని ఒక ఆయుధంగా చేసి వాడుకుంటూ ఉంటారు. వాళ్ళ అవగాహనా లేమికి అసలు మూలాధారం ఏమిటంటే ఉర్దూ భాషలో “ముబాషరత్‌' అన్న పదం 'రతి జరపటం” అనే అర్థంలో వాడబడటమే. నిజానికి అరబీలో అలా లేదు.

“ముబాషరహ్‌” అనే పదం 'బాషరి అనే ధాతువు నుంచి వచ్చింది. దీని అర్థం “ఏదైనా పనిని స్వయంగా చేయటం)” అని వస్తుంది. ఒక అరబ్బు వ్యక్తి చూడండి, ఫలానా పనిని ఇతరులపై పెట్టకుండా స్వయంగా మీరే చేయండి” అని చెప్పటానికి “ఇఫ్‌ అల్‌హు ముబాషరతన్‌” (అంటే పనిని స్వయంగా మీరే చేయండి) అని అంటాడు. లేదా అతను 'నేనే స్వయంగా అక్కడికి వెళ్లాను. ఎవరినీ పంపలేదు” అని అనటానికి “జుహబ్‌తు ముబాషరతన్‌” అంటాడు. ఇదేవిధంగా పదం ఒక స్త్రీ, ఒక పురుషుడు శారీరకంగా దగ్గరైనప్పుడు కూడా వాడబడుతుంది. అయితే దీని అర్ధం లైంగికంగా కలుసుకున్నారన్నది ఎంతమాత్రం కాదు. ఇక్కడ కూడా అదే అర్థంలో వాడబడింది. కాబట్టి ప్రవక్త (స) సన్నిధిలో హాజరైన వ్యక్తి 'నేను రోజాలో వున్నప్పుడు నా భార్యతో కలవవచ్చా' అని విన్నవించుకున్నాడు. అలా ప్రశ్నించిన వ్యక్తి వయోవృద్దుడు కాబట్టి అతనికి దైవప్రవక్త (స) అనుమతినిచ్చారు. ఇదే విషయమై ప్రశ్నించిన మరో వ్యక్తి యువకుడు కావటాన ప్రవక్త (స) అతనికి అనుమతినివ్వలేదు. వృద్దుడు అయిన వ్యక్తి అతను నిగ్రహించుకోలేనంతగా లైంగిక ఉద్రేకం రాదన్న విషయం తెలిసిన విషయమే. అదే యువకుడైన వ్యక్తి తన వుద్రేకాన్ని అదుపులో పెట్టుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు అతను రోజాను భంగపరచగలడు. ఫలితంగా అతను కష్టాల్లో పడతాడు. అందుకనే ఇలాంటి వ్యక్తి ప్రీతో కలవకుండా దూరంగా మసలుకోవటంలోనే శ్రేయం దాగివుంది.

హదీసు ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ఇలాంటి చర్య (కలయిక) అనుమతించబడిందే. అయినప్పటికీ ఎవరైతే తనను తాను అదుపులో వుంచుకోలేడో అతను ఇలాంటి చర్యకు దూరంగానే వుండాలి. అయితే తనను నిగ్రహించుకునే శక్తి గల వ్యక్తి అవకాశం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

106 ఆత్మ (ప్రక్షాళనం రోజూ దానంతట అదే వాంతి అయినప్పుడు రోజా భంగం కాదు

abd LIGIER Ca

BCT TATE ONT

CTD OIE

కలప భరము టు. ఆడమ్‌ ees 51. హజ్రత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు : రోజాలో వున్నవేళ దానంతట అదే వాంతి చేసుకున్న వ్యక్తి తన రోజాను ఖజా చేసుకోవలసిన అవసరం లేదు. అయితే బుద్ధిపూర్వకంగా వాంతి చేసుకున్న వ్యక్తి తన రోజాను ఖజా చేసుకోవాలి. (తిర్మిజీ, అబూదావూద్‌, ఇబ్నెమాజా, దారిమీ)

వ్యక్తికయినా దానంతట అదే వాంతి అయితే దాని అర్థం బుద్ధిపూర్వకంగా అతను రోజాను భంగపరచలేదు. ఇది కూడా రోజాలో మరచిపోయి తిన్నవాడితో సమానం. మరచిపోయి ఎవరైనా వ్యక్తి కడుపు నిండా భుజించినప్పటికీ రోజా ఖజా కాదు. కావాలని చేసినప్పుడే అది ఖజా అవుతుంది. అదేవిధంగా ఎవరైనా వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా వాంతి చేసుకున్నట్లయితే అతను రోజాను తప్పక ఖజా చేయాలి. ఒకవేళ ఎవరికైనా కడుపులో ఏదో తెలియని బాధ కారణంగా దానంతటదే వాంతి అయినట్లయితే, అది కొంచెమయినా లేక అనేకసార్లు అయినా అట్టి పరిస్థితిలో అతని రోజా భంగం కాదు.

వాంతి అయినట్లయితే నఫిల్‌ రోజాను విరమించుకోవాలి

SWI TLE ESI CE yy perp HUTS Ps

WEE a OF EEG SWE; PT 22m

నంజ ట్‌ కో ఠీ డాయ! వరం! DE శ్రమే

Me de tre sth ot Js డం లీ వం యు promos snr RTA G

(Css

ఆత్మ ప్రక్షాళనం రోజా 107 52. జనాబ్‌ మఅదాన్‌ బిన్‌ తల్లా (రహ్మ) ఉల్లేఖించారు : హజత్‌ అబుద్దర్‌దా (రజి) నాతో ఇలా అన్నారు-దైవప్రవక్త (స) వాంతి చేసుకున్నారు, తరువాత ఇఫ్టార్‌ చేసి రోజా విరమించారు. మఅదాన్‌ తన మాటను కొనసాగిస్తూ, డెమాస్మస్‌ మస్టిద్‌లో నేను, హజ్రత్‌ సౌబాన్‌(రజి)ని కలిసి నప్పుడు నేను వారితో అన్నాను - హజ్రత్‌ అబుద్దర్‌దా (రజి) గారి “దైవప్రవక్త (స) వాంతి చేసుకుని, రోజా ఇఫ్టార్‌ కూడా చేశారు అన్న ఉల్లేఖనాన్ని విన్పించాను. ఆపై హజత్‌ సౌబాన్‌ (రజి) ఇలా సమాధానం ఇచ్చారు : 'హజత్‌ అబుద్దర్‌దా (రజి) సత్యం పలికారు. నేను స్వయంగా దైవప్రవక్త (స) గారి చేతులపై నీళ్లు పోశాను, ఇంకా పుక్కిలించటానికి ఆయన(స)కు నీళ్లు కూడా ఇచ్చాను.” (అబూదావూద్‌, తిర్మిజీ, దారిమీ) దైవప్రవక్త (స) గారి రోజా, నఫిల్‌ రోజా కోవకు చెందినదన్న విషయాన్ని గ్రహించాలి. ప్రవక్త (స) గారికి ఏదైనా బాధ కలిగివుండవచ్చు, తత్మారణంగా ఆయన (స) ఇఫ్లార్‌ చేసి వుండవచ్చు.

రోజా స్థితిలో మిస్వాక్‌ చేయటం అభిలషణీయమే

మాతంర hey hele టాటా Mgr > Aaa 22 tb ళ్‌ Aste (తినడము 25

58. హజ్రత్‌ ఆమిర్‌ బిన్‌ రబీయ (రజి) ఉల్లేఖించారు: “నేను దైవప్రవక్త (స)ను

ఉపవాస స్థితిలో మిస్వాక్‌ చేస్తుండగా లెక్కలేనన్ని మార్లు చూశాను.”

(తిర్మిజీ, అబూదావూద్‌)

దీని వలన తెలిసిందేమంటే రోజాలో వున్నప్పుడు మిస్వాక్‌ చేయవచ్చు.

దానితో రోజాకు ఎలాంటి భంగం వాటిల్లదు.

రోజా స్థితిలో సుర్మా పెట్టవచ్చా?

het edd IE Ce UIs లీ SU బో 2 సమగ్రత AEs

(ba) 0G ls

108 ఆత్మ ప్రక్షాళనం రోజా 54. హజ్రత్‌ అనస్‌ (రజి) ఉల్లేఖనం : ఒక వ్యక్తి దైవప్రవక్త (స) సన్నిధిలో

హాజరై ఇలా విన్నవించుకున్నాడు - నా కళ్లల్లో బాధగా వుంది, రోజా

స్థితిలో నేను సుర్మా పెట్టుకోవచ్చా? అని. దానికి ఆయన (స) “అవును,

పెట్టుకోవచ్చు” అని అన్నారు. (తిర్మిజీ)

ఉల్లేఖనం బలహీనమైనది. అందుకని ఒకవేళ దీన్ని నిజమైనదిగా నమ్మినట్లయితే దీనిద్వారా మీదు మిక్కిలి తెలిసేదేమంటే - సుర్మా పెట్టవచ్చు అని. ఎందుకంటే అది చిన్నపాటి పదార్థం. కాని దీన్ని ఆధారంగా చేసుకొని కళ్లల్లో కారేవిధంగా మందుపెట్టుకోవచ్చని భావించరాదు. ఎందుకంటే కంటికి, కంఠానికి మధ్య ఎలాంటి అడ్డుగోడ ఉండదు. ఒకవేళ మీరు ఏదైనా రంగు గల మందును కళ్లల్లో పెట్టుకున్నట్లయితే కొంత సేపటి తరువాత దాని రంగు కంఠంలోకి దిగినప్పుడు మీరు వుమ్మివేస్తే, మీ ఉమ్మి కూడా అదే రంగులో ఉంటుంది.

కళ్ళకు బదులు చెవుల్లో మందు వేయటానికి అనుమతి ఉంది. ఎందుకంటే చెవులకు కంఠానికి మధ్యలో ఒక పొర అడ్డంగా ఉంటుంది. దానివలన మందు కంఠంలోకి దిగదు. ఒకవేళ చెవి నిండా మందువేసినా దాని కొద్దిపాటి తడి కూడా కంఠంలో దిగదు. దీనికి ప్రతిగా కంటిలో కాస్త మందు వేసినా వెంటనే అది కంఠంలో దిగిపోతుంది. ఎందుకంటే కొంతమందికి విషయం తెలియదు, అందువల్ల చెవి లోతుగా ఉంటుంది కాబట్టి బాహ్యపరంగా చూస్తే అది రంధ్రం గుండా లోపలికి దిగటం వల్ల రోజా భంగమవుతుందని భావిస్తారు, అందుకని కళ్ళల్లో మందువేయటం వలన రోజా భంగం కాదని అనుకుంటారు. చూడబోతే వ్యవహారం తద్భిన్నంగా ఉంది.

వాస్తవానికి ఇది ఫిఖా సమస్య కాదు. ఇది వైద్యపరమైన సమస్య. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తికి మానవ దేహ నిర్మాణం గురించి తెలిసివుంటే అతను దీన్ని బాగా అర్థం చేసుకుంటాడు.

రోజాలోని తీవ్రతను తగ్గించటానికి స్నానం చేయటం, తలపై నీళ్ళు చల్లుకోవటం సమ్మతమే

బుయ్రర్తనేలోమంంప డం దీదీ నా సాం నా చరమదశ తయరు LDR EET (మో 6D ధరం

ఆత్మ ప్రక్షాళనం రోజా 109 55. దైవప్రవక్త (స) గారి ఒక సహాబీ ఇలా ఉల్లేఖించారు : నేను ప్రవక్త (స)ను “అర్‌జ్‌* అనే ప్రదేశంలో చూశాను. అప్పుడు ఆయన తలపై నీళ్ళు చల్లుకుంటున్నారు. సమయంలో ఆయన (స) రోజాలు వున్నారు. దాహం కారణంగానో లేక వేడిమికి తాళలేకనో అలా చేశారు. (మాలిక్‌, అబూదావూద్‌) దాహార్తి కారణంగానో, ఎండతాపం కారణంగానో వాటి తీవ్రత నుంచి ఉపశమనం పొందటానికి ప్రవక్త (స) రోజా స్థితిలో వుండి తలపై నీళ్ళను చల్లుకోవటాన్ని దైవప్రవక్త (స) గారి సహచరులు (రజి) చూడటం జరిగింది. దీనివలన తెలిసేదేమంటే దీని మూలంగా రోజాలో ఎలాంటి భంగం వాటిల్లదు. అందువలన మీరు నీటి తొట్టెలో మీ దేహం మునిగేలా కూర్చోవచ్చు, మీ తలపై మాటిమాటికీ నీరు చల్లుకున్నా మీ రోజాకు భంగం వాటిల్లదు. ఇలా ఎక్కువ సమయం వరకు చేసినా సరే. నీళ్ళల్లో కూర్చున్నా లేక స్నానం చేసినా వేడి, తాపం తగ్గిపోతుందన్న విషయం తెలిసిందే. కాని దీని వలన రోజాకు భంగం వాటిల్లదు. అయితే మీ గొంతులో ఒక్క చుక్క నీరు దిగినా మీ రోజా భంగమయిపోతుంది.

రోజాలో వున్నప్పుడు పచ్చాలు (శరీరంలోని చెడురక్తాన్ని బయటికి తీసే పద్ధతి) వేయించటం

ఆశ్నవ!గ్రడ ౮లో ql Se ప్‌ ది] TERA IE IIs 4 eth Cale seal bye Azle “యాగ (జప భయప 56. హజ్రత్‌ షద్దాద్‌ బిన్‌ బెస్‌ (రజి) ఇలా ఉల్లేఖించారు : దైవప్రవక్త (స) బఖీహ్‌ అనే చోటును సందర్శించినప్పుడు అక్కడ ఒక వ్యక్తి పచ్చాలు వేస్తున్నాడు. సందర్భంలో ఆయన (స) నా చేతిని పట్టుకొని వున్నారు. రోజు రమజాన్‌ 18వ తేది. “పచ్చాలు వేసేవారు, వేయించుకునేవారు ఇద్దరి రోజాలు భంగమయిపోయాయి” అని ఆయన (స) చెప్పారు. (అబూదావూద్‌, ఇబ్నెమాజా, దారిమీ)

110 ఆత్మ ప్రక్షాళనం రోజా

ఇంతకు క్రితమే హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ అబ్బాస్‌ (రజి) ఉల్లేఖించిన హదీసులో “స్వయంగా (ప్రవక్త (స) రోజాలు వుండి పచ్చాలు వేయించుకున్నారు” అని తెలుపబడింది. అయితే ఇక్కడ దైవప్రవక్త (స) “పచ్చాలు వేసేవారు, వేయించు కునేవారు ఇద్దరి రోజా భంగమయిపోయింది” అని సెలవిచ్చారు. ఇక్కడ రెంటిలో హదీసును అనుసరించాలన్న ప్రశ్న ఉదయిస్తుంది.

ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ (రహ్మ) హదీసును స్వీకరించారు. దీని ఆధారంగానే ఆయన రోజాలో వున్నప్పుడు పచ్చాలు వేసేవారు, వేయించుకునేవారు ఇద్దరి రోజా భంగమవుతుందన్న అభిప్రాయంతో ఏకీభవించారు. కొంతమంది దృష్టిలో ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ హదీసును దేని ఆధారంగా అంగీకరించారంటే - పచ్చాలు వేయించుకున్న వ్యక్తి దేహం నుంచి రక్తం స్రవించి అతను నిస్సత్తువకు లోనయి రోజాను విరమించటానికి పూనుకుంటాడు. అదేవిధంగా కొమ్ము లేక కప్పు ద్వారా రక్తాన్ని పీల్చే వ్యక్తి రక్తం పీలుస్తున్న సమయంలో పొరపాటున ఒక చుక్క రక్తం అతని గొంతులోకి దిగినా అతని రోజా కూడా భంగమయ్యే ఆస్మారం, అనుమానం వుంది.

అయితే హదీసు విషయంలో ఇతర ఉల్లేఖనాల ద్వారా అందిన వివరాల ప్రకారం తెలిసిందేమంటే హదీసులో తెలిపిన సంఘటన మక్కా విజయం తర్వాతి కాలంలో సంభవించింది. అప్పుడు హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ దైవప్రవక్త (స) పచ్చాలు వేయించుకోవటాన్ని చూశారు. అది వీడ్కోలు హజ్‌ నాటి సందర్భం. అందుకనే ఫిఖావేత్తల్లోని ఒక వర్గం వారు ఏమంటారంటే - విషయంలో హజత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌(రజి) గారి సాక్ష్యం కాలక్రమం రీత్యా ప్రవక్త (స) గారి చివరి ఆచరణగా తెలుస్తోంది. కాబట్టి వ్యవహారంలో చివరి ఆదేశం, హితవు ఏమంటే పచ్చాలు వేయించుకోవటం ద్వారా రోజా భంగం కాదు. ఇమామ్‌ అబూ హనీఫా (రహ్మ), ఇమామ్‌ మాలిక్‌ (రహ్మ) ఇంకా ఇమామ్‌ షాఫియి (రహ్మ) గారి అభిప్రాయం కూడా ఇదే.

జీవితాంతం ఉండే రోజాలు, రమజాన్‌లోని ఒక్క రోజాకు కూడా సాటిరావు Bhs An చం AF sh CPAs ih దయయ యా ప్రవీల్తాలోతళ పమ [క తం As lash)

4 Ee wins 2 ost Poh. hes ce (SES GIDE S15 5 Sa సమం

ఆత్మ ప్రక్షాళనం రోజా 111

57. హజత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా

ప్రవచించారు : ఎవరైనా ఒక వ్యక్తి ఎలాంటి బలమైన కారణం లేకుండా

లేక ఎలాంటి అనారోగ్యానికి గురికాని స్థితిలో రమజాన్‌లోని ఒక రోజా

విడిచిపెడితే అది అతను తన జీవితాలతం రోజాలు వున్నా ఒక్క రోజాకు అవి ప్రత్యామ్నాయం (ఖజా) కాజాలవు.

(అహ్మద్‌, తిర్మిజీ, అబూదావూద్‌, ఇబ్నెమాజా, దారిమీ, బుఖారీ)

ఇది రమజాన్‌ రోజాకు చెందిన ఖజా తాలూకు షరీఅత్‌ ఆదేశం కాదు. ఎవరైనా వ్యక్తి ఖజా రోజా పాటిస్తే అది పూర్తవుతుంది. కాని వాస్తవమేమంటే అల్లాహ్‌ వద్ద అతని జీవితాంతపు రోజాలు కూడా పుణ్యఫలం, ఇంకా బెన్నత్యం రీత్యా తాను రమజాన్‌లో బుద్ధిపూర్వకంగా విడిచిపెట్టిన ఒక్క రోజాకు సరిసమానం కాజాలవు. ఏదైనా షరీఅత్‌ కారణం రీత్యా రోజాను విడిచిపెడితే అది వేరే విషయం. అట్టి పరిస్థితిలో మనిషి ఖజా రోజాలు ఉండవచ్చు. కాని అంగీకారయోగ్యం కాని విషయమేమంటే ఎలాంటి షరీఅత్‌ కారణం లేకుండా ఉద్దేశ్యపూర్వకంగా రోజాను విడిచిపెట్టడం ఎలాంటిదంటే అతను జీవితకాలమంతా రోజాలున్నా దానికి సాటి రావు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే షరీఅత్‌లో కొన్ని విషయాలు చట్టపరమైన స్థాయి కలిగివుంటే మరికొన్ని నైతిక స్థానం కలవిగా వుంటాయి. చట్టపరమైనవి ఏమంటే ఒకవేళ ఎవరైనా బుద్ధిపూర్వకంగా ఏదైనా ఒక రోజాను విడిచిపెడితే అతనిపై ఖజా తప్పనిసరి అవుతుంది. చట్టం కోరేదేమంటే అతను ఖజా రోజా పాటించాలన్నది. అయితే హదీసు రీత్యా తన రోజాను ఖజా చేసే నైతిక స్థానం ఏమంటే ఒక్కరోజు ఖజా ఉపవాసమే కాదు అతను జీవితాంతం రోజాలు పాటించినా అతను బుద్ధిపూర్వకంగా విడిచిపెట్టిన రోజాకు అవి సాటి రావు.

అసలు ఉద్దేశం రోజా బాహ్యరూపం కాదు, కావలసింది దాని వాస్తవ ఊపిరి

జడల $25 ర్రేశలేడ కంకశ్ట dA Helse చేతలో: D5 టు

Gr Jig డత 1 Wi) bys. 2415}

112 ఆత్మ ప్రక్షాళనం రోజా 58. హజత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు : ఎంతోమంది ఉపవాసాలుంటారు - వారు దప్పికతో పడివుండటం తప్ప వారికి దక్కేది మరేమీ లేదు. మరెంతోమంది రాత్రిళ్ళు నిల్చొని దైవారాధన చేస్తారు - కాని వీరి ఆరాధన వలన

వారు నిద్ర నుంచి దూరమవటం తప్ప వారికి దక్కేది మరేమీ లేదు. (దారిమీ)

హదీసు ద్వారా తెలిసేదేమంటే ఆచరణల స్థాయి రెండు విధాలు. ఒకటి బాహ్యపరమైనది. అంటే వాటిని బాహ్యపరంగా ఎలా ఆచరిస్తే అలా అవి నెరవేర్చబడతాయి. రెండవది, గోప్యమయినది. అంటే దీనిద్వారా ఆచరణ అసలు ఉద్దేశం, ఆశించబడిన దాని ఊపిరి. షరీఅత్‌ సూచించిన విధంగా ఏదైనా పనిచేస్తే, దాని అర్ధం మీ బాధ్యతను మీరు నిర్వర్తించారన్నమాట. అంటే మీ విధిని మీరు నెరవేర్చారన్నమాట. దీని తరువాత రెండవ కారణం ఆచరణకు ఊపిరిలాంటిది. శరీరం నుంచి ప్రాణం విడిపోయినప్పుడు, చూడటానికి దేహమైతే ఉన్నదున్నట్లు కన్పిస్తుంది, అయితే తేడా ఏమంటే మొదట అందులో ప్రాణమున్నది, ఇప్పుడు అందులో ప్రాణం లేదు, తేడా అంతే. అందులో ప్రాణమున్నంత వరకు దాన్ని సమాధి చేయాలన్న తలంపు రాదు మీకు. అయితే అది చచ్చిపోతే మీరు దాన్ని మీ వద్ద ఉంచడానికి ఇష్టపడరు. అలాగే ఆచరణలకు కూడా వాటి బాహ్యాచరణ, గుప్తాచరణలుంటాయి. ఒక మనిషి షరీఅత్‌ చూపినవిధంగా ఆచరించకపోతే షరీఅత్‌ దృష్టిలో అతని ఆచరణ నిరర్థకమైనది. ఇంకా తన ఆచరణలో వాంఛించిన నిజమైన జీవాత్మ లేకపోతే దేవుని దృష్టిలో అతని ఆచరణ అవాస్తవమైనదిగా, తేలికైనదిగా తేలిపోతుంది.

ఉదాహరణకు ఒక వ్యక్తి రోజా పాటించి పగలంతా ఏమీ తినలేదు, త్రాగలేదు. కాబట్టి రోజా యొక్క బాహ్యాచరణను నెరవేర్చాడు. ఒకవేళ అతను పగలంతా దేవుణ్ణి మరచిపోయి చేయకూడని పనులన్నీ చేస్తూ పోయినట్లయితే, అతన్నుద్దేశించి అతను రోజాయే వుండలేదని అనలేము, లేదా అతని రోజా భంగమయిందనీ చెప్పలేము. రోజా స్థితిలోనే అతను అబద్ధం పలికాడు, మరొకరిపై నిందమోపడమూ చేశాడు, ఇలాంటి పరిస్థితిలో అతను రోజా కాంక్షించే అసలు ఉద్దేశ్యాన్ని నాశనం చేశాడు లేక ఖూనీ చేశాడు. విధంగా అతని రోజా నిర్జీవమైపోయింది - మృత కళేబరంలా. వాస్తవానికి వ్యక్తి తన రోజాను ఆకలిదప్పులతో గడిపాడు తప్ప మరేదీ సాధించలేదు.

ఆత్మ (ప్రక్షాళనం రోజా 113

ఇదేవిధంగా ఎవరైనా ఒక వ్యక్తి రమజాన్‌ రాత్రిళ్ళల్లో జాగరణ చేసి, దైవారాధనలో తన కాలాన్ని గడుపుతాడు. అలాంటప్పుడు అతన్నుద్దేశించి అతను జాగరణ చేయలేదని, దైవారాధన చేయలేదని అనలేము. కాని తన జాగరణ నిజ భావంలో దేవుని వైపు మరలే భావనను సృజించలేకపోతే, ఇంకా తన ఆరాధనను స్వచ్చంగా, నిర్మల మనస్సుతో చేయకపోతే, తన రాత్రి జాగరణ, ఆరాధన కేవలం ఒక కల్తీ ఆచరణగా, జీవాత్మలేని, ప్రాణంలేని ఆచరణగా పరిగణించబడుతుంది. దీనివలన అతనికి రాత్రి జాగరణ తప్ప మరేదీ ప్రాప్తం కాదు.

అంతే, షరీఅత్‌ కోరుకునేదేమంటే మీ ఆచరణలు బాహ్యపరంగానూ, చట్టానికి లోబడి వుండాలి, ఇంకా వాటిలో వాస్తవమైన జీవాత్మ కూడా ఉండాలన్నమాట - మీ ఆచరణల వాస్తవమైన ఆత్మ ఏమిటంటే, అల్లాహ్‌ స్మరణ, ఆయన పట్ల పేమ, ఆయన ప్రీతిని పొందేకాంక్ష ఆయన సన్నిధిలో హాజరై జవాబు చెప్పుకోవాలన్న భావన, ఆయన భీతి, అన్ని వేళల్లోనూ ఆయన ఆదేశాలు, చట్టాల పట్ల విధేయత చూపటం, వాటిని పాలించే భావన కలిగి వుండటం - వీటన్నిటి ద్వారానే ఆచరణలో, ఊపిరి, జీవం జనిస్తాయి. ఇవి లేకుంటే బాహ్యపరంగా కేవలం షరీఅత్‌ నిబంధన పూర్తవుతుంది. ఇంకా చట్ట వ్యతిరేకత నుంచి కూడా అతను బాహ్యపరంగా తప్పించుకోగలడు. అయితే ఆచరణల్లో నిజమైన జీవాత్మకు దూరమైపోతాడు. ఫలితంగా అల్లాహ్‌ సన్నిధిలో అతని ఆచరణలు ఎలాంటి గౌరవానికి, మూల్యానికి నోచుకోవు.

మూడవ భాగం మూడు చర్యల వల్ల రోజా భంగం కాదు లట పత రరతం CHE ది DIED Saheb Jog ESD నూ Ge Giang 59. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు : మూడు చర్యలు ఉపవాసి ఉపవాసాన్ని

భగ్నం చేయవు. 1. పచ్చాలు (హిజామా) వేయటం, లేక వేయించుకోవటం వలన.

2. వాంతి చేసుకోవటం వలన.

114 ఆత్మ ప్రక్షాళనం రోజా శి. కలలో వీర్యస్థలనమవటం వలన. (తిర్మిజీ) హదీసులో పేర్కొన్న వాంతి ఎలాంటిదంటే దానంతట అదే వచ్చిన వాంతి అన్నమాట. అంతేగాని మనిషి ఏదైనా అవసరం కారణంగానో, లేదా బాధ రీత్యానో నోటిలో వేళ్ళుపెట్టి లేదా మరో పద్ధతి ద్వారా చేసుకున్న వాంతి కాదన్నమాట. ఇలా బలవంతంగా వాంతి చేసినట్లయితే రోజా భంగమయిపోతుంది, ఇంకా ఖజా తప్పనిసరి అవుతుంది.

రోజా స్థితిలో పచ్చాలు వేయించుకోవటానికి షరీఅత్‌ రీత్యా తగు

కారణం Te SIG బర్‌ భరిత శక

ఉండ గనం సరవా గళ్ళ 1 ఉమ్యదలుపు వరత యక (జిమశవు

60. జనాబ్‌ సాబిత్‌ బనానీ (రహ్మ) (తాబయీ = సహాబా తరువాతి వారు) ఇలా చెప్పారు : నేను హజత్‌ అనస్‌ (రజి) బిన్‌ మాలిక్‌తో “మీరు (ఇక్కడ కొందరు సహాబాలు అని ఉద్దేశం) దైవప్రవక్త (స) గారి కాలంలో రోజాలోవున్న వ్యక్తి పచ్చాలు వేయించుకోవటాన్ని మక్రూహ్‌ (అవాంఛ నీయం) గా భావించేవారా?” అని అడిగారు. హజ్రత్‌ అనస్‌ (రజి) దీనికి సమాధానంగా, “లేదు, అయితే దీనివలన బలహీనత తప్పక ఏర్పడుతుందన్న ఉద్దేశంతో వాటి జోలికి పోయేవారం కాదు” అని అన్నారు. (బుఖారీ)

తెలిసిందేమంటే పచ్చాలు వేయించుకోవటం వల్ల బలహీనత కలగటం ఖాయం. దీనివలన భరించలేని బాధ, నొప్పి కలిగినట్లయితే, రోజాను కూడా భంగం చేయాల్సి వస్తుందనే శంకతో ప్రవక్త (స) సహచరులు (రజి) దీనికి దూరంగా వుండేవారు. అయితే వారు పచ్చ్నాలు వేయించటం వలన రోజా భంగమవుతుందన్న భావనను కలిగివుందేవారు కాదు.

కొన్ని హదీసుల్లో పచ్నాలు వేయటం, వేయించుకోవటం వలన ఆయా రోజుల్లోని రోజాలు భంగమవుతాయని పేర్మొనటం జరిగింది. అందువలన తాబయీన్‌ (రహ్మ్ర)లు సహాబాతో సంప్రదించి మరీ విషయంలో షరీఅత్‌ భావన ఏమిటన్నది తెలుసుకునేవారు. హదీసులోని చర్చనీయాంశం కూడా అదే.

ఆత్మ ప్రక్షాళనం రోజా 115 రోజాలో పచ్చాలు వేయించే విషయంలో హజ్రత్‌ అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ (రజి) గారి ఆచరణ

HILL pd CF Soares, పృద rrr

61. ఇమామ్‌ బుఖారీ (రహ్మ) (ఎలాంటి ప్రమాణాధారం లేకుండా) ఇలా ల్లేఖించారు : హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) గారి విధానం ఏమంటే, ఆయన రోజాలో వున్నప్పుడు పచ్చాలు వేయించుకునేవారు. తరువాత ఆయన దీన్ని మానుకొని, రాత్రివేళ పచ్చాలు వేయించటం మొదలెట్టారు. (బుఖారీ)

ఇమామ్‌ బుఖారీ (రహ్మ) గారి పద్ధతి ఏమిటంటే కొన్నిసార్లు ఆయన ఏదైనా సమస్యను వివరించటానికి ఎవరైనా సహాబీ లేక తాబయీ ఉల్లేఖనం లేక ఆచరణను ఎలాంటి ప్రమాణం లేకుండా పేర్కొంటారు. ఇలాంటి ఉల్లేఖనాలు లేదా ఆచరణలను హదీసులుగా పరిగణించటం జరగదు. అయితే అవి తులమానం రీత్యా నమ్మదగ్గవి గానే పరిగణించబడేవి. ఎందుకంటే ఇమామ్‌ బుఖారీ పరిశోధకులు. ఆయన గట్టి నమ్మకంగా పేర్కొన్నదేదైనా వాస్తవ విరుద్ధం ఎంతమాత్రం కాదు.

ఇమామ్‌ బుఖారీ (రహ్మ) గారి ఉల్లేఖనం ద్వారా తెలిసేదేమంటే ఒకవేళ రోజాలో పచ్చాలు వేయించుకోవటం మక్రూహ్‌ అయి, రోజాకు భంగం వాటిల్లితే హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) ఇలా చేసేవారే కాదు. పిదప పచ్చాలు పగలు వేయించుకునే బదులు రాత్రిపూట వేయించుకోసాగారు. వయస్సులో పెద్దవారవటం చేత పగలు పచ్చాలు వేయించుకోవటం వలన బలహీనత ఏర్పడటాన్ని గమనించారు.

పుక్కిలించిన పిదప ఉమ్మిని మింగటం, ఏదైనా చెట్టు బంక లేదా గుగ్గిలం చెట్టు బంక వగైరా నమలటం గురించిన సమస్య

gr;

పటట Cy

పపం తోట

యు

116 ఆత్మ ప్రక్షాళనం రోజా

ళు

త్తం $5 భం rn WSs > యా త్య స్త (1

on

62. జనాబ్‌ అతా (రహ్మ) (ప్రఖ్యాత తాబయీ ఇంకా గొప్ప ఫిఖహ్‌వేత్త) వివరించే సమస్య ఏమిటంటే, ఎవరైనా వ్యక్తి (రోజాలో వున్నప్పుడు) పుక్కిలించి, నోటి నుంచి నీటిని పూర్తిగా ఉమ్మివేయాలి. ఆపై వ్యక్తి తన ఉమ్మిని మింగటంలో ఎలాంటి అభ్యంతరం లేదు - అది కూడా తన నోటిలో మిగిలివున్న దానిని (అంటే నీటి ప్రభావం) మాత్రమే. ఇంకా వ్యక్తి రోజా స్థితిలో ఎలాంటి చెట్టు బంకను గానీ లేదా గుగ్గిలం కాని నమలరాదు. ఎందుకంటే దాని ప్రభావం తన ఉమ్మిలో వుండి, దానిని మింగినట్లయితే వ్యక్తి రోజా భంగమవుతుందని మాత్రం నేను అనలేను, కాని అలాంటి చేష్ట నుంచి వారించటం జరుగుతుంది.

(బుఖారీ) ఇంతకు ముందు వచ్చిన ఉల్లేఖనంలానే దీన్ని హదీసుగా గాకుండా జనాబ్‌ అతా (రహ్మ) గారి ధార్మిక తీర్పు (ఫత్వా)గా పొందుపరచటం జరిగింది. దీని ఉద్దేశం ఏమిటంటే ఒకవేళ మనిషి రోజాలో పుక్కిలించి, నోటి నుంచి నీరు బయటికి ఊసిన తరువాత కూడా దాని ప్రభావం మిగిలివుండి, దాన్ని మింగినటైతే రోజా భంగం కాదు. నీటితో పుక్కిలించాక నీటి తేమ నోట్లో కొంచెమయినా మిగిలివుంటుందనేది అందరికీ అర్థమయ్యే విషయమే. నోటిలోని మొత్తం నీటిని ఊసేసినప్పటికీ ఎంతో కొంత ప్రభావం ఉమ్మితో పాటు లోపలికి వెళ్ళటం ఖాయం. కాని ఇది రోజాను భంగపరిచే వస్తువైతే కాదు. అయితే ఎవరైనా వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా నోట్లో కొంచెం నీటిని నిల్వవుంచి, ఉమ్మితో పాటు నీటిని మింగినట్లయితే అతని రోజా భంగమయ్యే అవకాశం ఉంది. ఇంకా అక్కడ బొగ్గును నమలరాదని కూడా చెప్పడం జరిగింది. మనం పళ్ళ పొడి (మంజన్‌) లేక టూత్‌ పేస్ట్‌ అన్న భావంలో కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి నోట్లో నీరు తీసుకొని బయటికి పుక్కిలిస్తాడు. అదేవిధంగా అతను పళ్లపొడి లేక టూత్‌పేస్ట్‌ ఉపయోగిస్తాడు. తరువాత పూర్తిగా నోటిని శుభ్రం చేస్తాడు. అలాంటప్పుడు అతని రోజా భంగమయ్యిందని చెప్పలేం. (ఇంతకు ముందు బొగ్గు

ఆత్మ ప్రక్షాళనం రోజా 117 విషయంలో చెప్పినట్లు). అయితే రోజావున్న వ్యక్తి ఇలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం.

నీరు అయితే ఉమ్మితో పాటు బయటికి వచ్చేస్తుంది. కాని ఇతర వస్తువులు కొంచెం గాఢత కలిగివుంటాయి. ఎంతగా పరిశుభ్రం చేసినా నోట్లో ఎంతోకొంత మిగిలివుండే ఆస్కారం ఉంది. అది రోజాను భంగపరిచేదిగా పరిణమిస్తుంది. అయితే మిస్వాక్‌ విషయం దీనికి భిన్నమైనది. ఎందుకంటే దైవప్రవక్త (స) రోజాలో మిస్వాక్‌ చేసేవారన్న విషయం రూడీ అయిన విషయం. అయితే మిస్వాక్‌ను కూడా ఎంతో కొంత నమలాల్సివస్తుంది, దాని రసం కూడా వెలువడుతుంది. కాని అందులో చిక్కదనం ఉండదు కాబట్టి అది నోటిలో అతుక్కుని వుండే అవకాశం లేదు. అందువలన మిస్వాక్‌ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇతర వస్తువుల విషయంలో అలా ఊహించుకోవటం కూడా భావ్యం కాదు. అందుకని బొగ్గు ఉదాహరణ ఇవ్వటం జరిగింది. ఇందులో ఒక రకమైన గాఢత వుంటుంది. అలానే మంజన్‌ లేదా టూత్‌పేస్ట్‌లో కూడా ఒకింత చిక్కదనం వుంటుంది. అందువలన వీటి వాడకానికి దూరంగా ఉండటమే మంచిది. *

A హదీసు పాఠం తరువాత మౌలానా గారు ఒక ప్రశ్నకు జవాబిస్తూ 'రోజాలో వున్నవ్హుడు టూత్‌పేస్ట్‌ వాడటం అభిలషణీయం కాదు, అయితే మిస్వాక్‌ దీనికి భిన్నమైనది” అన్నారు. (సంకలనకర్త)

118 ఆత్మ ప్రక్షాళనం రోజూ

spo

ప్రయాణీకుని రోజా

అధ్యాయంలో ప్రయాణంలో ఉన్నప్పుడు రోజా పాటించే ఆదేశాలు విశదీకరించబడ్డాయి.

ప్రయాణంలో ఉన్నప్పుడు రోజా పాటించినా, లేక పాటించకపోయినా రెండూ అనుమతించబడినవే SE TOSI Ey SEQ ih Jog GELS FETs od తము (alga) - sa ry

hie

62. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) విధంగా తెలిపారు : హజత్‌ హమ్‌జా (రజి) బిన్‌ అమ్‌ అస్లమీ గారు దైవప్రవక్త (స)తో “నేను ప్రయాణంలో వున్నవేళ రోజా వుండవచ్చా?” అని విన్నవించుకున్నారు. దీనిపై దైవప్రవక్త (స) “మనసు కోరితే రోజా వుండు, మనసు కోరకపోతే పాటించకు” అని సెలవిచ్చారు. (ముత్తఫకున్‌ అలైహ్‌) హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) ఉల్లేఖనాన్ని వివరిస్తూ విషయాన్ని

కూడా సెలవిచ్చారు : ప్రయాణీకుడు ఎలాంటివాడు” అని ఆరాదీశారు. ఎందుకంటే

ఆమె (రజి. అన్‌హా) ఎంతో ఉన్నత శ్రేణి ధర్మశాగస్రజ్ఞాని. షరీఅత్‌లోని సున్నితమైన అంశాలు కూడా ఆమె దృష్టిలో వుండేవి. అందుకని ఆమె వివరంగా సెలవిచ్చారు: పృచ్చకులైన హజ్రత్‌ హమ్‌జా (రజి) తరచుగా రోజాలు పాటించేవారు. ఇక్కడ ఆయన గారి ప్రశ్న నఫిల్‌ రోజాల గురించి కాదు, ఫర్డ్‌ రోజాల విషయం గురించి

ఆత్మ ప్రక్షాళనం రోజా 119 మాత్రమే. “రమజాన్‌లో నేను ఒకవేళ ప్రయాణం చేయాల్సివస్తే, నేను రోజాలు పాటించాల్నా లేక వద్దా?” అన్నదే ఆయన ప్రశ్న. దీనికి దైవప్రవక్త (స) “నీకు ఇష్టమైతే రోజా పాటించు లేకపోతే లేదు. రెంటిలోనూ నీకు అనుమతి ఉంది” అని సెలవిచ్చారు. విషయంలో హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) గారి వివరణ ఏమిటంటే, హజ్రత్‌ హమ్‌జా (రజి) గారికి తరచూ రోజాలు పాటించే అలవాటు ఉంది, కాబట్టి ఒకవేళ ఒక మనిషి సంవత్సరంలో తరచుగా రోజాలు పాటించే వాడయినప్పుడు, సాధారణ మనుషులకన్నా రోజాలో ఎదురయ్యే కష్టాన్ని తేలిగ్గా సహించగలడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి ప్రయాణంలో కూడా రోజాలు పాటించి నట్లయితే, ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలను, కేవలం రమజాన్‌లో మాత్రమే రోజాలుండే వ్యక్తికన్నా తేలిగ్గా ఎదుర్మోగలడని ఆమె (రజి. అన్‌హా) గారి అభిప్రాయం.

హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) గారి వివరణ వెలుగులో ఒక విషయాన్ని గ్రహించవచ్చు - ప్రయాణంలో వున్నప్పుడు రోజా పాటించాల్నా, వద్దా అన్న రెండు విషయాలూ సమాన ప్రాతిపదిక కలిగివున్నాయన్నది అసలు విషయం కాదు. ఇక్కడ చూడవలసిందేమంటే ఒక మనిషిలో కష్టాన్ని సహించేంత సహనం వుంది, మరొకరిలో అది లేదు. ఎవరిలోనయితే శక్తులున్నాయో అలాంటి వ్యక్తి రోజా వుండటంలోనే మేలుంది, మరే వ్యక్తిలోనయితే అంతటి శక్తి, సహనం లేదో అతను రోజా పాటించకుండా వుండవచ్చు.

విధంగా ప్రయాణావస్థలో వున్నప్పుడు ఎలాంటి సందర్భంలో రోజా ఉండటం ఉత్తమం, మరెలాంటి సందర్భంలో ఉండకపోవటం ఉత్తమమైందోనన్న విషయం కూడా తెలుస్తోంది. ధర్మవేత్తల్లో సమస్య గురించి భేదాభి ప్రాయముంది. ఇమామ్‌ మాలిక్‌ (రహ్మ), ఇమామ్‌ షాఫయి (రహ్మ) ఇంకా ఇమామ్‌ అబూ హనీఫా (రహ్మ) ప్రయాణంలో రోజా ఉండటాన్ని ఉత్తమమని నిర్ణయించారు. రోజా పాటించకపోవటాన్ని ప్రతిఫలం రీత్యా తక్కువ స్థాయిగా నిర్ణయించారు. ఇతర ఫిఖావేత్తలు రోజా ఉండకపోవటమే మేలని నిర్ణయించారు. మరికొంతమంది మేము ఇంతకు క్రితం వివరించిన విధంగా - అంటే రోజా వుండటమనేది మనిషి ప్రయాణంలోవున్న పరిస్థితి, అతని శక్తి, సహనాలపై ఆధారపడిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక వ్యక్తిలో కష్టాన్ని ఓర్చుకునే శక్తి ఎక్కువగా ఉండి అతను చేస్తున్న ప్రయాణంలో ఎలాంటి కష్టం ఎదురయ్యే అవకాశం లేకపోతే అలాంటి సందర్భంలో అతను రోజా పాటించడమే ఉత్తమం. దీనికి ప్రతిగా ఒక వ్యక్తిలో

120 ఆత్మ (ప్రక్షాళనం రోజా కష్టాల్ని ఎదుర్మొనే శక్తి లేకపోగా, అతను ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలను భరించటం కూడా కష్టంగా వున్నప్పుడు అతను రోజాలు పాటించకపోవటమే ఉత్తమం.

ప్రయాణంలో రోజా పాటించేవారు, పాటించనివారు ఒకరింకొకరిపై అభ్యంతరం తెలుపరాదు

J CAA ne Ean తయత్ర్న ప్ర లా లా డడ be fails bit dehy 55 యు!

64. హజత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ (రజి) కథనం : “మేము రమజాన్‌ 16వ తేదీన దైవప్రవక్త (స)తో ఒక యుద్ధం కొరకు బయలుదేరాము. అప్పుడు మాలో కొందరు రోజాలో ఉన్నారు, మరికొందరు రోజాలో లేరు. అయినా రోజా వున్నవారు లేనివారిని నిందించనూలేదు, రోజా పాటించనివారు పాటించిన వారిపట్ల ఆక్షేపణ తెలుపనూలేదు.” (ముస్లిం) హదీసులో తెలుపబడిన విషయమేమిటంటే ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి

ప్రయాణంలో రోజా పాటించకపోయినా లేక పాటించినా దీనికి ప్రతిగా వ్యవహరించే

వ్యక్తి అతని పట్ల ఎలాంటి విమర్శనా భావంతో వ్యవహరించరాదు. ఎందుకంటే షరీఅత్‌లో రెండు పరిస్థితులకూ అనుమతించబడింది. కాబట్టి వ్యక్తీ మరొకరి పట్ల వ్యతిరేక భావంతో వ్యవహరించే హక్కులేదు.

వ్యవహారంలో షరీఅత్‌లోని సున్నితమైన విషయాలను అవగాహన చేసుకోవాలి. దీని ఆధారంగానే హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ (రజి) సంఘటనను వివరించారు. షరీఅత్‌ నిబంధన ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి షరీఅత్‌లో అనుమతించబడిన రెండు పద్ధతుల్లోనూ ఏదో ఒకదానిని పాటిస్తే దాని పట్ల వ్యతిరేకత చూపే హక్కు మరే వ్యక్తికీ లేదు. ఒకవేళ ఎవరైనా ఇలా వ్యతిరేకత చూపిస్తే అలాంటి వ్యక్తి షరీఅత్‌ స్వభావాన్ని అర్ధం చేసుకోలేదు. ఇంకా వాస్తవానికి షరీఅత్‌నే తన చెప్పుచేతల్లో తీసుకోవటానికి ప్రయత్నించాడని అర్ధం. షరీఅత్‌ అయితే (ప్రజలకు

ఆత్మ (ప్రక్షాళనం రోజా 121 సరిసమానమైన హక్కుల్ని ప్రసాదించింది. అలాంటప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యవహారానికి మరో దానిపై ఆధిక్యతనిచ్చి ఇతరులను కించపరచే ప్రయత్నం చేస్తాడు. విధంగా ప్రజల పట్ల అనవసరంగా కాఠిన్యంగా వ్యవహరించి షరీఅత్‌లో అల్లాహ్‌ ప్రసాదించిన అనుమతులను లాక్కోవటానికి ప్రయత్నిస్తాడు. చూడటానికి విషయం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి రోజా పాటించినా పాటించకపోయినా మరొక వ్యక్తి అతన్ని దూషిస్తున్నాడు. ఇది చాలా తీవ్రమయిన విషయం. ప్రజల్లో సమానతా భావాన్ని సృజించటానికి, ఇంకా వారిలో షరీఅత్‌ ఆదేశాలను పాటించటానికి వాటిపట్ల విధేయులై మెలిగే భావనల్ని జనింపజేయాలి. దీనికొరకు మనిషి బాగా అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ఒక వ్యక్తి దేవుడిచ్చిన అనుమతి ద్వారా ప్రయోజనం పొందుతూ వున్నప్పుడు దాన్ని వ్యతిరేకించే హక్కు మరొక వ్యక్తికి లేదు.

నాం కాకపోతే ప్రయాణంలో రోజా పాటించవద్దు

యసవ poh 59 OD A aN yA RE] SE Ei ) IGE

(ఎకు త్ర కిము గ్యట్తరః

65. హజ్రత్‌ జాబిర్‌ బిన్‌ అబ్బుల్లాహ్‌(రజి) గారి ఉల్లేఖనం: “ఒకసారి దైవ ప్రవక్త (స) ప్రయాణంలో వున్నప్పుడు ప్రజలు ఒకచోట గుంపుగా ఏర్పడటాన్ని గమనించారు. వాళ్ళంతా ఒక వ్యక్తి చుట్టూ చేరి నీడ కల్పించారు. ఆపై ఆయన (స) “ఏమిటీ విషయం?” అని ఆరా తీయగా ప్రజలు ఇలా విన్నవించారు - “ఒక వ్యక్తి రోజాలో ఉన్నాడు, దాని కారణంగా అతనిలో బలహీనత ఏర్పడింది”. దీనిపై ఆయన (స) సెలవిచ్చారు : “ప్రయాణంలో (ఇలాంటి) రోజా వుండటం ఎలాంటి పుణ్యకార్యం కాదు.”

(ముత్తఫకున్‌ అలైహ్‌)

ధర్మశాస్త్రవేత్తలు ప్రయాణంలో రోజా పాటించరాదని హదీసు ఆధారంగానే పేర్కొంటారు. అయితే హదీసులో దైవప్రవక్త (స) ప్రయాణంలో రోజా వుండటాన్ని పుణ్యానికి విరుద్ధమని పేర్మొన్నట్లుగాని లేదా ఆయన (స) గారి ఉపదేశం ప్రత్యేక పరిస్థితుల్లోనే వర్తిస్తుంది అన్న విషయంగాని వివరంగా లేదు. అయితే ఇక్కడ కళ్ళ

122 ఆత్మ ప్రక్షాళనం రోజా ముందు ప్రత్యేక పరిస్థితే కన్పిస్తుంది - ఒక వ్యక్తి రోజా కారణంగా బలహీనుడైపోయాడు. తెలిసిందేమంటే అది తీవ్రమైన ఎండా కాలం. ప్రయాణం కూడా పగలే చేయటం జరిగింది. కాబట్టి దాన్ని వ్యక్తి తట్టుకోలేక పడిపోయాడు. ఆపై ప్రజలు అతని చుట్టూ చేరి నీడ కల్పించారు. పరిస్థితిని చూసిన దైవప్రవక్త (స) “ప్రయాణంలో వున్నప్పుడు ఇలాంటి రోజా ఉండటం ఎలాంటి పుణ్యకార్యమూ కాదు” అని సెలవిచ్చారు. దీని భావం ఏమిటంటే ఒక వ్యక్తి ప్రయాణంలో రోజా పాటించబోయే ముందు, అందులో ఎదురయ్యే కష్టాలను భరించే శక్తి తనలో వుందా లేదా ? లేక భరించశక్యం కాని ఎలాంటి కష్టాలైనా ఎదురవబోతున్నాయా? అనే విషయాలను స్వయంగా ఆలోచించుకోవాలన్నమాట. ప్రయాణం కూడా భారంగా తోస్తున్న పరిస్థితిలో ఒక వ్యక్తి అతి కష్టంతో రోజా పాటించడం, దానిపై కష్టాల పాలవడం ఏమాత్రం పుణ్యకార్యం కాదు. ప్రయాణం కష్టమని తోచినప్పుడు రోజా పాటించకపోవటమే శ్రేయస్కరం ర్త చా 411 ప్రార 23s pigs 41 C4 డ్రె స్త చా gb Gs Myer క. న! Shi as Be 66. హజ్రత్‌ అనస్‌ (రజి) గారి ఉల్లేఖనం : “మేము ఒక ప్రయాణంలో దైవప్రవక్త (స) గారితో వున్నాం. మాలో కొందరు రోజాలో వున్నారు, మరికొందరు రోజా పాటించని వారున్నారు. అత్యంత వేడిగా వున్న ఒక రోజు మేము ఒక ప్రదేశంలో విడిది చేశాము. రోజాలో వున్నవారు విడిదిలోకి వెళ్ళి పడుకున్నారు. రోజా పాటించనివారు గుడారాలను వేసి, ప్రయాణంలో వున్న ఒంటెలకు నీరు త్రాగించారు. దీనిపై దైవప్రవక్త (స) “ఈ రోజు రోజా పాటించనివారు పుణ్యఫలాన్ని జుర్రుకున్నారు” అని సెలవిచ్చారు. (ముత్తఫకున్‌ అలైహ్‌)

ఆత్మ ప్రక్షాళనం రోజా 123

హదీసులో సెలవిచ్చినట్లు ప్రయాణంలో వున్నప్పుడు రోజా పాటించక పోవడమే మేల్తరమన్న విషయం వైపునకే త్రాసు బరువుగా వంగుతోంది. దీని ప్రకారం ప్రయాణంలో రోజా వుండకపోవటం ఉత్తమం. పైన వివరించిన హదీసులో ఉపవాసం పాటించేవారు ఎండ తీవ్రతకు తట్టుకోలేక వెళ్ళగానే మేను వాల్చారు. వారిలో గుడారాలు వేసే శక్తి లేకపొయ్యింది, ఇంకా ఒంటెలకు నీరూ త్రాపలేకపోయారు. అందువలన రోజాలో లేనివారు పరుల విశ్రాంతి కోసం తగు ఏర్పాటు చేశారు. ఒకవేళ వారు కూడా రోజాలో వుండివుంటే అందరికందరూ పరుండేవారు. ఆపై గుడారాలు వేసేవారు, ఒంటెలకు నీరు త్రాపేవారు లేకపోయేవారు. కారణంగానే దైవప్రవక్త (స) “ఈ రోజు రోజా పాటించనివారు పరుల విశ్రాంతి కొరకు పాటుపడి పుణ్యాలను లూటీ చేశారు” అని సెలవిచ్చారు.

ఇక ఆలోచించండి, ప్రయాణంలో వున్నప్పుడు రోజా పాటించడం ఉచితమా లేక అనుచితమా అన్న విషయంలో రెండు కోణాలకు సంబంధించిన రుజువు లున్నాయి. రెంటిలోనూ తగిన బలం వుంది. దీనిపై ఇక ప్రయాణంలో రోజా వుండటం ఉత్తమమని వ్యక్తీ గట్టిగా చెప్పలేడు, కాదు ప్రయాణంలో రోజా పాటించకపోవటమే మేలని వ్యక్తీ గట్టిగా వాదించలేడు. తేలిందేమంటే నిర్ణయం తీసుకున్నా మనిషి తన సౌకర్యం, శక్తిపై ఆధారపడి వుంది. రోజు రోజా పాటించాలా మానుకోవాల్నా అనే విషయాన్ని తన పరిస్థితుల కనుగుణంగా నిర్ణయించుకోవాలి. రెండు కోణాలు సమాన ప్రతిపత్తిని కలిగివున్నాయి. నేను ప్రయాణంలో రోజా పాటించకపోతే పుణ్యాలు తక్కువయిపోతాయని, తరువాత వీటిని పూర్తిచేసుకోవాల్సివస్తే రమజాన్‌ రోజుల్లో ప్రాప్తమయ్యే పుణ్యాలు ప్రాప్తం కావేమో అన్న ఎలాంటి సందేహమూ అతని మనసులో వుండకూడదు. స్వయంగా అల్లాహ్‌యే ప్రయాణంలో రోజా పాటించకపోయినా ఫర్వాలేదని, తరువాత వాటిని ఖజా చేసుకోవచ్చన్న సౌలభ్యాన్ని కల్పించాడు. అలాంటప్పుడు తరువాత ఖజా రోజా వుంటే రమజాన్‌లో రోజా పాటించినంత పుణ్యం ప్రాప్తం కాదన్న శంక మనిషిలో ఏమాత్రం వుండరాదు. ఒకవేళ బలమైన కారణం లేకుండా రమజాన్‌లో రోజా విడిచిపెట్టినట్లయితే దాని వ్యవహారం వేరు. అలా చేస్తే రమజాన్‌లోని ఒక్క రోజా పుణ్యం మనిషి తన జీవితాంతం ఖజా పాటించినప్పటికీ దానికి సరిసమానం కాదు. ఇక్కడ వ్యవహారం పూర్తిగా భిన్నమైనది. ఇలాంటి స్థితిలో రోజా ఖజా చేయటం వలన ప్రాప్తమయ్యే పుణ్యంలో కొరత ఏర్పడుతుందన్న అనుమానం లేదు. అసలు

124 ఆత్మ ప్రక్షాళనం రోజా

విషయం ఏమిటంటే మనిషి తగిన విధంగా తన పరిస్థితుల్ని బేరీజు వేసుకొని తగు నిర్ణయం తీసుకోవాలి - రోజు నేను రోజా పాటించాల్నా వద్దా అనే విషయం. రెండు కోణాల్లో తన దృష్టి ఎక్కువగా ఎటు మళ్ళుతుందో దాన్ని ఆచరించాలి. పుణ్యఫలం రీత్యా రెండూ సమానత కలిగివున్నాయి.

గత్యంతరం లేని పరిస్థితుల్లో రోజా ముందుగానే విడవటానికి అనుమతి వుంది LESH EG 4 స్త్‌ వయం పపుర్తప రవ GOD SOE ప్రయ లగ తక అత్రి తుం తయ! dake hI No యాడ కదరా డంప్‌ rr యయ

> “97

టాయి! కాగ 67. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (రజి) గారి ఉల్లేఖనం: (మక్కా విజయం నాటి ప్రయాణ సందర్భంగా) దైవప్రవక్త (స) మదీనా నుంచి మక్కా వైపు బయలుదేరినప్పుడు ప్రయాణ మొత్తం ఆయన (స) రోజా పాటిస్తూనే 'ఉస్ఫాన్‌' అనే చోటికి (మదీనా మరియు మక్కాల మధ్యనున్న తీర ప్రాంతం) వరకు చేరుకున్నారు. అక్కడ ఆయన (స) నీరు తెప్పించి దాన్ని ప్రజలు కూడా చూసేలా చేతితో పైకెత్తారు. తరువాత ఆయన (స) ఇష్టార్‌ చేశారు. తరువాత మక్కా చేరేవరకు రోజా పాటించలేదు. ఇది రమజాన్‌ కాలంలో జరిగిన సంఘటన. దీని ఆధారంగా హజత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (రజి) ఇలా అన్నారు (అంటే ఇది ఆయన గారి ధార్మిక తీర్చు) : “దైవప్రవక్త (స) రమజాన్‌ మాసంలో ప్రయాణం చేసినప్పుడు ఒక్కోసారి రోజా పాటించారు, మరొకసారి పాటించలేదు.

ఆత్మ ప్రక్షాళనం రోజా 125 అందుచేత మీ కోసం కూడా ఆదేశం ఏమిటంటే, మీకు ఇష్టమైతే ప్రయాణంలో రోజాలు పాటించండి, ఇష్టం లేకపోతే పాటించకండి.” (ముత్తఫకున్‌ అలైహి) ఇంకా ఇమామ్‌ ముస్లిం గారు పేర్కొన్న హదీసులో హజ్రత్‌ జాబిర్‌ బిన్‌ అబ్బుల్లాహ్‌ (రజి) గారి పదాలు “దైవప్రవక్త (స) మఖామె ఉస్‌ఫాన్‌ వద్దకు వెళ్ళి అస్‌ర్‌ తరువాత నీరు త్రాగారు” అని అదనంగా ఉన్నాయి.

హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (రజి) గారి ఉల్లేఖనంలో, దైవప్రవక్త (స) పగలు సమయంలో రోజాను విరమించారన్న విషయం వివరంగా చెప్పబడలేదు. అయితే సహీహ్‌ ముస్లింలో హజ్రత్‌ జాబిర్‌ బిన్‌ అబ్బుల్లాహ్‌ (రజి) గారి ఉల్లేఖనంలో అది అసర్‌వేళ అని వివరంగా తెలుపబడింది. అయితే హజత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (రజి) గారి ఉల్లేఖనం సారాంశం కూడా అది పగటి సమయమనే తెలుపుతోంది - అది ఉదయమయినా లేక సాయంత్రానికి ముందైనా. ఎందుకంటే ఒకవేళ దైవప్రవక్త (స) సహ్‌రీ కంటే ముందు నీరు (త్రాగినటైతే దాన్ని తెలుపడంలో ఎలాంటి అర్ధం లేదు. ఒకవేళ మగ్రిబ్‌ తరువాత త్రాగారని తెలిపినా, దాన్ని కూడా తెలిపే అవసరమూ లేదు. మొత్తం మీద హజ్రత్‌ జాబిర్‌ (రజి) గారి ఉల్లేఖనం ద్వారా అది అస్‌ర్‌ వేళ అనే విషయం రూఢీ అవుతోంది.

హదీసులో హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) గారు; దైవప్రవక్త (స) నీటిని చేత్తో పైకెత్తి సైన్యంలో వున్న వారంతా చూసేలా నీరు త్రాగారు, దీంతో ఆయన (స)

వయా.

రోజా కూడా విరమించారు అన్న విషయాన్ని వివరంగా తెలిపారు.

హదీసు ద్వారా తెలిసిన మరో విషయం ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా రోజాలో వున్నప్పుడు, భరించశక్యం కాని పరిస్థితి ఏర్పడితే వ్యక్తి వేళకంటే ముందుగానే ఇఫ్తార్‌ చేయవచ్చు. ఒక కోణం ఏమిటంటే మనిషి ఏదైనా బలమైన అనివార్య కారణం వలన రోజా పాటించలేకపోవచ్చు. మరో కోణం ఏమంటే ఒక మనిషి రోజా అయితే పాటించాడు కాని ఆపై అతనికి భరించలేని పరిస్థితి దాపురించింది, అప్పుడు అతనికి రోజాను విడిచే అనుమతి వుంది. విధంగా రోజాను విడిచిపెట్టినట్లయితే అది రోజా భంగం చేసిన కోవలోకి రాదు, దానికి కప్ఫారా చెల్లించాల్సిన నిబంధన కూడా వర్తించదు. అయితే దీన్ని ఖజా చేయటం తప్పనిసరి అవుతుంది.

126 ఆత్మ ప్రక్షాళనం రోజా. ప్రయాణీకుడు, పాలు త్రాపించే స్రీ, గర్భవతికి రోజా విడిచిపెట్టే అనుమతి ఉంది

BY TIE GHW GT గం SNR Ol: Sei బలే జజుసీ! లక PE IHRE

2 994 హో!

ర. తష. Pees

68. హజ్రత్‌ అనస్‌ బిన్‌ మాలిక్‌ కిఅబియ్యో (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు : అల్లాహ్‌ ప్రయాణీకుని కొరకు నమాజ్‌లో సగభాగాన్ని తగ్గించాడు, ఇంకా ప్రయాణంలో రోజాను విడిచిపెట్టే అనుమతిని కూడా ఇచ్చాడు. ఇదే విధంగా పాలు త్రాగించే స్రీలకు, గర్భవతులైన స్త్రీలకు కూడా రోజా విడిచిపెట్టే అనుమతి వుంది.

(అబూదావూద్‌, తిర్మిజీ, నసాయి, ఇబ్నెమాజా)

సగం నమాజ్‌ను తగ్గించటమంటే 4 రకాతుల్లోని నమాజ్‌లో 2 రకాతులు మాఫీ చేయబడ్డాయి. ఇక్కడ మరో విషయాన్ని ప్రత్యేకించి చెప్పే అవసరం వుంది కాబట్టి దైవప్రవక్త (స) నమాజ్‌ ఆదేశాలను వివరంగా సెలవియ్యలేదు. కేవలం ప్రయాణీకుని నమాజ్‌ను సగభాగం తగ్గించటం జరిగిందని సెలవిచ్చారు (స). ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మూడు, రెండు రకాతుల నమాజుల్లో ఎలాంటి తగ్గింపు లేదు. నమాజ్‌లో తగ్గింపే కాకుండా ప్రయాణీకుడు రోజా వుండే కట్టుబాటును కూడా సడలించడం జరిగింది. అయితే రెంటిలో తేడా ఏమిటంటే ప్రయాణీకుడు రోజాను తప్పనిసరిగా ఖజా చేసుకోవాలి, కాని ప్రయాణంలో తగ్గించి చేసుకున్న నమాజులకు ఖజా లేదు. అంటే ప్రయాణంలో 4 రకాతులకు బదులు 2 రకాతులు నమాజ్‌ చేసుకొని, ఇంటికి చేరాక ప్రయాణంలో విడిచిపెట్టిన మిగతా 2 రకాతులు పూర్తి చేసుకోవాలన్నది దీని భావం కాదు.

ప్రయాణీకుడు, పాలు పట్టే స్రీ, గర్భవతులైన స్రీలకు రోజా విడిచిపెట్టే అనుమతి వుందన్న దాని భావం ఏమంటే, ఒకవేళ వారు రోజా పాటించకపోతే ఎలాంటి దోషం లేదు. అయితే ఒక ప్రయాణీకుడు ప్రయాణంలో పూర్తి నమాజ్‌లు ఆచరించటం అభిలషణీయం కాదు కాని, రోజా వుండే వ్యక్తి స్టోమతవుంటే అతను రోజా పాటించటం మేలు.

ఆత్మ ప్రక్షాళనం రోజా 127

సందర్భంగా మరో విషయాన్ని కూడా గమనించాల్సి వుంది. ఎవరైనా ఒక వ్యక్తి ప్రయాణంలో రోజాను విడిచిపె పెట్టినటైతే వాటి ఖజా పూర్తి చేసుకోవాలి. ఇదేవిధంగా పాలు త్రాపించే ప్రీ పాలు త్రాపించే కాలంలో, ఇంకా బా స్రీలు గర్భిణిగా వున్న కాలంలో అసాధారణమైన కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తే వా రోజాను విడిచిపెట్టవచ్చు. వారి కాలం గడిచిపోయాక విడిచిపెట్టిన ఖజా రోజాలను పూర్తి చేసుకోవాలి.

ప్రయాణంలో కష్టాలు ఎదురవకపోతే రోజా పాటించాలి

ఉ్రర్రడంంతంరత్తపి తమ మం రబ సవ రకతో, చయయ బు! గర టీ53 ఉడా Sasa మయ్య గతి) 69. జనాబ్‌ సలమ బిన్‌ ముహబ్బఖ్‌ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు : ఒక వ్యక్తి దగ్గర ఒక మంచి వాహనం వుండి, తాను రాత్రి వరకు ఒక చోటికి చేరి అక్కడ ప్రశాంతంగా కడుపునిండా భోజనం చేయగలిగిన పరిస్థితి వుంటే, అలాంటి వ్యక్తి రమజాన్‌ ఎక్కడ లభించినా రోజా పాటించాలి. (అబూదావూద్‌)

ప్రవక్త (స) ఇక్కడ ప్రయాణీకుణ్ణి ఉద్దేశించి సెలవిచ్చిందేమంటే ఒక వ్యక్తి ప్రయాణంలో వున్నప్పుడు, తన వద్ద వాహనం వున్నా లేకపోయినా, తన స్థితి మెరుగ్గా లేకపోయినా రోజా పాటిస్తున్నప్పుడు, తాను మగ్‌రిబ్‌ వరకు ఒక చోటికి చేరి ప్రశాంతంగా తిని త్రాగే అవకాశం లేనప్పుడు తాను రోజా పాటించకూడదు. మరో కోణంలో, అతని వద్ద మంచి వాహనం వుంది, తాను రాత్రి వరకు ఒక చోటికి చేరుకొని ప్రశాంతంగా తిని త్రాగే అవకాశం వుందన్న పూర్తి నమ్మకముంటే అలాంటి వ్యక్తి రమజాన్‌ కాలం ఎక్కడ లభించినా అతను రోజాను పాటించటం మొదలుపెట్టాలి.

ఇక్కడ గమనించాల్సిన విషయం “ఫల్‌యసుమ్‌” అన్న దాని అర్థం “అతను తప్పక రోజా పాటించాలి” అని కాదు. ఎందుకంటే కోవకు చెందిన ఇతర హదీసుల్ని చేర్చి చూస్తే తెలిసేదేమంటే ప్రయాణీకునిపై ఇది తప్పనిసరి కాదు, కాని అతనికి అనుమతి వుంది. అందుకని “ఫల్‌యసుమ్‌”లో క్రియారూపం గుప్తంగా

128 ఆత్మ ప్రక్షాళనం రోజా వుంది. (అంటే అతను రోజా పాటించాలి) అన్నది. అయితే దీని అర్థం తప్పనిసరి అని కాదు, ఎందుకంటే ఇతర హదీసుల్ని పరిశీలిస్తే విషయం తేటతెల్లమవుతుంది - ఒకవేళ కేవలం హదీసునే ఆధారంగా చేసుకుంటే ఒక వ్యక్తి ప్రయాణంలో వున్నప్పుడు తప్పనిసరిగా రోజా వుండాలి అనే అర్థం స్ఫురిస్తుంది. కాని ఇది అభిలషణీయం కాదు.

హదీసుల ద్వారా, అలాగే ఖుర్‌ఆన్‌ ద్వారా ఆదేశాలను తెలుసుకునే పద్ధతి ఏమిటంటే, అంశం తాలూకు ఎన్ని హదీసులు, ఆయత్‌లున్నాయో వాటిని మనిషి జమచేసి వాటి సంగ్రహాన్ని సారాంశాన్ని గ్రహించాలి. ఖుర్‌ఆన్‌లోని ఏదో ఒక ఆయత్‌ను ఆధారంగా తీసుకొని ఆదేశాన్ని జారీచేసేందుకు ప్రయత్నం చేసే మనిషి పొరబడేందుకు ఆస్కారం వుంది. అందుకని ఖుర్‌ఆన్‌లో అంశానికి సంబంధించిన ఇతర ఆయత్‌లలో కూడా ఏమని సెలవియ్యబడిందో పరిశీలించాలి. ఇదే విషయం హదీసుకు కూడా వర్తిస్తుంది. కేవలం ఏదో ఒక హదీసును ఆధారంగా చేసుకొని ఆదేశాన్ని జారీ చేసే బదులు, అంశానికి సంబంధించి దైవప్రవక్త (స) గారి వేరితర బోధనలేమిటి? అన్న దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఒకవేళ ఒక వ్యక్తి కేవలం ఇదే హదీసును దృష్టిలో వుంచుకొని ఆదేశం జారీచేస్తే, మంచి వాహనం లభించిన ప్రయాణీకుడు తప్పక రోజా పాటించాలనే అంటాడు. ఎందుకంటే దైవప్రవక్త (స) “ఫల్‌యసుమ్‌” అని సెలవిచ్చారు. అయితే ఇలా చెప్పటం ఏమాత్రం అభిలషణీయం కాదు. ఎందుకంటే ఇతర హదీసుల్లో వివరణాత్మకమైన పదాలతో తెలియజేయబడింది - ప్రయాణంలో రోజా విడిచిపెట్టే అనుమతి వుంది అని. అందుకనే ఇక్మడ “ఫల్‌యసుమ్‌” అన్న పదాలకు “అతను రోజా వుండటం త్తమం” అని అనబడింది.

ఖుర్‌ఆన్‌ మరియు హదీసుల్లో ఆచరణపై అనేక ఉదాహరణలున్నాయి. ఒక మాటను ఆదేశంగా పేర్కొనటం జరిగింది. అంటే దాన్ని క్రియారూపంగా పేర్కొనటం జరిగింది. అయితే దాని అర్థం తప్పనిసరిగా చేయాలన్నది కాదు. ఉదాహరణకు, అల్‌ మాయిదా సూరాలో సెలవియ్యబడింది : “ఇజా హలల్‌తుమ్‌ ఫస్‌తాదూ” (ఆయత్‌ : 2) “ఇహ్రామ్‌ విడిచిన తరువాత మీరు వేటాడవచ్చు” - ఇక్కడ కేవలం “ఫస్‌తాదూ” (వేటాడండి) అన్న ఒక్క పదాన్నే తీసుకుంటే దాని అర్థం “మనిషి ఇహ్రామ్‌ విడవగానే ముందుగా వేటాడాలి” అని వస్తుంది. వాస్తవంగా చూస్తే దీని అర్థం అది కాదు. వాస్తవానికి దీని ఉద్దేశం, “ఇహ్రామ్‌ స్థితిలో వున్నప్పుడు వేటాడటానికి మీకు అనుమతి లేదు” అన్నది. అయితే ఇక్కడ ఇహ్రామ్‌ విడిచిన పిదప

ఆత్మ (ప్రక్షాళనం రోజా 129 మీరు వేటాడవచ్చు అన్నదాంట్లో క్రియారూపం దాగివుంది కాని, తప్పనిసరి అన్న భావంలో కాదు. దీనివలన తెలిసేదేమంటే కేవలం క్రియారూపం వలన “తప్పనిసరి” అని రూఢీ కాదు.

మక్కా విజయం నాటి ప్రయాణంలో ప్రవక్త (స) ఇష్టార్‌ చేసిన సంఘటన

70.

మజ యయ పడుత లద యం ధరమ = భా SEE HES రణ్‌ SND peertemerrt వషటే రష్‌ GED శయ యీ! a లట

హజ్రత్‌ జాబిర్‌ బిన్‌ అబ్బుల్లాహ్‌ (రజి) గారి ఉల్లేఖనం : దైవప్రవక్త (స) మక్కా విజయం నాటి సంవత్సరం రమజాన్‌ నెలలో మదీనా నుంచి మక్కాకు బయలుదేరినప్పుడు దారి పొడుగునా ఆయన (స) రోజా పాటిస్తూ చివరకు 'కురాఅల్‌ నయీమ్‌” 4 అనే చోటికి చేరుకున్నారు. ఇతర ప్రజలు మామూలు ప్రకారం రోజా పాటించారు. ప్రవక్త (స) ఒక పాత్రలో నీరు తెమ్మని చెప్పారు. ఆపై ఆయన (స) నీటి పాత్రను అందరూ చూసేలా పైకెత్తి అందరూ చూస్తుండగానే నీటిని త్రాగారు (అంటే రోజా విరమించారు). దాని తరువాత కొంతమంది ఆయన (స) వద్దకు వెళ్ళి “ఇంకా కొంతమంది రోజాలోనే వున్నారు” అని విన్నవించుకోగా, దానిపై ఆయన (స) “వారు అవిధేయులు, వారు అవిధేయులు” అని సెలవిచ్చారు. (ముస్లిం)

దైవప్రవక్త (స) మక్కా విజయ ఉద్యమంపై ప్రయాణం చేసినప్పుడు అది

రమజాన్‌ కాలం. ఇంకా అది ఎండాకాలం. ఆయన (స) దీర్చ ప్రయాణాన్ని

A

కురాఅల్‌ నయీమ్‌ మదీనా మరియు మక్క్మాల మధ్య వున్న ఒక స్థలం. ఇది ఉస్‌ఫాన్‌ ప్రాంతానికి దగ్గరలో వుంది.

130 ఆత్మ ప్రక్షాళనం రోజా కొనసాగిస్తూ వెళ్తున్నప్పుడు ప్రజలతో అది పెద్ద ఉద్యమంలా తయారయ్యింది. ప్రజలు బలహీనులైపోతే యుద్ధం చేయలేరేమోనన్న అనుమానం కలిగింది. తలంపు వల్ల కూడా తనను అనుసరించి రోజా విరమిస్తారనే ఉద్దేశ్యంతో ఆయన (స) బహిరంగంగానే రోజాను విరమించారు. సందర్భంగా ఆయన (స) “మీరు రోజా విడవవచ్చు” అని ప్రజలకు సమాచారం పంపలేదు. కాని స్వయంగా ఆయన (స) అందరి ముందే ఒక ఆచరణ చేశారు - దాన్ని చూసి ప్రజలు కూడా రోజా విరమించాలని. అయితే రోజు అయితే దీనికి క్షమాపణ లభించింది. కాని దీని తరువాత ప్రజలు రోజా విరమించని సమాచారం ఆయన (స)కు అందజేయబడింది. దీనిపై ఆయన “వారు అవిధేయులు, వారు అవిధేయులు” అని సెలవిచ్చారు.

దీని అంతరార్థం ఏమిటంటే, దైవప్రవక్త (స) అల్లాహ్‌ ప్రసాదించిన ఒక వినాయింపుతో ప్రయోజనం పొందినప్పుడు, వీళ్ళెవరు? దాని అవసరం లేదని తలచటానికి? దీని అర్థం ఏమిటంటే ప్రజలు ఎంత మితిమీరిన ధీమాతో వున్నారంటే “మేమైతే చాలా ఉన్నత స్థానంలో వున్నాం, మాకు ఇలాంటి వినాయింపు ద్వారా ప్రయోజనం పొందే అవసరం కూడా లేదు” అని తలపోశారన్నమాట. అందుకనే ఆయన (స) “వారు అవిధేయులైన ప్రజలు” అని సెలవిచ్చారు.

ఇక్కడ స్పష్టంగా గ్రహించాల్సిన విషయం, దీని ఉద్దేశ్యం ఏమిటంటే ఒకవేళ రమజాన్‌ కాలంలో ఎవరైనా ఒక వ్యక్తికి క్లిష్టతర పరిస్థితి ఎదురైనప్పుడు రోజాను విరమించకపోతే అతను పాపాత్ముడవుతాడు అన్నది. (ప్రవక్త (స) గారి బోధన ఉద్దేశ్యం ఏమంటే “నేను రోజా విరమించాను, ఆపై ఇతరులు రోజాను విరమించక పోవటమన్నది ఒక అవిధేయ చర్య” అన్నది. స్పష్టంగా తెలిసేదేమంటే దైవప్రవక్త (స) భావనతో అయితే బహిరంగంగా ఇఫ్తార్‌ చేశారో, దాన్ని చూసి ఇతరులు కూడా విషయంలో ఆయన (స) ను అనుసరించి విధేయత చూపాలన్నది.

ప్రయాణంలో (కిష్టతర పరిస్థితి ఎదురయ్యే అనుమానముంటే) రోజా వుండటం భావ్యం కాదు

3 ote

ఉప! లీ మరత లేరట లట కద JENA: Aig wl Re (ఉదయమం శ్రర

ఆత్మ ప్రక్షాళనం రోజా 131 71. హజ్రత్‌ అబ్బుర్రవ్మాన్‌ బిన్‌ జెఫ్‌ (రజి) గారి ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ప్రయాణంలో వున్నప్పుడు రమజాన్‌ ఉపవాసం (రోజా) పాటించే వ్యక్తి, ఇంటిపట్టున వుండి రోజా పాటించని వ్యక్తిలాంటి వాడు. (ఇబ్నెమాజా) ఒక వ్యక్తి ఇంటిపట్టునే వుండి ఎలాంటి కారణం లేకుండా రమజాన్‌ రోజాలను విడిచిపెట్టడాన్ని ఎలా తప్పుగా భావించబడుతుందో, అలాగే ప్రయాణంలో వున్న వ్యక్తి తనను తాను కష్టాలపాల్టేసుకుని రోజా వుండటం కూడా మంచిదికాదు. దీని అర్థం రెండు ఆచరణల స్థితి, స్థానం ఒక్కటే అన్నది ఎంతమాత్రం కాదు. దీని ఉద్దేశం ఏమంటే ఒక వ్యక్తి క్రి ఇంటేపట్టునే వుండి కూడా రోజా పాటించకపోవటం పొరపాటు, అలాగే ప్రయాణంలో వుండి రోజా పాటించటం కూడా పొరపాటే. అయితే ప్రయాణంలో వున్న మనిషికి క్లిష్టతర పరిస్థితి ఎదురైనప్పుడే ఇది వర్తిస్తుంది. లేకపోతే ఇంతకు ముందు పేర్మొనబడిన హదీసుల ప్రకారం దైవప్రవక్త (స) స్వయంగా ప్రయాణంలో రోజా పాటించారని తెలుస్తోంది. ఇంకా ప్రవక్త సహచరులు (సహాబా - రజి) కూడా రోజా పాటించారు. ఇంకా సదృశంగా ఎలాంటి పరిస్థితి సంభవించిందంటే ఒక ప్రయాణంలో కొంతమంది సహాబా (రజి) రోజా పాటించారు, మరికొంతమంది పాటించలేదు. అందుకని అసందర్భం కాదనుకుంటే అన్ని హదీసుల వెలుగులో హదీసులో పేర్కొనబడిందేమంటే ప్రయాణంలో మనిషికి క్లిష్ట పరిస్థితులు ఎదురౌతున్న శంక కలిగినట్లయితే రోజా వుండటం మంచిది కాదు. ఒక మనిషి ఇంటి పట్టున వుండి కూడా రోజా పాటించకుండా ఉండటం ఎంత తప్పో ఇదీ అంతే తప్పు. ఎందుకంటే విషయం ముందే వచ్చింది. ఇంటిపట్టున వుండి ఎలాంటి కారణం లేకుండా రోజాను పాటించని వ్యక్తి తరువాత జీవితాంతం రోజా పాటించినా దానికి సరిరాదు. కాని ఒకవేళ ప్రయాణంలో రోజా ఉంటే అది అంతగా తీవ్రమైన పొరపాటుగా నిర్ణయించబడదు.

ప్రయాణంలో రోజా విడిచిపెట్టే అనుమతి అల్లాహ్‌చే ప్రసాదించ బడిన ఒక వెసులుబాటు

డైనైేకట ISLIP <r Hi 9 Asp EP aie స్రీ! యు! లు పతయ! ధ్రరషడక PYG డజిర్రకరెకో

PE NEE Me: ప్రద రప

కుల (ED రో

132 ఆత్మ ప్రక్షాళనం రోజూ 72. హజ్రత్‌ హమ్‌జా బిన్‌ అమ్‌ అస్లమీ (రజి) చెప్పారు : నేను దైవప్రవక్త (సుతో - “ఓ దైవప్రవక్తా (స)! నేను ప్రయాణంలో కూడా రోజా పాటించే శక్తిని కలిగి వున్నాను. ఒకవేళ స్థితిలో రోజా పాటిస్తే పాపాత్ముడనవుతానా?” అని విన్నవించాను. దానిపై దైవప్రవక్త (స) సెలవిచ్చారు : “ఇదైతే మహోన్నతుడైన అల్లాహ్‌ తరఫు నుంచి ప్రసాదించబడిన ఒక అనుమతి. ఎవరైనా ఒక వ్యక్తి అనుమతి ద్వారా ప్రయోజనం పొందినట్రైతే ఇది మంచి నిషయమే. అయినా ఎవరైనా రోజా వుండటాన్నే ఇష్టపడినట్లయితే అందులో ఎలాంటి దోషమూ లేదు.” (ముస్లిం) ఇది అధ్యాయంలో పేర్కొనబడిన చివరి హదీసు. వాస్తవంగా చెప్పాలంటే ఒక మనిషిలో శక్తి వుండి, పరిస్థితులు కూడా అనుకూలంగా వుంటే ప్రయాణంలో కూడా అతను రోజా పాటించడం ముమ్మాటికీ సముచితమే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ అతను ప్రయాణంలో రోజా పాటించే శక్తిలేదని, పైగా ప్రయాణంలో కష్టాలు ఎదురౌతాయన్న అనుమానం వున్న పరిస్థితులలో రోజా పాటించకుండా అల్లాహ్‌ ప్రసాదిత అనుమతి ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఎందుకంటే అల్లాహ్‌ ఏదైనా విషయంలో వినాయింపు ఇస్తే మనిషికి శ్రేయస్మరమైనదేమంటే అతను దాని ద్వారా ప్రయోజనం పొందాలి.

ఆత్మ (ప్రక్షాళనం రోజా 133

మాల్య

ఖజా అధ్యాయం

(ఈ అధ్యాయంలో ఖజా రోజాలకు సంబంధించిన ఆదేశాలు

వివరించబడ్డాయి). రమజాన్‌ ఖజా రోజులను నెల మొదటి పదిహేను రోజుల చివర్లో కూడా పాటించవచ్చు edo కటట =r ఫో శ్రిక్సీ దవే! JR ళ్‌! ధీఈరిడమీ! ధన లతకు 505 ఆమ ఢమ్‌ aici beget

73. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) ఇలా ఉల్లేఖించారు: రమజాన్‌ ఉపవాసాల లోని కొన్నింటిని (ఖజాగా) పాటించాల్సిన బాధ్యత నాపైన ఉండేది. అయితే షాబాన్‌ నెలలో తప్ప మిగతా రోజుల్లో ఖజా రోజాలను పూర్తి చేయలేకపోయేదాన్ని. హదీసుకు చెందిన మరో ఉల్లేఖనకర్త యహ్యో బిన్‌ సయీద్‌ (రజి) దీని వివరణ ఇలా పేర్కొన్నారు. ఆమె (రజి.అన్‌హా) ఉద్దేశ్యంలో దీని భావం ఏమిటంటే దైవప్రవక్త (స) గారి సేవలో ఆమె నిమగ్నమవటం వల్ల షాబాన్‌ కంటే ముందు ఖజా రోజాలను పూర్తిచేయలేకపోయేవారు. (ముత్తఫకున్‌ అలైహ్‌) ఇంతకు ముందు వచ్చిన హదీసులో షాబాన్‌ నెల పదిహేనవ తేదీ తరువాత

ఎలాంటి రోజా వుండరాదని దైవప్రవక్త (స) సెలవిచ్చారు. (షాబాన్‌ నెల ప్రారంభంలో

దానికి అనుమతి వుంది). ఎందుకంటే షాబాన్‌ నెల చివరి రోజుల్లో కూడా రోజా పాటించినట్లయితే దౌర్బల్యం ఏర్పడి రమజాన్‌ రోజాలు పూరించలేకపోవచ్చు.

134 ఆత్మ ప్రక్షాళనం రోజా వాస్తవానికి మనిషి షాబాన్‌ నెలలో నఫిల్‌ రోజాలుంటాడు. రమజాన్‌లో వ్యవహారం ఫరజ్‌ రోజాలకు చెందినది. ఇక్కడ హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) సెలవిస్తున్న దేమంటే, 'నేను ఖజా రోజాలను షాబాన్‌ నెలలో పూరించేదాన్ని. ఎందుకంటే మిగతా పది నెలల్లో కూడా పనుల వత్తిడి వలన తీరిక వుండేది కాదు. వాటిని వాయిదా వేసుకుంటూ పోగా చివరకు షాబాన్‌ నెల వచ్చేది” అని. అయితే ఆమె (రజి) గారు రోజాలను షాబాన్‌ నెల పదిహేనవ తేదీకంటే ముందు పాటించేవారా లేదా తరువాతనా? అన్న విషయం వివరంగా తెలుపలేదు. కాని హదీసునుబట్టి అంచనా వేసి చూస్తే ఆమె (రజి.అన్‌హా) ఖజా రోజాలను షాబాన్‌ పదిహేనవ తేదీ తరువాతనే పూరించారని తెలుస్తోంది. దీన్నిబట్టి తెలిసిన విషయం వాస్తవానికి ఖజా రోజాలు విధిగా పాటించాల్సిన రోజాలు. ఇవి నఫిల్‌ రోజాలు కావు. అందువలన వాటిని రోజుల్లో కూడా పూర్తి చేసుకోవచ్చన్నమాట.

నఫిల్‌, ఖజా రోజాలు పాటించే ముందు భార్య, భర్త అనుమతి తీసుకోవాలి

Wf ptr sh రమతాం HG a Wea Js IEICE లన mot ఆయా 1) పాడాలి! they aes prea “పుట! BOI ILI HUGE

392 (ర

(Ass 74. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారి ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు : ఒక ప్రీ కొరకు - భర్త ఇంటిపట్టున వున్నప్పుడు అతని అనుమతి లేకుండా రోజాలు వుండటం సముచితం కాదు. ఇంకా భర్త అనుమతిస్తే తప్ప ఆమె పరాయి వ్యక్తిని ఇంట్లో ప్రవేశించ టానికి కూడా అనుమతినివ్వరాదు. (ముస్లిం)

హదీసులో దైవప్రవక్త (స) గారి ప్రబోధనం ద్వారా తెలిసేమంటే భర్త ఇంటిపట్టునే వుండగా ఒక స్త్రీ భర్త అనుమతి లేకుండా రోజాలు పాటించడం ధర్మసమ్మతం కాదు. నఫిల్‌ రోజాలనుద్దేశించి లేక ఖజా రోజాల గురించి ఇలా చెప్పి వుండవచ్చు (ఇక్కడ హదీసు ప్రబోధనం కూడా 'ఖజా అధ్యాయం'లో పేర్కొనటం జరిగింది). ఎందుకంటే ఖజా రోజాలు పదకొండు నెలల్లోపు ఎప్పుడైనా

ఆత్మ ప్రక్షాళనం రోజా +35 పూర్తి చేసుకునే అవకాశం వుంది. అందువలన ప్రీ ముందు తన భర్త నుంచి అనుమతి పొందాలి. అంతేగాని భర్త అనుమతి లేనిదే ఆమె (నఫిల్‌) రోజాలు పాటించటం సముచితం కాదు - అవి నఫిల్‌ లేక ఖజా రోజాలైనా సరే. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో భర్తకు ఇది కష్టంగా పరిణమించవచ్చు. ఇలాంటి విషయాల కారణంగా భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు రావచ్చు లేక కనీసం భర్త మనసులో భార్యపట్ల అయిష్టత జనించే అవకాశం ఉంది. ఇది షరీఅత్‌ దృష్టా అభిలషణీయం కాదు. భార్యాభర్తల మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొనాలని షరీఅత్‌ కోరుతుంది, ఒకవేళ వారిరువురి సంబంధాలు సరిగా లేకుంటే మున్ముందు వాటి ఫలితాలు చేదుగా మారవచ్చు. అందుకనే షరీఅత్‌ దంపతుల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు జనించకూడదని భావిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో భార్య పాటించే రోజా (అది నఫిల్‌ లేక ఖజా రోజా అయినా) భర్తకు ఆమె అహంకారంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు రోజా తాలూకు తన నోటిద్వారా అనరాని మాటలు పలికే అవకాశం ఉంది. దీని కారణంగా భార్యాభర్తల సంబంధాల్లో అరుచి జనిస్తుంది, పైగా మనిషి కూడా పాపాత్ముడవుతాడు. అందువలన రోజా పాటించే ముందు భార్య భర్త అనుమతి తీసుకోవటం సముచితం. అయితే రమజాన్‌ రోజాల విషయం దీనికి భిన్నమైనది. రమజాన్‌ రోజాలు పాటించటానికి భార్య భర్త అనుమతిని తీసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే రమజాన్‌ రోజాలు విడిచిపెట్టే ప్రసక్తే తలెత్తదు.

బహిష్టు అయిన స్త్రీ రోజాను ఖజా చేసుకోవటం తప్పనిసరి అవుతుంది కాని నమాజులను కాదు

మమేంటతటో భవా. SEE AB ESE పడు! REST వండు! తప్పే టో $155) 75. ఒక తాబయీ (ప్రవక్త -స- సహచరులను చూసిన) స్త్రీ “ముఅజతల్‌ అదవియ (రహ్మ)” ఇలా తెలిపింది : నేను ఒకసారి హజత్‌ ఆయిషా (రజి.అన్‌హా) గారితో విన్నవించుకున్నాను - “ఇదేమి విచిత్రం, బహిష్టు

136 ఆత్మ ప్రక్షాళనం రోజా అయిన ఒక గస్తీ రుతుకాలంలో విడిచిపెట్టిన రోజాలను ఖజా చేస్తుంది. అయితే విడిచిపెట్టిన నమాజ్‌లను పూరించదు.” దీనిపై హజత్‌ ఆయిషా (రజి.అన్‌హా) సమాధానంగా సెలవిచ్చారు - “దైవప్రవక్త (స) గారి కాలంలో మాకు రోజాలను ఖజా చేసుకునే ఆదేశమైతే ఇవ్వబడేది కాని, నమాజ్‌లు ఖజా చేసుకోవాలని ఎలాంటి ఆదేశమూ ఇవ్వబడేది కాదు.”

(ముస్లిం)

ఇక్కడ మీరు గమనించే వుంటారు. ప్రశ్నించే స్త్రీ కారణాలను గురించి విచారిస్తుంది - బహిష్టు అయిన స్ర్తీ రుతుకాలంలో విడిపోయిన రోజాలను ఖజా చేస్తున్నప్పుడు మరి విడిపోయిన నమాజ్‌ల ఖజాను ఎందుకు చేయదు? అని. అయితే హజ్రత్‌ ఆయిషా (ర.అ) దీనికి జవాబుగా సెలవిచ్చారు : “ఆదేశం ఇదే” అని. ఆదేశంలో జెచిత్యం దాగివుంది. ఆలోచిస్తే అది అర్ధమవుతుంది. హజ్రత్‌ ఆయిషా (ర.అ) సెలవిచ్చినట్లు, చట్టం మరియు ఆదేశం ఇదే. దీన్ని కాదని కారణం మీకు అర్ధమయినా, కాకున్నా మీ కర్తవ్యం ఆదేశాలను పాటించటమే. పైగా ఇది ఒక ముస్లింకు ఉండవలసిన మొదటి లక్షణం. ఒకవేళ అతను నాకు అందులోని జెచిత్యం అర్ధమయినప్పుడే నేను ఆదేశాన్ని పాటిస్తాను అంటే అసలు అతను ముస్లిమే కాదు. ఒక వ్యక్తి అల్లాహ్‌ను విశ్వసించి దైవప్రవక్త (స) దైవదౌత్యాన్ని అంగీకరించిన మీదట, దైవ గ్రంథం పూర్తిగా సత్యమైనదని నమ్మిన తరువాత దాని ఆదేశాలను పాలించడం, విధేయత చూపడం అతని తప్పనిసరి కర్తవ్యం. అంతేగాని ప్రతి ఆదేశంలో దాగిన జిచిత్యం, కారణం అతనికి అర్థమవ్వాలన్న షరతు ఏమీ లేదు, పైగా ఇతరులు దానిని గురించి అతనికి అర్ధమయ్యేలా చెప్పే అవసరమూ లేదు. అల్లాహ్‌ ఆదేశం తన ముందుకు వచ్చినప్పుడు ఒక ముస్లింగా దాని పట్ల అతను శిరోధార్యత చూపాలి.

హదీసుకు సంబంధించినంత వరకు ఇందులో ప్రబోధించిన ఆదేశంలోని జెచితి తేలిగ్గా అర్థమవుతుంది. ఐదుపూటల నమాజ్‌ తప్పనిసరిగా చేయాలన్నది తెలిసిన విషయమే. ఇక మీరే ఆలోచించండి, బహిష్టు అయిన స్త్రీ రుతుకాలంలో ఎనిమిది లేక పది రోజుల వరకు నమాజ్‌ను విడిచిపెట్టాల్సి వస్తుంది. ఆమెకు కాలంలో తప్పిపోయిన 40 లేక 50 నమాజ్‌లు ఆమెపై ఖజా అయిపోతాయి. వీటిని ఆమె తరువాత పూర్తిచేయాల్సి వుంది. ఇవి ఆమెకు చాలా భారంగా మారవచ్చు. అందువల్లనే అల్లాహ్‌ విషయంలో రాయితీ ప్రసాదించి, వాటి ఖజాను తప్పనిసరి చేయలేదు. దీనికి ప్రతిగా రోజాల విషయం ఏమిటంటే, అవి సంవత్సరంలోని ఒక

ఆత్మ (ప్రక్షాళనం రోజా 137 నెలలో మాత్రమే విధిగా చేయబడ్డాయి. అవి ఖజా అయినప్పుడు సంవత్సరంలోని మిగతా నెలలో అయినా వాటిని పూరించవచ్చు. నమాజ్‌కు మినహాయింపు ఇచ్చినట్లుగా వీటి విషయంలో వినాయింపు లేదు. ఇది స్పష్టమైన విషయమే. హజ్రత్‌ ఆయిషా (ర.అ) గారు తలచుకుంటే ప్రశ్నించిన స్ర్తీకి ఆదేశంలో దాగిన జెచితిని, కారణాన్ని తెలిపేవారే. కాని ఆమె (ర.అ) ఇందులో దాగిన విజ్ఞతను చూపేబదులు ఆజ్ఞాపాలన గురించే నొక్కి చెప్పారు.

మరణించిన మనిషికి చెందిన ఖజా రోజాలు అతని సంరక్షకుని బాధ్యతగా మారతాయా?

ab LIDS LE Cs CISTI

76. హజ్రత్‌ ఆయిషా (ర.అ) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు : ఒక వ్యక్తికి కొన్ని ఖజా రోజాలు పాటించవలసి వున్న స్థితిలో మరణం సంభవిస్తే అతని సంరక్షకుడు రోజాలను పాటించాలి.

(ముత్తఫకున్‌ అలైహ్‌)

ఇదొక సమస్యాత్మక ఫిఖహ్‌ చర్చ. ఖజా రోజాలు మిగిలివున్నప్పుడు ఒక

వ్యక్తికి మరణం సంభవిస్తే అతని సంరక్షకుడు వాటిని తప్పక పూర్తి చేయాల్నా? లేదా? విషయం తాలూకు అనేక హదీసులున్నాయి. వాటిలో భిన్నాభిప్రాయా లున్నాయి. అందువలన హదీసు విషయంలో కూడా తర్మం జనిస్తుంది. పైగా ఫిఖహ్‌ (ధర్మశాస్త్రం) పంథాలు కూడా వేర్వేరుగా వున్నాయి. ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ (రహ్మ) హదీసు ఆధారంగా వ్యక్తం చేసిన ధర్మాభిప్రాయం ఏమంటే, ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని తాలూకు మిగిలివున్న ఖజా రోజాలను అతని సంరక్షకుడు పూర్తి చేయాలి. కాని ఇమామ్‌ అబూ హనీఫా (రహ్మ), ఇమామ్‌ మాలిక్‌

(రహ్మ) ఇంకా ఇమామ్‌ షాఫియీ (రహ్మ) దీనిపై ఏకాభిప్రాయం కలిగిలేరు.

ఇమాములు హదీసును రద్దు చేయలేదు కాని దీనిపై భావాన్వయం చేస్తారు.

మొదట వీరి దృష్టిలో అవి రమజాన్‌ రోజాలే కానవసరం లేదు, అవి జీవితానికి సంబంధించిన ఎలాంటి రోజాలైనా కావచ్చు. (అంటే ఒకవేళ ఒక వ్యక్తి నా ఫలానా

138 ఆత్మ ప్రక్షాళనం రోజా పని పూర్తయితే నేను ఇన్ని రోజాలుంటానని మొక్కుకున్నాడని అనుకుందాం. పని నెరవేరింది. అయితే మొక్కు పూర్తి అయ్యే ముందే అతను మరణించాడు. అప్పుడూ అతని సంరక్షకుడు రోజాలను పూర్తిచేయగలడు. మరో అర్థంలో ఇవి తప్పనిసరిగా పూరించాలన్న క్రియారూపంలో లేవు. (ఇంతకు ముందు కూడా ఒక హదీసు తాలూకు ఇదే విషయం పేర్కొనబడింది). అందువలన ఇక్కడ కూడా అతని సంరక్షకుడు రోజాలను పాటించవచ్చని చెప్పబడింది. మూడో అర్థంలో విషయం తాలూకు వచ్చిన ఇతర హదీసుల ద్వారా తెలిసేదేమంటే హదీసు వాటికంటే ముందే పేర్కొనబడింది. అందువలన ఫిఖ్‌హ్‌వేత్తల అభిప్రాయంలో ఆదేశం రద్దు చేయబడిందని భావించబడుతుంది. పరంపర తాలూకు ఇతర హదీసులు మున్ముందు రాబోతున్నాయి.

మరణించిన వ్యక్తి ఖజా రోజాలకు బదులుగా నిరుపేదలకు భోజనం పెట్టే విషయం sg obras sath ధయ

AOR

Gey ssl Hs WED 77. జనాబ్‌ నాఫె (రహ్మ) గారు హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) ద్వారా ఉటంకించారు : దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు, “ఒక వ్యక్తి మరణించిన సమయాన అతని రమజాన్‌ రోజాలు ఇంకా మిగిలివుంటే అతని తరఫున ప్రతి రోజాకు బదులుగా ఒక నిరుపేదవానికి అన్నం పెట్టాలి (అంటే దాని పరిహారంగా ఇవ్వాలి).” (తిర్మిజీ)

ఇమామ్‌ తిర్మిజీ (రహ్మ) దృష్టిలో ఇది దైవప్రవక్త (స) గారి ప్రబోధన కాదు, ఇది హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) గారి ధార్మిక తీర్చు మాత్రమే. అంటే దీనిని ప్రవక్త (స) సెలవిచ్చినట్లు రూఢీ లేదు. పైగా పటిష్టమైన ఆధారాలతో పేర్కొనబడిన ఉల్లేఖనాల ద్వారా తెలిసిందేమంటే ఇది హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) గారి స్వంత అభిప్రాయం. వీరి ధార్మిక తీర్చు ఏమంటే, ఒకవేళ ఎవరైనా వ్యక్తికి చెందిన రమజాన్‌ రోజాలు ఇంకా మిగిలివుండగా మరణం సంభవిస్తే,

ఆత్మ ప్రక్షాళనం రోజా 139 అతని తరఫున పరిహారం (ఫిదియా)గా నిరుపేదకు అన్నం తినిపించాలి. ఫిదియా అతని జీవితకాలంలో కూడా చెల్లించవచ్చు. ఖుర్‌ఆన్‌లో పేర్కొన్న ఆదేశం ఏమిటంటే ఎవరైనా వ్యక్తి రోజా పాటించకుండా అనారోగ్యం వగైరాలతో మరణిస్తే ఫిదియా చెల్లించాలి. అంటే ప్రతి రోజాకు బదులు ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. ఉదాహరణకు అతను అనారోగ్యంగా వున్నప్పుడు అన్నం తినిపించలేకపోయాడు. ఆపై మరణించాడు. తరువాత అతని సంరక్షకుడు వ్యక్తి ఫిదియా రూపేణ ప్రతి రోజాకు బదులు ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి.

ఒకవేళ దీనిని దైవప్రవక్త (స) గారి ప్రబోధనగా పరిగణిస్తే ఇది పై హదీసుకు వ్యతిరేకమవుతుంది. దాని ద్వారా ఆదేశించబడిందేమంటే అలాంటి వ్యక్తి సంరక్షకుడు వ్యక్తి తరఫున రోజాలు పాటించాలి. కాని దీనిని హజత్‌ ఇబ్నె ఉమర్‌ గారి ఉవాచగా భావిస్తే దాని అర్ధం, హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) గారి ఫత్వా ప్రవక్త (స) గారి ప్రబోధనకు వ్యతిరేకం. మరి చూడబోతే ఇదొక తప్పనిసరి ఆచరణ. ఒకవేళ ఆయన జ్ఞానపరిధిలో సంరక్షకుడు రోజాలు పాటించాలన్నదే ప్రవక్త (స) గారి ప్రబోధన అయివున్నట్లయితే ఆయన (రజి) ఏమాత్రం దానికి వ్యతిరేకంగా ఫత్వా ఇచ్చేవారు కాదు. అందుకనే ధర్మశాస్త్రవేత్తలు దీనికి వ్యాఖ్యానంగా ఏం చెబుతారంటే ఒకవేళ సంరక్షకుడు రోజా పాటించాలన్న నియమం పూర్వ హదీసుల్లో వున్నప్పటికీ తరువాత అది రద్దు చేయబడింది. లేదా దానిలో క్రియారూపం తప్పనిసరి కాదు అన్న అర్థాన్ని గ్రహించారు. అయితే దీనిద్వారా కేవలం సంరక్షకుడు రోజా పాటించవచ్చు అన్న అనుమతి స్ఫురిస్తుంది. పరంపరలో మూడవ హదీసు రాబోతోంది.

ఎవరైనా ఒక వ్యక్తి ఇతరులకు బదులు రోజా పాటించటం గానీ, ఇంకా నమాజ్‌ ఆచరించటం గానీ చేయలేడు

>

AON ges HS a Ca dT oI leas

NN! CTIA I (WWD

140 ఆత్మ (ప్రక్షాళనం రోజా 78. ఇమామ్‌ మాలిక్‌ (రహ్మ) గారు తన వద్దకు సమాచారం అందినట్లు పేర్కొన్నారు : హజత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (ర.అ) గారితో “ఎవరైనా ఒక వ్యక్తి ఇతరులకు బదులుగా రోజా పాటించవచ్చా? లేదా ఇతరులకు బదులుగా నమాజ్‌ ఆచరించవచ్చా” అన్న విషయమై ప్రశ్నించగా, ఆయన విధంగా బదులిచ్చేవారు : “ఏ వ్యక్తీ ఇతరులకు బదులు రోజా పాటించనూలేడు, నమాజ్‌ ఆచరించనూలేడు.” (మాలిక్‌ - రహ్మ)

దీనిద్వారా తెలిసేదేమంటే హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (ర.అ) గారి ఫత్వా ప్రవక్త (స) గారి హదీసుకూ వ్యతిరేకంగా పరిణమించదు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క సంరక్షకుడు అతనికి బదులుగా రోజా పాటించాలన్న ప్రవక్త (స) గారి ఆజ్ఞను ఊహామాత్రంగానయినా సమ్మతించినట్లయితే, అది తన వరకు చేరలేదంటే దాని అర్థం అది ప్రవక్త సహచరుల కాలం. అనేకమంది సహాబాతో ప్రవక్త (స) ఇలా ఆదేశించేవారని అన్నప్పుడు తమరు ఫత్వా ఎలా ఇస్తున్నారు? అని వారు అడిగి వుండేవారు. కాని వారితో ఎవరూ ఇలా ప్రశ్నించలేదు. అంటే సర్వ సాధారణంగా (సహాబా) అనుచరులందరికీ తెలిసిన విషయం ఏమంటే ఎవరి ఖజా రోజాల బాధ్యత కూడా మరొకరిపై తప్పనిసరి గావించబడలేదు - అతను తన కుమారుడైనప్ప టికినీ.

ఆత్మ ప్రక్షాళనం రోజా 141

eet

స్వచ్చంద రోజాల అధ్యాయం

“తతవ్వూ” అని అంటే తన ఇష్టపూర్వకంగా స్వచ్చందంగా ఒక పనిని నిర్వర్తించడం అని అర్ధం. ఇది ఫర్డ్‌ కాదు. ఫర్ట్‌ అంటే దాన్ని తప్పకుండా చేయాలన్న నిబంధనతో కూడుకున్నది. తతవ్వూ అంటే మనిషి స్వయంగా ఇష్టపడి చేసే పని అన్నమాట. తనపై విధిచేయబడని లేదా తప్పనిసరి చేయబడని ఆచరణ అన్నమాట. కాబట్టీ “సియాము తతవ్వూ” అంటే ఉద్దేశం నఫిల్‌ రోజాలు. అధ్యాయంలో వాటి గురించే ప్రస్తావించటం జరిగింది.

ప్రవక్త (స) అన్ని నెలలకన్నా ఎక్కువగా నఫిల్‌ రోజాలను షాబాన్‌ నెలలోనే పాటించేవారు

hI రళతుళ LE C= 4

Sb ETI IEE

S| ARSC Ase

త్రెడదు ఓక కరక త్ర ౮క అర

oats: UR BRE

PROTON 79. హజత్‌ ఆయిషా (ర.అ) ఇలా తెలిపారు : దైవప్రవక్త (స) ఒక్కోసారి ఎడతెగని రోజాలు పాటించేవారు. అప్పుడు మేము ఇక ఆయన (స) రోజాలు విరమించరేమో అని తలచేవారం. అలాగే ఒక్కోసారి రోజాలు పాటించేవారు కాదు. అప్పుడు మేము ఇక ఆయన (స) రోజాలు

142 ఆత్మ ప్రక్షాళనం రోజా పాటించరేమో అని భావించేవాళ్ళం. ప్రవక్త (స) నెలలోనూ పూర్తిగా రోజాలను పాటించడం నేను చూడలేదు - ఒక్క రమజాన్‌ తప్ప. ఇంకా షాబాన్‌ నెలలో తప్ప మరే నెలలోనూ ఎక్కువ రోజాలు పాటించడం కూడా నేను చూడలేదు. మరో ఉల్లేఖనంలో షాబాన్‌ నెలలో ఆయన (స) రోజాలు పాటించని రోజులు అతి తక్కువగా ఉండేవని పేర్కొనటం జరిగింది. అంటే షాబాన్‌ నెలంతా రోజాలు పాటించేవారన్నమాట.

(ముత్తఫకున్‌ అలైహ్‌)

హదీసులో హజ్రత్‌ ఆయిషా (ర.అ) ప్రవక్త (స) గారి నఫిల్‌ రోజుల గురించి పేర్కొన్నారు. రాబోయే హదీసుల్లో మీకు ప్రవక్త (స) గారి రోజాల గురించి తెలిపిన వివిధ ఉల్లేఖనాలు లభిస్తాయి. వీటిద్వారా నఫిల్‌ రోజాల తాలూకు ఆయన

(స) గారి ఆచరణ ఎలా వుండేదో తెలిసివస్తుంది. ఇక్కడ హజ్రత్‌ ఆయిషా (ర.అ)

గారు తెలిపిందేమంటే, ఆయన (స) ఒక్కోసారి రోజాలే వుండేవారు కాదు. మరో

మాటలో చెప్పాలంటే నవాఫిల్‌ రోజాల తాలూకు ఆయన (స) ఒక నిర్ధారిత పద్ధతిని అవలంబించేవారు కాదు.

హజ్రత్‌ ఆయిషా (ర.అ) తెలిపిన మరోమాట ఏమిటంటే రమజాన్‌ తప్ప మరే నెలలోనూ ఆయన పూర్తిగా రోజా పాటించలేదు. అయితే షాబాన్‌ నెలలో మాత్రం తతిమ్మా నెలలకన్నా ఎక్కువ రోజులు రోజా పాటించేవారు. అంటే షాబాన్‌ నెలలో ఎంతగా రోజాలు పాటించేవారంటే పూర్తి నెల రోజులూ రోజా పాటించారా అనిపించేది. విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించడం జరిగిందంటే షాబాన్‌ నెల సగం రోజులు గడిచాక, ఎవరూ నఫిల్‌ రోజాలు పాటించరాదని సెలవిచ్చియున్నారు. ఎందుకంటే దీనిద్వారా మనిషి బలహీనుడైపోతే దాని ప్రభావం రమజాన్‌ రోజాలపై పడుతుంది. అయితే ఖజా రోజాలు పాటించేవారు, ఏదైనా మొక్కుబడి రోజాలు పాటించే వ్యక్తులు దీన్నుండి మినహాయించబడ్డారు, లేదా మరికొంతమంది ఇలాంటి ప్రత్యేక రోజుల్లోనే నఫిల్‌ రోజులను పాటించే అలవాటు వున్నవారు కూడా వీటి నుంచి మినహాయించబడ్డారు. ఇలాంటి ప్రత్యేక వినాయింపు రోజుల్లో తప్ప ప్రవక్త (స) గారి సాధారణ హితవు కేవలం ఇతర వ్యక్తులకు వర్తిస్తుంది. ఆయన (స) సంప్రదాయం ఏమంటే షాబాన్‌ నెలలో సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు ఉపవాసాలు పాటించేవారు.

ఆత్మ ప్రక్షాళనం రోజా 143 రమజాన్‌లో తప్ప దైవప్రవక్త (స) ఇతర నెలల్లో పూర్తి నెల రోజులు రోజా పాటించేవారు కారు

80.

కా. GWEC A. Ish ese bats నా ఖద ధ్యః OO NT

లీ

( IED

జనాబ్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ షఖీఖ్‌ (రహ్మ) తెలిపారు : నేను హజ్రత్‌ ఆయిషా (ర.అ) గారితో దైవప్రవక్త (స) ఏదైనా నెలలో పూర్తిగా రోజాలు పాటించేవారా? అని ఆరా తీశాను. దానిపై హజత్‌ ఆయిషా (ర.అ) సెలవిచ్చారు, 'రమజాన్‌లో తప్ప ఇతర నెలలో అయినా పూర్తిగా రోజాలు పాటించినట్లు నా దృష్టిలో లేదు. అదేవిధంగా ఒక్క రోజా అయినా పాటించకుండా ప్రవక్త (స) నెలనైనా విడిచిపె పెట్టారన్న విషయం కూడానా జ్ఞాన పరిధిలో లేదు. సంప్రదాయం ఆయన (స) చివరి ప్రస్థానం వరకూ కొనసాగింది.” (ముస్లిం)

దీని ఉద్దేశం ఏమంటే ప్రాపంచిక జీవితం ముగిసేవరకు ప్రవక్త (స) రమజాన్‌

తప్ప మరే నెలలోనూ పూర్తి రోజాలు పాటించలేదు, ఇంకా ఎలాంటి రోజాలు పాటించకుండా నెలనూ విడిచిపెట్టలేదు.

షాబాన్‌ నెల చివరి రెండు రోజుల ఉపవాసం గురించి

81.

యు సీపాన! ్రహ్యసతవ్యర కళ WD

తదపి] బే AVE EA EPO

చూవలోడువడ ICG: రటేసమత్త Pas తుము? 1136: ప్రత, ఆపలత/వదడే CA

హజ్రత్‌ ఇమ్రాన్‌ బిన్‌ హుసైన్‌ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు : ప్రవక్త (స) ఒక వ్యక్తిని విచారిస్తూ వుండగా

144 ఆత్మ ప్రక్షాళనం రోజా నేను విన్నాను. (తరువాతి ఉల్లేఖనకర్తల అభిప్రాయంలో ప్రశ్న ప్రవక్త (స) గారు ఇతరులతో అన్నట్లు ఉన్నది) ఫలానా వ్యక్తీ! నీవు షాబాన్‌ నెలలోని చివరి రెండు రోజుల ఉపవాసాలు పాటించలేదా? దానికా వ్యక్తి “లేదు” అని సమాధానమివ్వగా, ఆపై ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: 'నీవు ప్రస్తుత రమజాన్‌ రోజాలు పూర్తి చేసుకున్నాక, వేరే ఇతర రెండు రోజుల ఉపవాసాలు (వాటికి బదులుగా) పాటించాలి”.

(ముత్తఫకున్‌ అలైహ్‌)

ఉల్లేఖనంలో ప్రవక్త (స) ప్రశ్నించింది ఎవరిని అన్న ప్రశ్న తలెత్తింది. తరువాతి ఉల్లేఖనకర్తలకు “నాతో ప్రవక్త (స) ఇలా ప్రశ్నించారని చెప్పిన హజ్రత్‌ ఇమ్రాన్‌ బిన్‌ హుసైన్‌ (రజి) గారి మాటలు గుర్తుకు రాలేదు. లేదా వేరే వ్యక్తితో విషయం గురించి ప్రశ్నిస్తున్నప్పుడు నేను విన్నాను అన్న విషయం కూడా కావచ్చు. మొత్తంమీద ప్రవక్త (స) గారు సెలవిచ్చినట్లు హజ్రత్‌ ఇమ్రాన్‌ బిన్‌ హుసైన్‌ (రజి) ఉల్లేఖించారన్నది రూఢీఅయ్యింది. ఉల్లేఖనం ద్వారా తెలిసిందేమంటే ఇమ్రాన్‌ బిన్‌ హుసైన్‌ (రజి) గారి ద్వారా హదీసును ఉల్లేఖించినవారు ధర్మవేత్త కాకపోవచ్చు. అందుకని ఆయన విషయాన్ని స్పష్టపరచలేదు - అసలు ప్రవక్త (స) ఆయనతో ఎందుకు ఇలా ప్రశ్నించారు? ఇంకా రోజాలు పాటించమని ఎందుకు తాకీదు చేశారు? షాబాన్‌ నెల చివరి రెండు రోజుల రోజాలను పాటించడం తప్పనిసరి అని, ఒకవేళ ఒక వ్యక్తి రోజాలను పాటించనట్లయితే తరువాతి రోజుల్లో ఖజా తప్పనిసరి అవుతుందా? అన్న విషయం స్పష్టంగా తెలియని కారణంగా ఇలాంటి అపార్థం తప్పక జనిస్తుంది.

వేరే ఉల్లేఖనం ద్వారా తెలిసే విషయమేమంటే ప్రవక్త (స) ప్రశ్నించిన వ్యక్తి ఖజా రోజాలు లేక మొక్కుబడి రోజాలు పూర్తి చేసుకోవాల్సి వుండింది, లేక రోజుల్లో వ్యక్తి నఫిల్‌ రోజాలు పాటించే అలవాటు వున్నవాడైనా కావచ్చు, ఇతర వ్యక్తులు వివిధ సందర్భాలలో పద్ధతుల్లో నఫిల్‌ రోజులను పాటించినట్లు కొంతమంది ప్రతి నెల మధ్యలో మూడు రోజుల నఫిల్‌ రోజాలను పాటిస్తారు. మరికొందరు వేరేదినాల్లో పాటిస్తారు. లేక వ్యక్తి నెలలోని చివరి రెండు రోజుల రోజాలు పాటించే సంకల్పం చేసుకొని అయినా వుండవచ్చు. ప్రవక్త (స) ఆయనతో ఇలా ప్రశ్నించడానికి కారణం ఇదే అయి వుండవచ్చు. ఇంకా అవి ఖజా రోజాలు లేక మొక్కుబడి రోజాలు అయి, వాటిని అతను పూరించాలన్న విషయం ప్రవక్త (స) గారికి తెలిసివుండవచ్చు లేక రెండు రకాల రోజాల విషయమై వ్యక్తి తయారీ చేసుకొని వుండవచ్చు. అందుకనే ప్రవక్త (స) ఆయనతో ఫలానా రోజాలు

ఆత్మ (ప్రక్షాళనం రోజా 145 పాటిస్తున్నావా? అని ప్రశ్నించి వుండవచ్చు. ఇక స్వయంగా వ్యక్తి రోజాలను పాటించకపోవటానికి కారణం కూడా చాలా తేలిగ్గా అర్థమవుతుంది. దైవప్రవక్త (స) షాబాన్‌ 15వ తేదీ తరువాత రోజాలు ఉండకూడదని హితవు పలికినందున ఆయన (స) రోజుల్లో రోజా పాటించడం మానుకొని వుండవచ్చని తెలుస్తోంది. అందుకని ప్రవక్త (స) వ్యక్తికి సమస్యను సావధానపరచడానికి “ఏమిటి? నీవు రోజుల్లో రోజాలు పాటిస్తున్నావా?” అని ప్రశ్నించివుండవచ్చు. అప్పుడు వ్యక్తి “లేదు” అని చెప్పినప్పుడు, ప్రవక్త (స) “ఇక వాటికి బదులుగా ఇతర దినాల్లో రోజాలు పాటించాలి, దీనివలన నీవు తయారీ చేసుకున్న విధంగా అవి పూరించాలి (లేక నీ బాధ్యతలో వున్న మొక్కుబడి లేక ఖజా రోజాలు పూర్తి చేయబడాలి)” అని సెలవిచ్చివుండవచ్చు.

ఇదే హదీసులో దాగిన అంతరార్థం అయివుండవచ్చు. అలాకాక షాబాన్‌ నెలలోని చివరి రెండు రోజుల రోజాలను తప్పక పాటించాలని, ఒకవేళ పాటించకపోతే వాటి ఖజా తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని వేరితర హదీసులలో రూఢీ పరచలేదు, లేదా ఫిఖా పండితులు దీని పట్ల సుముఖంగా లేరు.

ముహర్రం నెలలోని రోజాలు ఇంకా తహజ్ఞుద్‌ నమాజ్‌ ప్రాశస్త్యం

బయ! లకమురతంళటుడల = లట ooo ah DN FLAIR TAD జి! ast. yh! 82. హజ్రత్‌ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు : రమజాన్‌ తరువాత అన్నిటికన్నా శ్రేష్టమైన రోజాలు ముహర్రం నెల రోజాలు. ఫర్డ్‌ నమాజుల తరువాత శ్రేష్టమైన నమాజ్‌ 'సలాతులైలొ (తహజ్ఞుద్‌ నమాజ్‌). (ముస్లిం)

ముహర్రం రోజాల గురించి మున్ముందు పలు హదీసులు రాబోతున్నాయి. వీటిద్వారా దైవప్రవక్త (స) ఆషూరా (ముహర్రం 10వ తేదీ) నాటి రోజాను తప్పనిసరి చేసుకునేవారని, ఇంకా ముహర్రం నెలలో ఎక్కువగా రోజాలు పాటించేవారని తెలుస్తోంది. ఇక్కడ అవగతమైన మరో విషయం ఏమిటంటే రమజాన్‌ తరువాత

146 ఆత్మ (ప్రక్షాళనం రోజా మిగతా అన్ని నెలల కంటే ముహర్రం నెలలో పాటించే రోజాలు శ్రేష్టమైనవి. దీనికి అనేక కారణాలుండవచ్చు. కాని దాన్ని గురించి వివరించటం జరగలేదు. అందువలన ముహర్రం నెలలోని నఫిల్‌ రోజాలు ఇతర నెలలకన్నా గ్రేష్టమైనవని పూర్తి నమ్మకంతో చెప్పలేము.

హదీసులో మరోమాట రాత్రిపూట ఆచరించే నమాజ్‌ గురించి సెలవియ్యడం జరిగింది. రాత్రి నమాజ్‌ అంటే తహజ్ఞుద్‌ నమాజ్‌. దీనిని మనిషి రాత్రివేళ నిశ్శబ్దంగా, గోప్యంగా ఆచరిస్తాడు. దీని విషయం స్వయంగా మనిషికీ దేవునికీ తప్ప మరొకరికి తెలియదు. ఫర్డ్‌ నమాజ్‌ తరువాత నమాజ్‌ దేవుని దృష్టిలో ఎంతో శ్రేష్టమైనదిగా, ఇష్టకరమైనదిగా పరిగణించటం జరిగింది.

శ్రేష్టత విషయానికివస్తే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ఒక సందర్భంలో ఒక విషయాన్ని శ్రేష్టమైనదిగా చెప్పడం జరుగుతుంది, మరో సందర్భంలో మరోదాన్ని శ్రేష్టమైనదిగా పేర్కొనటం జరుగుతుంది. వాస్తవానికి ఇందులో ఎలాంటి వైరుధ్యం, వ్యాఘాతం ఉండదు. కొన్ని పనుల శ్రేష్టత గురించి హదీసుల్లో వచ్చిన వివరాలు, ముఖ్యంగా ప్రజలకు వాటిపట్ల అవగాహన, శ్రద్ధ కల్పించడానికే అలా చెప్పటం జరిగింది. ఫలానా పని చేస్తే ఇంత పుణ్యం దొరుకుతుందని, మరో పని చేస్తే అది (శ్రేష్టమైనదని పేర్కొనటంలో కూడా అదే ఉద్దేశం దాగి ఉంది. సందర్భంగా పని గురించి చెప్పిన తీరు, పద్ధతికి కారణం ఏమిటంటే, ప్రజల్లో దాని పట్ల మక్కువ జనించాలని మరికొన్ని సందర్భాల్లో ఒకేసారి అనేక పనుల గురించిన శ్రేష్టతను చాటే పదాలు వుపయోగించబడ్డాయి. దాని ఉద్దేశ్యం పనికన్నా మరేదీ శ్రేష్టమైనది, ఉత్తమమైనది లేదని చెప్పటం కాదు. వాస్తవానికి అనేక పనులు, ఆచరణలు వాటి వాటి సందర్భాల్లో గొప్పవే. ఉదాహరణకు, ఇక్కడ ముహర్రంలో నఫిల్‌ రోజా పాటించడం చాలా (శ్రేష్టమైనదని సెలవియ్యటం జరిగింది. మరోచోట అరఫా (అంటే జిల్‌ హజ్జహ్‌ 9వ తేదీ) నాటి రోజా ఎంతో శ్రేష్టమైనదని చెప్పటం జరిగింది. వాస్తవానికి రెండు విషయాల్లో ఒకటి మరొకదానితో ఎలాంటి వైరుధ్యం కలిగి లేదు. దాని అర్థం అరఫా నాటి రోజా కూడా ఎంతో శ్రేష్టమైనదని చెప్పటమే. ఇంకా ముహర్రం (ఆషూరా రోజు) నాటి రోజా కూడా శ్రేష్టమైనదే. ఇదేవిధంగా ఫర్ట్‌ నమాజ్‌ తరువాత అన్నిటికంటే (శ్రేష్టమైనది 'సలాతులైలొ అంటే తహజ్ఞుద్‌ నమాజ్‌ అని పేర్కొనటం జరిగింది. దీని ఉద్దేశం ఇతర నమాజూ శ్రేష్టమైనది కాదు అని లేక తక్కువ గ్రేష్టత కలది అని చెప్పటం. కాదు. ఇలా భావించటం సరియైనది కాదు. హదీసుల్లో “ముఅక్కిద

ఆత్మ ప్రక్షాళనం రోజా 147 సున్నత్‌”లు ఎంతో శ్రేష్టమైనవని అనేకసార్లు పేర్కొనటం జరిగింది. అందువలన “'ముఅక్కిద సున్నత్‌ నమాజులు కూడా ఘనమైనవే. అదేవిధంగా తహజ్ఞుద్‌ నమాజ్‌ కూడా. రెంటిలో కూడా గ్రేష్టత దాగివుందని చెప్పటం రెంటి మధ్య వైరుధ్యం ఏర్పరచటం కానేకాదు.

ఫర్డ్‌ నమాజ్‌ల తరువాత తహజ్ఞుద్‌లో శ్రేష్ట వుందని చెప్పటానికి కారణం, ఫర్డ్‌ నమాజ్‌ అయితే ఇస్లామ్‌ మూలాధారాల్లో ఒకటి. ఇస్లాంకు మూలాధారాన్ని స్థాపించటానికి ఫర్ట్‌ నమాజ్‌ను బహిరంగంగా, పకడ్బందీ పద్ధతిలో నెరవేర్చటం అత్యంతావసరం. ఎందుకంటే ఇది వినా ఇస్లాం కట్టడం నిల్పోలేదు. అందువల్లనే ధర్మవ్యవస్థలో నమాజ్‌కు ఎంతో ప్రాధాన్యత చేకూరింది. దీనికి ప్రతిగా తహజ్ఞుద్‌ నమాజ్‌ను ఎంతో గోప్యంగా ఆచరించటం జరుగుతుంది. మనిషిలో అల్లాహ్‌ పట్ల గట్టి సంబంధం, అత్యధిక (ప్రేమ, నిష్కల్మషమైన విశ్వాసం లేనంతవరకు, మనిషి రాత్రిళ్లలో లేచి నిశ్శబ్దంగా తహజ్ఞుద్‌ నమాజ్‌ను ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆచరించటం సాధ్యం కాదు. అసాధారణమైన శ్రద్ధాభక్తులు, దైవచింతన లేకపోతే ఇది సాధ్యం కాదు. ఫర్డ్‌ నమాజ్‌లో అయితే ప్రదర్శనాబుద్ధి కన్పించే అవకాశం వుంది. ఎందుకంటే మనిషి తగు ఏర్పాటు, తయారీ చేసుకొని నమాజ్‌ కొరకు మస్టిద్‌కు వెళతాడు. “ఇతను నమాజ్‌ చేసే మనిషి అని ప్రజలకు తెలియజెప్పే ఉద్దేశం కూడా అతని ఆచరణలో దాగి వుండవచ్చు. అయితే తహజ్ఞుద్‌ నమాజ్‌లో దీని అవకాశం లవలేశమైనా లేదు. తహజ్ఞుద్‌ నమాజ్‌నయితే అల్లాహ్‌తో గట్టి సంబంధం, నిష్కల్మష విశ్వాసం, దైవప్రేమ వున్నవాడే ఆచరించగలడు. అతను ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు పొందాలన్న ఉద్దేశంతో కాక, అల్లాహ్‌ ప్రీతిని పొందే అభిలాషియై వుంటాడు. అందువల్లనే తహజ్ఞుద్‌ నమాజ్‌కు అంతటి ఘనమైన ్రేష్టత వుంది.

ఇక్కడ ఆషూరా (ముహర్రం 10వ తేదీ) నాటి ఘనతకు కారణం హజ్రత్‌ హుసైన్‌ (రజి) రోజు అమరగతి పొందటం కాదు. రోజు ఘనతను గురించి పూర్వకాలం నుంచే ప్రస్తావించటం జరుగుతూ వస్తోంది. అంటే హజ్రత్‌ మూసా (అ) కాలం నుంచే దీన్ని పేర్కొంటూ రావటం జరుగుతోంది. వేరితర కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తున్నదేమంటే, హజ్రత్‌ మూసా (అ) జాతి వారికి ఫిర్‌బెన్‌ దౌర్దన్యాల నుండి విముక్తి లభించిన రోజు అది. అందువలన హజత్‌ మూసా (అ) కృతజ్ఞతాపూర్వకంగా, క్రమం తప్పకుండా రోజు రోజా పాటించేవారు. ఇది హజ్రత్‌ మూసా (అ) గారి సంప్రదాయం కావటాన దైవప్రవక్త (స) కూడా ఆషూరా రోజున రోజా పాటించడాన్ని థేష్టతరంగా నిర్ణయించారు, ఇంకా రోజాను

148 ఆత్మ (ప్రక్షాళనం రోజా పాటించాలని హితవు పలికారు. మున్ముందు మరో హదీసులో దీని తాలూకు మరొక వివరణ రాబోతోంది.

ఆషూరా (ముహర్రం 10వ తేదీ) రోజాలోని శ్రేష్టత

dost LiL Gg yg! Ey SEA hap os peer

SEEN LSS EIFS, ఎర్రమల. ప్రద

83. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (రజి) ఉల్లేఖనం : దైవప్రవక్త (స) గ్రేష్టత రీత్యా రోజు ఉపవాసాన్ని కూడా తనపై విధించుకున్నట్లు నేను చూడలేదు - ఆషూరా దినపు రోజాను తప్ప. అలాగే శ్రేష్టత రీత్యా పూర్తిగా నెల రోజులూ విధిగా రోజాలు పాటించలేదు - రమజాన్‌ మాసపు రోజాలు తప్ప. (ముత్తఫకున్‌ అలైహ్‌) ప్రవక్త ఆచరణ ఏమిటంటే రమజాన్‌ నెల రోజాలను విధిగా చేసుకున్నట్లు

ఆషూరా దినపు రోజాను కూడా ఆయన (స) విధిగా చేసుకుని పాటించేవారు.

దీనిద్వారా హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (రజి) వెలిబుచ్చిన అభిప్రాయం ఏమిటంటే ప్రవక్త (స) దృష్టిలో ఇతర దినాలకన్నా ఆషూరా నాటి శ్రేష్టత అధికంగా వుండేది. అందువల్లనే రోజు తప్పనిసరిగా రోజా పాటించేవారు.

స్పష్టంగా ఇక్కడ గ్రహించాల్సిన విషయమేమిటంటే, దైవప్రవక్త (స) ఆషూరా నాటి రోజా అన్నిటికంటే శ్రేష్టమని చెప్పినట్లు లేదు. ప్రవక్త (స) గారి ఆచరణను గమనించి అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (రజి) వెలిబుచ్చిన తన స్వంత అభిప్రాయం ఇది. దీన్ని ఇంత వివరంగా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే మున్ముందు ఒక హదీసు రాబోతోంది, అందులో ఆషూరా రోజు కంటే అరఫా రోజు మరింత శ్రేష్టమైనదని తెలుపబడింది. దీనివలన రెండు హదీసుల్లో పరస్పర వైరుధ్యం ఉందనే సందేహం

కలుగుతుంది. కాని ఇలా ఆలోచించటం సబబుకాదు. ఎందుకంటే ప్రవక్త (స)

విషయాన్ని సెలవియ్యలేదు. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (రజి) గారు సంగ్రహించి

వెలిబుచ్చిన తన స్వంత అభిప్రాయ సారాంశ ఫలమిది. అరఫా నాటి ఢ్రేష్టత గురించి ప్రవక్త (స) తెలిపిన హదీసు మున్ముందు రాబోతోంది.

ఆత్మ ప్రక్షాళనం రోజా 149 ఆషూరాతో పాటు 9 లేదా 11వ తేదీ ఉపవాసాన్ని కూడా కలుపుకోవాలి

SWINE! ar TET TEP

salt PA AEE Td ఆరయ 53! ఉమపుట) ఘు! 9556

యుప భు! యతయ కంపే (BSD AEE HES!

84. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (రజి) గారి ఉల్లేఖనం - ఒకసారి దైవప్రవక్త (స) ఆషూరా రోజా పాటించారు. ఇంకా దాన్ని పాటించాలని ప్రజలకు హితవు పలికారు. ఆపై ప్రజలు, 'దైవప్రవక్తా (స), దీన్నయితే యూదులు, క్రైస్తవులు కూడా పాటిస్తారు కదా!” అని విన్నవించుకున్నారు. దానిపై దైవప్రవక్త (స), “ఒకవేళ వచ్చే సంవత్సరం నేను జీవించివుంటే ముహర్రం తొమ్మిదవ తేదీ రోజా కూడా పాటిస్తాను” అని సెలవిచ్చారు.

(ముస్లిం)

దీనిద్వారా తెలిసేదేమంటే విషయాన్ని ప్రజలు ప్రవక్త (స) జీవిత కాలంలోని చివరి సంవత్సరంలో విన్నవించారు. (ప్రవక్త (స) సమక్షంలో ఇలా విన్నవించు కోవడంలో వారి ఉద్దేశ్యం ఏమిటంటే యూదులు, క్రైస్తవులు కూడా దీన్ని (శ్రేష్టతగా భావిస్తున్నారు, మీరు కూడా దీని ప్రాశస్యాన్ని గురించి నిర్ణయించారు అన్నది. దీనివలన యూదులు, క్రైస్తవులు మేము వారిని అనుకరిస్తున్నామన్న అర్థం తొడుగుతారేమో. దీని విషయంపై దైవప్రవక్త (స) “నేను వచ్చే సంవత్సరం జీవించివుంటే ముహర్రం 9వ తేదీనాటి రోజా కూడా తప్పక పాటించి నా ఆచరణ యూదులు, కైస్తవుల ఆచరణకు భిన్నమైనదని తెలియజేస్తాను” అని సెలవిచ్చారు. దీనిద్వారా తెలిసిందేమంటే ఎవరైనా ఆషూరా నాడు రోజా వుండాలని సంకల్పించుకుంటే, అతను దానికి ముందు రోజైనా లేదా దాని తరువాతి రోజునైనా కలుపుకోవాలి. ఎందుకంటే దైవప్రవక్త (స) ఏదైనా పనిని చేయాలని సంకల్పించుకోవడం కూడా అది ఆయన (స) సంప్రదాయం అన్నది రుజువైన విషయమే. మున్ముందు వచ్చే హదీసు ద్వారా ఆషూరాతో ముహర్రం 9వ తేదీనే కలుపుకోవాలన్న నిబంధన ఏదీ లేదు, 11వ తేదీనైనా కలుపుకోవచ్చు అన్న విషయం తెలుస్తోంది.

150 ఆత్మ ప్రక్షాళనం రోజా

విషయం ద్వారా మీరు ఇస్లామ్‌లోని సున్నిత స్వభావాన్ని అంచనా వేయవచ్చు. అది ప్రతి చోటా ముస్లింల వైశిష్ట్యాన్ని, జెన్నత్యాన్ని విధంగా నెలకొల్పాలని అనుకుంటుందో తెలుస్తోంది. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ అది ముస్లింలు యూదులు, కైస్తవులను ఇంకా ఇతర అవిశ్వాసుల్ని అనుకరించే అవకాశాన్నివ్వదు.

ఇలాంటి హితవుల్ని దృష్టిలో వుంచని కారణంగా పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందంటే ముస్లింలు యూదులు, క్రైస్తవుల ఒక్కొక్క చెడును ఎంచుకొని మరీ అనుకరించటం మొదలెట్టారు. కారణంగా ముస్లిం, ముస్లిమేతరుల మధ్య బాహ్యపరమైన తేడాయే లేకుండా పోయింది. కొన్ని సందర్భాల్లో ఎలా వుంటుందంటే మనం ఒక మనిషిని ముస్లింగా భావించి మాట్లాడుతుంటాం, కొంత సమయం తరువాత అతను పరధర్మానికి సంబంధించిన వ్యక్తి అని తెలిసిపోతుంది. దైవప్రవక్త (స) సెలవిచ్చారు. ఒక సమయం రాబోతోంది, అప్పుడు మీరు యూదులు, క్రైస్తవుల అడుగులకు మడుగులొత్తటం మొదలెడతారు. పరిస్థితి ఎంత వరకు వస్తుందంటే వారు ఏదైనా ఉడుము రంధ్రంలో దూరిపోతే మీరు కూడా అందులో దూరిపోతారు. నేడు చిత్తరువు సంపూర్ణంగా మనముందుంది. ఇలా ఎందుకు జరిగిందంటే దీని కారణం కేవలం ముస్లింలు జీవితంలోని దాదాపు అన్ని వ్యవహారాల్లో ఇస్లామీయ షరీఅత్‌ స్వభావాన్ని దాని వైభవాన్ని అలక్ష్యం చేశారు.

అరఫా (జిల్‌హజ్ఞహ్‌ 9వ తేదీ) రోజా గురించి

HG E త! ens CNA WSIS Bad ips ఫర పయయుయ TT DEE

కనే 4 sofas

(యాతో. న్‌ పస్తు eee 85. హజ్రత్‌ ఉమ్ముల్‌ ఫజ్‌ల్‌ (రజి) బిన్తె హారిస్‌ ఉల్లేఖనం : నా సమక్షంలో అరఫా రోజున ప్రజలు ఇలా తర్మిస్తున్నారు - “ఈ రోజు దైవప్రవక్త (స) రోజా పాటించారా? లేదా?” అని. వారిలో కొంతమంది

ఆత్మ (ప్రక్షాళనం రోజా 151 అభిప్రాయం ప్రకారం ఆయన (స) రోజాలో వున్నారు, మరికొంతమంది ఆయన (స) రోజా పాటించలేదు అని అన్నారు. దీనిపై (వాస్తవం తెలుసుకోవటానికి) నేను ప్రవక్త సన్నిధిలోకి ఒక పాల పాత్రను పంపాను. సమయంలో ఆయన అరఫా మైదానంలో ఒంటెపై స్వారీఅయి వున్నారు. ఆయన (స) పాల పాత్రను తీసుకొని పాలను త్రాగారు.

(ముత్తఫకున్‌ అలైహ్‌)

ప్రవక్త (స) అంతిమ హజ్జ్‌ (హజ్జతుల్‌ విదా) సందర్భంగా అరఫా మైదానంలో

వున్నప్పుడు రోజు దైవప్రవక్త (స) రోజాలో వున్నారా? లేదా? అన్న ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే ఆయన (స) మదీనాలో వున్నప్పుడు అరఫా రోజు (అంటే జిల్‌ హజ్జహ్‌ 9వ తేదీన) తప్పనిసరిగా రోజా పాటించేవారు. ఇక ప్రవక్త (స) ఒంటెపై ఆసీనులై వుండి పాలు త్రాగినప్పుడు ఆయన అరఫా నాడు రోజా పాటించలేదన్న విషయం అందరికీ తెలిసిపోయింది. దీనిద్వారా గ్రహించిన అర్థం ఏమిటంటే అరఫా రోజాను ఇతర ప్రాంతాల్లో వున్నప్పుడు పాటించాలి. మరి హజ్జ్‌ చేసే వారు రోజు రోజా పాటించకపోవటమే సముచితం. ఎందుకంటే అరఫా మైదానంలో హాజీలు పరుగులు తీస్తూ వుంటారు. బహిరంగ మైదానంలో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఎండలో గడపాల్సివస్తుంది. ఇలాంటి స్థితిలో మనిషి రోజా కూడా వుంటే దానివలన అతనికి కష్టం కలగవచ్చు. ఫలితంగా రోజాను కూడా భంగపరిచే పరిస్థితి రావచ్చు. దీని కారణంగా దైవప్రవక్త (స) సందర్భంగా అరఫా నాటి రోజాను పాటించలేదు. తన ఆచరణ ద్వారా తాను రోజా పాటించలేదన్న విషయాన్ని అందరికీ తెలియజేశారు.

ప్రవక్త (స) జిల్‌హజ్ఞహ్‌ నెలలోని మొదటి పది రోజుల ఉపవాసా లన్నీ ఎన్నడూ పాటించలేదు

Alb) Fh EDU LEA (యు BDA 86. హజత్‌ ఆయిషా (ర.అ) ఇలా పేర్కొన్నారు : “దైవప్రవక్త (స) జిల్‌ హజ్ఞహ్‌లోని మొదటి పది రోజులలో పూర్తిగా రోజా పాటించటాన్ని నేను ఎన్నడూ చూడలేదు.” (ముస్లిం)

152 ఆత్మ ప్రక్షాళనం రోజా

హజ్రత్‌ ఆయిషా (ర.అ) ఇలా ఎందుకు సెలవిచ్చారంటే, కొన్ని ఇతర హదీసుల ద్వారా తెలుస్తోంది - దైవప్రవక్త (స) జిల్‌ హజ్జహ్‌లోని ప్రారంభ రోజుల్లో రోజా పాటించటాన్ని తప్పనిసరి చేసేవారు. దీనివలన ఎవరైనా ప్రవక్త (స) అప్పుడప్పుడూ లేదా సదా మొదటి పూర్తి 9 రోజులు రోజా పాటించేవారేమో అని తలపోసే ఆస్మారముంది.

హ(జత్‌ ఆయిషా (ర.అ) గారి ఉల్లేఖనంపై కొంతమంది ఇలా అభిప్రాయపడవచ్చు - ప్రవక్త (స) మొదటి 9 రోజులు ఎడతెగకుండా రోజా పాటించేవారన్న విషయం హజ్రత్‌ ఆయిషా (ర.అ) జ్ఞానపరిధిలోకి రాలేదేమో. ఇంకా మరికొందరి అభిప్రాయంలో ప్రవక్త (స) గారు దీన్ని తన ఆచరణలో పెట్టినా పెట్టకపోయినా రోజుల్లో పూర్తిగా రోజాలు తప్పక పాటించాలని సెలవిచ్చేవారేమో. అయితే ఆయన (స) రోజుల్లో రోజా పాటిస్తే అధిక (శ్రేష్టమని సెలవిచ్చి ఉండటం చేత ఎవరయినా దినాలలో ఎడతెగకుండా - మొదటి 9 రోజులు - ఉపవాసాలు పాటిస్తే అందులో తప్పేమీ లేదు.

నఫిల్‌ రోజాలు పాటించే మస్నూన్‌ పద్ధతి

వము వట హడల్‌ దము రేతయు! స్‌ టయ ఏట కలికి టీకే WES te SEH! దధ రజల పయ] దెస 5 bss ISAM A hides రర తక 2 యువ రగ పడటం CASTE NUT

i ds 4 Te Bes 3 sa kate యే! లిం లీకు టూకార్తే ఉక్క కమం 06

ఆత్మ (ప్రక్షాళనం రోజా 153 DAE re: Sei Se పదం భ్రే యమం టు డా! JE a IE pF Ao (తయడు! యము బకీభే | పడరు!

87. హజ్రత్‌ అబూ ఖతాదా అన్సారీ (రజి) ఉల్లేఖనం, ఒక వ్యక్తి దైవప్రవక్త (స) సన్నిధిలో హాజరై, మీరు ఎలా రోజాలు పాటిస్తారని అడిగారు. వ్యక్తి మాటపై ప్రవక్త (స) గారికి కోపం వచ్చింది. అప్పుడు హజ్రత్‌ ఉమర్‌ (రజి) ప్రవక్త (స) గారి కోపాన్ని అసహనాన్ని గమనించి ఇలా అన్నారు, “మేము అల్లాహ్‌యే మా ప్రభువని, ఇస్లాం మా ధర్మమని, ముహమ్మద్‌ (స) మా